2012-05-17
Featuresindia.com RSS Feed: హైదరాబాద్లో కిడ్నీ 'కుంభకోణం'
Featuresindia.com RSS Feed: స్టార్ మార్కు వుండదు
2012-05-16
SEVA: సీబీఐ ఉచ్చులో యడ్యూరప్ప
బెంగళూరు మే 16: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన కేసు దర్యాప్తులో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బెంగళూరు లోని డాలస్ కాలనీతో పాటు శివమొగ్గలోని యడ్డీ స్వగ్రామం సికారిపురలోని నివాసంతో సహా ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించి హడలెత్తించింది.
ఈ సోదాల్లో సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. యడ్యూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర శివమొగ్గ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు విజయేంద్ర, అల్లుడితో పాటు పలువురు కీలక అధికార అనుచరగణ నివాసాల్లో కూడా సీబీఐ సోదాలు జరిపింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమరీతిలో అనుయాయులకు లబ్ది చేకూర్చడంతో పాటు గనుల లీజు వ్యవహారాల్లో ఆశ్రిత పక్షపాతం కనబర్చినట్లు సుప్రీం కోర్టు నిర్థారించింది. దీనితో సుప్రీం కోర్టు ఆయనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం యడ్యూరప్ప సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మర్నాడే యడ్యూరప్ప సహా ఆయన బంధువుల నివాసాలపై దాడులు నిర్వహించడంతో కేసు దర్యాప్తులో సీబీఐ చురుగ్గా కదులుతున్నట్లు స్పష్టమౌతోంది
“ప్రవాసరాజ్యం”: కంచి శంకరాచార్యపై కోర్టులో నటి రంజిత వాంగ్మూలం
“ప్రవాసరాజ్యం”: తమిళనాడు పత్రికలలోనూ చిరంజీవి పేరే!
ప్రజాశక్తి: పదమూడవ భాషలో సినిమా
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 14.05.2012
ప్రజాశక్తి: కాశీతాడు?
SEVA: టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ
నెల్లూరు, మే 16 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నాయుడు హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మర్రిపాడు మండలం చెరువుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్ర బాబు పంటల గిట్టుబాటు ధరల కోసం గట్టిగా కృషి చేస్తామన్నారు. పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పొగాకు కేంద్రాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు.పేదల సొమ్మును దోచుకుని అవినీతి డబ్బుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని సాక్షి టీవీ చానెల్, సాక్షి పత్రిక పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కు చెందిన అనేక కేసుల్లో తాను కాపాడానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా ముద్దాయేనని చంద్ర బాబునాయుడు వ్యాఖ్యానించారు. ముద్దాయి అయిన కిరణ్ సీఎంగా కొనసాగడానికి అనర్హుడని బాబు అన్నారు. జగన్ వల్లే అధికారులు, వ్యాపారులు జైలు పాలయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం పనికిమాలిన ప్రభుత్వం ఉందని, దానికి ప్రజలు చరమగీతం పాడాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి: పాఠం
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 13.05.2012
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
ప్రజాశక్తి: చావు అంచుల వరకూ...
:: నేటి ప్రపంచం ::: ఎన్టీఆర్ ‘బాద్ షా’ బిజినెస్ !!
:: నేటి ప్రపంచం ::: మహేష్ బాబు దూకుడు 2
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు
ప్రజాశక్తి: దూసుకెళుతున్న బాణం!
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: క్లుప్తంగా… 12.05.2012
2012-05-15
Manyaseema.com RSS Feed: హైదరాబాద్లో కిడ్నీ 'కుంభకోణం'
Manyaseema.com RSS Feed: స్టార్ మార్కు వుండదు
2012-05-13
24 గంటలు: మీరు నోమోఫోబియా బారిన పడ్డారా..?
2012-05-09
24 గంటలు: కెవ్వు కేక అంటున్న మలైకా
24 గంటలు: సీఎంల ప్రాణాలతో హెలికాప్టర్ల చెలగాటం
2012-04-30
24 గంటలు: వంశీకి షోకాజ్ వెనుక బాలయ్య హస్తం?
2012-04-26
24 గంటలు: రాజ్యసభకు సచిన్ టెండుల్కర్
2012-03-29
24 గంటలు: జయను మాయలో పడేస్తున్న శశికళ
2012-03-07
Mulakkada. Latest Blog Articles From Telugu News: సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో

సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం... అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా ...
Mulakkada. Latest Blog Articles From Telugu News: జగన్ హవా తగ్గుతోంది: జెసి

జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: ...
2012-02-03
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: బ్యాంక్కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్
ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్గా తీసుకుని ఓ బ్యాంక్కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్ను లోన్గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్
దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్
చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు
తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు
పార్టీ నుంచి బహిష్కరించిన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో దెబ్బ తీశారు. శశికళ సోదరుడు దివాకరన్ను తిరువారూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రిషియూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటిని కూల్చిన కేసులో దివాకరన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు దివాకరన్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.2011-08-13
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: ఈ ఏడాదిలోనే చరణ్ నిశ్చితార్థం : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నిశ్చితార్థం ఈ ఏడాదిలోపే జరగనుంది. ఈరోజు చరణ్ తండ్రి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే రాంచరణ్, ఉపాసనల నిశ్చితార్థం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబాలు కలిసి వారంలోగా నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాదు నగర మేయర్ కార్తీక చిరంజీవికి రాఖీ కట్టారు.
2011-04-24
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: సత్యసాయి బాబా జీవిత విశేషాలు
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబర్ 23వ తేదిన పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఫలముగా భగవాన్ సత్యసాయి జన్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పిదప స్వామి జన్మించడం తో ఆయన తల్లితండ్రులు ఆయనకు సత్యనారాయణ రాజు అని నామకరణం చేసారు. బాబా పసికందుగా ఉన్నప్పటి నుండే అనేకమైన అద్బుతాలు జరిగాయని అంటారు. ఆయన పుట్టిన తరుణంలో ఇంటిలోని సంగీత వాద్యాలు వాటంతటవే మ్రోగాయట. బాబా జననం తరువాత ఈశ్వరమ్మ పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని ఇది ఆ అవతార పురుషుడి లీలగా భక్తులు చెబుతారు.
బాబా చిన్న తనం నుండి ఆధ్యాత్మిక స్మరణలో ఉండేవారట. తనతో చదువుకొనే తోటి విద్యార్దులకు ఎప్పుడూ ఆత్యధ్మిక బోధనలు చేసేవారు. పురాతన శ్లోకాలను అవలీలగా చెప్పేవారట. ఎప్పుడూ ఏకాగ్రతతో మౌనంగా ఉండేవారని తినే ఆహారంపై కూడా ఎప్పుడూ ఆసక్తి చూపేవారు కాదని భక్తులు చెబుతారు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు తన 14వ ఏట 1940 మార్చి 28వ తేదీన తను షిర్డీ సాయిబాబా అవతారమని ప్రకటించారు. "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పి తన చదువుకు స్వస్టి పలికారట. ఆతరువాత దాదాపుగా మూడేళ్ళు పాటు ఒక పొలంలో ధ్యానం చేసారట. అప్పటినుండి ఆయనకు భక్తులు పెరగడం మొదలు పెట్టారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు చుట్టుపక్కల గ్రామాలను, రాష్ట్రాలనే కాకుండా సుమారు 150 దేశాల ప్రజలను ఆకర్షించింది. పదుల్లో మొదలైన భక్తుల సంఖ్య కోట్లల్లో కి పెరింగింది. నిరుపెదైన, కోటీశ్వరుడైన బాబాకి సమానమే. నిరుపేదైన దేశాలను ఏలే రాజైన బాబాకు భక్తులుగా మారిపోయారు.
ఒక్కప్పుడు పుట్టపర్తి గ్రామంలో బస్సు సౌకర్యం కూడా లేదు. కానీ ఇప్పుడు అదో అద్బుతమైన ఆత్యధ్మిక కేంద్రం. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణా కేంద్రం. ఏంతో మందికి ఉచితంగా చదువు చెబుతున్న విద్యా నిలయం. నిత్యం బాబా స్మరణతో, ఆత్యధ్మిక బోధనలతో అలరారుతున్నఒక ప్రశాంతమైన నిలయం. తన తల్లి ఈశ్వరమ్మ కోరిక మేరకు 1954 లోనే 12 పడకలతో ఒక ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్మిచారు. "సత్యసాయి ట్రస్ట్" ద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆసుపత్రి ని ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో అభివృద్ధి చేసారు. ఇక్కడ పేద ప్రజలకు లక్షల విలువచేసే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. వైద్యంతో పాటు అక్కడికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించడం, వారిని అన్నివిదాల కరుణతో చూడడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఈ ఆసుపత్రికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లబించింది.
సత్య సాయి సేవా కార్యక్రమాల్లో మరో ముక్యమైనది "సత్యసాయి మంచినీటి పధకం". తాగునీటి కోసం పరితపిస్తున్నకొన్ని ప్రాంతాలను ఆయన దత్తతికి తీసుకున్నారు. దాదాపుగా 1300 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాంతాలవారి దాహార్తిని తీర్చి సత్య సాయి కరుణామూర్తిగా కీర్తించబడ్డాడు. ఒకానొక సమయంలో ఈ పధకానికి డబ్బు లేక పోవటంతో ట్రస్ట్ ఆస్తులను బ్యాంక్ లో తనకా పెట్టి లోన్ ద్వారా డబ్బు సేకరించి మంచినీటి పధకాలను పూర్తీ చేసారు సత్య సాయి. ఈ పతకాలను కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చెయ్యకుండా ప్రక్క రాష్ట్రమైన తమిళనాడు కి కూడా ఈ మంచినీటి పధకంతో దాహార్తిని తీర్చారు.
మరో ముక్యమైన సేవాకార్యక్రమం ఉచిత విధ్య. ముందుగా చెప్పుకున్నట్లు, పుట్టపర్తి ఒక సరస్వతి నిలయం. ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు. పేద, ధనిక అనే బేదం ఉండదు. ఒకటే లక్యం, "నేటి బాలను రేపటి ఉత్తమ పౌరులుగా" తీర్చి దిద్దడం. ఆద్యాత్మికతో కూడిన ఉన్నత ప్రమాణాలతో అత్యున్నతమైన మైన విద్యను విలువలను జోడించి బోదిస్తారు. "మానవసేవే మాధవసేవ" అనే తత్వాన్ని వీరికి బోదించడం ద్వారా వీరిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
ఒక వ్యక్తిని భగవంతుని గా కొలవడానికి ఆయనకు అద్బుత శక్తులు అవసరంలేదు. దయాగుణం, కరుణ, ప్రేమ కలిగిన వారెవరైనా భగవంతునితో సమానమే. అలంటి వారిలో "సత్య సాయి" ఒకరని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎంతోమందికి ప్రేమను పంచిన కరుణామూర్తి సత్య సాయిబాబా. ఈయన మరణం అసత్యం. మరణించింది కేవలం ఈయన శరీరం మాత్రమే కానీ ఈయన పంచిన ప్రేమ కాదు, ఆయన ఆత్మ మన శ్వాసలో కలిసిపోయింది. అంటే ప్రతీ ఒక్కరూ ఆయన ఏమైతే కోరుకున్నారో, ఏ ప్రేమనైతే పంచి వెళ్ళారో వాటిని పాటించాలి.
2011-03-15
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: చెద పట్టిన శ్రీజ, బరద్వాజ్ ల ప్రేమ
చిరంజీవి కూతురు శ్రీజ గుర్తుంది కదా? ఎందుకు ఉండదు అప్పటిలో ఆమెగారు చేసిన సీన్ చిన్నదేమీ కాదు కదా! శ్రీజ, శిరీష్ బరద్వాజ్... చాలా గొప్ప ప్రేమికులు. అందర్ని ఎదిరించి 2007 అక్టోబర్ న్యూ బోయిన్పల్లి ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకున్న వీరి వివాహానికి అప్పటిలో చాలా మంది (బయటి పెద్దలు) సపోర్ట్ చేసారు. చేసేది లేక చిరంజీవి మౌనంగా ఉన్నారు. అది జరిగిపోయిన కధ!



