ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-02-04

Featuresindia.com RSS Feed: కూలర్‌ బాక్స్‌కు ఇద్దరు బలి

2012-02-04 04:01 PM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన వింతైన సంఘటనలో ఒక కుర్రవాడితో సహాఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మైపాడుకు చెందిన కె.సనత్‌(40), రాపూరుకు చెందిన ఎ.సాయి(15) ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద కూల్‌ డింక్స్‌, పళ్లరసాల దుకాణంలో దినసరి కార్మికులుగా...

Featuresindia.com RSS Feed: భోజ్‌పురి నటుడు రాజా అరెస్టు

2012-02-04 04:01 PM
భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని శుక్రవారం జైపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఆసుపత్రి పార్కింగ్‌ వద్ద ఈయన కారులో మద్యం తాగుతుండగా ఆసుపత్రి భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆయన వారితో గొడవకు దిగారు. సమాచారం అందుకొన్న స్థానిక పోలీసులు నటుడిని అరెస్టు చేయగా...

'సేవ' తెలుగు పత్రిక: 2జీ కేసులో స్వామి పిటిషన్ కొట్టివేత.. చిదంబరానికి ఊరట

2012-02-04 02:51 PM సేవ sevalive.com
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : 2జీ టెలీకాం కుంభకోణం కేసులో కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఊరట లభించింది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను పాటియాల హౌస్ కోర్టు శనివారం కొట్టివేసింది. ఆయనను సహనిందితుడిగా చేర్చలేమని సీబీఐ న్యాయమూర్తి ఓపీ సైనీ పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో యుపీఏ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 2జీ కుంభకోణంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరాన్ని సహ నిందితుడిగా చేర్చాలని, ఇందులో ఆయన పాత్ర ఉందని పేర్కొంటూ జనతాదళ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామి పాటియాల సీబీఐ [...]

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2012-02-04 02:42 PM
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎలాగైనా చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో తొలి దఫా సమావేశం పది నిమిషాల్లో ముగిసినా మరోమారు కలిసి మాట్లాడేందుకు వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ఉన్నదా.. అసలు ఆయన అటువంటి చర్చను సోనియా వద్ద తెచ్చారా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది

'సేవ' తెలుగు పత్రిక: దోషులను వదలను!.. హైకోర్టుకు వెళతా: సుబ్రహ్మణ్యన్ స్వామి

2012-02-04 02:32 PM సేవ sevalive.com
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : 2జీ టెలీకాం కుంభకోణం కేసులో తమ వాజ్యం ఇంతటితో ఆగిపోదని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, అవినీతిపై పోరాడుతున్న తాను నిరాశ చెందడంలేదని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్‌స్వామి పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళతానని స్వామి స్పష్టం చేశారు. 2జీ కుంభకోణంలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరాన్ని సహ నిందితుడిగా చేర్చాలని, ఇందులో ఆయన పాత్ర ఉందని పేర్కొంటూ సుబ్రహ్మణ్యన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం [...]

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2012-02-04 02:18 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన మాజీ స్నేహితురాలు, ఆమె కుటుంబాన్ని వెంటాడుతున్నారు. ఇటీవలే శశికళ సోదరుడు దివాకరన్ పారిపోతుండగా పోలీసులు వెతికి పట్టుకున్నారు. దివాకరన్... తిరువారూర్ జిల్లాలో ఓ మహిళకు చెందిన రెండు గృహాలను గత ఏడాది నవంబరు నెలలో కూలగొట్టారట. దీనికిగాను సదరు మహిళ అతనిపై కేసు పెట్టారు. దీనికి స్పందించిన పోలీసులు ఇప్పుడు దివాకర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు ఇంత సమయం ఎందుకు పట్టినట్లు..? అనే దానిపై తమిళనాడులో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అవేంటయా..? అంటే, జయలలిత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఆమె ప్రియసఖి శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సీఎం పీఠంపై కన్నేశారట. ఇందులో భాగంగా జయలలితకు స్లో పాయిజన్ ఫుడ్ ఇచ్చారని తెహెల్కా వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది. జయకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆమె పతనాన్ని చూడాలని యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టి, ఆ సమాచారాన్నంతా ఒక నివేదికలో పొందుపరిచి జయకు సమర్పించారట.

ప్రజాశక్తి: మాఫియా చోరీ

2012-02-04 01:48 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
అక్రమ సంపదలను ఎలా కూడపెట్టుకోవచ్చో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న సిబిఐ విచారణలో వెల్లడవుతున్న అంశాలు అపూర్వ చింతామణి, కాశీ మజిలీ కథల్లాగా అంతం లేకుండా సాగుతున్నాయి. ఇక్కడ చెప్పబోయేది దాదాపు అలాంటిదే. నేరాలు చేయటంలో అందెవేసిన రెండు కుటుంబాలతో చేతులు కలిపిన మొత్తం 13 మంది అమెరికాలో అవినీతికి పాల్పడ్డారు. న్యూజెర్సీ  .....

ప్రజాశక్తి: మాకెందుకీ శాపం ... మేమేం చేశాం ...

2012-02-04 10:17 AM ప్రజాశక్తి (noreply@blogger.com)
ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. చూడనివి మరెన్నో ఉన్నాయి. అలాగే మనం పట్టించుకోని వ్యాధులెన్నో ఉన్నాయి. మనకేదైనా అనారోగ్యం వస్తే తల్లిదండ్రులు, సహచరులు, స్నేహితులు, బంధువులు, పిల్లలు అంతా ఆదరిస్తారు. చుట్టూ చేరి మేమున్నామంటూ ధైర్యానిస్తారు. కానీ ఈ వ్యాధి వస్తే మాత్రం అందరూ దూరమే. వ్యాధిగ్రస్తులంతా ప్రపంచానికి సంబంధం లేకుండా జీవచ్ఛవాలుగా బతుకు ఈడ్చడమే. ఆ రోగులకు ఉండే ఇల్లు, తినే

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు

2012-02-04 07:13 AM విశేఖర్

జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో పత్రిల సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్లు వృత్తి నిర్వహించడంలో తమ అసహాయతను వ్యక్తం చేసారు. పులివెందుల పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన దివాకర్ అనే వ్యక్తిని కొనఊపిరితో 108 సేవల ద్వారా చేర్చారనీ, వైద్యం చేస్తుండగానే అతను మరణించాడనీ వారు తెలిపారు. అయితే, జగన్ వర్గ గూండాలు దివాకర్ మృతికి తామే బాధ్యులమని ఆరోపిస్తూ దాడికి దిగారనీ, బూతులు తిడుతూ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారనీ ఆరోపించారు. ఒ.పి విభాగంలో ఆద్దాలు ధ్వంసం చేశారనీ, సిబ్బందిని బెదిరించి భయ భ్రాంతులకు గురి చేశారనీ ఆరోపించారు.

రోగికి మెరుగైన చికిత్స చేయడానికే తాము ప్రయత్నిస్తామనీ, కాని ప్రాణాలు కాపాడడం పూర్తిగా డాక్టర్ల చేతిలో ఉండదన్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. సుధాకర్ మృతి విషయంలో విచారణ జరిపించుకోవచ్చుననీ, తమ తప్పు ఉన్నట్లు తేలితే తాము వైద్య వృత్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు ప్రకటించారు. తమపై దాడులకు పాల్పడినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పులివెందుల లో వైద్య వృత్తి చేయాలంటే భయంగా ఉందనీ, తమను బదిలీ చేసి, విముక్తి చేయాలనీ డాక్టర్లు పత్రికల సమావేశంలో కోరారు.

తండ్రి మరణానికి తట్టుకోలేక మరణించినవారిని ఓదార్చే పేరుతో రాష్ట్రం అంతటా ఎడతెగని పర్యటనలు చేస్తున్న జగన్మోహన రెడ్డి తన అనుచరగణం వల్ల బాధితులైన వారిని కూడా ఓదార్చడానికి మరొక యాత్ర తలపెడితే బాగుంటుంది. ఆ యాత్ర పులివెందుల నుండే ప్రారంభించవలసిన అవసరాన్ని పులివెందుల ఆసుపత్రి డాక్టర్లు ఎత్తి చూపారు. హృదయ విదారకమైన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్న జగన్ పుత్ర హృదయం సంగతి రాష్ట్ర ప్రజలకు ఓ భారంగా పరిణమించగా, ఆయన ఇలాకాలోని రౌడీలు పులివెందుల ఉన్నది ప్రజాస్వామ్యం కాదనీ, రౌడీ రాజ్యం మాత్రమేననీ చాటి చెబుతున్నారన్నమాట!


Filed under: సమాజం, సంస్కృతి Tagged: జగన్ గూండాలు, రౌడీ రాజ్యం

ప్రజాశక్తి: ప్రేక్షకుల దీవెనల వల్లే...

2012-02-04 06:27 AM ప్రజాశక్తి (noreply@blogger.com)
తెలుగు సినీ రంగాన్ని ఆ...నలుగురు ఏలుతున్న కాలంలో తనదైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటుడు రాజశేఖర్‌. అంకుశం, ఆవేశం, మగాడు...సినిమాలతో స్టార్‌డమ్‌ సంపాదించారు. శనివారం ఆయన పుట్టినరోజు. సినిమల్లోకి వచ్చి 26 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. తన పుట్టినరోజైన శనివారం క్యాన్సర్‌ డే కావడంతో పలు సేవా కార్యక్రామల్లో పాల్గొననన్నుట్టు చెబుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పలు సినీ, రాజకీయ విషయాలు

Manyaseema.com RSS Feed: కూలర్‌ బాక్స్‌కు ఇద్దరు బలి

2012-02-04 12:00 AM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన వింతైన సంఘటనలో ఒక కుర్రవాడితో సహాఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మైపాడుకు చెందిన కె.సనత్‌(40), రాపూరుకు చెందిన ఎ.సాయి(15) ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద కూల్‌ డింక్స్‌, పళ్లరసాల దుకాణంలో దినసరి కార్మికులుగా...

Manyaseema.com RSS Feed: భోజ్‌పురి నటుడు రాజా అరెస్టు

2012-02-04 12:00 AM
భోజ్‌పురి నటుడు రాజా చౌదరిని శుక్రవారం జైపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఆసుపత్రి పార్కింగ్‌ వద్ద ఈయన కారులో మద్యం తాగుతుండగా ఆసుపత్రి భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆయన వారితో గొడవకు దిగారు. సమాచారం అందుకొన్న స్థానిక పోలీసులు నటుడిని అరెస్టు చేయగా...

2012-02-03

ప్రజాశక్తి: ఏప్రిల్‌లోపే ఇరాన్‌పై దాడి? : వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం

2012-02-03 09:55 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
ఇరాన్‌ దేశంపై ఇజ్రాయిల్‌ ఏప్రిల్‌లోపే బాంబు దాడి చేసే అవకాశాలు పెరుగుతున్నాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి లియోన్‌ పనెట్టా విశ్వసిస్తున్నట్లు అమెరికా మీడియా గురువారం తెలిపింది. రానున్న కొద్ది నెలల్లోనే ఇజ్రాయిల్‌ దాడి జరిపే అవకాశాలు పెరగడం పట్ల పనెట్టా ఆందోళన......

ప్రజాశక్తి: పారితోషికం భారీగా పెంచేశాడు

2012-02-03 05:32 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
తెలుగు సినిమా అగ్ర దర్శకుల జాబితాలో చేరిన శ్రీనువైట్ల, తన పారితోషికం భారీగా పెంచేశాడని ఇండిస్టీ టాక్‌ ! 'దూకుడు' రికార్డు స్థాయి కలెక్షన్లు కురిపించడంతో..........

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: పన్నులు కోతలు వెరసి నిరుద్యోగం -కార్టూన్

2012-02-03 10:41 AM విశేఖర్

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం మిగిల్చిన భారాన్ని కోశాగార క్రమశిక్షణతో (fiscal discipline) పూడ్చుకోవాలని ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ల్లోని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు బోధిస్తారు. అయితే క్రమ శిక్షణ ను వాల్ స్ట్రీట్ కంపెనీలు, ప్రవేటు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి ‘టూ బిగ్ టు ఫెయిల్’ ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వర్తించవు. ఈ దగుల్బాజీ ఆర్ధికవేత్తల దృష్టిలో క్రమ శిక్షణ పాటించవలసింది ప్రజలే.

ప్రజలపై వీరు రుద్దే క్రమ శిక్షణ ను ముద్దుగా ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ అని పిలుచుకుంటారు. ఈ పిలుపు లో ఉన్న ‘పొదుపు’ కూడా పైన చెప్పిన కంపెనీలకు వర్తించవు. అది కూడా ప్రజలే పాటించాలి. పొదుపు చేయడం అన్నా, కోశాగార క్రమశిక్షణ అన్నా మరే ఇతర పేరు పెట్టినా వాటి అంతిమ ధ్యేయం ఉద్యోగుల సదుపాయాలను రద్దు చేయడం, పెన్షన్ లో కోత పెట్టడం, వేతనాలు తగ్గించడం, బోనస్ లు రద్దు చేయడం (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీల సి.ఇ.ఒ తరగతి పారాసైట్లకి బోనస్ లు రద్దు చేయకూడదు. వీలైతే మరింత పెంచాలి), నిరుద్యోగ భృతిలో కోత పెట్టడం, పన్నులు మరిన్ని బాదడం… ఇవే. ప్రజలకిచ్చే సదుపాయాలపైన పెట్టే ఖర్చు ‘పెచ్చు’ అని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల అభిప్రాయం. అందువలన ఆ ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ‘కోశాగార క్రమ శిక్షణ’ పాటించాలనీ, ‘పొదుపు’ చేయాలనీ వారు బోధిస్తారు.

ఈ విధానాల పాలబడి అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు, స్పెయిన్, గ్రీసు, ఇటలీ, ఐర్లండు, పోర్చుగల్ లాంటి యూరప్ దేశాల్లోనూ  నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. ఈ కార్టూన్ ఐర్లండు ను దృష్టితో పెట్టుకుని వేసినా అది అమెరికా, యూరప్ దేశాలన్నింటికీ వర్తిస్తుంది.

Austerity and unemployment-

-ఫస్ట్ పోస్టు నుండి-

-


Filed under: ఆర్ధిక ద్రవ్య రంగాలు Tagged: కోశాగార క్రమశిక్షణ, నిరుద్యోగం, fiscal discipline

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: 2 జి చిక్కుముడి విప్పండి

2012-02-03 08:23 AM విశేఖర్

‘ది హిందూ’ పత్రిక ఈ గ్రాఫిక్ ను అందించింది.

Untangling crossed wires of 2G-

-

 

 


Filed under: ఆర్ధిక ద్రవ్య రంగాలు Tagged: 2 జి చిక్కుముడి

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్

2012-02-03 05:56 AM Madan (admin@apreporter.com)

ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకుని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్‌బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్

2012-02-03 05:20 AM Madan (admin@apreporter.com)

దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది  భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్‌సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్

2012-02-03 05:13 AM Madan (admin@apreporter.com)

చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు

2012-02-03 05:11 AM Madan (admin@apreporter.com)

తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు

2012-02-03 04:56 AM Madan (admin@apreporter.com)

పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

2012-01-30

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: చైనా, ఇండియాల్లో క్రమశిక్షణ -ఫొటో

2012-01-30 11:55 AM విశేఖర్
Descipline in China, India

క్లిక్ చేసి పెద్దది చూడండి

(ఫేస్ బుక్ నుండి సేకరణ)

ఈ ఫొటో ప్రచురణ చైనాని గొప్ప చేయడానికీ కాదు, ఇండియాని తక్కువ చేయడానికీ కాదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వివిధ అవసరాల కోసం జనం కూడే ఇతర ప్రదేశాల్లో ఒకరిపై ఒకరు పడుతూ, ముందున్న వారిని నెట్టివేస్తూ తానే ముందుకు చేరాలన్న ఆత్రుతలో, తమ దాకా రాదేమో అన్న ఆందోళనతో ఉన్నపుడు, సాధారణంగా ఇటువంటి పరిస్ధితులు కనిపిస్తుంటాయి. అందరికి సరిపడా ఉంది, కనుక అందరికీ అందుతుంది అన్న భరోసా ఉంటే ఈ తోపులాటలు తప్పుతాయి. క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కావలసింది అందుతుంది అన్న నమ్మకం ఉంటే ముందున్నవాడిని వెనక్కి నెట్టేయాలన్న ఆలోచన రాదు. అలా కాక అవసరమైనవీ, అత్యవసరమైనవీ కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటేనో, అవి అవసరమైనవారు అనేక రెట్లు ఉంటేనో తమ దాకా రాదన్న ఆత్రుత, ఆందోళన ఉదయించడం సహజం. అంటే, ప్రజలకు సౌకర్యాల కల్పన పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉంచగల ప్రభుత్వాలు ఈ పరిస్ధితిని నివారించ గలవు. ప్రజలకు చెందవలసింది కూడా తామే నొక్కేస్తూ ఉన్న పాలకులు ఉన్న భారత దేశంలో ఈ పరిస్ధితి కాకుండా మరొక పరిస్ధితి ఎలా ఉంటుంది? ఈ చిత్రాన్ని ఆ కోణంలో నుండే చూడాలి.


Filed under: సమాజం, సంస్కృతి Tagged: క్రమ శిక్షణ

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ‘పావెల్ పుహోవ్’ వీధి చిత్రాలు -ఫొటోలు

2012-01-30 11:21 AM విశేఖర్

రష్యా దేశానికి చెందిన వీధి చిత్రకారుడు ‘పావెల్ పుహోవ్’ గీసిన వీధి చిత్రాలివి. వీధి చిత్రకారులకి ప్రత్యేకంగా నిర్ధిష్టమైన కాన్వాస్ అంటూ పరిమితి లేకపోవడంతో వారి సృజనాత్మకతకు కూడా హద్దులు ఉండనట్లు కనిపిస్తోంది. ఓ కరెంటు స్తంభం ఆధారం చేసుకుని కళ్లజోడుని సృష్టించిన చిత్ర కారుడి సృజనను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది.

Street Art by Pavel Puhov 01 Street Art by Pavel Puhov 02 Street Art by Pavel Puhov 03 Street Art by Pavel Puhov 04 Street Art by Pavel Puhov 05 Street Art by Pavel Puhov 06 Street Art by Pavel Puhov 07

-

-


Filed under: సమాజం, సంస్కృతి Tagged: పావెల్ పుహోవ్, ఫొటోలు, వీధి చిత్రకళ

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: రీ-ఆకుపై వాల్‌స్ట్రీ… సారీ, వైట్‌హౌస్

2012-01-30 10:45 AM విశేఖర్

ఈ సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా గెలుపొందడం కోసం ఒబామా వేషాలు పునః ప్రారంభమయ్యాయి. ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాడు. ధనికులు పై పన్నులు పెంచుతాననిక్, వారి పన్ను రాయితీలు రద్దు చేస్తానని నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ఒబామా తన వాగ్దానాలను అమలు చేయలేదు. తిరిగి అవే వాగ్దానాలను చేయడానికి ఒబామా సిగ్గుపడకపోవడమే ఆశ్చర్యం.

Occupy white house-

-


Filed under: ఆర్ధిక ద్రవ్య రంగాలు, రాజకీయాలు Tagged: అమెరికా ఎన్నికలు, ఒబామా వాగ్దానాలు

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: పాకిస్ధాన్ విభజనపై అంబేద్కర్, గోల్వాల్కర్ అభిప్రాయాలను పోల్చతగదు

2012-01-30 08:30 AM విశేఖర్

ముస్లింల గురించి ఆర్.ఎస్.ఎస్ గురువుగోల్వాల్కర్ చెప్పిన అంశాలను ఉటంకిస్తూ ఈ బ్లాగ్ లో ఒక పోస్టు ప్రచురితమయ్యింది. ఆ పోస్టు కింద అంతర్యానం గారు ఓ వ్యాఖ్య రాసారు. అదియధాతధంగా ఇలా ఉంది.

వి. శేఖర్ గారు

థాట్స్ ఆన్ పాకిస్తాన్అనే పుస్తకంలో అంబేద్కర్ అంటారు “…..దేశవిభజనతోపాటు మహమ్మదీయులందరినీ పాకిస్తాన్ పంపాలి. పాకిస్తాన్ లోనిహిందువులను, బౌద్ధులను భారతదేశానికి తరలించాలి. టర్కీ, గ్రీసు దేశాలలో ఇదిజరిగింది. తమ మత గ్రంధాల ప్రకారం ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగాభావించడం సాధ్యం కాని పని”….

భారతదేశంలో ఉండాలి కాబట్టి ఈ దేశ సంస్కృతిని ఆచరించాలని గోల్వాల్కర్చెబితే, వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళని పాకిస్తాన్ పంపేయాలని అంబేద్కర్అన్నారు.

ఈ రెండు విషయాలను మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది.

అంతర్యామిగారు ఉటంకించిన వ్యాఖ్యలను ఏ సందర్భంలో అంబేద్కర్ చేసినదీ ఆయన చెప్పలేదు. ఆసందర్భం కోసం నేను అంబేద్కర్ రచనలను వెతికాను. అంబేద్కర్ రచనలులోఎనిమిదవ భాగం పాకిస్ధాన్ విభజన విషయమై అంబేద్కర్ తయారు చేసిననివేదికకే పూర్తిగా కేటాయించారు. దానిని చదవగా అంబేద్కర్ ప్రస్తావనకూ, గురుగోల్వాల్కర్ ప్రస్తావనకూ సంబంధం లేదని అర్ధం అవుతుంది. ఆ విషయమే ఈటపాలో వివరించబడుతుంది.

అంబేద్కర్ చర్చించిందేమిటి?

బ్రిటిష్ భారత దేశాన్ని విభజించి పాకిస్ధాన్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అటువంటి విభజన వల్ల తలెత్తే సమస్యలను అంబేద్కర్ తన గ్రంధంలో చర్చించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలను పాకిస్ధాన్ గా విభజించదలిస్తే పాకిస్ధాన్ భూభాగంలో ఉన్న హిందువుల పరిస్ధితిని గురించి అంబేద్కర్ అందోళన చెందాడు. ముఖ్యంగా పశ్చిమ, తూర్పు పాకిస్ధాన్ లు గా విభజించదలుచుకున్న రాష్ట్రాలను ఏ భూభాగాలవద్ద విభజన రేఖ గీయాలన్న సమస్యను అంబేద్కర్ పట్టించుకున్నాడు. విభజన జరిగాక పాకిస్ధాన్ లో మత సామరస్యం నెలకొల్పబడితే తప్ప అక్కడ హిందువులకు రక్షణ దొరకదని అంబేద్కర్ ఊహించి దాని కనుగుణమైన పరిస్ధితుల ఏర్పాటుకు తగిన చర్యలను ఆయన ప్రతిపాదించాడు. పాకిస్ధాన్ విభజన జరిగాక అది ముస్లిం రాజ్యంగా ఏర్పడితే అక్కడ అల్ప సంఖ్యాక వర్గాలుగా మిగిలిపోయే హిందువులకు రాజ్యాంగ రక్షణలు ఏర్పాటు చేయడమా లేక సరిహద్దులు నిర్ణయించడంలో హిందూ మెజారిటీ ప్రాంతాలను భారత దేశంలో కలపడమా లేక ఇతర మార్గాలేమన్నా ఉన్నాయా అన్న విషయాలను అంబేద్కర్ చర్చించాడు.

ఈ సందర్భంగా అంబేద్కర్ తన విస్తృత మేధా సంపత్తికి పని పెట్టాడు. ప్రపంచంలో ఇదే తరహా సమస్యలు తలెత్తిన చోట అవి పరిష్కారం చేసుకున్న విధానాన్ని పరిశీలించాడు. టర్కీ, గ్రీసు, బల్గేరియా, ఐర్లండు లాంటి దేశాలలో ఇటువంటి సమస్యలు తలెత్తాయని ఆయన తన గ్రందంలో ఉదహరించాడు. అక్కడ సజావుగా సమస్యలు పరిష్కరించబడిన ఉదాహరణలనూ, సజావుగా సమస్యలు పరిష్కారం కాక సమస్య మరింత జఠిలమైన ఉదాహరణలను అంబేద్కర్ ప్రస్తావించాడు. సఫలమయైన ప్రయత్నాలను చర్చించి ఎందుకు సఫలమైందీ వివరించాడు. అలాగే విఫలమైన పరిష్కార మార్గాలను కూడా ఉదహరించి అవెందుకు విఫలమైందీ చర్చించాడు. సఫలమైన పద్ధతులను భారత దేశ ఉదాహరణకు ఎలా విజయవంతంగా అమలు చేయవచ్చునో కూడా అంబేద్కర్ వివరించాడు.

తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో హిందూ, ముస్లిం ప్రజలు ఏయే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదీ అంబేద్కర్ అధ్యయనం చేశాడు. తూర్పు పాకిస్ధాన్ (బెంగాల్, అస్సాం) విభజించబడడానికి బాగా అనుకూలంగ ఉందనీ, పశ్చిమ పాకిస్ధాన్ (వాయవ్య రాష్ట్రాలు, సిందు, పంజాబ్) సరిహద్దు ప్రాంతాలు సమస్యలు లేకుండా విభజించబడడానికి అంతగా అనుకూలంగా లేవనీ అంబేద్కర్ గమనించాడు. తూర్పు పాకిస్ధాన్ లోని సరిహద్దు జిల్లాల్లో ముస్లిం మెజారిటీ జిల్లాలు, హిందూ మెజారిటీ జిల్లాలు పక్కపక్కనే తూర్పు పాకిస్ధాన్, భారత్ లలో కలపడానికి వీలుగా ఉండగా, పశ్చిమ పాకిస్ధాన్ సరిహద్దులోగల హిందూ మెజారిటీ జిల్లాలు, ముస్లిం మెజారిటీ జిల్లాలు పక్క పక్కనే కాక చెదిరిపోయినట్లుగా ఉన్న సంగతిని అంబేద్కర్ గమనించాడు. అంటే హిందు మెజారిటీ జిల్లా పక్కనే మరొక ముస్లిం మెజారిటీ జిల్లా, దాని పక్కన హిందూ మెజారిటీ జిల్లా… ఇలా పాకిస్ధాన్ భూభాగంలోకి సమస్యలు లేకుండా కలిపివేయడానికి వీలుగా లేకుండా ఉన్నాయి. ఈ పరిస్ధితికి అంబేద్కర్ ఒక పరిష్కారాన్ని సూచించాడు.

ఆ పరిష్కారమే ‘జనాభా బదలాయింపు’. జనాభా బదలాయింపు అనగానే చాలామంది నవ్వుతారనీ, అపహాస్యం చేస్తారనీ చెబుతూ ఆ పరిష్కారం ఏయే ప్రాంతాల్లో విజయవంతం అయిందీ అంబేద్కర్ వివవించాడు. అంబేద్కర్ గ్రంధం నుండి నేరుగా ఉటంకించడం ఇక్కడ సముచితంగా ఉంటుంది.

“జనాభాను మార్చడం, బదలాయించడం ఏమిటని కొందరు అపహాస్యం చేస్తారు. అల్ప సంఖ్యాక వర్గాల సమస్య స్పష్టం చేసే సంక్లిష్ట పరిస్ధితులు ఏమిటో, వాళ్ళని కాపాడ్డానికి చేసే అన్ని ప్రయత్నాలూ విఫలం అయితే వచ్చే చిక్కులు ఏమిటో అపహాస్యం చేసేవాళ్ళకు తెలియదు. యుద్ధానంతరం ఏర్పడ్డ రాజ్యాల్లోనూ, యూరప్ లోని పాత రాజ్యాల్లోనూ అల్ప సంఖ్యాక వర్గాల సమస్య వచ్చింది. వాటి రాజ్యాంగాలు ఈ అల్ప సంఖ్యాక వర్గాలకు రాజ్యాంగపరమైన రక్షణ చర్యలు కల్పిస్తే చాలన్న ఊహతో మొదలయ్యాయి. దాంతో ఆ నూతన రాజ్యాల రాజ్యాంగాలు చాలా భాగం అధిక సంఖ్యాక వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఏ హక్కులతో ఉండాలో పెద్ద ప్రాధమిక హక్కులతో జాబితాలు నిండిపోయాయి. అధిక సంఖ్యాక వర్గాలు వాటిని ఉల్లంఘించకుండా ఉండాలని అనుకున్నారు. కాని అనుభవం తెలియజేసిందేమిటి? రాజ్యాంగ రక్షణలు అల్ప సంఖ్యాకవర్గాలను కాపాడలేవని. అల్పసంఖ్యాకవర్గాల మీద నిర్ధాక్షిణ్యంగా చేసిన యుద్ధం కూడా సమస్యను పరిష్కరించలేదని. అప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం విదేశీ అల్ప సంఖ్యాక వర్గాలనూ, తమ అల్పసంఖ్యాక వర్గాలనూ బదలాయించుకోవడం అన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎవళ్ల సరిహద్దుల్లోకి వాళ్ళు వెళితే సజాతీయ రాజ్యాలు ఏర్పడతాయని వారి ఉద్దేశ్యం. టర్కీలో, గ్రీక్ లో, బల్గేరియాలో జరిగింది ఇదే. జనాభా బదలాయింపుని అవహేళన చేసేవాళ్ళు టర్కీలో, గ్రీస్ లో, బల్గేరియాలో ఉత్పన్నమైన అల్ప సంఖ్యాకవర్గాల చరిత్రను అధ్యయనం చెయ్యడం బాగుంటుంది. వాళ్ళు అధ్యయనం చేస్తే జనాభా బదలాయింపే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫలవంతమైన మార్గం అని ఆ దెశాలు తెలుసుకున్నట్లు బోధపడుతుంది. ఈ దేశాలు నిర్వహించదలచిన కర్తవ్యం ఏ మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇరవై మిలియన్ల జనాభాను ఒక నివాసం నుండి మరో నివాసానికి బదలాయించడం ఈ పనిలో ఉంది. అయినా ఏ మాత్రం బెదిరిపోకుండా, ఈ మూడు దేశాలు ఈ కర్తవ్య భారాన్ని భుజస్కందాల మీదకు ఎత్తుకున్నాయి. దిగ్విజయంగా పూర్తి చేశాయి. ఏమంటే జాతి సామరస్యం మిగిలిన అన్నింటికంటే ఎక్కువైందని అవి పరిగణించడమే ఇందుకు కారణం.”

పై పేరా తెలుగు అనువాదం లోనిది. ఇంగ్లీషు మూలం కావాలనుకుంటే అది ఇలా ఉంది.

“Some scoff at the idea of the shifting and exchange of population. But those who scoff can hardly be aware of the complications, which a minority problem gives rise to and the failures attendant upon almost all the efforts made to protect them. The constitutions of the post-war states, as well as of the older states in Europe which had a minority problem, proceeded on the assumption that constitutional safeguards for minorities should suffice for their protection and so the constitutions of most of the new states with majorities and minorities were studded with long lists of fundamental rights and safeguards to see that they were not violated by the majorities. What was the experience ? Experience showed that safeguards did not save the minorities. Experience showed that even a ruthless war on the minorities did not solve the problem. The states then agreed that the best way to solve it was for each to exchange its alien minorities within its border, for its own which was without its border, with a view to bring about homogeneous States. This is what happened in Turky, Greece and Bulgaria. Those, who scoff at the idea of transfer of population, will do well to study the history of the minority problem, as it arose between Turky, Greece and Bulgaria. If they do, they will find that these countries found that the only effective way of solving the minorities problem lay in exchange of population. The task undertaken by the three countries was by no means a minor operation. It involved the transfer of some 20 million people from one habitat to another. But undaunted, the three shouldered the task and carried it to a successful end because they felt that the considerations of communal peace must outweigh every other consideration.”

ఈ సున్నిత అంశాలపైన అప్పటి భారత ప్రభుత్వం చేసిన అధ్యయనం ఏమిటో తెలియదు గానీ దేశ విభజనకు అనుసరించవలసిన పద్ధతులను నిర్ధారించడానికి అంబేద్కర్ రాసిన గ్రంధం బాగా ఉపయోగపడిందని నెహ్రూ, జిన్నా, గాంధీ లాంటి పెద్దలు ప్రశంసిన సంగతి చరిత్రలో రికార్డయి ఉంది. ఈ గ్రంధం రచించేనాటికి దేశ విభజన అనంతరం పాకిస్ధాన్ గా విభజింపవలసిన భూభాగాల పట్ల జిన్నాకు కూడా పూర్తి పరిజ్ఞానం లేకుండా పోయింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలను పాకిస్ధాన్ గా ఏర్పాటు చేయాలన్న సాధారణ డిమాండ్ తప్ప నిర్ధిష్టంగా ఏ ప్రాంతాలగుండా సరిహద్దు గీయాలన్నది జిన్నా, నెహ్రూ, గాంధీ లకు ఈ గ్రంధ రచన జరిగేదాకా ఒక అవగాహన ఏర్పడలేదు. పాకిస్ధాన్ ఏర్పాటు జరగాలా వద్దా అన్న అంశంపైన గాంధీ జిన్నాతో ఉత్తర ప్తత్యుత్తరాలు నడిపాడు తప్ప విభజన అనివార్యం అయితే ఏమిటన్న దాన్ని గురించి వారు చర్చించుకోలేదు. దేశ విభజన పాప, పుణ్యాలుగా గాంధీ చూస్తే అంబేద్కర్ వాస్తవాల ప్రాతిపదికగా, మత సామరస్యం ప్రాతిపదికగా, ప్రజలు మత సంఘర్షణలు లేకుండా జీవనం గడపవలసిన అవసరాల ప్రాతిపదికన చూసాడు. గాంధీ వ్యక్తం చేసిన ‘పాప, పుణ్యాల’ వాదనను అంబేద్కర్ తన గ్రంధంలో చీల్చి చెండాడిన అంశం కూడా మనం చూడగలం.

గ్రంధం నేపధ్యం

డా.బి.ఆర్.అంబేద్కర్ పాకిస్ధాన్ విభజన పైన రాసిన గ్రంధ నేపధ్యానికి వస్తే, అప్పటికింకా దేశ విభజన జరగలేదు. 1940 మార్చి 22, 24 తేదీల మధ్య ముస్లింలీగ్లాహోర్ లో సమావేశమై పాకిస్ధాన్ తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి బొంబాయిరాష్ట్రంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీఅన్న పేరుతో ఒక రాజకీయ పార్టీఉండేది. ముస్లిం లీగ్ తీర్మానం చేశాక ఈ పార్టీ కూడా పాకిస్ధాన్ సమస్య పట్లతన వైఖరిని అప్పటికి చెప్పనవసరం లేదని భావిస్తూనే ఆ సమస్యను అధ్యయనంచేయాలని భావించింది. (ఒక విధంగా ఆ పార్టీ పాకిస్ధాన్ భావన పట్లఆకర్షితురాలైంది అని కూడా అంబేద్కర్ తన గ్రంధం ప్రస్తావనలోపేర్కొన్నాడు.) పాకిస్ధాన్ సమస్యను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలనిఆరుగురితో ఒక కమిటీని ఆ పార్టీ నియమించింది. ఆ కమిటీ సభ్యుల్లో అంబేద్కర్ ఒకరు.నాతో సహా వీరు కమిటీలో సభ్యులుఅని చెబుతూ అంబేద్కర్ ఇతర సభ్యుల పేర్లనుప్రస్తావనలో ఉదహరించాడు. వీరంతా ఆ పార్టీ సభ్యులేనని ఆయన పేర్కొన్నాడు. ఈకమిటీలోని ఇతర సభ్యుల కోరిక మేరకు అంబేద్కర్ ఈ గ్రంధ రచనకు పూనుకున్నారు. నివేదికతయారయ్యాక దాన్ని ఇండిపెండేంట్ లేబర్ పార్టీ చర్చించి, ప్రకటించమని కోరింది.ఆ నివేదికే ఈ గ్రంధం. పాకిస్ధాన్ సమస్యను అధ్యయనం చేసేవారికి సహాయకారిగాఉండాలన్నదే గ్రంధం లక్ష్యం అని అంబేద్కర్ తన ప్రస్తావనలో పేర్కొన్నారు.

గ్రంధ రచన ఏవైపూ మొగ్గు చూపడానికి ఉద్దేశించింది కాదని అంబేద్కర్చెప్పుకున్నారు. నిస్పక్షపాతంగా వాస్తవాలను అధ్యయనకర్తల ముందు ఉంచేప్రయత్నం చేశానని రాశారు. పాకిస్ధాన్ ఏర్పాటుకి ముస్లిం లీగ్ చెబుతున్నకారణాలు, పాకిస్ధాన్ ఏర్పాటుకి వ్యతిరేకిస్తూ హిందూవాదులు చెబుతున్నకారణాలు వారి వారి వాదనలు ప్రస్తావిస్తూ, ఆ వాదనలు రెండింటికీ మద్దతుగాఅంబేద్కర్ అనేక అంశాలను చెప్పాడు. అప్పటికి దేశంలో ఉన్న అనేక రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్ధితులను అయన వివరించాడు. భారత దేశ పరిస్ధితుల వివరణఇచ్చేటపుడు అంబేద్కర్ తన దృక్కోణాన్నే అనుసరించాడని వేరే చెప్పనవసరం లేదు.పాకిస్ధాన్ అనుకూల వాదనలు వివరించేటప్పుడు వాటికి మద్దతుగా అనేక అంశాలనుఅంబేద్కర్ వివరించాడు. అదే విధంగా పాకిస్ధాన్ వ్యతిరేక వాదనలకు మద్దతుగాకూడా అనేక వాదనలను ఆయన వివరించాడు.

నిర్ధిష్టవాదనను వివరిస్తున్నపుడూ, ఆ వాదనకు మద్దతుగా అంబేద్కర్ ప్రస్తావించినవివిధ పరిస్ధితులను ఉదహరిస్తున్నపుడూ అంబేద్కర్ ఆ నిర్ధిష్ట వాదనకు మద్దతుఇస్తున్నట్లుగా కనిపిస్తాడు. దానికి వ్యతిరేక వాదనను వివరించేటప్పుడు కూడాఅంబేద్కర్ అదే పరిస్ధితిలో కనిపిస్తాడు. గ్రంధం మొత్తం మీద చూస్తేఅంబేద్కర్ కి పాకిస్ధాన్ ఏర్పాటు పట్ల ఉన్న మొగ్గు స్పష్టంగా కనిపిస్తుంది.తాను ఎటువైపు మొగ్గు చూపుతున్నానో తన గ్రంధంలో చెప్పలేదని తననువిమర్శించారని చెబ్తూ ఓ చోట అంబేద్కర్, వాస్తవానికి తానా పని చేశానని కూడాచెప్పాడు. స్పష్టంగా తన వైఖరి చెప్పలేదని అంగీకరిస్తూనే అక్కడొక చోట, ఇక్కడొక చొట తన వైఖరిని చెప్పానని కూడా ఆయన చెప్పాడు. అలా స్పష్టమైనఅంబేద్కర్ వైఖరి పాకిస్ధాన్ ఏర్పాటుకి అనుకూలంగా ఉందని గ్రంధం చదివినవారికి అర్ధం అవుతుంది. గ్రంధానికి రాసిన ఉపోద్ఘాతంలో అంబేద్కర్ రాసిన ఈ భాగం చూడండి.

“… పాకిస్ధాన్ ఏర్పాటు పధకానికి సంబంధించిన సమస్త విషయాలను తెలియటమే నాలక్ష్యం. అంతేగాని పాకిస్ధాన్ కోసం వాదించడం లేదు. వివరించడం లక్ష్యం గానీమీ మనసుల్ని మార్చడం నా లక్ష్యం కాదు. పాకిస్ధాన్ పై నాకు ఎలాంటిఅభిప్రాయాలూ లేవనడం సబబు కాదు. నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. కొన్నింటినివెల్లడించాను. మరికొన్నింటిని మీరే గ్రహించాల్సి వుంటుంది. నాఅభిప్రాయాలను గూర్చి రెండు విషయాలను చెప్పవచ్చు. అభిప్రాయాలు వివరించివాటిని హేతుబద్ధంగా చెప్పడం మొదటిది. నేను ఏమి చెప్పినా అవి ప్రజల నిశ్చితదురభిమానాల మీద ఆధారపడకపోవడం రెండవది. ఒక రకంగా అవి నా ఆలోచనలు మాత్రమే.అభిప్రాయాలు కావు. మరో రకంగా చెప్పాలంటే నాది ఏమీలేని శూన్యపు బుర్ర కాదు.నేను కొన్ని అభిప్రాయాలను ఆహ్వానిస్తాను. … … …సమస్యపై గల అన్నివిషయాలను పాఠకుల ముందుంచడానికి (చేసిన) ఈ ప్రయత్నంలో నా అభిప్రాయాలనువేటినీ చేర్చలేదు. ఇరు పక్షాల వాదనలను పాఠకుల ముందుంచా. పాఠకులే వారిఅభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు.” (అంబేద్కర్ రచనలు, ఎనిమిదవ భాగం, ‘ఉపోద్ఘాతం’, పేజి XX, XXI).

పాకిస్ధాన్కి మద్దతుగా వివిధ అంశాలను చెప్పినపుడు అంబేద్కర్ పాకిస్ధాన్ వ్యతిరేకులనుచీల్చి చెండాడుతున్నట్లు కనిపిస్తుంది. పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా ఉన్నఅంశాలను ప్రస్తావిస్తున్నపుడు అంబేద్కర్ పాకిస్ధాన్ అనుకూలురను చీల్చిచెండాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి పరిస్ధితి చూసి పాఠకుడు అయోమయానికిగూడా గురవుతాడు. ఈ గ్రంధాన్ని ఇలా రాసినందుకు కూడా తనపైన విమర్శలువచ్చాయని అంబేద్కర్ రాసుకున్నాడు. అయితే, నిస్పక్షపాతంగా వివిధ అంశాలనుపాఠకుల ముందు ఉంచాలని భావించిన కారణాన, గ్రంధం అలా ఉందని కూడా ఆయన సమాధానంఇచ్చాడు. అయినప్పటికీ తన వైఖరిని చెబుతూ వచ్చానని ఆయన చెప్పాడు. ఆ వైఖరిపాకిస్ధాన్ కి అనుకూలంగానే ఉందని పాఠకుడు గ్రహించగలడు.

ఇపుడు అంతర్యానం గారి ఉటంకన విషయానికి వస్తే, ఆయన ఉటంకించిన వాక్యాలు మొత్తం ఒక చోటినుండి సంగ్రహించినవి కావు. అసలు ఆయన ఉటంకించిన వ్యాక్యాలు అంబేద్కర్ గ్రంధంలో యధాతధంగా ఎక్కడా లేవు. అయితే ఆ అర్ధం వచ్చే విధంగా వేరే వాక్యాలు ఏమన్నా ఉన్నాయో లేదో తెలియదు. ఆ సంగతి అంతర్యానం గారే చెబితే బాగుంటుంది. మరో విషయం కూడా స్పష్టం చేయవచ్చు. అదేమంటే భారత దేశంలో మహమ్మదీయులు ఉండలేరు కాబట్టి వారిని పాకిస్ధాన్ పంపాలి అని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదు. భారతదేశంలోని మహమ్మదీయులందరినీ పాకిస్ధాన్ వెళ్లాల్సిందే అని అంబేద్కర్ అసలు చెప్పనేలేదు. పాకిస్ధాన్ ఏర్పడ్డాక, అది మత రాజ్యంగా ఏర్పడితే ఆ భూభాగం పై ఉండే హిందువుల పరిస్ధితి ఏమిటి? అన్న దానిపైనే అంబేద్కర్ పై భాగంలో కేంద్రీకరించాడు. పాకిస్ధాన్ మతరాజ్యంగా అవతరిస్తే అక్కడ మత సామరస్యత నెలకొనగలదా లేదా అన్న అనుమానం లేవనెత్తుతూ, మత సామరస్యత లేని పరిస్ధితుల్లో అక్కడి హిందువుల పరిస్ధితి పట్ల అంబేద్కర్ ఆందోళన చెందాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ పాకిస్ధాన్ భూభాగంపై ఉండడానికి ఇష్టపడని వారు భారత దేశంలోకి తరలి రావడానికి అంగీకరించాలని ప్రతిపాదించాడు. భారత భూభాగాలపై కాకుండా పాకిస్ధాన్ భూభాగంపై ఉండడానికి ఎవరైనా కోరుకుంటె వారికీ అనుమతి ఇవ్వాలనీ అంబేద్కర్ ప్రతిపాదిస్తూ దానికి అవసరమైన విధి, విధానాలను అంబేద్కర్ తన గ్రంధంలో పొందుపరిచాడు. ఆస్తుల తరలింపు, స్దిరాస్తులను తరలించలేం కనుక దాని విలువను చెల్లించడం, పన్నులు… తదితర సమస్యలకు అంబేద్కర్ పరిష్కారం చూపాడు.

ఈ పరిష్కారం ఐఛ్ఛికమే గాని బలవంతం కాదు అని కూడా అంబేద్కర్ చెప్పాడు. “ప్రజల మార్పిడి అనేది తప్పనిసరా? లేక ఐచ్ఛికమా?” (అదే గ్రంధం, పేజి 375 పేరా 2) అని ప్రశ్నిస్తూ అంబేద్కర్, దానికి సమాధానంగా చరిత్రలో రెండూ జరిగాయని సమాధానం ఇచ్చాడు. భారత దేశానికి సంబంధించి ‘ఐచ్ఛికం’ చెయ్యాలని అంబేద్కర్ స్పష్టం గా చెప్పాడు. అంబేద్కర్ గ్రంధం నుండి ఉటంకించబడిన కింది భాగం చూస్తే ఆ విషయం స్పష్టం కాగలదు.

“… వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా అతనిని తన పూర్వీకుల ఆవాస ప్రాంతం నుండి వలస పొమ్మని బలవంతం చెయ్యడం మంచిది కాదు. ఒకవేళ అతను నివసిస్తున్న ప్రదేశం శాంతి, సుస్ధిరతలకు భంగం వాటిల్లి దేశం అస్తవ్యవస్త పరిస్ధితులకు లోనయ్యే పరిస్ధితులందు వలసపోవడమనేది అతని శ్రేయస్సు దృష్ట్యా అతనికే అవసరం. ఇపుడు కావలసినదేమంటే కష్టనష్టాలు లేకుండా కోరుకున్న వారందరూ వలసపోవుటకు అనువైన పరిస్ధితులు. కాబట్టి నా అభిప్రాయం ఏమంటే మార్పిడి అనేది బలవంతంగా జరుగకూడదు. వలసపోయే విషయంలో తమ మనోగతాన్ని వెల్లడించేవారికే దీనిని వదిలివేయాలి.” (అదే గ్రంధం, పేజి 375, పేరా 5)

కనుక భారత దేశంలో ఉన్న మహమ్మదీయులందరూ పాకిస్ధాన్ కి పంపేయాలని అంబేద్కర్ చెప్పాడని అంతర్యానం చెప్పినది నిజం కాదు. ‘దేశ విభజతో పాటు మహమ్మదీయులందరినీ పాకిస్ధాన్ పంపాలి’ అని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదు. అంతర్యానం గారు ఉటంకించినది నిజం కాదు. ఈ విధంగా అంబేద్కర్ చెప్పని అంశాలను ఆయనకి ఆపాదించడంలో అంతర్యానం గారి ఉద్దేశ్యం ఏమిటి? రాజ్యాంగ నిర్మాతగా, దళితుల అభ్యున్నతికి కృషి చేసినవాడిగా గౌరవం అందుకుంటున్న అంబేద్కర్ కి, ఆయన చెప్పని మాటలను ఆపాదించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. టర్కీ, గ్రీసు, బల్గేరియా ల గురించి అంబేద్కర్ ఉదహరించిన సందర్భం పూర్తిగా వేరని పై ఉటంకను చూస్తే అర్ధం కాగలదు. అది తీసుకొచ్చి గురు గోల్వాల్కర్ చేసిన బోధనతో పోల్చడం సరికాదు.

అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన అంశాలకూ, గురు గోల్వాల్కర్ చెప్పిన అంశాలకూ కూడా అసలు పోలిక లేదు. రెండు మతాల ప్రజలు మత సామరస్యంతో జీవనం గడపవలసిన అవసరాన్ని చెబుతూ దానికి పాకిస్ధాన్ విభజన పరిష్కారం కాగలదని అంబేద్కర్ సూచించాడు. అంతే తప్ప భారతదేశంలో మహమ్మదీయులు ఉండలేరు కాబట్టి పాకిస్ధాన్ విభజన జరగాలని ఆయన తన గ్రంధంలో ఎక్కడా చెప్పలేదు. గురు గోల్వాల్కర్ భారతదేశంలో మహమ్మదీయులు ఉండరాదని నిర్ధారిస్తే, కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో, కొద్దిమంది ముస్లింలు, వారి క్షేమం దృష్యా వలసపోవడం ఉత్తమం అని అంబేద్కర్ చెప్పాడు. అది కూడా పాకిస్ధాన్ లో నివసించడానికి ఇష్టపడని హిందువులతో భారత దేశంలో నివసించడానికి ఇష్టపడని ముస్లింలను పరస్పరం మార్చుకోవాలన్న సూచనలో భాగంగానే ఇటువంటి వలసను అంబేద్కర్ ప్రతిపాదించాడు. అది కూడా బలవంతంగా కాక ఐచ్ఛికంగా జరగాలనే అంబేద్కర్ చెప్పాడు

‘ద్విజాతి సిద్ధాంతం’ ప్రతిపాదించిన జిన్నా దానిని జాతి దృక్పధంతో కాక మతం దృక్పధంతో ప్రతిపాదించాడన్నది స్పష్టమే. ముస్లింలకు సొంత ‘నేషన్’ కావాలనడంలొ, ‘భౌగోళిక దేశం’ అర్ధంలో కోరిన కోరిక తప్ప చారిత్రక మూలాల ప్రాతిపదికన ఏర్పడిన ‘జాతి’ కి స్వంత దేశం కావలన్న కోరిక అందులో లేదు. అందుకు తగిన చారిత్రక ప్రాతిపదిక కూడా లేదు.

(ఈ అంశంఫై అధ్యయనం చేసే అవకాశం నాకు కల్పించినందుకు ‘అంతర్యానం’ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే సమయంలో అంబేద్కర్ చెప్పని అంశాలను ఆయనకి ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. -విశేఖర్)


Filed under: మార్క్సిజం-లెనిజిజం, సమాజం, సంస్కృతి Tagged: పాకిస్ధాన్ పై అంబేద్కర్ భావాలు, పాకిస్ధాన్ విభజన

2012-01-29

24 గంటలు: వడ్డీకి ఇచ్చారు... వ్యాపారం చేసుకోమన్నారు..

2012-01-29 05:29 PM sateesh devalla (noreply@blogger.com)
మద్యం మాఫియాలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. మద్యం సిండికేట్లపై, ఎక్సైజ్ అధికారులపై ఏసీబీ పలు దఫాలుగా చేసిన దాడులు.. ఆశ్చర్యకరమైన వివరాలను బయటపెట్టాయి. సిండికేట్లను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే.. వాళ్లకు అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏసీబీ గుర్తించింది. సిండికేట్లపై ఏసీబీ రూపొందించిన 750 పేజీల నివేదికలో పలు కీలక విషయాలున్నాయి. ఏడు జిల్లాల్లో 22 ప్రాంతాల్లో 33 మద్యం సిండికేట్‌

24 గంటలు: చంద్రబాబుపై గాలి మాటలు

2012-01-29 05:27 PM sateesh devalla (noreply@blogger.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానిమంత్రి కావాలని దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బాబు ప్రధాని అయితే  దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో రోజురోజుకు దిగజారుతోందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కుతుందన్నారు. మొత్తానికి బాబు ప్రధాని అభ్యర్థి

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: గ్రీసు బడ్జెట్ ఇ.యు చేతికివ్వాలి, జర్మనీ దుర్మార్గం

2012-01-29 08:09 AM విశేఖర్

గ్రీసు బడ్జేట్ రూపకల్పనను కూడా యూరోపియన్ యూనియన్ నియంత్రణకి అప్పజెప్పాలన్న దుర్మార్గమైన ప్రతిపాదనను జర్మనీ ముందుకు తెచ్చింది. ఇప్పటికే గ్రీసు దేశ బడ్జెట్ తో పాటు అక్కడి ఆర్ధిక కలాపాలనన్నింటినీ పెద్ద ఎత్తున గుప్పిట్లో పెట్టుకున్న యూరోపియన్ యూనియన్ ఇకనుండి నేరుగా బడ్జెట్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇ.యుకి అధికారం ఇవ్వాలని జర్మనీ డిమాండ్ చేస్తోంది. పేరుకి జర్మనీ ప్రతిపాదన అయినప్పటికీ, యూరోపియన్ యూనియన్ దేశాల్లోని బహులజాతి ప్రవేటు కంపెనీలే జర్మనీ ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నాయి.

గ్రీసు తన రుణ సంక్షోభ సమస్యలనుండి గట్టెక్కాలంటే తన సౌర్వభౌమత్వాన్ని కొంతమేరకు వదులుకోవాల్సి ఉంటుందని జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ గతంలోనే ప్రకటించింది. ఐతే, ఆ ప్రతిపాదన నోటిమాటవరకే ఇప్పటివరకూ ఉండగా, ఇప్పుడది ప్రతిపాదనల రూపంలో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను ఆమోదించడానికి గ్రీసు ప్రభుత్వం తిరస్కరిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇ.యు ఒత్తిడికి లొంగదన్న గ్యారంటీ కనపడడం లేదు.

యూరోపియన్ యూనియన్ దేశాలు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రెండు దురాక్రమణ యుద్ధాలు, దరిమిలా తలెత్తిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా యూరోపియన్ దేశాలు అప్పుల ఊబిలో కూరుకున్నాయి. ఈ అప్పులన్నీ ఆయా దేశాల అవసరాల కోసం కాకుండా దురాక్రమణ యుద్ధాల కోసం, ద్రవ్య, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన బహుళజాతి కంపెనీలను ఆదుకోవడానికి పంచి పెట్టిన బెయిలౌట్లవల్ల పేరుకుపోయినవే. సంక్షోభం నుండి బైటికి రావడానికి ప్రభుత్వాలనుండి బెయిలౌట్లు పొందిన కంపెనీలు తాము సంక్షోభం నుండి బైటికి వచ్చినప్పటికీ సదరు అప్పుల భారాన్ని మోయడానికి నిరాకరిస్తున్నాయి. దానితో అప్పుల భారాన్ని మోయడం ప్రజల వంతయ్యింది.

గ్రీసును రుణ సంక్షోభం నుండి ఆదుకోవాలన్న పేరుతో ఆ దేశానికి యూరోపియన్ యూనియన్ ఇస్తున్న బెయిలౌట్లు గ్రీసు బడ్జేట్ ఖాతాలోకి వెళ్లలేదు. అవన్నీ తిరిగి అప్పు చెల్లింపుల రూపంలో ఇ.యు బహుళజాతి కంపెనీలకు, ప్రవేటు బ్యాంకులకు, ఇన్సూరెన్సు కంపెనీల లాంటి ప్రవేటు ద్రవ్య సంస్ధలకు చేరిపోయాయి. ఫలితంగా గ్రీసు కోసం ఇ.యు మంజూరు చేసి బెయిలౌట్ వల్ల ఆ దేశంలో ఉత్పత్తి కార్యక్రమాలేవీ జరగలేదు. గ్రీసు చేసిన అప్పులతో పాటు ఆ దేశ బడ్జెట్ లోని అధిక కేటాయింపులు సైతం ప్రవేటు కంపెనీలకే వెళ్తుండడంతో గ్రీసు ఆర్ధిక వనరులన్నీ గ్రీసు ప్రజల వినియోగానికి బదులు ఇ.యు అమెరికాల ప్రవేటు బహుళజాతి కంపెనీలకు వినియోగపడుతున్నాయి.

వాస్తవాలు ఇలా ఉండగా, గ్రీసు కి బెయిలౌట్ ఇస్తున్నప్పటికీ అది సంక్షోభ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదనీ, బడ్జెట్ లోటు తగ్గింపుకు చర్యలు తీసుకోవడం లేదనీ జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెత్తందారీ రాజ్యాలు ఆరోపిస్తున్నాయి. తద్వారా గ్రీసును మరింతగా కొల్లగొట్టడానికి తగిన రహదారుల్ని నిర్మించుకుంటున్నాయి. దానిలో భాగంగానే గ్రీసు రుణ సంక్షోభం పరిష్కారానికి ఆ దేశ బడ్జెట్ రూప కల్పన కూడా తమకు అప్పజెప్పాలని ఇ.యు సమావేశాల్లో జర్మనీ ప్రతిపాదిస్తోంది. దుర్మార్గమైన ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న గ్రీసు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులపై అమానుషమైన నిర్బంధకాండను గ్రీసు ప్రభుత్వం ప్రయోగిస్తోంది.

అధిక బడ్జెట్ లోటు, ఖర్చులకు అప్పు పుట్టకపోవడం రుణ సంక్షోభం ముదిరిందనడానికి తగిన లక్షణాలుగా చెబుతున్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తదితర ఆదాయ వర్గాలపైన పొదుపు, కోత విధానాలు అమలు చేస్తుండడంతో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం బాగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం పడిపోవడం వల్ల బడ్జెట్ సైజును తగ్గించుకోవాలనీ, తద్వారా తన ప్రజల కోసం గ్రీసు పెడుతున్న ఖర్చులను బాగా తగ్గించుకుని, ఉన్న బడ్జెట్ అంతా వినియోగించి కంపెనీలకు అప్పులు తీరుస్తూ పోవాలని ఇ.యు దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి. గ్రీసు ప్రజలు కడుపులు మాడ్చుకుని, అవసరాలన్నీ  బందు పెట్టుకుని బహుళజాతి ద్రవ్య కంపెనీల ధనదాహాన్ని తీర్చడానికే కంకణబద్ధులు కావాలన్నది ఇ.యు దేశాల కోరిక. ఈ విధంగా ప్రవేటు బహుళజాతి కంపెనీలకు ఉన్న అప్పులన్నీ తీరుస్తూ పోతేనే ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉన్నట్లుగానూ లేదంటె ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోయినట్లుగానూ పత్రికలు పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నాయి.

కార్మికులు, ఉద్యోగులు జీతాలు లేక, సదుపాయాలు రద్దయ్యి, పస్తులుంటున్న పరిస్ధితి వచ్చినప్పటికీ ఈ విష పత్రికలకు సంక్షోభం లాగా కనిపించదు. అసలది వారికి లెక్కేకాదు. కంపెనీలకు లాభాలు రావాలి. మామూలు లాభాలు కూడా కాదు. అధిక లాభాలు రావాలి. అత్యధిక లాభాలు రావాలి. ఈ లాభాలు ప్రతి రోజూ పెరుగుతూ పోవాలి. ప్రతి నెలా, ప్రతి క్వార్టరూ, ప్రతి ఏడూ అలానే పెరుగుతూ పోవాలి. అలా పెరిగితేనే ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సజావుగా ఉన్నట్లు. కంపెనీలకు లాభాలు రాకపోయినా, ఆ లాభాలు పెరగకపోయినా, లాభాలు పెరగడమే కాక లాభ శాతం పెరగకపోయినా, గతం కంటే ఎక్కువగా ఆదాయం పెరగకపోయినా ఆ దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్నట్లు లెక్క. ఇటువంటి దగుల్బాజీ పెట్టుబడిదారీ సిద్ధాంతాలతో, కేవలం ప్రవేటు కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతూ యావద్దేశ ప్రజానీకం పస్తుల్లో ఉంచడానికి కూడా సిద్ధపడే విధానాలతో ఇ.యు దేశాల ప్రభుత్వాలు తమ దేశాల ప్రజల ఉసురు తీసుకుంటున్నాయి. తమ దగుల్బాజీ విధానాలను ప్రజలు ప్రశ్తించకుండా అనేక సామాజిక వైమనస్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నాయి.

ఇప్పుడు ఏకంగా ఇ.యు సభ్య దేశాల ఆర్ధిక సార్వభౌమత్యాన్ని సైతం కబళించడానికి ఇవి సిద్ధపడుతున్నాయి. జర్మనీ ప్రతిపాదన ప్రకారం గ్రీసు బడ్జెట్ ని పర్యవేక్షించడానికి ‘బడ్జెట్ కమిషనర్’ ని ఇ.యు నియమిస్తుందట. ఈ కమిషనర్ కి దుర్మార్గమైన వీటో అధికారాలను దఖలు పరుస్తారట. అసలు బడ్జేట్ కమిషనర్ నియామకమే దుర్మార్గం కాగా, వాడికి వీటో అధికారాలను దఖలు పరచడం మరింత దుర్మార్గం. ఇ.యు ఆదేశాలకు, అది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రీసు బడ్జెట్ ప్రతిపాదనలు లేనట్లయితే అటువంటి బడ్జెట్ ప్రతిపాదనలను వీటో చేసే అధికారం బడ్జెట్ కమిషనర్ కి ఉంటుందట. అంతేకాకుండా గ్రీసు తన అప్పులను చెల్లించడానికి అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటారట. గ్రీసు దేశం ఇప్పటివరకూ ఇస్తూ వచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలోనూ, తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ విఫలం అయినందున ఈ కమిషనర్ అవసరమని ఇ.యు తరపున జర్మనీ ప్రతిపాదిస్తొందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక తెలిపింది.

జర్మనీ ప్రతిపాదనలో మరిన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రీసులో తిష్ట వేసుకుని ఉన్న ఇ.యు అధికారులకు గ్రీసు అనుసరించే కోశాగార విధానంలోని నిర్ధిష్ట నిర్ణయాధికారాలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిపాదనలను చూసానంటున్న రాయిటర్స్ తెలిపింది. పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదట. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా గ్రీసు ప్రభుత్వ ప్రతినిధి పాంటేలిస్ కాప్సిస్ ప్రకటించాడని బిబిసి తెలిపింది. గ్రీసు బడ్జెట్ పూర్తిగా గ్రీసు ప్రభుత్వ చేతిలోనే ఉంటుందని ఆయన బల్లగుద్దాడని ఆ సంస్ధ తెలిపింది. సోమవారం బెల్జియ రాజధాని బ్రసెల్స్ లో ఇ.యు నాయకులు సమావేశం కానున్న నేపధ్యంలో ఈ ప్రతిపాదనలు లీక్ చేశారు. గ్రీసు కోసం ఉద్దేసించిన నూతన కోశాగార ఒప్పందాన్ని (ఫిస్కల్ పేక్ట్) ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. గ్రీసు తో ఇ.యు ఓపిక నశిస్తోందనడానికి ఇంతకంటే రుజువు అనవసరమనై బిబిసి విలేఖరి వ్యాఖ్యానిస్తున్నడు. నిజానికి నశిస్తోంది ఇ.యు ఓపిక కాదు. ఇ.యు దేశాల బందిపోటు విధానాలతో గ్రీసు ప్రజల ఓపిక మాత్రమే నశిస్తోంది. ఒక్క గ్రీసు ప్రజల ఓపిక మాత్రమే కాదు. జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్సు, స్పెయిన్ తదితర దేశాల ప్రజల ఓపిక సైతం నశించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.


Filed under: ఆర్ధిక ద్రవ్య రంగాలు Tagged: గ్రీసు సంక్షోభం, యూరప్ రుణ సంక్షోభం

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: గాలి కోసం జగన్ బూతులు బెదిరింపులు

2012-01-29 06:17 AM విశేఖర్

అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజుల్ని గాలి కంపెనీకి అప్పజెప్పడంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సి.బి.ఐ జగన్ అరెస్టుకి ఎందుకు వెనకాడుతోంది? గాలి జనార్ధన రెడ్డి కంటే ముందే ఇనుప గనుల లీజుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన కంపెనీని కాదని గాలి కంపెనీకి గనులు లీజు ఇచ్చారనీ, ఈ విషయంపై కోర్టుకి వెళ్లడంతో జగన్ తనను బెంగుళూరుకి మూడుసార్లు పిలిపించి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తిట్టి బెదిరించాడనీ, అందువల్లనే తాను కేసుతో పాటు లీజు దరఖాస్తు కూడా ఉపసంహరించుకున్నాననీ ‘కొండారెడ్డి’ ఇచ్చిన వాంగ్మూలాన్ని ‘ఆంధ్ర జ్యోతి’ దిన పత్రిక బయట పెట్టింది. ఇంత స్పష్టంగా వై.ఎస్.జగన్మోహన రెడ్డి పైన ఆరోపణలు వచ్చినప్పటికీ సి.బి.ఐ ఇంతవరకూ ఆయనని అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలు కలగజేస్తోంది.

జగన్ అక్రమాస్తుల కేసుపైన సి.బి.ఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సి.బి.ఐ విచారిస్తున్న ఎమార్ విల్లాల కుంభకోణం, గాలి అక్రమ గనుల తవ్వకం కేసు రెండింటిలోనూ జగన్ పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇంతవరకూ జగన్ ను విచారించడానికి ఆసక్తి చూపలేదు. ఒకసారి విచారించినప్పటికీ అది ‘సాక్షి’ గానేనని జగన్ చెప్పుకున్నాడు. జగన్ ని నిందితుడుగా సి.బి.ఐ ఇంతవరకూ విచారించలేదు. సోనియాకు సరెండర్ అయినందువల్లనే జగన్ ను సి.బి.ఐ విచారించడం లేదన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

అనంతపురం జిల్లా, డి.హీరేహల్ మండలం, మలపనపురం, సిద్ధాపురం గ్రామాలో తొంభై హెక్టార్లలోఉన్న ఇనుప గనుల లీజు కోసం 2005లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందనీ, తాను 2004లోనే మైనింగ్ కోసం అటవీశాఖ అనుమతి కోరినా తన దరఖాస్తును జగన్ పక్కనబట్టించాడని ఎన్.కొండారెడ్డి సి.బి.ఐ కి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అనేకసార్లు సి.ఎం.ఒ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపాడు. దానితో తనను జగన్ మూడు సార్లు బెంగుళూరులోని తన నివాసానికి పిలిపించుకున్నాడనీ, గనుల లీజుకోసం దరఖాస్తు ఉపసంహరించుకోవాలనీ, కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చాడనీ, ఐనా తాను వినకపోవడంతో ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టాడనీ, రకరకాల బెదిరింపులకు దిగాడనీ కొండారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

కొండారెడ్ది దరఖాస్తు చేసుకున్న ప్రాంతాన్ని ఇతరులకు కేటాయించకుండా హై కోర్టు స్టే విధించాక రెండోసారి (2006 డిసెంబరు లేదా 2007 జనవరి) బెంగుళూరుకి పిలిపించుకుని మళ్ళీ బెదిరించాడని కొండారెడ్డి తెలిపాడు. గాలి జనార్ధన రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కొసం ఐదు కోట్ల రూపాయలు తన తండ్రికి ఇచ్చాడనీ, దానితో తన తండ్రి గాలి జనార్ధన రెడ్డికి మైనింగ్ లీజు ఇస్తానని మాట ఇచ్చారనీ ఇపుడు కొండారెడ్డి వల్ల ఆ మాట పోతోందనీ తనపై జగన్ విరుచుకుపడ్డాడని కొండారెడ్డి తెలిపాడు. హైకోర్టు తీర్పుని కూడా ప్రభావితం చేయనున్నారని సమాచారం అందడంతో తాను ఛీఫ్ జస్టిస్ కి దరఖాస్తు చేసుకుని కేసు మరో జడ్జి కి అప్పగించామని కోరాననీ దానికి ఆయన అనూకులంగా నిర్ణయం తీసుకున్నారని కొండారెడ్డి తెలిపాడు. మళ్ళీ 2007 ఫిబ్రవరి/మార్చి లో జగన్ తనను పిలిపించాడని కొండారెడ్డి తెలిపాడు.

మూడోసారి వ్యూహం మార్చుకున్న జగన్ తిట్లకు బెదిరింపులకు దిగడానికి బదులు ప్రలోభ పెట్టాడని కొండారెడ్డి తెలిపాడు. “సర్పంచ్ నుండి, సి.ఎ దాకా అధికారం అంతా మా చేతిలో ఉంది. నీ దరఖాస్తు వెనక్కి తీసుకో. వచ్చే క్యాబినెట్ విస్తరణలో మీ తండ్రికి మంత్రి పదవి ఇవ్వాలని మా నాన్నకి చెబుతా. నీ వ్యాపారాభివృద్ధికి బ్యాంకు లోన్లు ఇప్పిస్తాం” అని జగన్ ప్రలోభ పెట్టాడని కొండారెడ్డి తెలిపాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, హితులు జగన్ కి ఉన్న అధికార బలానికి ఎదురు తిరగవద్దనీ, వాళ్ళేమైనా చెయ్యగలరని హితవు పలకడంతో తాను వారిని అనుసరించక తప్పలెదని కొండారెడ్డి తెలిపాడు. హైకోర్టులో కేసునూ, లీజు దరఖాస్తునూ వెనక్కి తీసుకుంటూ ‘ఒ.ఎం.సి’ లాయర్ తయారు చేసి ఉంచిన డాక్యుమెంటులో సంతకాలు పెట్టానని కొండారెడ్డి తెలిపాడు.

రెండు సార్లు బూతులు తిట్టి, రక రకాల బెదిరింపులకు పాల్పడిన జగన్ మూడోసారి కొండారెడ్డిని ప్రలోభాలతో లొంగదీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కొండారెడ్డి తండ్రికి మంత్రి పదవి ఇవ్వడం అంటే ఆ కుటుంబానికి అవినీతి పాల్పడగల అవకాశాలు కల్పించడమే. ఆ విధంగా ఆర్ధిక లాభాలు సమకూరుతాయని నమ్మకం కుదిరాక మాత్రమే కొండారెడ్డి జగన్ కి లొంగాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సుపుత్రుడి హోదాలో ఉన్న జగన్ రెండుసార్లు బెదిరించినా లొంగని కొండారెడ్డి ఆర్ధిక ప్రలోభాలకి లొంగాడు. ఐతే వ్రతం చెడ్డా కొండారెడ్డికి ఫలితం దక్కలేదు. పైగా ఆ తర్వాత 2009 లో ప్రత్యర్ధులతో చేతులు కలిపి కొండారెడ్డి తండ్రిని వై.ఎస్.రాజశేఖర రెడ్ది ఓడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగా మాట తప్పని, మడమ తిప్పని వంశంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన సుపుత్రుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డి లు మాట తప్పి, మడమ తిప్పారు.

‘మాట తప్పని, మడమ తిప్పని వంశం మాది’ అని చెప్పుకునే జగన్ గొప్పలు వట్టి బూటకం. కేవలం తమకు ప్రయోజనాలు ఉంటేనే వారి మాటలు చెల్లుబాటవుతాయి తప్ప తమకు ప్రయోజనం లేదంటే వారి మాటలు నీటి మూటలే. అదొక వ్యవహారం కాగా, ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రజాధనాన్ని బంధువులకు, స్నేహితులకి, ప్రత్యర్ధులను లోంగదీసుకోవడానికి వినియోగించడానికీ సిద్ధపడడం, అందుకోసం హామీలూ, మాటలూ ఇచ్చేయడమే అత్యంత కిరాతకం. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకుని దాని ద్వారా ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమే ప్రస్తుతం రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న రాజకీయ కార్యక్రమం. ఈ పనిలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, రాష్ట్రానికి సంబంధించినంతవరకూ, అందరినీ అధిగమించి ఉన్నత స్ధాయికి చేరుకున్నాడని చెప్పవచ్చు. దేవుడి రాజ్యం అంటూ తన కిరాతక పాలనకి దైవాంశని ఆపాదించడానికి ఆయన చేసిన ప్రయత్నం చూస్తే దేవుళ్లు ఎవరికి అందుబాటులో ఉంటారో కూడా అర్ధం చేసుకోవచ్చు.

పాలక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ అధిపతి సోనియా గాంధి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఓ వైపు అవినీతి అంతానికి కంకణం కట్టుకున్నామంటూ దేశ ప్రజలకు వాగ్దానాలు కురిపిస్తూ మరోపక్క జగన్ లాంటి అవినీతిపరులపై నమోదైన సి.బి.ఐ కేసులు ముందుకు సాగకుండా జరుగుతున్న ప్రయత్నాల పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లు ఎందుకు మౌనంగా ఉన్నారు? భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించగల నాయకులు కొరవడిన నేపధ్యంలో జగన్ పైన కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నదా? అందుకే ప్రస్తుతానికి జగన్ వ్యవహారం పతాక శీర్షికలకు ఎక్కకుండా జాగ్రత్తపడుతోందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్న జగన్ మీడియాకు వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలను సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇస్తున్నట్లు? సోనియా, రాహుల్, మన్మోహన్ లాంటి కాంగ్రెస్ హై కమాండ్ అనుమతి జరగకుండా ఇవన్నీ సాధ్యమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్పష్టమే. ప్రజలే వారి స్ధానాల్ని నిర్ణయించవలసి ఉంది.


Filed under: రాజకీయాలు, సమాజం, సంస్కృతి Tagged: కొండారెడ్డి వాంగ్మూలం, జగన్ అవినీతి, జగన్ బూతులు

24 గంటలు: మద్యం వ్యాపారులకు మూడింది

2012-01-29 12:51 AM sateesh devalla (noreply@blogger.com)
మద్యం సిండికేట్లపై రెండోరోజూ ACB దాడులు కొనసాగాయి. మొదటిసారి జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు ACB పక్కాగా దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో భారీగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ గురవయ్య, సిండికేట్ అధ్యక్షుడు వెంకట్రావు, కోవూరు ఎక్సైజ్ ఎస్సై విజయకుమార్,బుచ్చిరెడ్డిపాళ్యం సిండికేట్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలో

24 గంటలు: టీడీపి వదిలినా..మేం పార్టీని వదలం..: హరికృష్ణ

2012-01-29 12:44 AM sateesh devalla (noreply@blogger.com)
టీడీపీలో ఫ్యామిలీ ఫైట్.. హరికృష్ణను వెలివేస్తారా..? సీతయ్య టీడీపీని వీడుతారా..? బాలయ్య రాకతో ఆత్మరక్షణలో ..? టీడీపీలో మళ్లీ చక్రం తిప్పాలని భావిస్తున్న సీతయ్య.. స్పీడ్ పెంచారు. కొన్నాళ్లుగా పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న ఆయన.. బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో, మళ్లీ యాక్టివ్ అయ్యారు.. పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. అయితే.. రాజకీయాల్లోకి వస్తానంటూ బాలయ్య ప్రకటించడంతోనే

2012-01-28

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు

2012-01-28 01:30 PM విశేఖర్

Reblogged from వీవెనుడి టెక్కునిక్కులు:

Click to visit the original post

  • Click to visit the original post
  • Click to visit the original post

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో …

మీ కృషికి అభినందనలు. కృతజ్ఞతలు కూడా.

Filed under: ఇతరములు

24 గంటలు: దాసరిపై చిరంజీవి ప్రతీకారం

2012-01-28 01:22 PM sateesh devalla (noreply@blogger.com)
దర్శకరత్న దాసరి నారాయణరావుకు, మెగాస్టార్ చిరంజీవికి అసలు పడదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చిరును పొగిడే దాసరి .. మరో వేదిక ఎక్కగానే మాత్రం విరుచుకుపడుతుంటారు. అయితే.. దాసరి విమర్శలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం చిరంజీవికి మరోలా చేతికందింది. ప్రజారాజ్యాన్నివిలీనం చేసుకోనున్న కాంగ్రెస్ పార్టీనే ఈ అవకాశాన్ని అందిస్తోంది. రాష్ట్రం నుంచి త్వరలో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ

24 గంటలు: నెల్లూరి నెరజాణకు ఏమయ్యింది?

2012-01-28 01:09 PM sateesh devalla (noreply@blogger.com)
నెల్లూరి నెరజాణకు భారతదేశాన్ని ఊపేసిన నేపాలి సుందరి మనీషా కోయిరాల తాజా చిత్రమిది. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన మనీషా.. 2010లో వివాహం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే.. ఇటీవలే ముంబైలో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరైన మనీషా.. ఫుల్ గా మందు కొట్టేసింది. ఆ తర్వాత ఇలా ఫొటోలకు చిక్కింది. అందాల తారగా కనిపించిన మనీషా.. ఒక్కసారిగా ఇంత దారుణంగా చూసి చాలా మంది తేరుకోలేకపోయారు. అయితే,

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఆ డాక్టరే లాడెన్‌ని పట్టిచ్చాడు -అమెరికా

2012-01-28 01:06 PM విశేఖర్

బిన్ లాడెన్ ఆచూకి తెలుసుకోవడంలో తమకు సహాయపడింది పాకిస్ధాన్ ప్రభుత్వం అరెస్టు చేసిన డాక్టరేనని అమెరికా మొదటిసారి ధృవీకరించింది. డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ఓ టెలివిజన్ ఛానెల్ కి ఇంటర్వూ ఇస్తూ ఈ నిజాన్ని కక్కాడు. అబ్బోత్తాబాద్ లో లాడెన్ నివసించాడని చెబుతున్న ఇంటికి సమీపంలోనే పెనెట్టా చెబుతున్న డాక్టర్ నివాసం ఉంటున్నాడు.

అమెరికాకి చెందిన నావీ సీల్ విభాగ కమాండర్లు రెండు హెలికాప్టర్లలో బయలుదేరి, పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెప్పకుండా, పాకిస్ధాన్ గగనతలంలోకి జొరబడి, ఒసామా బిన్ లాడెన్ ను చంపేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా గత మే నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ల నుండి తమ కమెండోలు లాడెన్ ఉంటున్న ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న మరో ముగ్గురిని దారుణంగా చంపేసారు. రక్తపు మడుగులో ఉన్న ముగ్గురి శవాలను పాకిస్ధాన్ భద్రతా బలగాలు బహిరంగం కావించాయి.

బిన్ లాడెన్ ని చంపేశామని చెప్పినప్పటికీ, అమెరికా, అందుకు తగిన సాక్ష్యాలేవీ బైట పెట్టలేదు. శవం తాలూకు ఫొటోలు అత్యంత భయంకరంగా, హృదయ విదారకంగా ఉన్నాయని అందువల్లనే ఆ ఫొటోలు విడుదల చేయలేకపోతున్నామనీ ఒబామా ప్రకటించాడు. ఒసామా బిన్ లాడెన్ నిరాయుధంగా ఉన్నాడని కూడా అమెరికా అధికారులు ఆ తర్వాత ధృవీకరించారు. నిరాయుధంగా ఉన్న బిన్ లాడెన్ ను ‘శవం ఫొటోలు బైటపెట్టడానికి కూడా వీలులేనంత’ దారుణంగా చంపామని చెప్పుకోవడానికి అమెరికా అధికారులు గానీ, అధ్యక్షుడు ఒబామా గానీ సిగ్గుపడలేదు. తమ ‘సిగ్గులేని తనాన్నీ’, ‘సంస్కార రాహిత్యాన్నీ’, ‘ప్రజాస్వామిక విలువల పట్ల ఉన్న బూటకపు గౌరవాన్నీ’, ‘లాడెన్ శవానికి కూడా భయపడే పిరికితనాన్నీ’ వారా విధంగా చాటుకున్నారు.

లాడెన్ హత్యతో పాకిస్ధాన్ పౌరులు అనేకమంది ఆగ్రహం చెందారు. పాకిస్ధాన్ ప్రాదేశిక సార్వభౌమత్యాన్ని అమెరికా నిరభ్యంతరంగా ఉల్లంఘించడం పట్ల తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ ఆగ్రహాన్ని ‘లాడెన్ కి ఆశ్రయం ఇస్తున్నందుకు’ వ్యక్తమైన ఆగ్రహంగా పశ్చిమ పత్రికలు రాసుకుని సంతృప్తి చెందాయి. అదే విశ్లేషణని ఇప్పటికీ నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నాయి. పాకిస్ధాన్ ప్రభుత్వం తమకు తెలియకుండా అమెరికా దాడి చేసిందని చెప్పినప్పటికీ దాన్ని విశ్వసించినవారు లేరు, లేదా అతి తక్కువ. ఐతే పాకిస్ధాన్ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి పాక్ ప్రభుత్వం ‘లాడెన్ హత్య’ పైన ‘విచారణ తంతు’ను ప్రారంభించి కొనసాగిస్తోంది.

డాక్టర్ షకీల్ అఫ్రిది సి.ఐ.ఏ జరిపిన దాడి కి అవసరమైన గూఢచార సమాచారాన్ని తమకు అందించాడని పెనెట్టా తెలిపాడు. సి.బి.ఎస్ ఛానెల్ కి చెందిన ’60 మినిట్స్’ కార్యక్రమానికి పెనెట్టా ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సంగతి చెప్పాడు. ఆదివారం ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నది. బిన్ లాడెన్ గా భావిస్తున్న వ్యక్తి డి.ఎన్.ఎ నమూనా సేకరించడానికి డాక్టర్ షకీల్ ‘వేక్సినేషన్ కార్యక్రమం’ నిర్వహించాడు. తద్వారా సేకరించిన డి.ఎన్.ఎ ఫలితాలను డాక్టర్ సి.ఐ.ఎ కి చేరవేశాడు. పాకిస్ధాన్ పౌరుడిగా ఉంటూ వారి దేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తి డి.ఎన్.ఎ ని అక్రమ పద్ధతుల్లో సేకరించి పరాయి దేశానికి, అందునా ప్రపంచ దురాక్రమణదారుగా, ప్రపంచంలోని ఆశేష శ్రామిక జన ప్రయోజనాలకు పచ్చి వ్యతిరేకిగా తనను తాను నిరూపించుకున్న ‘రాక్షస అమెరికా ప్రభుత్వానికి’ ఆ డాక్టర్ చేరవేశాడు.

డాక్టర్ షకీల్ పైన పాకిస్ధాన్ ‘దేశ ద్రోహం/విశ్వాస ఘాతుకం’ నేరం ఆరోపించింది. అయితే పాకిస్ధాన్ ప్రభుత్వం డాక్టర్ ని శిక్షించడంలో చిత్తశుద్ధితో లేదు. డాక్టర్ సమస్యను గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించుకోవాలని పాక్ చూస్తున్నట్లుగా తెలుస్తొంది. అఫ్రిది విషయమై మీడియా కేంద్రీకరణ చప్పబడిన తర్వాత షకీల్ ని అమెరికాకి అప్పజెప్పడానికి పాక్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు పాక్ అధికారులు చెప్పారని ‘ది హిందూ’ తెలిపింది. డాక్టర్ పై విచారణ జరుగుతున్నందున తమ పేర్లు చెప్పవద్దని వారు కోరారట.

డాక్టర్ షకీల్ అఫ్రిది ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో టాప్ సర్జన్ గా నియామకం సంపాదించడం వెనుక అమెరికా కుట్ర ఉంది. అంతవరకూ ఆయన డిపార్ట్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నప్పటికీ ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంతో సంబంధాలు ఏర్పడ్డాక ఒక్కసారిగా టాప్ సర్జన్ గా పేరు సంపాదించాడు. ఆరోగ్య విభాగంలో షకీల్ ఉన్నత స్ధానాలకి వేగంగా ప్రమోషన్లు పొందడం ‘మైండ్ బాగ్లింగ్’ గా ఆ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అభివర్ణించారని ఈ కధనం తెలియజేస్తోంది.1990ల్లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన షకీల్ ఇప్పటి ఖైబర్ ఫక్తూన్వా (అప్పటి నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. ఈయన తాతగారు కూడా బ్రిటిష్ ఆర్మీలో పని చేసి, తన సేవలకు ప్రతిఫలంగా, పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ లో, భూముల్ని పొందిన ఘనుడేనట.

డాక్టర్ గా పని చేస్తూ తనకు బహుమానాలు కురిపించిన కంపెనీల మందులనే సిఫారసు చేసేవాడని ఓ మెడికల్ రిప్రెజెంటేటివ్ తెలిపాడు. జామూద్ లో ఓ ప్రవేటు క్లినిక్ నడుపుతూ, తాను సర్జన్ కాకపోయినప్పటికీ అనేక సర్జన్లు చేశాడు. దానితో ఆయనపైన ఆరోగ్య విభాగం విచారణ జరుపుతోంది.  ఐదేళ్ల క్రితం ఆయన నర్సింగ్ హోమ్ లో పని చేసి ఒక నర్సు అనుమానాస్పద పరిస్ధితుల్లో మృతి చెందింది. నర్సు మృతి విషయంలో కూడా ఈయనపైన దర్యాప్తు జరుగుతోంది. అలాంటిది 2007 లో అమెరికా రాయబార కార్యాలయంతో సంబంధాలు ఏర్పడ్డాక షకీల్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. తనకు అమెరికా ఎంబసీ నుండి పిలుపు వచ్చినప్పుడల్లా తన పలుకుబడి గురించి గొప్పలు చెప్పుకునేవాడని అతని బంధువు తెలిపాడు. 2009లో షకిల్, భార్యాపిల్లలతో కలిసి అమెరికా కూడా వెళ్లాడు. అమెరికా నుండి తిరిగొచ్చాక ఆయన అకస్మాత్తుగా ఎజెన్సీ సర్జన్ గా ప్రమోషన్ సంపాదించాడు. ఆయన ప్రమోషన్ తో హెల్త్ డిపార్ట్ మెంట్ లో అనేకులు షాక్ తిన్నారట. ఆయన కంటే సీనియర్ డాక్టర్లను, మెరుగైనవారినీ పక్కన బెట్టి షకీల్ కి ప్రమోషన్ ఇచ్చారని ఆయన సహోద్యోగులు తెలిపారు.

అమెరికా గూఢచార సంస్ధ, కుట్ర కుతంత్రాల పుట్ట అయిన సి.ఐ.ఎ రాక్షస హస్తాలు ఊహించని మారుమూల చోట్లకి కూడా ఎలా చాచి ఉంటాయో ఈ ఉదాహరణ స్పషం చేస్తోంది. సి.ఐ.ఎ అనగానే అదెక్కడో అమెరికాలో ఉంటుందనీ, సినిమాల్లో సాహస కృత్యాలలో మాత్రమే కనిపిస్తుందనీ భావించేవారికి ఈ ఉదంతం కనువిప్పు కావాలి. తనకు అనుకూలమైన ప్రచార, ప్రసార సాధనాల ద్వారా సి.ఐ.ఎ ప్రపంచంలోని నలుమూలలకీ తన ప్రభావాన్ని విస్తరించింది. ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఇది అనేక దేశాల్లో ప్రజా జీవనాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. పాకిస్ధాన్ లో ఎక్కడో వాయువ్య మూలన పాక్ ప్రభుత్వానికి కూడా సరిగా అందుబాటులో ఉండని ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ లో గల ప్రాంతంలో నివసించే ఒక అవినీతి డాక్టర్ ని ఆకర్షించి అతని ద్వారా ‘పేరు మోసిన టెర్రరిస్టు’ గా అమెరికా ముద్ర వేసిన ‘ఒసామా బిన్ లాడేన్’ ప్రాణాలను సి.ఐ.ఎ తీయగలిగింది. గత సంవత్సరం జనవరిలో సి.ఐ.ఎ గూఢచారి ఒకరు ఇద్దరు పాక్ పౌరుల్ని కాల్చి చంపాక పాకిస్ధాన్ అనేక నగరాల్లో నివాస కాలనీల్లో ఉంటూ, పాక్ యువతులను వివాహం కూడా చేసుకుని నివసిస్తున్న అనేక మంది సి.ఐ.ఎ గూఢచారుల ఆనుపానుల్ని పాక్ ప్రజలు బైటికి వెల్లడించిన సంగతి గుర్తుంచుకుంటే, సి.ఐ.ఎ విస్తృతి అర్ధం కాగలదు. సి.ఐ.ఎ విస్తృతికి భారత దేశం గానీ, ఆంధ్ర రాష్ట్రం గానీ, చివరికి తెలుగు బ్లాగులు గానీ ఏ మాత్రం అతీతం కావని ఈ సందర్భంగా గుర్తించవలసిన అంశం.

ఐతే, డాక్టర్ షకీల్ ని అమెరికాకి అప్పజెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయన నేరానికి పాల్పడింది పాకిస్ధాన్ గడ్డపైన. అతను పాకిస్ధానీయుడే తప్ప అమెరికా దేశస్ధుడు కాదు. తమ దేశ పౌరుడైన ఒక దేశ ద్రోహిని అమెరికాకి అప్పజెప్పవలసిన అవసరం పాకిస్ధాన్ ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? డాక్టర్ ప్రాణాల పట్ల అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకి ఉన్న ఆందోళన ఈ ప్రశ్నలకు చక్కటి సమాధానం చెబుతుంది. డాక్టర్ దేశద్రోహానికి పాల్పడ్డప్పటికీ అతను సాయం చేసింది తమ మాస్టర్ అమెరికాకి గనక పాక్ పాలకులకి ఆయనని అమెరికాకి అప్పజెప్పడానికి అభ్యంతరం ఏమీ ఉండదన్నమాట. తమకు సాయం చేసిన డాక్టర్ ని అమెరికాకి రప్పించుకుని సురక్షితంగా ఉంచడంలో అమెరికాకి ఆసక్తి ఉంది కానీ, తమ గడ్డపైన తన పౌరుడిగా ఉంటూ ‘దేశ ద్రోహానికి’ పాల్పడిన వ్యక్తిగా ఆయనని శిక్షించడంలో పాక్ పాలకులకి ఆసక్తి లేకపోవడం అత్యంత విచారకరం. పాకిస్ధాన్ దేశంలో ‘దేశ ద్రోహానికి’ పాల్పడుతున్నవారి పట్ల పాక్ పాలకులకు అభ్యంతరం ఏమీ ఉండదన్నమాట! పాక్ పాలకులు, తమ అమెరికా లొంగుబాటుతనాన్ని ఈ విధంగా నిర్ద్వంద్వంగా రుజువు చేసుకుంటున్నారు.

అబ్బోత్తాబాద్ కాంపౌండ్ లో తమకు ఆసక్తి ఉన్న వ్యక్తి నియమిస్తున్నాడన్న సంగతి పాక్ ప్రభుత్వంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుందని తాను నమ్ముతున్నానని పెనెట్టా చెప్పాడు. సదరు కాంపౌండ్ లో ఉన్నది బిన్ లాడెనే అని పాక్ ప్రభుత్వానికి తెలిసినట్లుగా తన వద్ద సాక్ష్యాధారాలేవీ లేవని పెనెట్టా అంగీకరించాడు. అయినా అమెరికా పాలకులకీ, అధికారులకీ సాక్ష్యాలతో ఏంపని? అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గానీ, అంతర్జాతీయ చట్టాలను గానీ, కనీసం తన దేశంలో అమలువుతున్న న్యాయ సూత్రాలను గానీ చట్టాలను గానీ పాటించినట్లయితే సాక్ష్యాలతో అవసరం ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలనూ, న్యాయ సూత్రాలనూ తుంగలో తొక్కో, తన కావలి కుక్కలుగా చేసుకునో తాను చేయదలుచుకున్న దుర్మార్గాలన్నింటినీ పూర్తి కావించే అమెరికా దుర్మదాంధులకి సాక్ష్యాలతో పనా?

సాక్ష్యాలు ఏవీ లేకపోయినా పచ్చి అబద్ధాలను పక్కా నిజాలుగా ప్రచారం చెయ్యడంలో దిట్ట. ఆ ‘గోబెల్’ చచ్చి ఎక్కడున్నాడో గానీ ఆయనని మించిన అబద్ధాల ప్రచారకులు, పత్రికలు, ఛానెళ్లను అమెరికా, యూరప్ దేశాలు సృష్టించుకుని వాటి సాయంతో నానా దుర్మార్గాలనీ సాగిస్తున్నాయి. సద్దాం హుస్సేన్ వద్ద ‘సామూహిక విధ్వంసక ఆయుధాలు’ ఉన్నాయని అబద్ధాలు చెప్పి ఇరాక్ ప్రజలను దశాబ్ధానికిపైగా చిత్ర హింసలు పెట్టడమే కాక, ఆ దేశంపై దాడి చేసి అనేక తెగల, వర్గాల, గ్రూపుల ‘యుద్ధాల కొట్టం’ గా అమెరికా, యూరప్ లు మార్చివేశాయి. గడ్డాఫీ పైన ప్రజలు తిరగబడ్డారంటూ ప్రచారం చేసి తాను శిక్షణ నిచ్చిన లిబియా దేశ ద్రోహులతో ‘అద్దె తిరుగుబాటు’ ను అవి నడిపాయి. చివరికి లిబియాను కూడా ఇరాక్ లాగే మార్చడానికి అవి పూనుకుంటున్నాయి. అమెరికా, యూరప్ ల దుర్మార్గపూరిత అబద్ధాల ప్రచారానికి తాజా బాదితులు సిరియా, సిరియా ప్రజలు.


Filed under: యుద్ధమూ-శాంతి, రాజకీయాలు Tagged: అబ్బొత్తాబాద్ దాడి, డా. షకీల్ అఫ్రిది, లియోన్ పెనెట్టా

2012-01-27

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: రెండేళ్ళ పాపని కొట్టి, గోడకి బాది…

2012-01-27 02:03 PM విశేఖర్

Click to view slideshow.

ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ట్రౌమా సెంటర్ లో రెండేళ్ళ పాప ‘ఫాలక్’ కధ విన్న ఎవరికైనా హృదయం చలించక మానదు. రెండు చేతుల్లోనూ ఎముకలు చిట్లి, నేరుగా మెదడుకే గాయాలై, కపాలం ఫ్రాక్చరై, వొంటినిండా కొరికిన గాట్లతో ఉన్న ‘ఫాలక్’ని పది రోజుల క్రితం మరో పదిహేనేళ్ల పాప ‘మహి గుప్త’, జనవరి 18న ‘తానే తల్లి’ నంటూ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చింది. మంచం పైనుండి కింద పడిందనీ, ఆ తర్వాత బాత్రూమ్ లో జారి పడిందనీ విభిన్న కధనాలు వినిపించడంతో ‘మహి గుప్త’ ను డాక్టర్లు పోలీసులకి అప్పజెప్పారు. ‘మహి గుప్త’ కూడా స్వయంగా బాధితురాలని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు.

పాపకి రెండు చేతులూ ఫ్రాక్చర్ అయ్యాయి, ఒక్క చోట కాదు, అనేక చోట్ల. ఒంటి నిండా కొరికిన గాట్లు ఉన్నాయి. మొత్తం నోట్లో ఉన్న అన్ని పళ్ళనూ వినియోగించి కొరికిన ఆ గాయాల్ని చూస్తే పాషాణుడైనా ద్రవించక మానడు. కపాలం చిట్లిపోయింది. మెదడుకి గాయాలయ్యాయి. గోడ కేసి బాదడం వల్లనో, బరువైన వస్తువుతో కొట్టడం వల్లనో కపాలం చిట్లి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కుడి వైపు మెదడులో కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టి ఉంది. కుడి చేయి బాగా వాచి ఉంది. ముఖంపైనా, నుదుటి పైనా, కాలిపైనా, తీవ్రంగా కొరికిన గుర్తులు లోతుగా ఉన్నాయి. ఇది చేసినవాడు మనిషై ఉండడు. జంతువులకి అది చేయడం సాధ్యం కాదు. ‘మానవ మృగం’ అనవచ్చునేమో.

పాప బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. తలకి ఇంత బలమైన గాయం తగిలినవారు బతికి ఉండే అవకాశాలు ముప్ఫై శాతమేననీ, ఒక వేళ బతికినా సాధారణ స్ధాయికి రాగల అవకాశాలు యాభై శాతమేననీ వారు తెలిపారు. ఫాలక్ బతికి బట్టకడితే జీవితాంతం మరొకరిపై ఆధారపడి బతకవలసిందేననీ వారు తెలిపారు. ఈ పది రోజుల్లో పాపకి రెండు సార్లు గుండె నొప్పి వచ్చిందనీ, ఇప్పటికి పరిస్ధితి స్ధిరంగా ఉన్నప్పటికీ, క్లిష్టంగానే ఉందని తెలిపారు. వెంటిలేటర్ సౌకర్యం తొలగించే స్ధాయికి పరిస్ధితి మెరుగుపడిందని వారు తెలిపారు.

పాపను అడ్మిట్ చేస్తూ ‘మహి గుప్త’ తాను తన భర్త ‘రాజ్ కుమార్ గుప్త’ తో కలిసి మహీపాల్ పురి (దక్షిణ ఢిల్లీ) లోని వేరొకరి ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ డిప్యుటి కమిషనర్ ఛాయా శర్మ ప్రకారం దక్షిణ ఢిల్లీలోని స్వంత ఇంటినుండి మహి గత సంవత్సరం తప్పిపోయినట్లుగా ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఐతే, మహి ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్లుగా పోలీసులు తమ ఎంక్వైరీలో తెలుసుకున్నారు. గత ఇరవై రోజులుగా పాప తన వద్దనే ఉంటోందని మహి చెప్పింది. పోలీసులు ఈ విషయం ఇంకా ధృవపరచలేదని జీ న్యూస్ తెలిపింది.

న్యూఢిల్లీ టెలివిజన్ ఈ వార్తకి సంబంధించి మరిన్ని వివరాలు ఇచ్చింది. మహి ని పోలీసులు విచారించాక పాపను కొట్టింది తానేనని ఒప్పుకుంది. కాని కొరికింది తాను కాదని చెప్పింది. తాను కలిసి ఉంటున్న రాజ్ కుమార్ గుప్త నెల రోజుల క్రితం పాపను తనవద్దకు తెచ్చినట్లు తెలిపింది. ఇంటి నుండి పారిపోయి వచ్చి రాజ్ కుమార్ తో కలిసి ఉంటున్నానని అంగీకరించింది. మహిని పోలీసులు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. రాజ్ కుమార్ గుప్త ఆచూకి ఇంతవరకు దొరకలేదు. మహి ఇంటినుండి తప్పిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినందున ఆమె కూడా బాధితురాలే అయి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు పోలీసులు చెబుతున్నారు.

పాపకి తల్లిదండ్రుల నుండి దూరం కావలసిన పరిస్ధితి రావడానికి మొదటి కారణం తను ఆడపిల్ల కావడమేనని తెలుస్తూనే ఉంది. ఇంత దారుణానికి గురి కావడానికి గల అదనపు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. పాపను తానే కొట్టానని మహి చెబుతున్నప్పటికీ ఎముకలు విరిగేంతగా, కపాలం చిట్లేంతగా కొట్టవలసిన అవసరం ఎందుకొస్తుందన్న అనుమానం తలెత్తుతోంది. పాప శరీరంపై అనేక చోట్ల కొరికిన వ్యక్తే ఇతర గాయాలకూ కారకులని బలంగా తోస్తోంది.

చిత్తశుద్ధితో విచారిస్తే పోలీసులకి నిందితులని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. నిందితులు పట్టుబడి అసలు నిజాలు వెల్లడయ్యేవరకూ ఇదమిద్ధంగా ఏదీ ఊహించలేని పరిస్ధితి. ఊహకు అందనంత క్రౌర్యం పాప ఎదుర్కొన్నందునే ఈ ‘ఊహించలేని పరిస్ధితి’. మెదడుకి గాయమైనందున తనకి ఏం జరిగిందో పాప కొంచెమైనా చెప్పలేకపోవచ్చు. ప్రస్తుతం భారమంతా పోలీసులపైనే ఉంది.


Filed under: సమాజం, సంస్కృతి Tagged: పాప పై దారుణం

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ‘పెట్టుబడి’ క్రౌర్యానికి ఇద్దరు బలి

2012-01-27 12:32 PM విశేఖర్

యానాంలో కర్ఫ్యూ

‘అనంత’ లాభాలను గుంజుకోవడానికి వెంపర్లాడే పెట్టుబడి క్రౌర్యానికి ఇద్దరు బలయ్యారు. మరణించినవారిలో ఒకరు కార్మిక యూనియన్ నాయకుడు కాగా మరొకరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్. యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పోలీసులు అమానుషంగా జరిపిన లాఠీ ఛార్జిలో కార్మికుల నాయకుడు చనిపోగా, తమ నాయకుడి మరణానికి ఆగ్రహంగా తిరగబడ్డ కార్మికుల చేతిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చనిపోయాడు. కార్మికులకు స్ధానిక ప్రజానీకం సంఘీభావంగా ఉద్యమిస్తుండడంతో యానాంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది.

కాకినాడకి ముప్ఫై కి.మీ దూరంలో ఉన్న యానాంలోని ఒక ప్రవేటు సిరమిక్ ఫ్యాక్టరీలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కార్మిక యూనియన్ పెట్టుకుని యూనియన్ నాయకత్వంలో హక్కులు కావాలనీ, సౌకర్యాలు కల్పించాలనీ కొన్ని నెలలుగా కోరుతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. సమస్యలు పరిష్కరించడానికి బదులు యూనియన్ ని విచ్ఛిన్నం చేయడానికే యాజమాన్యం మొగ్గు చూపడంతో కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన తీవ్రం చేసారు. యాజమాన్యానికి పోలీసులు వత్తాసు వచ్చి లాఠీ ఛార్జీతో కార్మికుల యూనియన్ నాయకుడినే బలి తీసుకున్నారు.

రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులకి కూడా ఇక్కడ పర్మినెంటు ఉద్యోగం దక్కలేదు. మొత్తం పన్నెండు వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా అందులో ఎనిమిది వందలమంది ఇంకా కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. సీనియారిటీతో నిమిత్తం లేకుండా అరకొర వేతనాలిస్తూ లాభాలు జుర్రు కోవడానికి అలవాటు పడ్డ యాజమాన్యం కార్మికులు యూనియన్ పెట్టుకోవడం సహించలేకపోయింది. యూనియన్ వ్యవస్ధాపకుడు మురళీ మోహన్ నేతృత్వంలో జనవరి 1 నుండి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతనాలు పెంచాలనీ, కాంట్రాక్టు కార్మికులని పర్మినెంటు చేయాలనీ వీరు డిమాండ్ చేస్తున్నారు. కనీసం పది హేను సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులనైనా పర్మినెంటు చేయాలని కోరినా యాజమాన్యం దానికి నిరాకరించింది.

యాజమాన్యం కార్మికుల మీద పోలీసులకి ఫిర్యాదు చేయడంతో గురువారం రాత్రి యూనియన్ నాయకుడు మురళీ మోహన్ ని పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత అతన్ని వదిలిపెట్టారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకి కార్మికులని వెంట బెట్టుకుని మురళీ మోహన్ ఫ్యాక్టరి వద్దకు వెళ్ళాడు. ఉదయం షిప్టుకి హాజరువుతున్న కొద్ది మందికి నచ్చజెప్పి సమ్మెచేయించాలన్నది అతని ప్రయత్నం. యాజమాన్యం తరపున అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి ఉన్నారు. వారు వెంటనే లాఠీ ఛార్జీ ప్రారంభించారు. లాఠీ ఛార్జిలో మురళీ మోహన్ తలకి తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్ధానిక ఆసుపత్రికి తీసుకెళ్ళిన కొద్ది సేపటికే అతను చనిపోయాడు. తమ కళ్ల ముందే తమ నాయకుడు లాఠీ దెబ్బలు తిని చనిపోవడం కార్మికుల్లో ఆగ్రహావేశాల్ని రగిలించింది.

కార్మిక నాయకుడి మరణ వార్త దావానలంలా వ్యాపించింది. కార్మికులకి స్ధానిక ప్రజలు కూడా జత కలిసి బస్సుల్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కంపెనీ లారీలు, బస్సులు మొత్తం యాభై వరకూ తగలబెట్టినట్లు తెలుస్తోంది. కార్మికులు గుంపులు గుంపులుగా ఫ్యాక్టరీలోకి జొరబడి కనపడ్డ ప్రతీదాన్నీ ధ్వంసం చేసారు. ఫ్యాక్టరీ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజి పైన కూడా దాడి జరిగింది. ఆపరేషన్స్ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్ ఇంటిపైన జరిగిన దాడిలో ఆయన తలకి బలమైన గాయాలు కావడంతో కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొంతమంది పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా మరికొంతమంది ధ్వంస రచనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వంద మంది యానాం పోలీసులు వచ్చినప్పటికీ గుంపులు గుంపులుగా జనం రావడంతో వారేమీ చేయలేకపోయారని జెమినీ న్యూస్ ఛానెల్ తెలిపింది.

పోలీసులు, కార్మికులు, జనం మధ్య కూడా తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ ఛార్జీకి దిగడమే కాక కాల్పులు ప్రారంభించడంతో ఆరుగురు కార్మికులకి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లూ, కార్మికులు కూడా రెచ్చిపోయి రాళ్లు విసిరినట్లు తెలుస్తొంది. కాకినాడ నుండి అదనపు బలగాలు యానాం వెళ్ళాయి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి ఇంకా పరిస్ధితి ఉద్రిక్తంగానే ఉందని ఛానెళ్ళు చెబుతున్నాయి.

ఇరవై సంవత్సరాలకి పైగా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యం వైఖరిని ఏ చట్టాలూ కదిలించలేకపోయాయి. తమ జీవితాలు మొత్తం ఫ్యాక్టరీకే అంకితం చేసినా వారికి కనీస వేతనాలు ఇవ్వడానికి యాజమాన్యానికి మనసొప్పలేదు. పేరు గొప్ప చట్టాలు అనేక ఉన్నా నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో అవన్నీ పనికిరానివిగా మార్చివేశారు. కొన్ని నెలలుగా శాంతియుతంగా తమ కోర్కెలను కార్మికులు వ్యక్తం చేస్తున్నప్పటికీ శ్రమ దోపిడీకి అలవాటు పడ్డ యాజమాన్యానికి వారి శాంతి ప్రయత్నాలు తలకెక్కలేదు. అయినప్పటికీ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెల ద్వారానైనా యాజమాన్యం తమ మాట ఆలకించేలా చేయాలని ప్రయత్నించిన కార్మికులకు పేరు గొప్ప చట్టాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలూ, పోలీసులు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వగానే పరుగెత్తుకుంటూ వచ్చిన పోలీసులు కార్మికుల సమస్యలని పక్కనబెట్టి దౌర్జన్యానికి పూనుకున్న ఫలితంగా కార్మికుల నాయకుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దశాబ్దాల తరబడి ఆర్ధిక దోపిడీకి దిగడమే కాక కనీస వేతన హక్కు అడిగిన కార్మికులకి సమాధానం చెప్పేది పోలీసులే తప్ప యాజమాన్యం కాదన్నమాట.

పెట్టుబడికి లాభాలంటే పేరాశ. దానికి మామూలు లాభాలు సరిపోవు. ప్రతి రోజూ, ప్రతి నెలా, పతి సంవత్సరమూ దానికి లాభాలు పెరుగుతూ పోవాలి తప్ప తగ్గకూడదు. ప్రతి సంవత్సరం అది పెంచుకుంటూ పోయే లక్ష్యాలని చేరుకోవడానికి బలికావలసింది కార్మికుల వేతనాలూ, ఆ వేతనాలపై ఆధారపడ్డ కార్మికుల బతుకులూను. పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రతీదీ వృద్ధి రేటుతోనే కొలుస్తారు. వృద్ధి రేటు, లాభాలు, లాభ శాతం ఇవన్నీ పెరిగితే వాటిని చూసి షేర్ మార్కెట్లలో దాని షేర్ ధర పెరుగుతూ పోవాలి. మరింతమంది షేర్లు కొంటూ పోయేది మరిన్ని లాభాలు వస్తాయని. కాని ఆ లాభాలు ఎక్కడినుండి రావాలి? నెల నెలా, క్వార్టర్ క్వార్టరూ, సంవత్సరం సంవత్సరమూ లాభాలు ఎలా పెరుగుతాయి? మామాలు మార్గాల్లో అటువంటి అనంతమైన వృద్ధి, అనంతమైన లాభాలు సాధ్యం కాని పని. కొల్లగొట్టడమే దానికి మార్గం. అలా కొల్లగొట్టడానికి తేలిగ్గా దొరికేది కార్మికుడి శ్రమ శక్తే. శ్రమ తప్ప మరోక ఆస్తి లేని కార్మికుడు ఆ శ్రమను అమ్ముకోవడానికి పెట్టుబడిదారుడిని ఆశ్రయిస్తాడు. శ్రమకి తగిన వేతనాలు ఇవ్వడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కనీస వేతన చట్టం లాంటి కార్మిక చట్టాలు ఏర్పరిచాయి. ఆ చట్టాలని అమలు చేయాల్సినవాడు యజమాని జేబులో ఉంటే ఇక కార్మికుడి ఆర్తనాదం వినేదెవ్వడు?

కార్మికుడికి ఉండవలసిన సమ్మె హక్కు, కనీస వేతన హక్కు, ఉమ్మడి బేరసారాల హాక్కు నిజానికి హక్కులుగా ఏనాడో అంతరింపజేశారు. పెట్టుబడులు రావడమే గొప్ప అని భావించే మన్మోహన్ లాంటి పాలకుల వల్ల కార్మికుల హక్కులు సోదిలోకి కూడా లేకుండా పోయాయి. కార్మికులు శతాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ఈ హక్కులు ఇప్పుడు యజమానుల దయా దాక్షిణ్యాలకు లొంగి ఉన్నాయి. ఇక కార్మికుల విముక్తికి దారేది? అతనికి కనీస వేతనం వచ్చే మార్గం ఏది? ఫిక్కి, ఆసోఛామ్, ఎఫ్.ఐ.ఐ లాంటి సంఘాలు పెట్టుబడిదారులకి ఉన్నాయి. ఆ సంఘాలు ఏం కోరినా నడిచి వస్తాయి. చట్టాలు కావాలంటే వస్తాయి. ఉన్న చట్టాలు పోవాలంటే పోతాయి. వారు పన్నులు రద్దు చేయాలని కోరినా, బెయిలౌట్ కావాలన్నా, లక్షల కోట్ల అప్పులు రద్దు చేయాలన్నా ఆఘమేఘాల మీద జరిగిపోతాయి. కాని కార్మికుడు వంద రూపాయలు జీతం పెంచమన్నా, పదిహేనేళ్ళుగా పని చేస్తున్నాను కనుక జాబ్ రెగ్యులరైజ్ చెయ్యాలని కోరినా వచ్చేది పోలీసులు, లాఠీ చార్జీ. చివరికి ప్రాణాలు కూడా వదులుకోవాల్సిందే.

ఇదే పెట్టుబడికి తెలిసిన న్యాయం. అందుకే కార్మికులు తమకు తెలిసిన న్యాయం వెతుక్కోవలసిన పరిస్ధితి వస్తోంది. ఆ పరిస్ధితిని తెస్తోంది పెట్టుబడిదారులూ, వారికి కొమ్ముకాసే ప్రభుత్వాలే తప్ప కార్మికులు ఎంతమాత్రం కాదు.


Filed under: ఆర్ధిక ద్రవ్య రంగాలు, మార్క్సిజం-లెనిజిజం Tagged: యానాం ఫ్యాక్టరీ సమ్మె

2012-01-25

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఈ స్పామ్ కామెంట్స్ లక్ష్యం ఏంటి?

2012-01-25 03:04 PM విశేఖర్

ఇక్కడ మూడు స్క్రీన్ షాట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యాఖ్యలుగా ఈ బ్లాగ్ లో పోస్ట్ అయ్యాయి.

ఈ స్పాం కామెంట్లకు లక్ష్యం పట్ల నాకు కొన్ని అనుమానాలు తలెత్తడం వల్ల బహిరంగం చేయడం జరుగుతోంది. మొదటి రెండు స్క్రీన్ షాట్లలో చూస్తే ఆ వ్యాఖ్యలకు అర్ధం లేనట్లు తెలుస్తూనే ఉంది. మూడో స్క్రీన్ షాట్ లో చివరి వ్యాఖ్య మిగత వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ఈ వ్యాఖ్య, గురు గోల్వాల్కర్ బోధనలను ఉటంకిస్తూ రాసిన పోస్టు కింద పది రోజుల క్రితం పదహారవ తారీఖున పోస్ట్ అయింది. ఈ వ్యాఖ్య తాలూకు ఐ.పి నంబరు రెండో స్క్రీన్ షాట్ లోని ఒక స్పాం వ్యాఖ్య కి ఉన్న ఐ.పి తో సరిపోలింది.

Spam1 Spam2 Spam3

పదహారో తారీఖున పొస్ట్ అయిన వ్యాఖ్య నిజానికి ట్రాక్ బ్యాక్ కి సంబంధించినది. ఒక వెబ్ సైట్ అడ్రస్ నుండీ ఈ పోస్ట్ కి ట్రాక్ బ్యాక్ వచ్చినట్లుగా ఈ వ్యాఖ్య సూచిస్తోంది. ఆ వెబ్ సైట్ అడ్రస్ కూడా స్పాం తరహాలోనే ఉంది. ఇదే రకం ట్రాక్ బ్యాక్ ఇదే పోస్ట్ కింద దానికి కొద్ది రోజుల క్రితం రెండు వచ్చినా వాటిని తొలగించడం జరిగింది. మూడోసారీ వచ్చాక అనుమానంతో తొలగించలేదు. ఈరోజు పోస్ట్ అయిన పన్నెండు స్పాం కామెంట్లలో ఒక దాని ఐ.పి పదహారో తారీఖున పోస్ట్ అయిన ఐ.పి తో పోలడం దేన్ని సూచిస్తోంది?

సాంకేతిక విషయాలు ఈ బ్లాగర్ కి తెలియనందున, మిత్రులు తెలియజేస్తారని ఈ పోస్ట్ రాయడం జరిగింది. ఎవరైనా మిత్రులు ఈ స్పాం వ్యాఖ్యలకి లక్ష్యం ఏమైనా తెలిస్తే చెప్పగలరా? గురు గోల్వాల్కర్ బోధనలపై నేను రాసిన పొస్టు పైన అయిష్టత ఉన్నవారు ఈ స్పాంను పోస్ట్ చేసారని భావించవచ్చా?

నా బ్లాగ్ ని హ్యాక్ చెయ్యడానికి ఇది ప్రయత్నమా? హ్యాక్ చెయ్యడమే లక్ష్యం అయితే, వర్డ్ ప్రెస్ సంస్ధ నా బ్లాగ్ ని హోస్ట్ చేస్తున్నందున వీరి ప్రయత్నాలు సఫలం అవుతాయా?

ఇది కేవలం లక్ష్య రహిత స్పాం అయితే అలా లక్ష్యం లేకుండా స్పాం పోస్ట్ చేసేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి?


Filed under: ఇతరములు Tagged: స్పాం వ్యాఖ్యలు
2011-04-26
2011-04-26 09:25 AM manyasima - మన్యసీమ
హైదరాబాద్‌: జగన్‌ పార్టీ మే 13న కాలగర్భంలో కలసిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన పార్టీ పూర్తి పేరైన యువజన శ్రామిక రైతు పార్టీ పేరు చెప్పుకోలేని దుస్థితిలో జగన్‌ ఉన్నారని… వైఎస్‌కు, సోనియాకు పోటీ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కడప, బెంగళూరుకు మధ్య పోటీ అని ఆయన చెప్పారు. సాక్షి మీడియా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి కథనాలు రాస్తోందని ఆయన ఆక్షేపించారు. Filed under: వార్తలు
2011-04-26 08:05 AM manyasima - మన్యసీమ
చెర్నోబిల్‌: చెర్నోబిల్‌లో అణుప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రజలు ఆనాటి ప్రమాదంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 1986 ఏప్రిల్‌ 26 ఉదయం యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో పేలుడు సంభవించింది. పదిరోజుల పాటు మండిన ఆ అణుమంటలవల్ల వెలువడిన రేడియోధార్మికత హీరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబుల కన్నా 100 రెట్లు ఎక్కువ. ప్రమాదంలో వెలువడిన రేడియేషన్‌ యూరోప్‌ దేశాల వరకూ వ్యాపించింది. లెక్కకు ఆనాడు చనిపోయిన వారి సంఖ్య [...]
2009-12-16
2009-12-16 04:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-07-27
2009-07-27 02:07 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Priyanka Kothari Hot & Sexy Images
2009-05-18
2009-05-18 03:13 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న
2009-05-18 02:46 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా
2009-04-22
2009-04-22 05:46 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-04-10
2009-04-10 07:19 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Earth is an award-winning British natural history film from the BBC Natural History Unit. It was released in cinemas internationally in 2007 and is due to be released in the US on 22 April 2009. The British version was narrated by Patrick Stewart and the US version is to be narrated by James Earl Jones. A UK-German co-production, it was filmed entirely in high-definition and 35mm using the
2009-04-03
2009-04-03 06:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Cloudy with a Chance of Meatballs is a 2009 computer-animated forthcoming 3D film produced by Sony Pictures Animation and distributed by Columbia Pictures. It is scheduled for a theatrical release on September 18, 2009 and is inspired by the children's book of the same name by Judi Barrett and Ron Barrett. It is the Sony Pictures Animation's third film. Whereas the book had one speaking
2009-03-30
2009-03-30 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-28
2009-03-28 12:12 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు
2009-03-16
2009-03-16 05:24 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్
2009-03-14
2009-03-14 07:04 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-14 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child
2009-03-14 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
“X-Men Origins: Wolverine” WallpapersVenkateshwarlu Bulemoni
2009-03-12
2009-03-12 09:14 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అఫిషియల్ ట్రైలెర్
2009-03-11
2009-03-11 05:30 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival. Basic PlotThe film tell the story of the unlikely pen-pal friendship between Mary, a chubby lonely 8-
2009-03-10
2009-03-10 08:04 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి
2009-03-10 07:58 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు
2009-03-07
2009-03-07 05:55 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-02
2009-03-02 06:00 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-23
2009-02-23 10:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-21
2009-02-21 06:40 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and
2009-02-21 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Tollywood lead actress Charmme’s latest Telugu film 16 days is all set to release on 20 February. This film deals with 16-day-long period in the life of the lead pair, besides the situations that would surround them. Charmme is playing the role of Angelina who has the special talent of mimicking Pawan Kalyan, Ravi Teja, Sunil etc. Arvind plays male lead.
2009-02-20
2009-02-20 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-17
2009-02-17 05:47 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-14
2009-02-14 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Sontha Vooru is a Telugu Movie, starring Raja and Theertha as the lead pair, directed by P Sunil Kumar Reddy. Produced by Y Ravindra Babu & Kishore Baasireddy, and music composed by . The film Shooting is in progress.
2009-02-12
2009-02-12 10:56 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Shriya Saran (born September 11, 1982) is an Indian film actress. She began her career acting in music videos, while also attending an acting studio to follow her dream to act. After her debut in 2001 with Ishtam, she gained Telugu cinema's attention in 2002 by playing the role of Bhanu in Santhosham, her first major hit. Following the film she appeared in several Telugu films with prominent
2009-02-11
2009-02-11 06:27 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Drona is a Upcoming Telugu film, starring Nitin, Priyamani, Kelly Dorge, Mukhesh Rushi, Sita, Sunil, Raghubabu, directed by J Karunakumar. Produced by DS Rao, and music composed by Anoop Rubens. The film shooting is in progress.
2009-02-10
2009-02-10 07:12 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
భారతీయ చిత్రంగా నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పిటికే ఆస్కార్ నామినేషన్‌ను సాధించుకున్న ఈ చిత్రం ఆదివారం మరో ఘనతను సొంతం చేసుకుంది.బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్‌టీసీ) అవార్డు ఈ ఏడాది స్లమ్‌డాగ్ మిలీనియర్ సొంతమైంది. బాఫ్టా అని పిలవబడే ఈ అవార్డులు మొత్తం ఏడింటిని స్లమ్‌డాగ్ మిలియనీర్ దక్కించుకోవడం
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish