ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-03-11

Andhraprabha: ఈ 'దశాబ్ది వనిత'గా సోనియా ఎంపిక

2010-03-11 08:01 PM
కొజికోడ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ దశాబ్ది వనితగా ఎంపికయ్యారు. మళయాళ దినపత్రిక' మాతృభూమి'కి సంబంధించిన ఆన్‌లైన్‌ ఎడిషన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం సోనియాగాంధీకి 53 శాతం ఓట్లు రాగా, కేరళ వనిత మాయిలమ్మ 13శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచిం....

Andhraprabha: 11ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య

2010-03-11 08:01 PM
వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని శాయంపేట మండలం ప్రగతి సింగారంలో గురువారం ఓ 11ఏళ్ల బాలికపై దుండగులు అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. నాలుగో తరగతి చదువుతున్న పసిమొగ్గపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాధమిక సమాచారం. ఈ రాక్షస కృత్యం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈనాడు: అసెంబ్లీల బరిపై గురి!

2010-03-11 08:01 PM
కాంగ్రెస్‌ పార్టీ ఇంత హడావుడిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు పార్లమెంటు ముందుకు తెచ్చింది... పట్టుబట్టి మరీ బలవంతంగా రాజ్యసభలో ఎందుకు ఆమోదింపజేసుకుంది. ఏకాభిప్రాయ మంత్రం పఠించే ఆ పార్టీ పెద్దలు...

-- Delivered by Feed43 service

ఈనాడు: నిర్విఘ్నం.. ధనయజ్ఞం

2010-03-11 08:01 PM
రాష్ట్రంలో ఏ పథకానికి కావాలన్నా నిధులు లేవనే సమాధానం వస్తుంది. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో దోచిపెట్టడానికి మాత్రం నిధుల కొరత ఉండదు. ఎందుకంటే నాయకుల నుంచి అధికారుల వరకు ఎవరివాటా వారికి ముడుతుంది కాబట్టి!

-- Delivered by Feed43 service

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2010-03-11 02:39 PM
తెలంగాణ గురించి ప్రత్యేకంగా దేశ రాజధానిలోని ప్రజలు, నాయకులకు తెలియజేసేందుకు తెలంగాణ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యువ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. తెలంగాణ జాతరలో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ జాతర ఉంటుందని వారు తెలిపారు

24 గంటలు: అమ్మాయిలూ.. అప్రమత్తం..

2010-03-11 01:19 PM satyam (noreply@blogger.com)
ప్రపంచంలో మన దేశం అగ్రగామి.. దేశంలో మన రాష్ట్రమే ముందు వరసలో ఉంది. ఇదేదో సాఫ్ట్‌వేర్ ఫీల్డులోనే.. లేక అభివృద్ధిలోనో అనుకోకండి.. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్‌లో... ముఖ్యంగా అమ్మాయిల అక్రమ తరలింపులో.. ప్రలోబ పెట్టి.. వ్యభిచార రొంపిలో దింపే విషయంలో.. అందుకే.. అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి.. సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు... పది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురు విటుల అరెస్ట్.. ఇలా

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2010-03-11 09:12 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతోంది. ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ నగరంపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరానికి ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా ఒకపుడు ఎంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన భాగ్యనగరం.. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనలో అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం పొంచివుంది.

24 గంటలు: బాలయ్య మంత్రాంగం..

2010-03-11 05:33 AM satyam (noreply@blogger.com)
అన్నగారి కుటుంబం ఏకమవుతోందా...? చూస్తుంటే...అదే జరుగుతన్నట్టుంది. బుధవారం జరిగిన పరిణామం ...ఆ సంకేతాల్నే ఇస్తోంది. పెద్ద ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతీ....ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణను కలవడం .... హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ....ఓ అమ్మా, ఓ కొడుకు ...ఏం మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్‌ మరణించిన 14 ఏళ్ళ తర్వాత ఆయన కుమారుడు, ప్రముఖ సినీ హీరో అయిన నందమూరి బాలకృష్ణ స్వయంగా లక్ష్మీపార్వతి నివాసానికి వచ్చి

24 గంటలు: ఏ"కాంత" సేవలు.. ఫోటోలతో

2010-03-11 05:08 AM satyam (noreply@blogger.com)
సాధారణ మనిషి నుంచి స్వామీజీగా మారిన నిత్యానంద సెక్స్ స్కాండల్.. కొత్త మలుపు తిరిగింది. వీడియో టేపులు బయటపడ్డప్పటి నుంచి.. అజ్ఞాతంలో ఉన్న సినీనటి రంజిత పెదవి విప్పింది. స్వామీజీని సెక్స్ స్కాండల్‌లో మరింతగా ఇరికించే కొన్నీమాటలూ చెప్పింది. ఇంతకీ రంజిత చెప్పిందేమిటి.. ఏ ఉద్దేశ్యంతో ఆమె ఈ ప్రకటన చేసింది.. రంజిత... ఆధ్యాత్మిక గురువు నిత్యానంద సెక్స్ టేపుల్లో ఉన్న అందరికీ కనిపించిన సినీనటి. తమిళ,

2010-03-08

Yahoo! Telugu: News: పశ్చిమ బెంగాల్ సిఎంని హతమార్చే ఉద్దేశం లేదు: దీపక్

2010-03-08 04:41 PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను హతమార్చే ఉద్దేశం తమకు లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌ జీకి అత్యంత నమ్మకస్తుడైన నేత తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.

2010-03-05

24 గంటలు: హెల్.. కాప్టర్లు..

2010-03-05 01:59 PM satyam (noreply@blogger.com)
ఖమ్మం-కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో హెలికాప్టర్ మిస్సయ్యింది. గంటపాటు.. ఎక్కడుందో తెలియదు. ఎటు వెళుతుందో తెలియదు.. ఏం జరుగుతుందో పోలీసులకు అర్థం కాలేదు. హెలికాప్టర్‌కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్ మొదలయ్యింది. హెలికాప్టర్‌కు ఏం జరిగింది..? బ్రేకింగ్ న్యూస్ఏంటంటే.. ఇలాంటి మిస్సింగ్‌లు మరెన్నో జరగబోతున్నాయి.. రాష్ట్రంలో కలకలం పుట్టించిన ఈ హెలికాప్టర్.. ఏరియల్ సర్వే కోసం.. హైదరాబాద్‌నుంచి బయల్దేరింది.

2010-03-02

24 గంటలు: సత్తిబాబు స్ట్రాటజీ..

2010-03-02 02:05 PM satyam (noreply@blogger.com)
బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటన్నది.. బొత్స సూటి ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చేవారికోసం ఆయన వెతుకుతున్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాల్సిందేనని స్పష్టంగా చెప్పకున్నా... వ్యూహం మాత్రం అదే. అయితే.. ఈ విషయంలో ఎంతో తెలివిగా పావులు కదుపుతున్నారు..తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటంటూ.. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు రాష్ట్ర

2010-03-01

24 గంటలు: భార్యాదానం

2010-03-01 10:50 AM satyam (noreply@blogger.com)
వాస్తవగాథలు వెండితెరకెక్కి.. సినిమాలుగా మారితే.. కొన్ని సినిమా కథలే.. అప్పుడప్పుడు వాస్తవాలుగా మారుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది.. సినిమాలను మించి పోయే స్టోరీ. వాస్తవంలో జరగదనుకునే స్టోరీ. ఓ రాధాకళ్యాణం, ఓ హమ్ దిల్‌చుకే సనమ్.. మరో కన్యాదానం... ఈ సినిమాలన్నింటినీ తలపించేలా జరిగిన భార్యాదానం. అనంతపురంలో.. మంచి మనసుతో ఓ భర్త చేసిన గొప్పకార్యం. (ఘనకార్యం అందామనుకున్నా కానీ.. ఘనకార్యానికి ఇప్పుడు

2010-02-06

నారద లోకం: ఫోకస్: గోవింద`గానం'

2010-02-06 04:43 AM Kanvasa (kanvasas@gmail.com)
ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది

2010-01-14

నారద లోకం: శుభాకాంక్షలు

2010-01-14 03:22 AM Kanvasa (kanvasas@gmail.com)
నారదలోకం వీక్షకులకుసంక్రాంతి శుభాకాంక్షలు

2009-12-31

నారద లోకం: హ్యాపీ న్యూ ఇయర్

2009-12-31 06:02 PM Kanvasa (kanvasas@gmail.com)
నారదలోకం పాఠకులకు 2010నూతన సంవత్సర శుభాకాంక్షలుఅతిత్వరలోనే మళ్లీ మీ ముందుకు విశేష వార్తలు తీసుకువస్తానని మాట ఇస్తూ ... మీ కణ్వస kanvasas@gmail.com

2009-12-10

MataManthi » వార్తలు: రాజకీయ సంక్షోభం లో ఆంధ్ర ప్రదేశ్

2009-12-10 04:11 PM Matamanthi

తెలంగాణా కి వ్యతిరేకం గా రాయల సీమ, కోస్తా ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఆందోళన తారాస్థాయి కి చేరింది. ప్రజల్లో వేర్పాటు పై వెల్లువెత్తుతున్న నిరశన జ్వాలతో ప్రజా పర్తినిధులు పార్టీల కి అతీతం గా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికి 113 మంది ఎం.ఎల్.ఎ లు రాజీనామా చేశారు. జే.సి. దివాకర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, శోభా నాగిరెడ్డి, పరిటాల సునీత, లగడపాటి, మైసూరా రెడ్డి  వంటి ప్రముఖులు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్, తే.దే.పా, పీ.ఆర్.పీ ల నుంచి అధిక సంఖ్య లో నాయకులు రాజీనామాలు సమర్పించారు. మరో వైపు కేంద్రం లో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రం లో తెలంగాణేతర నాయకులు ఎంతో మంది పార్టీలలో తమ పదవులకు కూడా రాజీనామా సమర్పించారు. సంస్థాగతం గా కూడా ఎంతో మంది జెడ్.పీ పదవులకు, పంచాయతీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలను ఆమోదించలేదు. అయినప్పటికీ తాము రేపటినుంచి శాసన సభకు హాజరు కాము అని వారు ప్రకటించారు. జే.సి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు తాము అధిష్టానానికి వ్యతిరేకం గ వెళ్లాలని అనుకోకున్నా ప్రజల మనోభీస్థలు తమకు ముఖ్యం కనుక వాటిని దెబ్బ తీయరాదనే తాము విధి లేని పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నామని  ప్రకటించారు.

MataManthi » వార్తలు: తెలంగాణా పై ఆంధ్ర లో వెల్లువెత్తుతున్న నిరశనలు

2009-12-10 02:54 PM Matamanthi

సమైఖ్యాంధ్ర నినాదం తో కోస్తా, సీమలు అట్టుడుకుతున్నాయి. విద్యార్ధులు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒప్పుకోము అంటూ తీవ్ర నిరశన వ్యక్తం చేసారు. అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. శ్రీ కృష్ణ దేవరాయ, నాగార్జునా, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఆందోళనలకు దిగారు. తరగతులను బహిష్కరించి వేర్పాటు వాదాన్ని తాము సహించం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల కే.సి.ఆర్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేస్తున్నారు.

2009-12-07

నారద లోకం: ప్రత్యేక రాష్ట్రం - పది ప్రశ్నలు

2009-12-07 02:52 AM Kanvasa (kanvasas@gmail.com)
ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావన మళ్ళీ నలుగురి నోటా వినిపిస్తున్నది! విభజనోద్యమం విద్యా ర్థులు, ఉద్యోగి వర్గాల చేతుల్లోకి వెళ్లడంతో అది తీవ్రరూపమే ధరిస్తున్నది. సమష్టి రాష్ట్రంలో తమకు అన్యాయాలు జరుగుతున్నవని తెలంగాణ సోదరులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. అయితే,విభజనకు సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను కూడా నిర్ణయించుకున్న తర్వాత విభజన ఆలోచన చేయడం జరిగింది.'రాష్ట్రాన్ని

2009-11-24

నారద లోకం: సెటైర్: ఓటరు - గ్రేటరు

2009-11-24 04:46 AM Kanvasa (kanvasas@gmail.com)
`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు.

2009-09-16

World Public Services: శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు

2009-09-16 03:30 AM vdgali (noreply@blogger.com)

లడ్డూ లాంటి కబురు! తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్ కాపీరైట్) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ-జీఐఆర్)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి.
శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ''తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్, జీఐ సహాయ రిజిస్ట్రార్ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్-జనరల్ పి.హెచ్.కురియన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇకపై తితిదే అనుసరించే 'దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను 'దిట్టం'గా పరిగణిస్తారు. 'దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.

World Public Services: భూమాత గొడుగును కాపాడుకుందాం

2009-09-16 03:22 AM vdgali (noreply@blogger.com)
భూమాత గొడుగును కాపాడుకుందాం
సెప్టెంబరు 16 ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
'ప్రకృతికి మన అవసరాలు తీర్చగల స్థోమత ఉంది. కానీ.. పెరుగుతున్న జనం అత్యాశను మాత్రం తీర్చలేదు' - గాంధీజీ
'ప్రకృతితో సహజ జీవనం తల్లీబిడ్డల బంధం. ఆధునిక పరిజ్ఞానంతో సహజమైన పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తూ మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కుంటున్నాం' - పర్యావరణవేత్తలు

అందమైన జలపాతాలు.. అరుదైన జీవజాతులు.. ప్రకృతిలోని ప్రతి అణువూ మనసును పులకింపజేసేవే. అయితే అవన్నీ కాలగర్భంలో కలసి పోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. భావి తరాలకు సంపద సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమించే మనిషి.. ఆరోగ్యకరమైన ప్రకృతిని ఇచ్చే విషయాన్ని మరుస్తున్నాడు. సాంకేతిక ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కంటిపాపలా సంరక్షిస్తున్న ఓజోన్ పొరను మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. తద్వారా మనతోపాటు జీవజాలం ప్రకృతి సంపదను కాలగర్భంలో కలిపేస్తున్నాం. బుధవారం అంతర్జాతీయ 'ఓజోన్ పరిరక్షణ' దినోత్సవం. ఈ సందర్భంగా ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, మన కర్తవ్యాలను ఓసారి పరికిద్దాం.
ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లులు మానవాళికి తెచ్చే పెనుప్రమాదం గుర్తించిన ఐరాస 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ సదస్సు నిర్వహించింది. మోక్ట్రియల్ ప్రోటోకాల్‌ను ఖరారుచేసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 16ను పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు.

ఏమిటీ ఓజోన్
భూమికి 15-25 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఇది మానవాళికి రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుంది.
  • సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. వీటిలో అల్ట్రావయొలెట్ బి రేడియేషన్, అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ అని రెండు ఉంటాయి.
  • అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది. సూర్య కిరణాలు భూమికి చేరుకునే ప్రయాణంలో సి రేడియేషన్‌ను ఓజోన్ పొర పూర్తిగా అడ్డుకుంటుంది. బి రేడియేషన్‌ని వీలైనంత తగ్గిస్తుంది.
గొడుగుకు రంధ్రాలు
  • ఓజోన్ పొర ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లు నార్వే ప్రధాని గ్రోహార్లెన్ ఆధ్వర్యంలోని కమిషన్ 1987లో ఐరాసకు నివేదిక సమర్పించింది.
  • దక్షిణధ్రువం, ఉత్తరధ్రువం దగ్గర ఓజోన్ పొర దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
  • యూరప్ కెనడాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. దీని ప్రభావం పిల్లలపై పడకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పాఠశాల్లో పిల్లల్ని బయటకు రానీయవద్దని ఆంక్షలు కూడా విధించారు. ఒకవేళ బయటకు వచ్చినా ఈ కిరణాల నుంచి కాపాడే తొడుగులు, లేపనాలు వినియోగించేవారు.
ఐరాస ప్రాధాన్యం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చింది. అప్పట్లో లక్షలాది మందిని బలిగొన్న మలేరియా మహమ్మారిని అదుపు చేసేందుకు డీడీటీ విచ్చలవిడిగా వాడారు. దోమల నాశకానికి వినియోగించిన ఈ మందు ప్రభావంతో పర్యావరణానికి మేలు చేకూర్చే వందలాది క్రిమికీటకాలు, పక్షులు అంతరించాయి. జీవ వైవిధ్యం సమతుల్యం కోల్పోయింది.
కారణాలు
  • క్లోరోఫ్లోరో కార్బన్స్ (సీఎఫ్‌సీ) అనే వాయువు ఓజోన్ పొర క్షీణతకు కారణం. ఏసీ, ఫ్రిజ్‌లు వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది.
  • మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రసాయన వ్యర్థాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి.
  • అమెరికా సహా 12 యూరప్‌దేశాలు ప్రపంచం మొత్తమ్మీద మూడు వంతుల సీఎఫ్‌సీ విడుదల చేస్తున్నాయి.
  • రసాయనక ఎరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌పొరను తినేస్తున్నాయని 1970ల్లో పాల్ క్రటజన్ హెచ్చరించారు.
  • ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు నిషేధించిన కొన్ని రకాల గ్యాస్‌లు, వాయువుల వల్ల రెండేళ్లుగా ఓజోన్ స్థితి కొద్దిగా కుదుటపడ్డట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బాధ్యతలు
  • పర్యావరణం, ఓజోన్‌పై ప్రభుత్వాలు అవగాహన పెంపొందించాలి. స్థానికంగా సదస్సులు నిర్వహించాలి.
  • ఫ్రియాన్, సీఎఫ్‌సీల వాడకాన్ని ఆరికట్టాలి
  • ప్రత్యామ్నాయంగా వచ్చిన వస్తువులను ఉపయోగించాలి
  • ఓజోన్‌కు నష్టం కలిగించే పరిశ్రమలను క్రమంగా నిషేధించాలి.పచ్చదనాన్ని పెంపొందించాలి.
విపరిణామాలు
  • ఇంటి కప్పు.. బీటలు వారితే.. ఎండకు ఎండుతూ వానకు వానకు తడుస్తూ ఉండగలమా! భూమిని సంరక్షించే గొడుగు(ఓజోన్) క్షీణించడం వల్ల అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఎదురవుతోంది.
  • భూతాపం, రుతుపవనాలు గతి తప్పడానికి ఇదే కారణం
  • మానవుల్లో చర్మ క్యాన్సర్, వాధ్యి నిరోధక శక్తి క్షీణించడం, కంటి శుక్లాలు వంటి భయంకర ఇక్కట్లు తలెత్తుతాయి.
  • వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని పంట దిగుబడులు తగ్గిపోతాయి.

భారత్‌లో..
  • ఆరేళ్ల కిందట ఐఐటీ కాన్పూర్, అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ వర్సిటీ భారతదేశంలో ఓజోన్ పొరలో వచ్చిన మార్పుల్ని రెండు ఉపగ్రహాల సాయంతో పరిశోధనలు జరిపాయి.
  • ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ యూనిట్ల(డీయూ)లో కొలుస్తారు. సాధారణంగా ఈ పొర 300 నుంచి 500 డీయూల మందం కలిగి ఉంటుంది. గంగానదీ పరివాహ ప్రాంతాల్లోని పట్టణాలైన కాన్పూర్, కొల్‌కతా, పాట్నా, వారణాసిల్లో ఉండాల్సిన మందంతో పోలిస్తే 12.6, 10.8, 13.5, 11.3 డీయూలు తగ్గినట్లు అంచనా వేశారు.

2009-09-13

World Public Services: ఎల్ఐసీపై ఎన్‌సీడీఆర్‌సీ తీవ్ర విమర్శ

2009-09-13 04:17 AM vdgali (noreply@blogger.com)
పాలసీని జారీ చేసేటప్పుడే ఆ పాలసీ తాలూకు నియమ నిబంధనలను పూర్తిగా తెలియజేయకుండా పాలసీదారు ప్రయోజనాలను ఎంత మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడమేమిటని భారతీయ జీవిత బీమా సంస్థను (ఎల్ఐసీ) జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం (ఎన్‌సీడీఆర్‌సీ) తీవ్రంగా విమర్శించింది. బీమా ఏజెంట్లు ఎంత సేపూ కంపెనీ పాలసీలను అధిక సంఖ్యలో విక్రయించి ప్రీమియం మొత్తాలను గరిష్ఠ స్థాయిలో సేకరించడం, తద్వారా తాము కూడా సొమ్ము చేసుకోవడం పైనే ఆసక్తితో ఉంటున్నారని ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు ఆర్.కె.బట్టా, పి.డి.షెనాయ్‌లు అధిక్షేపించారు. ఒక కేసు విషయంలో ఎల్ఐసీ వినతిని వారు తోసిపుచ్చుతూ, ఈమేరకు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కేసు వివరాలు: సునీల్ జైన్ 2002లో తన కుమార్తె బేబీ మోనా జైన్ కోసం ఒక ఎల్ఐసీ పాలసీని తీసుకొన్నారు. బీమా రిస్క్ ప్రారంభం అయ్యే కన్నా ముందే, 2005లో మోనా చనిపోయింది. దీంతో పాలసీ కూడా రద్దయిపోయింది. జైన్ పరిహారం కోసం దరఖాస్తు ఇవ్వగా, ఆ క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించింది. పాలసీ ప్రత్యేక నియమాలను ఎల్ఐసీ ఏజెంటు తనకు విడమరచి చెప్పలేదని, మొదటి విడత ప్రీమియం చెల్లించిన నాటి నుంచి రిస్క్ అమలులోకి వచ్చిందని తాను భావించానని జైన్ వాదించారు. పాలసీ జారీ సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని క్లాజులను ఏజెంటు జైన్‌కు తెలియబరచలేదు. ''కవర్ నోట్''లో మాత్రమే పాలసీ షరతులను పేర్కొన్నారు. (బీమా పాలసీని జారీ చేస్తున్నట్లు తెలిపే పత్రమే కవర్ నోట్. ఇందులో పాలసీ తాలూకు పూర్తి సమాచారం పొందుపరచి ఉంటుంది). కవర్ నోట్‌ను పరిశీలించిన కమిషన్, పాలసీని ప్రతిపాదించిన తేదీ నాటి నుంచి నాలుగు సంవత్సరాలు గడచిన తరువాత మాత్రమే అమల్లోకి వస్తుందన్న ప్రత్యేక నిబంధన, రిస్క్ ప్రారంభం అయ్యే లోపే సంభవించిన పక్షంలో పాలసీ రద్దు అవుతుందన్న వివరణ అందులో ఉందన్న సంగతిని గుర్తించింది. ప్రీమియం వసూలు చేసి, కవర్ నోట్‌ను జారీ చేసే కన్నా ముందే వినియోగదారుకు పాలసీ క్లాజులన్నింటినీ వివరించడం ఎల్ఐసీ, ఆ సంస్థ ఏజెంట్‌ల కర్తవ్యమని కమిషన్ స్పష్టం చేసింది.

2009-09-02

World Public Services: డ్రైక్లీనింగ్‌తో వైరస్‌ను పారదోలతాం

2009-09-02 03:23 AM vdgali (noreply@blogger.com)
స్వైన్‌ఫ్లూపై మార్కెటింగ్ ఎత్తుగడలు
దేశంలో స్వైన్‌ఫ్లూ ఆందోళనల నెలకొనడంతో పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నిరోధించే కొత్త ఉత్పత్తులు, సేవలు అందిస్తామంటూ ప్రకటనలతో వూదరగొడుతున్నాయి. ఒక కంపెనీ అయితే ఏకంగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే డ్రైక్లీనింగ్ మా వద్ద ఉందంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇలాంటి వాటిని విశ్వసించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూక్ష్మజీవులను చంపే మందుతో బట్టలను డ్రైక్లీనింగ్ చేయిస్తే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని డైమండ్ ఫ్యాబ్‌కేర్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ''స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించడానికి బట్టల్ని మీ ఇంట్లో ఉతుక్కోవడం కంటే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం మేలు. వైరస్, ఇతర క్రిములను సంహరించేందుకు మేం.. కొంచెం ఎక్కువ మోతాదులో కీటకనాశనిని వాడుతున్నాం'' అని ఆ సంస్థకు చెందిన ఎ.శ్రీవాస్తవ చెప్పారు. మరోపక్క లిక్విడ్ సోప్‌కు, చేతులు కడుక్కునేందుకు వాడే జెల్ వంటి వాటికి గిరాకీ విపరీతంగా పెరిగిందని ఢిల్లీకి చెందిన ఓ మందుల దుకాణం నిర్వాహకుడు చెప్పారు. ''ఇంతకుముందు.. ఇలాంటి ఉత్పత్తుల సామర్థ్యంపై వంద ప్రశ్నలు గుప్పించే వినియోగదార్లు ఇప్పుడు స్వైన్‌ఫ్లూ దెబ్బకు విపరీతంగా కొనేస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

స్వైన్‌ఫ్లూ నేపథ్యంలో వస్తున్న మార్కెటింగ్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రజలను హెచ్చరించింది. ''వైరస్‌ను డ్రైక్లీనింగ్ నిరోధిస్తుందని రుజువు చేస్తుందని ఏ అధ్యయనంలోనూ రుజువుకాలేదు'' అని మండలి డైరెక్టర్ వి.ఎం.కటోచ్ తెలిపారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు కంపెనీలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన ఎన్.కె.పాండే తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి: స్వైన్‌ఫ్లూ వ్యాధితో పుణెలో ప్రియాంక షిమిల్కర్ అనే ఏడేళ్ల బాలిక మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 103కు చేరింది. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో తాజాగా మరో 100 కొత్త కేసులు నమోదయ్యాయి.

డిసెంబర్‌లో టీకా కొనుగోలు: స్వైన్‌ఫ్లూ టీకా పరీక్షల అంశంలో భారత్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. భారతీయులపై ఈ టీకాను పరీక్షించడానికి ఒక కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసిందని వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆర్.కె.శ్రీవాస్తవ తెలిపారు. గ్కాక్సో-స్మిత్‌క్త్లెన్ సంస్థ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. నమూనాలను సేకరించే, పరీక్షించే, రవాణా చేసే సిబ్బందికి మొదట ఈ టీకాను ఇస్తామని వివరించారు. డిసెంబర్ నుంచి టీకాను గ్లాక్సో సంస్థ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.

మధుమేహం, గుండె జబ్బులు ఉంటే జాగ్రత్త: మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, రక్తహీనత ఉన్న వారికి స్వైన్‌ఫ్లూ సోకితే పరిస్థితి విషమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరు వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. దేశంలో హెచ్1ఎన్1 వైరస్ వల్ల కలిగిన మరణాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శివలాల్ తెలిపారు. 82 మరణాలను విశ్లేషించామని, ఇందులో 37 మంది అప్పటికే వారికి ఉన్న తీవ్రమైన వ్యాధులవల్ల పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పారు.

రాష్ట్రంలో మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాజాగా మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 195కి చేరింది. మంగళవారం ఐదుగుర్ని తీసుకొచ్చి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 25 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్వైన్‌ఫ్లూ కేంద్రం సమన్వయకర్త శుభకర్ తెలిపారు. గత నెల 12న వ్యాధి నిర్ధరణ కోసం ఢిల్లీకి పంపిన నమూనాల్లో 10 మందికి వ్యాధి సోకినట్లు నివేదిక అందినట్లు ఆయన చెప్పారు.

స్వైన్‌పై ఆయుర్ యుద్ధం
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాప్తిని ఆయుర్వేద మందులతో నియంత్రించవచ్చని విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి జయకుమార్ మంగళవారం తెలిపారు. ఆయుష్ పరిశోధన విభాగం, విజ్ఞాన భారతి సంయుక్తంగా స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు పలు ఆయుర్వేద సూచనలు చేసిందన్నారు. నాలుగు సులభ పద్ధతులతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీతాకృష్ణన్ తెలిపారు.
ఇలా జాగ్రత్త పడదాం
ఎనిమిది మూలికలతో తయారు చేసిన అపరాజిత ధూపం రోజుకు రెండు సార్లు తరగతి గదులు, రద్దీ ప్రాంతాల్లో వేస్తే ఫ్లూ వ్యాప్తిని నియంత్రించవచ్చు.
నాలుగు గంటలకు ఒకసారి తిలా తైలాన్ని వాసన చూడటం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
పసుపుకొమ్మును నేతిలో ముంచి, తర్వాత కాల్చగా వచ్చే పొగను ముక్కుతో పీల్చి నోటితో వదలాలి. దీంతో వైరస్ శరీరంలో ఉంటే వెంటనే చనిపోతుంది.
తులసిని తినడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

2009-08-31

World Public Services: నీరుగారిన 'కిట్ల' పథకం!

2009-08-31 03:14 AM vdgali (noreply@blogger.com)
తాగునీటిస్వచ్ఛతను నిర్ధరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం నీరు కారిపోయింది. మంచినీటిని విశ్లేషించేందుకు రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు అటకెక్కాయి. వీటిని కొనటంలో కనపరచిన ఆత్రుత వినియోగించటంపై చూపటంలో ప్రభుత్వం విఫలమైంది.
తాగునీటి కాలుష్యంతో ఇరవై శాతం పైగా వ్యాధులు ప్రబలుతున్నట్లు తేలటంతో మంచినీటిని విశ్లేషించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోపంచాయతీలను భాగస్వాములుగా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రాజీవ్‌గాంధీ తాగునీటి పథకం కింద నిధులను కూడా మంజూరు చేసింది. చేతి పంపులు, రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేసే నీటిని విశ్లేషించాలని పేర్కొంది. ఇందుకోసం 22 వేల గ్రామ పంచాయతీలకు నీటి విశ్లేషణ కిట్లను రెండు దఫాలుగా సరఫరా చేశారు. 2007లో తొలి విడత కింద కొన్న కిట్ ధర రూ.2,500 కాగా తరువాత దీన్ని రూ.2 వేలుగా నిర్ణయించారు. కిట్ల వినియోగంపై గ్రామ సర్పంచి, సైన్స్ ఉపాధ్యాయుడు, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. తరువాత దీని గురించి మరచిపోవటంతో ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన దాదాపు రూ.19 కోట్లు నీటి పాలయ్యాయి.

కిట్లు ఏం చేస్తాయి..
 తాగునీటిలోని తొమ్మిది రకాల కారకాలను కిట్ల ద్వారా విశ్లేషించవచ్చు. సాంద్రత, ఆమ్లత్వం, కఠినత్వం, గాఢత్వం, క్లోరిన్, ఫ్లోరైడ్ స్థాయిని గుర్తించేందుకు ద్రావకాలను కూడా సరఫరా చేశారు. ద్రావకాల కాలపరిమితి ఏడాదిన్నర మాత్రమే. దీంతో కిట్లను వాడకుండానే వీటిని మూలన పడేసే పరిస్థితి నెలకొంది.

 గ్రామస్థాయి విశ్లేషణలో నీటిలో కారకాలు ఉన్నాయని తేలితే వాటిని జిల్లాస్థాయి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి పది శాతం నమూనాలు రాష్ట్రస్థాయి ప్రయోగశాలకు రావాలి. ఇక్కడకు ఇంత వరకూ ఒక్క శాంపిల్ కూడా రాలేదని సమాచారం. ఈ విధానాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

నీటిని విశ్లేషించే వ్యక్తికి ప్రతి నెలా రూ.100 గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినా, నిధులను మాత్రం విడుదల చేయలేదు. సైన్స్ ఉపాధ్యాయులైతే అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలా మంది బదిలీపై వెళ్లిపోయారు.

ప్రతి కుటుంబం నుంచి రూపాయి చొప్పున నిర్వహణ వ్యయం వసూలు చేయాలని తొలుత నిర్ణయించారు. చాలామందికి కిట్లు వచ్చిన విషయమే తెలియకపోవడంతో వసూళ్లు జరగలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచి దీనికి కేటాయించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

పంప్ మెకానిక్‌లు గతంలో బాక్టీరియాకు సంబంధించిన పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

శుభ్రమైన మంచినీరు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని పరీక్షిస్తామని చెబుతోంది. ఇది జరగాలంటే పంపిణీ చేసిన కిట్లను వాడుకోవాలి. గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారి సేవలను వినియోగించుకోవాలి. కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడినప్రయోగశాలలనూ పటిష్ఠ పరచాలి.

2008-12-22

World Public Services: వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

2008-12-22 09:28 AM vdgali (noreply@blogger.com)
పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

World Public Services: సమాచారం అందడంలేదు!

2008-12-22 09:26 AM vdgali (noreply@blogger.com)
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

World Public Services: రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

2008-12-22 09:23 AM vdgali (noreply@blogger.com)
పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.

2008-04-15

World Public Services: బ్యాగును పోగొట్టినందుకు రూ. 2 లక్షల పరిహారం

2008-04-15 05:09 AM vdgali (noreply@blogger.com)
బ్యాగును రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రూ. రెండు లక్షలు పరిహారంగా ప్రయాణికునికి చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. స్థానిక న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో అంకాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్న డాక్టర్ రాకేష్ చోప్రా 1998 నవంబర్‌లో జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఏథెన్స్ వెళ్లారు. అక్కడ విమానం దిగిన తరువాత తన పరిశోధనాపత్రాలున్న బ్యాగు కనిపించకుండా పోయిన విషయాన్ని డాక్టర్ రాకేష్ గుర్తించారు. ఇతర బ్యాగులు కూడా కదిలించినట్టు కనిపించాయి. పోయిన బ్యాగు ఆచూకీ కోసం సిబ్బంది చేసిన యత్నం ఫలించలేదు. దీంతో ఆయన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనలేకపోయారు. తరువాత ఢిల్లీ వినియోగదారుల కమిషన్‌ను డాక్టర్ రాకేష్ ఆశ్రయించారు.

2008-03-06

World Public Services: 498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

2008-03-06 05:41 PM vdgali (noreply@blogger.com)
మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సంస్థ ప్రతినిధులు చల్లా ఉమా, అనురాధ, విజయభారతితో పాటు పలువురు బాధితులు పాల్గొని దుర్వినియోగం అవుతున్న 498(ఎ) చట్టంలో వెంటనే మార్పులు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టం పలువురు అమాయకులను నిర్బంధంలోకి తోసేస్తుందన్నారు. ఒక పురుషుడికి తల్లి, చెల్లి, అక్క, వదిన అయిన పుణ్యానికి 498(ఎ) చట్టం వల్ల అరెస్టు అవుతున్నారని  అన్నారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సదరు మహిళ ఇచ్చే ఫిర్యాదుతో కుటుంబసభ్యులు అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఫిర్యాదుదారులు మాత్రమే మహిళలా? ఇతరులు కారా? అని ప్రశ్నించారు. ఈ చట్టం కింద ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ అరెస్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళల హక్కుల పరిరక్షణ పేరిట అమాయకుల మానవ హక్కులను ఉల్లఘించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 'వరకట్నం' పేరిట పెడుతున్న కేసుల వల్ల ఎన్నో జీవితాలు బలయ్యాయని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా 498(ఎ) చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీపుల్స్ గ్రీవెన్స్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్‌యాదవ్, బాధిత తల్లులు సరోజినీదేవి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొని మాట్లాడారు.

World Public Services: గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

2008-03-06 05:36 PM vdgali (noreply@blogger.com)
విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అందరూ ఇళ్లల్లో ఉన్న విద్యుత్తు దీపాలు ఆర్పి ఉద్యమానికి చేయూతనివ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాఘవేందర్ కోరుతున్నారు. ముంబయిలో డిసెంబర్ 15న నిర్వహించిన 'బత్తీ బంద్' కార్యక్రమమే తమకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.  ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి నగరంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న యువత రాఘవేందర్, మోహన్, మధుకర్, రజిత, పుష్కర్, సంపత్, షవాలీ నడుం బిగించారు. వీరంతా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు. ఏదైనా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉద్యమం. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సీవీఎస్‌కే శర్మతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ, నెడ్‌క్యాప్ తదితర సంస్థలూ సహకరిస్తున్నాయి. వివరాలకు 99088 15490లో సంప్రదించవచ్చన్నారు.

2008-02-13

World Public Services: ఢిల్లీలో నో స్మోకింగ్‌ బోర్డు తప్పనిసరి

2008-02-13 03:12 AM vdgali (noreply@blogger.com)
ఢిల్లీ లోని రెస్టారెంట్లు, గెస్టు హౌస్‌ల ముందు 'నో స్మోకింగ్‌ ఏరియా' బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఢిల్లీ పోలీసులకు వాణిజ్య సంస్థలకు హెచ్చరికలు జారీచేశారు. లేనట్త్లెతే యజమానులు రూ.500 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 1996 ఢిల్లీ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్మోకింగ్‌, నాన్‌స్మోకర్స్‌ హెల్త్‌ సంరక్షణ చట్టం కింద నగరంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఈటింగ్‌ హౌస్‌లు, గెస్టు హౌస్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని 10వ సెక్షన్‌ ప్రకారం ప్రజలు ఎక్కువగా వచ్చే ఆయా సంస్థల వద్ద ఉండే ముఖ్యమైన ప్రదేశాలు లేదా రాకపోకల గేట్ల వద్ద నో స్మోకింగ్‌ జోన్‌, పొగ తాగటం నేరం అనే బోర్డులు ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తికి మొదటిసారి రూ.100, రెండోసారి రూ.200 జరిమానాగా చెల్లించాలి. ఈ జరిమానా రూ.500 వరకు పొడిగించవచ్చు.
డీయూలో ఫిబ్రవరి నెల 15 నుంచి ధూమపాన నిషేధం అమలు
ఢిల్లీ యూనివర్సిటీలో ఫిబ్రవరి 15 నుంచి ధూమపాన నిషేధం అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు సర్క్యులర్లు జారీ చేశారు. పొగ తాగకూడదనే సందేశాన్ని వీధి నాటకాలు ప్రదర్శించడం, గోడలపై పెయింటింగ్‌లు, పోస్టర్లను అతికించడం ద్వారా ప్రచారం చేస్తున్నారు. క్యాంపస్‌ సమీపంలో సిగరెట్లను విక్రయించే దుకాణదారులను పంపించి వేశామని యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు అమృత బహ్రి అన్నారు. మొదటిసారి ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై రూ.200 జరిమానా విధిస్తారు. రెండో సారి ఉల్లంఘిస్తే రూ.500 వరకు ఫైన్‌ వేస్తారు.

World Public Services: వంటనూనె తయారీ యూనిట్లపై దాడి

2008-02-13 03:04 AM vdgali (noreply@blogger.com)
వంటనూనె తయారీ యూనిట్లపై తూనికలు, కొలతల అధికారులు దాడులు చేసి 58 మిల్లులపై కేసులు నమోదు చేశారు. తక్కువ మోతాదులో అయిల్‌ను ప్యాకింగ్‌ చేస్తున్న యూనిట్లపై హైదరాబాద్‌, రంగారెడ్డిలకు చెందిన అధికారులు దాడులు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌, కాటేదాన్‌, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఉన్న గోవర్దన్‌, మనియర్‌, అనీల్‌, అరుణ, గుడ్‌ హెల్త్‌ ఆగ్రోటెక్‌, షాలిమర్‌ డ్రాప్‌, ధూల్‌చంద్‌, పవన్‌, షాలిమర్‌, సర్దా, శీతల్‌, రామచరణ్‌ రిఫైనరీ అయిల్‌ యూనిట్లపై కేసులు నమోదు చేశామని లీగల్‌మెట్రాలజీ కంట్రోలర్‌ తెలిపారు.

2008-01-15

World Public Services: సమాచార హక్కు దుర్వినియోగం

2008-01-15 05:49 AM vdgali (noreply@blogger.com)
సమాచార హక్కు చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, శిక్షలకు సంబంధించిన నిబంధనలను చేరుస్తూ ఈ చట్టాన్ని సవరించాల్సి ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) అభిప్రాయపడింది. ' ఈ చట్టాన్ని దుర్వినియోగ ఉద్దేశంతో సమాచారం కోరే వారిని శిక్షించే చర్యలు తీసుకోడానికి వీలుగా ఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరాన్ని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి' అని కమిషన్‌ పేర్కొంటూ నవోదయ విద్యాలయకు చెందిన ఓ ఉపాధ్యాయుని దరఖాస్తును కొట్టివేసింది.
కేవలం ఆ బడిపై అక్కసు తీర్చుకోవడం కోసమే ఈ దరఖాస్తును ఆయుధంగా వాడుకోవాలని పిటిషనర్లు రమేశ్‌చంద్ర, ఆయన భార్య ఉమాకుమారి విశ్వప్రయత్నం చేసినట్టుగా కమిషన్‌ నిర్ధారించింది. రమేశ్‌ చంద్రను బదిలీ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ దంపతులు తొలుత కేంద్ర పాలనా వ్యవహారాల ట్రిబ్యునల్‌ (సీఏటీ)ని ఆశ్రయించగా చుక్కెదురైంది. తరువాత హైకోర్టులోనూ, అనంతరం షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌లోనూ అదే పరిస్థితి. చిట్టచివరగా ఆర్టీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఇదంతా గమనించిన సమాచార కమిషనర్‌ ఓపీ కేజారీవాల్‌ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

World Public Services: పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే పారితోషికం

2008-01-15 05:42 AM vdgali (noreply@blogger.com)
మనం పబ్లిక్‌ టాయ్‌లెట్లు వాడితే డబ్బులు చెల్లించడం ఎక్కడైనా ఉన్నదే. కానీ, వాడినందుకు మనకే డబ్బులిస్తోంది ఒక సంస్థ. ఒక్కసారికి పదిపైసల చొప్పున లెక్కకట్టి మరీ నెలవారీ చెల్లింపులు చేస్తోంది. తిరుచిరాపల్లి (కేరళ) సమీపంలోని ముసిరికి చెందిన సొసైటీ ఫర్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ అలా చేస్తోంది! ఎరువుగా మలమూత్రాల వాడకంపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ సుబ్బరామన్‌ చెప్పారు.

World Public Services: వైద్యులు, ఆస్పత్రులు నిబంధనలను పాటించాలి

2008-01-15 05:30 AM vdgali (noreply@blogger.com)
జాతీయ వైద్యమండలి నిబంధనలను రాష్ట్రంలోని వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా అనుసరించాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్యమండలి ఛైర్మన్‌ డాక్టర్‌ వల్లభనేని రాంప్రసాద్‌ కోరారు. ఇటీవల నిబంధనలను ఉల్లంఘించిన ఇరువురి వైద్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాల వైద్యుడు వి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యాయని తెలిపారు. తిరుపతికి చెందిన వైద్యుడు ఎం.శ్రీనివాసరావు కూడా నిబంధనలను ఉల్లంఘించినందున వీరిరువురి రిజిస్ట్రేషన్లు ఏడాది పాటు రద్దు చేస్తున్నామని చెప్పారు. ''వివిధ రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేస్తామంటూ కొందరు వైద్యులు పత్రికలు, కరపత్రాల ద్వారా జారీచేస్తున్న ప్రకటనలు వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇకపై వైద్యులు, ఆస్పత్రులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు నైతిక విధానాలను అనుసరించాలి'' అని కోరారు.

World Public Services: స్మార్టుకార్డులతో రూ.18 కోట్లు ఆదా

2008-01-15 05:24 AM vdgali (noreply@blogger.com)
సామాజిక పింఛన్లు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించే స్మార్టుకార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు ఏటా సుమారు రూ.18 కోట్లు ఆదా చేయవచ్చని అధికారుల అంచనా . ప్రస్తుతం వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఆరు జిల్లాల్లో, వచ్చే డిసెంబర్‌ నాటికి రాష్ట్రమంతటా వర్తింపచేయాలని భావిస్తున్నారు. ఇందుకు 13 బ్యాంకులతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. మౌలిక వసతులను బ్యాంకులు సమకూర్చనున్నాయి. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్మార్టుకార్డుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేయనుంది. అనంతరం తొలుత సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల్లో ఎంపికజేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి మూడోవారానికల్లా ముగించి లబ్ధిదారులకు స్మార్టుకార్డులను పంపిణీ చేస్తారు. తొలివిడతగా వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ నుంచి స్మార్టుకార్డుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రారంభిస్తారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఈ సేవలను విస్తరించనున్నారు.

2007-12-28

World Public Services: పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు

2007-12-28 05:05 AM vdgali (noreply@blogger.com)
రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ పని చేసేలా మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ బంకులను కూడా నెలకొల్పుతున్నట్లు చెప్పారు. దీన్ని నివారించడం కోసమే ముందుగా పాత తాలూకా కేంద్రాల్లో మందుల షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళలో పౌరసరఫరాల సంస్థ విజయవంతంగా మందుల షాపులను నడుపుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఖరీప్‌లో రైతులకు వరి ధాన్యం మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. గ్రేడ్ ఏ రకం క్వింటాల్‌కు రూ.775 మద్దతు ధర ఉండగా.. మిలర్లు రూ.876 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 62,446 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెల నుంచి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 2009 నాటికి మహిళలకు 25 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

World Public Services: ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్

2007-12-28 05:01 AM vdgali (noreply@blogger.com)
 'ఏపీఆన్‌లైన్' www.aponline.gov.in లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్' సూచికలో 'డౌన్‌లోడ్ తెలుగు సాఫ్ట్‌వేర్' ఉంటుందని తెలిపారు. విన్డోస్ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్ అవుతుంది.

2007-12-27

World Public Services: సెల్‌లో విద్యుత్తు బిల్లు

2007-12-27 02:36 AM vdgali (noreply@blogger.com)
సెల్‌ఫోన్ ఐదేళ్ల క్రితం వరకు సమాచారాన్ని అందిపుచ్చుకునేందుకే ఉపయోగపడేది. ప్రస్తుతం ఈ ఫోన్ మరిన్నో సేవలను అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ పేపర్, మొబైల్ టీవీ... ఇలా వివిధ రకాలుగా రూపాంతరం చెందుతోంది. తాజాగా విద్యుత్తు శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్తుకు సంబంధించిన వివరాలను సెల్‌లో చూసుకునే వెసలుబాటు ఏర్పడింది. సీపీడీసీఎల్ అధికారులు జెనీవా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి ఎస్.ఎం.ఎస్. ద్వారా విద్యుత్తు సంబంధిత సమాచారాన్ని వినియోగదారులకు అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సొంత భాషలో మెసేజ్‌లు పంపే సదుపాయం కల్పించింది. సీపీడీసీఎల్ ద్వారా సెల్‌ఫోన్ ఉన్న విద్యుత్తు వినియోగదారులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా బిల్లు వివరాలు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం వినియోగదారులు ముందుగా తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా విద్యుత్తు బిల్లు పంపడంతో పాటు, బిల్లు చెల్లించిన వెంటనే 'ధన్యవాదాలు' అంటూ సమాచారం పంపుతారు. వినియోగదారుడు ఉంటున్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో ఏమైనా అంతరాయాలుంటే ఆయా వివరాలూ పంపిస్తారు. ఇందుకు వినియోగదారుడికి అదనంగా ఎలాంటి ఛార్జీ పడదు. ఈ సేవలను మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితం చేశారు. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు.
మొబైల్ వినియోగదారులు తమ విద్యుత్తు సర్వీసు నంబరు, ఈఆర్ కోడ్‌ను కంపోజ్ చేసి, 57333 నంబరుకు ఎస్ఎంఎస్ పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెట్ అందుబాటులో ఉండే వినియోగదారులు www.apcentralpower.com  వెబ్‌సైట్‌లో 'మొబైల్ అలర్ట్స్' అనే లింక్‌లోకి వెళ్తే సరిపోతుంది. అక్కడ కోరిన సమాచారాన్ని అందజేసి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు
2010-03-10
2010-03-10 01:21 PM manyasima - మన్యసీమ
హైదరాబాదు: ముఖ్యమంత్రి రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఇంటివద్దే చికిత్స చేయించుకున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సర్దుకుంటుందని వైద్యులు తెలిపారు. Filed under: వార్తలు
2010-03-10 01:20 PM manyasima - మన్యసీమ
హైదరాబాదు: ముఖ్యమంత్రి రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఇంటివద్దే చికిత్స చేయించుకున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సర్దుకుంటుందని వైద్యులు తెలిపారు. Filed under: వార్తలు
2009-12-16
2009-12-16 04:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-07-27
2009-07-27 02:07 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Priyanka Kothari Hot & Sexy Images
2009-05-18
2009-05-18 03:13 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న
2009-05-18 02:46 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా
2009-04-22
2009-04-22 05:46 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-04-10
2009-04-10 07:19 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Earth is an award-winning British natural history film from the BBC Natural History Unit. It was released in cinemas internationally in 2007 and is due to be released in the US on 22 April 2009. The British version was narrated by Patrick Stewart and the US version is to be narrated by James Earl Jones. A UK-German co-production, it was filmed entirely in high-definition and 35mm using the
2009-04-03
2009-04-03 06:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Cloudy with a Chance of Meatballs is a 2009 computer-animated forthcoming 3D film produced by Sony Pictures Animation and distributed by Columbia Pictures. It is scheduled for a theatrical release on September 18, 2009 and is inspired by the children's book of the same name by Judi Barrett and Ron Barrett. It is the Sony Pictures Animation's third film. Whereas the book had one speaking
2009-03-30
2009-03-30 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-28
2009-03-28 12:12 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు
2009-03-16
2009-03-16 05:24 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్
2009-03-14
2009-03-14 07:04 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-14 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child
2009-03-14 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
“X-Men Origins: Wolverine” WallpapersVenkateshwarlu Bulemoni
2009-03-12
2009-03-12 09:14 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అఫిషియల్ ట్రైలెర్
2009-03-11
2009-03-11 05:30 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival. Basic PlotThe film tell the story of the unlikely pen-pal friendship between Mary, a chubby lonely 8-
2009-03-10
2009-03-10 08:04 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి
2009-03-10 07:58 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు
2009-03-07
2009-03-07 05:55 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-02
2009-03-02 06:00 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-23
2009-02-23 10:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-21
2009-02-21 06:40 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and
2009-02-21 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Tollywood lead actress Charmme’s latest Telugu film 16 days is all set to release on 20 February. This film deals with 16-day-long period in the life of the lead pair, besides the situations that would surround them. Charmme is playing the role of Angelina who has the special talent of mimicking Pawan Kalyan, Ravi Teja, Sunil etc. Arvind plays male lead.
2009-02-20
2009-02-20 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-17
2009-02-17 05:47 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-14
2009-02-14 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Sontha Vooru is a Telugu Movie, starring Raja and Theertha as the lead pair, directed by P Sunil Kumar Reddy. Produced by Y Ravindra Babu & Kishore Baasireddy, and music composed by . The film Shooting is in progress.
2009-02-12
2009-02-12 10:56 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Shriya Saran (born September 11, 1982) is an Indian film actress. She began her career acting in music videos, while also attending an acting studio to follow her dream to act. After her debut in 2001 with Ishtam, she gained Telugu cinema's attention in 2002 by playing the role of Bhanu in Santhosham, her first major hit. Following the film she appeared in several Telugu films with prominent
2009-02-11
2009-02-11 06:27 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Drona is a Upcoming Telugu film, starring Nitin, Priyamani, Kelly Dorge, Mukhesh Rushi, Sita, Sunil, Raghubabu, directed by J Karunakumar. Produced by DS Rao, and music composed by Anoop Rubens. The film shooting is in progress.
2009-02-10
2009-02-10 07:12 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
భారతీయ చిత్రంగా నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పిటికే ఆస్కార్ నామినేషన్‌ను సాధించుకున్న ఈ చిత్రం ఆదివారం మరో ఘనతను సొంతం చేసుకుంది.బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్‌టీసీ) అవార్డు ఈ ఏడాది స్లమ్‌డాగ్ మిలీనియర్ సొంతమైంది. బాఫ్టా అని పిలవబడే ఈ అవార్డులు మొత్తం ఏడింటిని స్లమ్‌డాగ్ మిలియనీర్ దక్కించుకోవడం
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish