ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-07-31

Featuresindia.com RSS Feed: తెలంగాణ రాష్ట్రం కోసం బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య

2010-07-31 09:01 AM
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ఇషాంత్‌ రెడ్డి అనే బీటెక్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇషాంత్‌ రెడ్డి వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌...

Featuresindia.com RSS Feed: తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదు:జేపీ

2010-07-31 09:01 AM
రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు.

Andhra Jyothy: (శీర్షిక లేదు)

2010-07-31 09:01 AM

-- Delivered by Feed43 service

ఈనాడు: తెలంగాణలో వర్ష బీభత్సం

2010-07-31 09:01 AM
అల్పపీడన ప్రభావంతో తెలంగాణను గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ భారీ వర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లాయి.

-- Delivered by Feed43 service

ఈనాడు: డీఎస్‌ భవిత ప్రశ్నార్థకం!

2010-07-31 09:01 AM
ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ పెద్ద పదవి ఆశ నిరాశ అయింది. రాష్ట్ర కాంగ్రెస్‌ సారథిగా ఉంటూ వరుసగా రెండో సారి ఓటమి పాలైన ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

-- Delivered by Feed43 service

ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)

2010-07-31 06:54 AM
రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు.

APReporter.com - Online Telugu News Portal: డీఎస్ ఓటమి కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ విద్యార్ధి

2010-07-31 06:50 AM Suman (mail2suman82@yahoo.com)

తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో విద్యార్ధి ఆత్మ బలిదానం చేశాడు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలం బసంతపూర్ కు చెందిన ఇషాంత్ రెడ్డి  వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ పూర్తి చేసి జిఆర్ఇకి ప్రిపేరవుతున్నాడు. నిన్న రాత్రి ఇషాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  ఇషాంత్ తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలియజేస్తూ ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు.

అందులో పీసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఓడిపోతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నానని ఇషాంత్ రాశాడు. అలాగే తన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఇషాంత్ కోరాడు.

అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెదేపా నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ద్రోహులని ఇషాంత్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని, ఎవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

APReporter.com - Online Telugu News Portal: చంద్రబాబు తెదేపా పగ్గాలను బాలకృష్ణకు అప్పగించాలి : ప్రసన్న కుమార్

2010-07-31 06:21 AM Suman (mail2suman82@yahoo.com)

balakrishnaతెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా పోవడంతో ఆ పార్టీ నుండి బహిష్కృతమైన నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ చంద్రబాబుఫై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేక చంద్రబాబు బాబ్లీ ప్రాజక్టు డ్రామా ఆడారని, ప్రచారానికి వెళితే ప్రజలు రాళ్ళతో కొట్టి తన్ని తరిమేస్తారని చంద్రబాబు భయపడ్డారని ప్రసన్న విమర్శించారు.

చంద్రబాబు వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టుకుపోయిందని, ఆయన ఇంకా నాయకత్వంలో కొనసాగితే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా తెదేపా నామరూపాలు లేకుండా పోతుందని ప్రసన్న అన్నారు. ఇకనైనా చంద్రబాబు పార్టీ పగ్గాలను స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, సినీనటుడు బాలకృష్ణకు మరియు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.

APReporter.com - Online Telugu News Portal: కాంగ్రెస్--తెదేపాల చెంప చెళ్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చారు : కేసీఆర్

2010-07-31 05:55 AM Suman (mail2suman82@yahoo.com)

kcrఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించడంఫై తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ తమ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్---తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి ఎన్నో ఎత్తులు వేశాయని, అయితే తెలంగాణ ప్రజలు వారి కళ్ళు గిర్రున తిరిగేలా, చెంప ఛెళ్లుమనిపించేలా, అది ఢిల్లీ పీఠానికి వినబడేలా తమ తీర్పునిచ్చారని అన్నారు. ఈ గెలుపునకు కృషి చేసిన తెలంగాణ అక్కాచెల్లెళ్లకు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు మరియు ప్రభుత్వోద్యోగులకు కే సీ ఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి దాన్ని ఓట్లుగా మలచి గెలిపించారని, ఇకఫై తెలంగాణా రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, ఇదే స్ఫూర్తిని తెలంగాణా ప్రజలు రాష్ట్ర విభజన జరిగే వరకూ కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెరాస సాధించిన భారీ విజయాన్ని తెలుసుకుని ప్రపంచంలోని 18 దేశాలలో ఉన్న తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని, అమెరికాలో శెలవు దొరకకపోయినా, బలవంతంగా శెలవు పెట్టి మరీ సంబరాలు చేసుకుంటున్నట్లు వారు తనతో చెప్పారని కేసీఆర్ తెలిపారు.

APReporter.com - Online Telugu News Portal: స్థానిక సమస్యలే తెరాస గెలుపుకు కారణం : మొయిలీ

2010-07-31 05:17 AM Suman (mail2suman82@yahoo.com)

veerappa_moyileeతెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్ధులు గెలుపొందడంఫై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని నిన్న ఢిల్లీలో మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారో, వారినే ఆ ప్రాంత ఓటర్లు తిరిగి గెలిపించారని మొయిలీ అభిప్రాయపడ్డారు.

తెరాస అభ్యర్ధులు గెలవడానికి అక్కడి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని, ఈ ఫలితాలఫై మరింత లోతుగా మాట్లాడేందుకు ఏమీ లేదని చెబుతూ మొయిలీ ఈ విషయంఫై ఇంకా మాట్లాడేందుకు నిరాకరించారు.

ముఖ్య వార్తలు: పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న బరాక్ ఒబామా!

2010-07-31 04:40 AM
వచ్చే నవంబరులో న్యూఢిల్లీ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ చారిత్రాత్మక పర్యటనకు సంబంధించిన తేదీల ఖరారులో ఇరు దేశాల ఉన్నతాధికారులు నిమగ్నమైవున్నారు.

APReporter.com - Online Telugu News Portal: పెరగనున్న స్టీల్ ధరలు!

2010-07-31 03:44 AM Hari Prasad (hari.apreporter@gmail.com)

steelప్రభుత్వ రంగంలోని ఉక్కు ఉత్పత్తి కంపెనీ సెయిల్ స్టీల్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌లో నిర్మాణ, అటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉక్కు ఉత్పత్తిలో సెయిల్ అతిపెద్ద కంపెనీ. దేశీయ మార్కెట్లో ఈ కంపెనీ వాటా 20 శాతంగా ఉంది. ఒక వేళ ఈ కంపెనీ స్టీల్ ధరలను పెంచితే మిగతా కంపెనీలైన జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎస్సార్ తదితర కంపెనీలు కూడా పెంచేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో జనవరి నెలలో టన్నుకు 615 డాలర్ల గరిష్ఠ స్థాయికి పెరిగిన హాట్ రోల్డ్ కాయిల్స్ ధర, జూలై నెలలో 550 డాలర్లకు పడిపోయింది. ఇందుకు కారణం యూరప్ దేశాలతో పాటు చైనాలో మాన్యుఫాక్చరింగ్ రంగంలో కార్యకలాపాలు మందగించడమే వర్మ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు హాట్ రోల్డ్ కాయిల్స్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జూలైలో పలు స్టీల్ ఉత్పత్తుల ధరలు 4 శాతం తగ్గి 13 శాతానికి చేరాయని, అటు నిర్మాణ, ఇటు ఆటోమొబైల్ రంగాల నుంచి స్టీల్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో స్టీల్ ధరలను సవరించే అవకాశం ఉన్నట్లు కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. స్టీల్ ధరలు పటిష్టపడుతున్నాయని, దీని వల్ల ధరలు పైకి పెరిగే విధంగా వత్తిడి ఉందని సెయిల్ చైర్మన్ సిఎస్ వర్మ తెలిపారు.

 

APReporter.com - Online Telugu News Portal: పాకిస్థాన్‌లో వరద బీభత్సానికి 300 మంది బలి

2010-07-31 02:41 AM Hari Prasad (hari.apreporter@gmail.com)

pak floodsగత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కైబర్ - పాక్తున్‌ఖ్వా ప్రావెన్సులోనే 291 మంది మృత్యువాత పడ్డారని పాక్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇదే ప్రాంతంలో కొండచరియ విరిగిపడడంతో శుక్రవారం 49 మంది సజీవ సమాధి అయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 20 మంది, పంజాబ్‌లో 34 మంది చనిపోయారు. సహాయక బందాలతో పాటు, పాక్ సైన్యం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కైబర్ ప్రావెన్సులో 1929 తర్వాత ఇంత భారీగా వర్షాలు కురవడం ఇదే తొలిసారని ఆ దేశ జాతీయ విపత్తుల నియంత్రణ సంస్థ తెలిపింది. స్వాత్ నది ఈ వరదలకు ఉధతంగా ప్రవహిస్తోందని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. పెషావర్‌లో 302 మిల్లీమీటర్లు, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో 190 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరద బీభత్సానికి సుమారు 300 మంది మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

APReporter.com - Online Telugu News Portal: ఇకనైనా ఆటకి వయసుకి ముడి పెట్టకండి : సచిన్

2010-07-31 02:32 AM Hari Prasad (hari.apreporter@gmail.com)

sachin"నేను 37 ఏ ళ్లప్పుడు డబుల్ సెంచరీ సాధించాను. నా ఉద్దేశ్యం ప్రకారం ఆటకు వయసు అడ్డు కానేకాదు. నా వయస్సు గురించి కామెంట్ చేయడం ఇకనైనా మానుకుంటారని అనుకుంటున్నాను" అని విమర్శకులనుద్దేశించి సచిన్ కొలంబో టెస్ట్ మ్యాచ్ అనంతరం అన్నారు. తాజా డబుల్ సెంచరీతో టె స్టుల్లో 48వ సెంచరీని నమోదు చేసిన ఈ వెటరన్ ఆటగాడు రెండోటెస్టులో భారత్ ఓటమిపాలు కా కుండా కీలకపాత్ర పోషించాడు. అయితే తొలిటెస్టులోనే అదరగొట్టిన సురేశ్‌రైనా, డాషింగ్ బ్యాట్స్‌మ న్ సెహ్వాగ్‌లపై సచిన్ ప్రశంసలు కురిపించాడు. ఆటను వయస్సుతో ముడిపెట్టే ఆలోచనలు ఇకనైనా మానుకోవాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ అన్నాడు. మానసికంగా దృఢంగా ఉండి, ఆడగలననే నమ్మకమున్నప్పుడు వయస్సుతో సంబంధం లేదు.

APReporter.com - Online Telugu News Portal: హత్యకు గురైన అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు లోరెంజెన్ వ్రైహ్ట్

2010-07-31 02:16 AM Hari Prasad (hari.apreporter@gmail.com)

lorenzenఅమెరికా నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మాజీ ఆటగాడు లోరెంజెన్ వ్రైహ్ట్(34) హత్యకు గురయ్యాడు. 13 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్‌లో లాస్ ఏంజెల్స్ క్లిప్పర్స్, అట్లాంటా హాక్స్, మెంఫిస్ గ్రిజ్లిస్, సాక్రమెంటో కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే క్లేవ్‌లాండ్ కావలియర్స్ తరఫున కూడా మ్యాచ్‌లో పాల్గొన్నాడు. 778 గేమ్స్ ఆడిన అతను సగటున 8 పాయింట్లు సాధించి, ఎన్‌బిఎ మేటి ఆటగాళ్ల సరసన స్థానం సంపాదించాడు. ఈనెల 18వ తేదీ అర్థరాత్రి చివరి సారి రైట్‌ను చూసినట్టు అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకటి రెండు రోజులు గడిచినా రైట్ ఇల్లు చేరకపోవడంతో 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, దర్యాప్తు ప్రారంభించినప్పటికీ వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. 19వ తేదీన అతని సెల్ ఫోన్ నుంచి చివరి కాల్ వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. రైట్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ సమీపంలోనే అతని మృత దేహం లభించింది. శరీరంపై తుపాకీతో కాల్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, దీనితో దీనిని హత్యగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు ప్రకటించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం పంపామని, అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే మృతుడు లోరెంజెన్ఏ అన్న విషయం తేలుతుందని ఓ పోలీస్ అధికారి ప్రకటించాడు. మృత దేహంపై తుపాకీతో కాల్చిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నాడు. అందుకే, దీనిని హత్యగా అనుమానిస్తే దర్యాప్తు చేపట్టామని వివరించాడు. కాగా, రైట్ హత్యపై ఎన్‌బిఎ వర్గాలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

2010-07-30

APReporter.com - Online Telugu News Portal: ఉప ఎన్నికల ఫలితాలలో ప్రజల తీర్పును గౌరవిస్తాం : రోశయ్య

2010-07-30 12:15 PM Suman (mail2suman82@yahoo.com)

rosaiahతెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రోజు విడుదలైన ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాలను చూసిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఒక ప్రకటనను విడుదల చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఈ ప్రకటనలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల ప్రజల తీర్పును గౌరవిస్తామని రోశయ్య తెలిపారు.

అయితే ఈ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఓటమిపాలవ్వడంతో పార్టీ నాయకులు, అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడే గాంధీ భవన్ ఈ రోజు ఎవరూ లేక వెలవెలబోయింది.

APReporter.com - Online Telugu News Portal: తెలుగుదేశం పార్టీకి ఇక తీర్ధయాత్రలే గతి : విజయశాంతి

2010-07-30 10:25 AM Suman (mail2suman82@yahoo.com)

vijayashantiతెలంగాణ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలవడంతో తెరాస నాయకురాలు, మెదక్ ఎంపీ విజయశాంతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా విజయశాంతి మాట్లాడుతూ క్రిందటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతు కాగా, ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గల్లంతు అయ్యిందని అన్నారు.

తెలుగుదేశం కనీసం ధరావతు సైతం కాపాడుకోలేకపోయిందని, ఇక తెలుగుదేశానికి తీర్ధయాత్రలే గతని, వారు చేసిన బాబ్లీ యాత్రఫై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే నిజామాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన డీ.శ్రీనివాస్ రెండవసారి బిజెపి అభ్యర్ధి లక్ష్మీనారాయణ చేతిలో చిత్తుగా ఓడిపోయారని, డీఎస్ అంటే నో డిపాజిట్, నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు.

2010-07-28

Yahoo! Telugu: News: పాకిస్థాన్‌లో భారీ వరదలు: 400 మందికి పైగా మృతి!

2010-07-28 05:41 AM
పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ఇప్పటి వరకు సుమారు 400 మంది పైగా మరణించారు. మరో నాలుగు లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీటికి మరో 60 మంది మృతి చెందారు.

Yahoo! Telugu: News: కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి!

2010-07-28 05:41 AM
కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాశ్మీర్ లోయలోని ప్రధాన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు. నలుగురి మృతితో ఆగ్రహోద్రుక్తులైన స్థానికులు రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

24 గంటలు: ఛలో చందమామ

2010-07-28 05:05 AM satyam (noreply@blogger.com)
మీరో ఫోన్ చేస్తారు...హలో.. కన్నా ఎలా ఉన్నావ్...బాగానే ఉన్నానమ్మా.. (అటు నుంచి సమాధానం)ప్రయాణం బాగా సాగిందా..హ్యాపీగా అమ్మా.. ఇప్పుడే దిగాను..అక్కడ వాతావరణం ఎలా ఉంది..చాలా బాగుంది.. కాకపోతే మనకన్నా కాస్త చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది..మనవాళ్లు ఎలా ఉన్నారు...బాగున్నారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ ప్రశ్నలన్నీ మన దేశం నుంచి మరో దేశానికి వెళ్లిన మీ అబ్బాయికి వేసేవి కాదు... మన భూమిపై నుంచి

2010-07-27

24 గంటలు: సెల్లులో సొల్లొద్దు

2010-07-27 01:50 PM satyam (noreply@blogger.com)
సెల్‌ఫోన్..ఇప్పుడు ఓ నిత్యావసరం..ఒకప్పుడు మనుషులను మనసు కలిపితే.. ఇప్పుడాపని చేస్తోంది మొబైల్‌ఫోన్..ఎదురుగా ఉండి చెప్పలేని భావాలను తెలియచేయాలంటే మార్గం కూడా మొబైలే..నచ్చిన వారికి నచ్చినప్పుడు కాల్ చేసుకోవచ్చు.. కావల్సినంత సేపు మాట్లాడుకోవచ్చు..ఒకే దగ్గర ఉండి మాట్లాడాలనీ లేదు.. ఎక్కడికైనా వెళ్లూ మాట్లాడుకోవచ్చు..నిలబడి మాట్లాడుకోవచ్చు..కూర్చుని మాట్లాడుకోవచ్చు..కావాలనుకుంటే.. నడి సముద్రంలోకి

2010-07-26

24 గంటలు: నిధులు ఫలహారం

2010-07-26 05:03 AM satyam (noreply@blogger.com)
పేదల సంక్షేమానికి నిధులివ్వడానికి సర్కారు దగ్గర డబ్బులుండవు.. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడానికీ నిధులుండవు. ఏవైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే నిధుల కోత వెంటాడుతుంది. కానీ.. సొంతఖర్చులకోసం కావల్సినంత సొమ్ము. కేంద్ర ప్రభుత్వం అనవసర ఖర్చులు చూస్తే.. ఎవరికైనా కళ్లు తిరగకమానవు. నిధులను ఫలహారం చేయడంలో మనవాళ్లను మించినోళ్లు ఎవరూ ఉండరేమో.. నమ్మరా.. స్నాక్స్‌, మినరల్‌ వాటర్‌కు ఎంత ఖర్చు చేశారో కేంద్ర

24 గంటలు: మగాళ్ల కష్టాలు

2010-07-26 04:33 AM satyam (noreply@blogger.com)
ఆడోళ్లకే కష్టాలన్నీ అనే మాటలు ఎన్నో విన్న నాకు.. అంత త్వరగా కష్టాలు వచ్చి పడతాయని అనుకోలేదు. కష్టాలంటే.. ఇవేవో ఆర్థికబాధలో.. శారీరక బాధలో.. లేక కుటుంబ బాధలో కాదు.. మానసిక బాధలు. మగాడిగా పుట్టినందుకు.. పెరిగే వయస్సును కంట్రోల్‌ చేయలేం కదా.. అలాగే నాకూ వయస్సు పెరుగుతూ వచ్చింది. కనపడ్డ పెద్దవాళ్లందరినీ అంకుల్‌ అని పిలవడం నాకు చిన్నప్పటినుంచీ ఉన్న అలవాటు. అయితే.. ఈ అంకుల్‌ పదమే నన్ను మానసికంగా వేదనకు

2010-07-22

24 గంటలు: సిగ్గు సిగ్గు

2010-07-22 04:42 AM satyam (noreply@blogger.com)
దేశం మొత్తంమీద మనమే నెంబర్ వన్..మనల్ని మించినోళ్లు.. దేశం మొత్తంమీదా లేనే లేరు..ఇంతకీ ఈ ఘనత ఎందులో.. అభివృద్ధిలోనా... కాదు..పోనీ.. టూరిజంలోనా.. కాదు కాదు..ఐటీ కంపెనీలు ఎక్కువ కాబట్టి.. ఆరంగంలోనా..కానే కాదు..వ్యవసాయం బాగుంది కాబట్టి.. పాడిపంటల్లోనా..ఛాన్సే లేదు..భారీగా ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి.. జలయజ్ఞంలోనా..అదీకాదు...కార్పొరేట్ కాలేజీలు ఎక్కువ కాబట్టి.. ఎడ్యుకేషన్‌లోనా.. అక్కడా మనది

24 గంటలు: ఓ అద్భుతం...

2010-07-22 04:34 AM satyam (noreply@blogger.com)
ఈ ఫోటో చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో నల్లగా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా.. సృష్టికి వెలుగునిచ్చే సూరీడు. ముందు బంగారం వర్ణంలో మిలమిలలాడుతున్నదేమిటో తెలుసా.. మన భూమి కాదు.. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు.జులై 11, 2010న మన దగ్గర పాక్షిక చంద్రగ్రహణం సంభవించినా.. సౌత్ పసిఫిక్‌లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం తటస్థించింది. సూర్యుడి చుట్టూ అరుణవర్ణంలో కనిపించేది కరోనా. లార్జ్ యాంగిల్ స్పెక్టోమెట్రిక్

2010-02-06

నారద లోకం: ఫోకస్: గోవింద`గానం'

2010-02-06 04:43 AM Kanvasa (kanvasas@gmail.com)
ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది

2010-01-14

నారద లోకం: శుభాకాంక్షలు

2010-01-14 03:22 AM Kanvasa (kanvasas@gmail.com)
నారదలోకం వీక్షకులకుసంక్రాంతి శుభాకాంక్షలు

2009-12-31

నారద లోకం: హ్యాపీ న్యూ ఇయర్

2009-12-31 06:02 PM Kanvasa (kanvasas@gmail.com)
నారదలోకం పాఠకులకు 2010నూతన సంవత్సర శుభాకాంక్షలుఅతిత్వరలోనే మళ్లీ మీ ముందుకు విశేష వార్తలు తీసుకువస్తానని మాట ఇస్తూ ... మీ కణ్వస kanvasas@gmail.com

2009-12-10

MataManthi » వార్తలు: రాజకీయ సంక్షోభం లో ఆంధ్ర ప్రదేశ్

2009-12-10 04:11 PM Matamanthi

తెలంగాణా కి వ్యతిరేకం గా రాయల సీమ, కోస్తా ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఆందోళన తారాస్థాయి కి చేరింది. ప్రజల్లో వేర్పాటు పై వెల్లువెత్తుతున్న నిరశన జ్వాలతో ప్రజా పర్తినిధులు పార్టీల కి అతీతం గా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికి 113 మంది ఎం.ఎల్.ఎ లు రాజీనామా చేశారు. జే.సి. దివాకర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, శోభా నాగిరెడ్డి, పరిటాల సునీత, లగడపాటి, మైసూరా రెడ్డి  వంటి ప్రముఖులు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్, తే.దే.పా, పీ.ఆర్.పీ ల నుంచి అధిక సంఖ్య లో నాయకులు రాజీనామాలు సమర్పించారు. మరో వైపు కేంద్రం లో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాష్ట్రం లో తెలంగాణేతర నాయకులు ఎంతో మంది పార్టీలలో తమ పదవులకు కూడా రాజీనామా సమర్పించారు. సంస్థాగతం గా కూడా ఎంతో మంది జెడ్.పీ పదవులకు, పంచాయతీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కాగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలను ఆమోదించలేదు. అయినప్పటికీ తాము రేపటినుంచి శాసన సభకు హాజరు కాము అని వారు ప్రకటించారు. జే.సి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు తాము అధిష్టానానికి వ్యతిరేకం గ వెళ్లాలని అనుకోకున్నా ప్రజల మనోభీస్థలు తమకు ముఖ్యం కనుక వాటిని దెబ్బ తీయరాదనే తాము విధి లేని పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నామని  ప్రకటించారు.

MataManthi » వార్తలు: తెలంగాణా పై ఆంధ్ర లో వెల్లువెత్తుతున్న నిరశనలు

2009-12-10 02:54 PM Matamanthi

సమైఖ్యాంధ్ర నినాదం తో కోస్తా, సీమలు అట్టుడుకుతున్నాయి. విద్యార్ధులు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒప్పుకోము అంటూ తీవ్ర నిరశన వ్యక్తం చేసారు. అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. శ్రీ కృష్ణ దేవరాయ, నాగార్జునా, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఆందోళనలకు దిగారు. తరగతులను బహిష్కరించి వేర్పాటు వాదాన్ని తాము సహించం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల కే.సి.ఆర్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేస్తున్నారు.

2009-12-07

నారద లోకం: ప్రత్యేక రాష్ట్రం - పది ప్రశ్నలు

2009-12-07 02:52 AM Kanvasa (kanvasas@gmail.com)
ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావన మళ్ళీ నలుగురి నోటా వినిపిస్తున్నది! విభజనోద్యమం విద్యా ర్థులు, ఉద్యోగి వర్గాల చేతుల్లోకి వెళ్లడంతో అది తీవ్రరూపమే ధరిస్తున్నది. సమష్టి రాష్ట్రంలో తమకు అన్యాయాలు జరుగుతున్నవని తెలంగాణ సోదరులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. అయితే,విభజనకు సంబంధించిన కొన్ని క్లిష్ట సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను కూడా నిర్ణయించుకున్న తర్వాత విభజన ఆలోచన చేయడం జరిగింది.'రాష్ట్రాన్ని

2009-11-24

నారద లోకం: సెటైర్: ఓటరు - గ్రేటరు

2009-11-24 04:46 AM Kanvasa (kanvasas@gmail.com)
`గ్రేటర్' హైదరాబాద్ మహానగరంలోని ఓ పౌరుడు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, మధ్యతరగతి ఉద్యోగస్థుడు. అతగాడు ఆరురోజులు పనిచేసేదే `ఆదివారం' రాకకోసం. ఆదివారం రాకపోతుందా అన్న ఆ ఒక్కఆశే అతగాడ్ని మిగతారోజుల్లో పరుగులుపెట్టిస్తుంది. అన్ని ఆదివారాల్లాగానే ఈ ఆదివారం కూడా గ్రేటర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ముసుగుతన్ని పడుకున్నాడు. పొద్దున్న కాఫీ, టిఫినీలు బెడ్ మీదనే లాగించాడు. మళ్ళీ ముసుగుతన్ని పడుకున్నాడు.

2009-09-16

World Public Services: శ్రీవారి ప్రసాదానికి భౌగోళిక అనుకరణ హక్కు

2009-09-16 03:30 AM vdgali (noreply@blogger.com)

లడ్డూ లాంటి కబురు! తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్ కాపీరైట్) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ-జీఐఆర్)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి.
శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ''తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్, జీఐ సహాయ రిజిస్ట్రార్ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్-జనరల్ పి.హెచ్.కురియన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇకపై తితిదే అనుసరించే 'దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను 'దిట్టం'గా పరిగణిస్తారు. 'దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.

జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.

World Public Services: భూమాత గొడుగును కాపాడుకుందాం

2009-09-16 03:22 AM vdgali (noreply@blogger.com)
భూమాత గొడుగును కాపాడుకుందాం
సెప్టెంబరు 16 ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
'ప్రకృతికి మన అవసరాలు తీర్చగల స్థోమత ఉంది. కానీ.. పెరుగుతున్న జనం అత్యాశను మాత్రం తీర్చలేదు' - గాంధీజీ
'ప్రకృతితో సహజ జీవనం తల్లీబిడ్డల బంధం. ఆధునిక పరిజ్ఞానంతో సహజమైన పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తూ మనం కూర్చున్న చెట్టును మనమే నరుక్కుంటున్నాం' - పర్యావరణవేత్తలు

అందమైన జలపాతాలు.. అరుదైన జీవజాతులు.. ప్రకృతిలోని ప్రతి అణువూ మనసును పులకింపజేసేవే. అయితే అవన్నీ కాలగర్భంలో కలసి పోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉంది. భావి తరాలకు సంపద సృష్టించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమించే మనిషి.. ఆరోగ్యకరమైన ప్రకృతిని ఇచ్చే విషయాన్ని మరుస్తున్నాడు. సాంకేతిక ముసుగులో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కంటిపాపలా సంరక్షిస్తున్న ఓజోన్ పొరను మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. తద్వారా మనతోపాటు జీవజాలం ప్రకృతి సంపదను కాలగర్భంలో కలిపేస్తున్నాం. బుధవారం అంతర్జాతీయ 'ఓజోన్ పరిరక్షణ' దినోత్సవం. ఈ సందర్భంగా ఓజోన్ పొర ప్రాధాన్యాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని, మన కర్తవ్యాలను ఓసారి పరికిద్దాం.
ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లులు మానవాళికి తెచ్చే పెనుప్రమాదం గుర్తించిన ఐరాస 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మౌంటేరియా సిటీలో ప్రపంచ సదస్సు నిర్వహించింది. మోక్ట్రియల్ ప్రోటోకాల్‌ను ఖరారుచేసింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 16ను పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు.

ఏమిటీ ఓజోన్
భూమికి 15-25 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఇది మానవాళికి రక్షణ కవచంగా కాపాడుతూ ఉంటుంది.
  • సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. వీటిలో అల్ట్రావయొలెట్ బి రేడియేషన్, అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ అని రెండు ఉంటాయి.
  • అల్ట్రా వయొలెట్ సి రేడియేషన్ చాలా ప్రమాదకరమైంది. సూర్య కిరణాలు భూమికి చేరుకునే ప్రయాణంలో సి రేడియేషన్‌ను ఓజోన్ పొర పూర్తిగా అడ్డుకుంటుంది. బి రేడియేషన్‌ని వీలైనంత తగ్గిస్తుంది.
గొడుగుకు రంధ్రాలు
  • ఓజోన్ పొర ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లు నార్వే ప్రధాని గ్రోహార్లెన్ ఆధ్వర్యంలోని కమిషన్ 1987లో ఐరాసకు నివేదిక సమర్పించింది.
  • దక్షిణధ్రువం, ఉత్తరధ్రువం దగ్గర ఓజోన్ పొర దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
  • యూరప్ కెనడాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. దీని ప్రభావం పిల్లలపై పడకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పాఠశాల్లో పిల్లల్ని బయటకు రానీయవద్దని ఆంక్షలు కూడా విధించారు. ఒకవేళ బయటకు వచ్చినా ఈ కిరణాల నుంచి కాపాడే తొడుగులు, లేపనాలు వినియోగించేవారు.
ఐరాస ప్రాధాన్యం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణానికి ప్రాముఖ్యతనిచ్చింది. అప్పట్లో లక్షలాది మందిని బలిగొన్న మలేరియా మహమ్మారిని అదుపు చేసేందుకు డీడీటీ విచ్చలవిడిగా వాడారు. దోమల నాశకానికి వినియోగించిన ఈ మందు ప్రభావంతో పర్యావరణానికి మేలు చేకూర్చే వందలాది క్రిమికీటకాలు, పక్షులు అంతరించాయి. జీవ వైవిధ్యం సమతుల్యం కోల్పోయింది.
కారణాలు
  • క్లోరోఫ్లోరో కార్బన్స్ (సీఎఫ్‌సీ) అనే వాయువు ఓజోన్ పొర క్షీణతకు కారణం. ఏసీ, ఫ్రిజ్‌లు వంటి వాటి నుంచి ఇది విడుదలవుతుంది.
  • మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రసాయన వ్యర్థాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి.
  • అమెరికా సహా 12 యూరప్‌దేశాలు ప్రపంచం మొత్తమ్మీద మూడు వంతుల సీఎఫ్‌సీ విడుదల చేస్తున్నాయి.
  • రసాయనక ఎరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌పొరను తినేస్తున్నాయని 1970ల్లో పాల్ క్రటజన్ హెచ్చరించారు.
  • ఓజోన్ పొరను కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు నిషేధించిన కొన్ని రకాల గ్యాస్‌లు, వాయువుల వల్ల రెండేళ్లుగా ఓజోన్ స్థితి కొద్దిగా కుదుటపడ్డట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బాధ్యతలు
  • పర్యావరణం, ఓజోన్‌పై ప్రభుత్వాలు అవగాహన పెంపొందించాలి. స్థానికంగా సదస్సులు నిర్వహించాలి.
  • ఫ్రియాన్, సీఎఫ్‌సీల వాడకాన్ని ఆరికట్టాలి
  • ప్రత్యామ్నాయంగా వచ్చిన వస్తువులను ఉపయోగించాలి
  • ఓజోన్‌కు నష్టం కలిగించే పరిశ్రమలను క్రమంగా నిషేధించాలి.పచ్చదనాన్ని పెంపొందించాలి.
విపరిణామాలు
  • ఇంటి కప్పు.. బీటలు వారితే.. ఎండకు ఎండుతూ వానకు వానకు తడుస్తూ ఉండగలమా! భూమిని సంరక్షించే గొడుగు(ఓజోన్) క్షీణించడం వల్ల అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఎదురవుతోంది.
  • భూతాపం, రుతుపవనాలు గతి తప్పడానికి ఇదే కారణం
  • మానవుల్లో చర్మ క్యాన్సర్, వాధ్యి నిరోధక శక్తి క్షీణించడం, కంటి శుక్లాలు వంటి భయంకర ఇక్కట్లు తలెత్తుతాయి.
  • వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని పంట దిగుబడులు తగ్గిపోతాయి.

భారత్‌లో..
  • ఆరేళ్ల కిందట ఐఐటీ కాన్పూర్, అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ వర్సిటీ భారతదేశంలో ఓజోన్ పొరలో వచ్చిన మార్పుల్ని రెండు ఉపగ్రహాల సాయంతో పరిశోధనలు జరిపాయి.
  • ఓజోన్ పొర మందాన్ని డాబ్సన్ యూనిట్ల(డీయూ)లో కొలుస్తారు. సాధారణంగా ఈ పొర 300 నుంచి 500 డీయూల మందం కలిగి ఉంటుంది. గంగానదీ పరివాహ ప్రాంతాల్లోని పట్టణాలైన కాన్పూర్, కొల్‌కతా, పాట్నా, వారణాసిల్లో ఉండాల్సిన మందంతో పోలిస్తే 12.6, 10.8, 13.5, 11.3 డీయూలు తగ్గినట్లు అంచనా వేశారు.

2009-09-13

World Public Services: ఎల్ఐసీపై ఎన్‌సీడీఆర్‌సీ తీవ్ర విమర్శ

2009-09-13 04:17 AM vdgali (noreply@blogger.com)
పాలసీని జారీ చేసేటప్పుడే ఆ పాలసీ తాలూకు నియమ నిబంధనలను పూర్తిగా తెలియజేయకుండా పాలసీదారు ప్రయోజనాలను ఎంత మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడమేమిటని భారతీయ జీవిత బీమా సంస్థను (ఎల్ఐసీ) జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం (ఎన్‌సీడీఆర్‌సీ) తీవ్రంగా విమర్శించింది. బీమా ఏజెంట్లు ఎంత సేపూ కంపెనీ పాలసీలను అధిక సంఖ్యలో విక్రయించి ప్రీమియం మొత్తాలను గరిష్ఠ స్థాయిలో సేకరించడం, తద్వారా తాము కూడా సొమ్ము చేసుకోవడం పైనే ఆసక్తితో ఉంటున్నారని ఎన్‌సీడీఆర్‌సీ సభ్యులు ఆర్.కె.బట్టా, పి.డి.షెనాయ్‌లు అధిక్షేపించారు. ఒక కేసు విషయంలో ఎల్ఐసీ వినతిని వారు తోసిపుచ్చుతూ, ఈమేరకు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కేసు వివరాలు: సునీల్ జైన్ 2002లో తన కుమార్తె బేబీ మోనా జైన్ కోసం ఒక ఎల్ఐసీ పాలసీని తీసుకొన్నారు. బీమా రిస్క్ ప్రారంభం అయ్యే కన్నా ముందే, 2005లో మోనా చనిపోయింది. దీంతో పాలసీ కూడా రద్దయిపోయింది. జైన్ పరిహారం కోసం దరఖాస్తు ఇవ్వగా, ఆ క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించింది. పాలసీ ప్రత్యేక నియమాలను ఎల్ఐసీ ఏజెంటు తనకు విడమరచి చెప్పలేదని, మొదటి విడత ప్రీమియం చెల్లించిన నాటి నుంచి రిస్క్ అమలులోకి వచ్చిందని తాను భావించానని జైన్ వాదించారు. పాలసీ జారీ సమయంలో పాలసీకి సంబంధించిన అన్ని క్లాజులను ఏజెంటు జైన్‌కు తెలియబరచలేదు. ''కవర్ నోట్''లో మాత్రమే పాలసీ షరతులను పేర్కొన్నారు. (బీమా పాలసీని జారీ చేస్తున్నట్లు తెలిపే పత్రమే కవర్ నోట్. ఇందులో పాలసీ తాలూకు పూర్తి సమాచారం పొందుపరచి ఉంటుంది). కవర్ నోట్‌ను పరిశీలించిన కమిషన్, పాలసీని ప్రతిపాదించిన తేదీ నాటి నుంచి నాలుగు సంవత్సరాలు గడచిన తరువాత మాత్రమే అమల్లోకి వస్తుందన్న ప్రత్యేక నిబంధన, రిస్క్ ప్రారంభం అయ్యే లోపే సంభవించిన పక్షంలో పాలసీ రద్దు అవుతుందన్న వివరణ అందులో ఉందన్న సంగతిని గుర్తించింది. ప్రీమియం వసూలు చేసి, కవర్ నోట్‌ను జారీ చేసే కన్నా ముందే వినియోగదారుకు పాలసీ క్లాజులన్నింటినీ వివరించడం ఎల్ఐసీ, ఆ సంస్థ ఏజెంట్‌ల కర్తవ్యమని కమిషన్ స్పష్టం చేసింది.

2009-09-02

World Public Services: డ్రైక్లీనింగ్‌తో వైరస్‌ను పారదోలతాం

2009-09-02 03:23 AM vdgali (noreply@blogger.com)
స్వైన్‌ఫ్లూపై మార్కెటింగ్ ఎత్తుగడలు
దేశంలో స్వైన్‌ఫ్లూ ఆందోళనల నెలకొనడంతో పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నిరోధించే కొత్త ఉత్పత్తులు, సేవలు అందిస్తామంటూ ప్రకటనలతో వూదరగొడుతున్నాయి. ఒక కంపెనీ అయితే ఏకంగా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే డ్రైక్లీనింగ్ మా వద్ద ఉందంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇలాంటి వాటిని విశ్వసించవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సూక్ష్మజీవులను చంపే మందుతో బట్టలను డ్రైక్లీనింగ్ చేయిస్తే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని డైమండ్ ఫ్యాబ్‌కేర్ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ''స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించడానికి బట్టల్ని మీ ఇంట్లో ఉతుక్కోవడం కంటే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం మేలు. వైరస్, ఇతర క్రిములను సంహరించేందుకు మేం.. కొంచెం ఎక్కువ మోతాదులో కీటకనాశనిని వాడుతున్నాం'' అని ఆ సంస్థకు చెందిన ఎ.శ్రీవాస్తవ చెప్పారు. మరోపక్క లిక్విడ్ సోప్‌కు, చేతులు కడుక్కునేందుకు వాడే జెల్ వంటి వాటికి గిరాకీ విపరీతంగా పెరిగిందని ఢిల్లీకి చెందిన ఓ మందుల దుకాణం నిర్వాహకుడు చెప్పారు. ''ఇంతకుముందు.. ఇలాంటి ఉత్పత్తుల సామర్థ్యంపై వంద ప్రశ్నలు గుప్పించే వినియోగదార్లు ఇప్పుడు స్వైన్‌ఫ్లూ దెబ్బకు విపరీతంగా కొనేస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

స్వైన్‌ఫ్లూ నేపథ్యంలో వస్తున్న మార్కెటింగ్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రజలను హెచ్చరించింది. ''వైరస్‌ను డ్రైక్లీనింగ్ నిరోధిస్తుందని రుజువు చేస్తుందని ఏ అధ్యయనంలోనూ రుజువుకాలేదు'' అని మండలి డైరెక్టర్ వి.ఎం.కటోచ్ తెలిపారు. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు కంపెనీలు చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్‌కు చెందిన ఎన్.కె.పాండే తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి: స్వైన్‌ఫ్లూ వ్యాధితో పుణెలో ప్రియాంక షిమిల్కర్ అనే ఏడేళ్ల బాలిక మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 103కు చేరింది. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో తాజాగా మరో 100 కొత్త కేసులు నమోదయ్యాయి.

డిసెంబర్‌లో టీకా కొనుగోలు: స్వైన్‌ఫ్లూ టీకా పరీక్షల అంశంలో భారత్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలను కేంద్రం ఖండించింది. భారతీయులపై ఈ టీకాను పరీక్షించడానికి ఒక కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసిందని వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆర్.కె.శ్రీవాస్తవ తెలిపారు. గ్కాక్సో-స్మిత్‌క్త్లెన్ సంస్థ సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. నమూనాలను సేకరించే, పరీక్షించే, రవాణా చేసే సిబ్బందికి మొదట ఈ టీకాను ఇస్తామని వివరించారు. డిసెంబర్ నుంచి టీకాను గ్లాక్సో సంస్థ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.

మధుమేహం, గుండె జబ్బులు ఉంటే జాగ్రత్త: మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, రక్తహీనత ఉన్న వారికి స్వైన్‌ఫ్లూ సోకితే పరిస్థితి విషమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరు వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. దేశంలో హెచ్1ఎన్1 వైరస్ వల్ల కలిగిన మరణాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శివలాల్ తెలిపారు. 82 మరణాలను విశ్లేషించామని, ఇందులో 37 మంది అప్పటికే వారికి ఉన్న తీవ్రమైన వ్యాధులవల్ల పరిస్థితి విషమించి చనిపోయారని చెప్పారు.

రాష్ట్రంలో మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తాజాగా మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధిబారిన పడ్డవారి సంఖ్య 195కి చేరింది. మంగళవారం ఐదుగుర్ని తీసుకొచ్చి ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 25 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్వైన్‌ఫ్లూ కేంద్రం సమన్వయకర్త శుభకర్ తెలిపారు. గత నెల 12న వ్యాధి నిర్ధరణ కోసం ఢిల్లీకి పంపిన నమూనాల్లో 10 మందికి వ్యాధి సోకినట్లు నివేదిక అందినట్లు ఆయన చెప్పారు.

స్వైన్‌పై ఆయుర్ యుద్ధం
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాప్తిని ఆయుర్వేద మందులతో నియంత్రించవచ్చని విజ్ఞాన భారతి జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి జయకుమార్ మంగళవారం తెలిపారు. ఆయుష్ పరిశోధన విభాగం, విజ్ఞాన భారతి సంయుక్తంగా స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు పలు ఆయుర్వేద సూచనలు చేసిందన్నారు. నాలుగు సులభ పద్ధతులతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గీతాకృష్ణన్ తెలిపారు.
ఇలా జాగ్రత్త పడదాం
ఎనిమిది మూలికలతో తయారు చేసిన అపరాజిత ధూపం రోజుకు రెండు సార్లు తరగతి గదులు, రద్దీ ప్రాంతాల్లో వేస్తే ఫ్లూ వ్యాప్తిని నియంత్రించవచ్చు.
నాలుగు గంటలకు ఒకసారి తిలా తైలాన్ని వాసన చూడటం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
పసుపుకొమ్మును నేతిలో ముంచి, తర్వాత కాల్చగా వచ్చే పొగను ముక్కుతో పీల్చి నోటితో వదలాలి. దీంతో వైరస్ శరీరంలో ఉంటే వెంటనే చనిపోతుంది.
తులసిని తినడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

2009-08-31

World Public Services: నీరుగారిన 'కిట్ల' పథకం!

2009-08-31 03:14 AM vdgali (noreply@blogger.com)
తాగునీటిస్వచ్ఛతను నిర్ధరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం నీరు కారిపోయింది. మంచినీటిని విశ్లేషించేందుకు రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కిట్లు అటకెక్కాయి. వీటిని కొనటంలో కనపరచిన ఆత్రుత వినియోగించటంపై చూపటంలో ప్రభుత్వం విఫలమైంది.
తాగునీటి కాలుష్యంతో ఇరవై శాతం పైగా వ్యాధులు ప్రబలుతున్నట్లు తేలటంతో మంచినీటిని విశ్లేషించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోపంచాయతీలను భాగస్వాములుగా చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రాజీవ్‌గాంధీ తాగునీటి పథకం కింద నిధులను కూడా మంజూరు చేసింది. చేతి పంపులు, రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేసే నీటిని విశ్లేషించాలని పేర్కొంది. ఇందుకోసం 22 వేల గ్రామ పంచాయతీలకు నీటి విశ్లేషణ కిట్లను రెండు దఫాలుగా సరఫరా చేశారు. 2007లో తొలి విడత కింద కొన్న కిట్ ధర రూ.2,500 కాగా తరువాత దీన్ని రూ.2 వేలుగా నిర్ణయించారు. కిట్ల వినియోగంపై గ్రామ సర్పంచి, సైన్స్ ఉపాధ్యాయుడు, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. తరువాత దీని గురించి మరచిపోవటంతో ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన దాదాపు రూ.19 కోట్లు నీటి పాలయ్యాయి.

కిట్లు ఏం చేస్తాయి..
 తాగునీటిలోని తొమ్మిది రకాల కారకాలను కిట్ల ద్వారా విశ్లేషించవచ్చు. సాంద్రత, ఆమ్లత్వం, కఠినత్వం, గాఢత్వం, క్లోరిన్, ఫ్లోరైడ్ స్థాయిని గుర్తించేందుకు ద్రావకాలను కూడా సరఫరా చేశారు. ద్రావకాల కాలపరిమితి ఏడాదిన్నర మాత్రమే. దీంతో కిట్లను వాడకుండానే వీటిని మూలన పడేసే పరిస్థితి నెలకొంది.

 గ్రామస్థాయి విశ్లేషణలో నీటిలో కారకాలు ఉన్నాయని తేలితే వాటిని జిల్లాస్థాయి ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి పది శాతం నమూనాలు రాష్ట్రస్థాయి ప్రయోగశాలకు రావాలి. ఇక్కడకు ఇంత వరకూ ఒక్క శాంపిల్ కూడా రాలేదని సమాచారం. ఈ విధానాన్ని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

నీటిని విశ్లేషించే వ్యక్తికి ప్రతి నెలా రూ.100 గౌరవ వేతనం చెల్లించాలని నిర్ణయించినా, నిధులను మాత్రం విడుదల చేయలేదు. సైన్స్ ఉపాధ్యాయులైతే అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో చాలా మంది బదిలీపై వెళ్లిపోయారు.

ప్రతి కుటుంబం నుంచి రూపాయి చొప్పున నిర్వహణ వ్యయం వసూలు చేయాలని తొలుత నిర్ణయించారు. చాలామందికి కిట్లు వచ్చిన విషయమే తెలియకపోవడంతో వసూళ్లు జరగలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచి దీనికి కేటాయించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

పంప్ మెకానిక్‌లు గతంలో బాక్టీరియాకు సంబంధించిన పరీక్ష నిర్వహించేవారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారికే ఈ బాధ్యతలు అప్పగించాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.

శుభ్రమైన మంచినీరు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా సరఫరా చేసే నీటిని పరీక్షిస్తామని చెబుతోంది. ఇది జరగాలంటే పంపిణీ చేసిన కిట్లను వాడుకోవాలి. గ్రామస్థాయిలో శిక్షణ పొందిన వారి సేవలను వినియోగించుకోవాలి. కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడినప్రయోగశాలలనూ పటిష్ఠ పరచాలి.

2008-12-22

World Public Services: వారసులకు పరిహారం చెల్లించాలి : సుప్రీం

2008-12-22 09:28 AM vdgali (noreply@blogger.com)
పాలసీదారుని మృతిని తెలుపక పోయినా మోటారు వాహన బీమా సంస్థ మృతుని వారసులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు రుణంతో ఒక ట్రక్‌ను ఆత్మారామ్‌ కొనుగోలు చేశాడు. ఈ వాహనానికి యునైటెడ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ బీమా పాలసీని తీసుకున్నాడు. 1991లో ఆత్మారామ్‌ మరణం తరువాత ఈ వాహనాన్ని నడుపుతున్న అతని వారసులు రిజిస్ట్రేషన్‌ మార్పిడి చర్యలు తీసుకోలేదు. బీమా మొత్తాన్ని ఆత్మారామ్‌ పేరిటే ఏటా బ్యాంకు ద్వారా చెల్లించారు. 1994 సెప్టెంబర్‌ 15న ఈ వాహనానికి ప్రమాదం సంభవించడంతో డ్రైవర్‌ చత్తార్‌సింగ్‌ మరణించాడు. మృతుని కుటుంబానికి రూ.1.42 లక్షలు చెల్లించాలని కార్మిక పరిహార కమిషనర్‌ బీమా కంపెనీని ఆదేశించారు. పాలసీదారుడు మరణించిన కారణంగా పరిహారాన్ని చెల్లించలేమని బీమా సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు.. పాలసీ రెన్యూవల్‌ సమయంలో తనిఖీ చేయాల్సిన బాధ్యత కంపెనీదే అయినందున, పరిహారం చెల్లింపును తిరస్కరించలేరని స్పష్టం చేసింది. దీంతో బీమాసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణాన్ని తెలియచేయలేదని పరిహారం చెల్లింపునకు నిరాకరిస్తున్న సంస్థ, ప్రీమియంను స్వీకరించడకుండా ఉండాల్సిందని జస్టిస్‌ ఎస్‌బీ సిన్హా, సిరియాక్‌ జోసెఫ్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

World Public Services: సమాచారం అందడంలేదు!

2008-12-22 09:26 AM vdgali (noreply@blogger.com)
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మొత్తం చట్టం ఉద్దేశమే దెబ్బతింటోందని పేర్కొంది. గుజరాత్‌, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌లలోని కొన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఆర్‌ఐఏ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం నిర్వహించింది. మొత్తం పది రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వే ఫలితాలను 'ఆర్‌టీఐ కింద సమాచారం పొందడం: ప్రజల అనుభవం' పేరుతో విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లో 90శాతం మంది, కేరళలో 84శాతం మంది ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) నుంచి కోరిన సమాచారాన్ని పొందుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో 55శాతం, రాజస్థాన్‌లో 66శాతం, హర్యానాలో 68శాతం మందికి అది లభిస్తోందని పేర్కొంది. మొత్తంమీద సగటున 68.41శాతం మందికి మాత్రమే కోరిన సమాచారం లభ్యమవుతోంది. బీహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 45శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే కావాల్సిన సమాచారం లభిస్తోందని తెలిపింది. ప్రజలు కోరిన సమాచారం ఇచ్చే విషయంలో పీఐఓలు ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ చట్టం ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని సర్వే పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసిన 150 రోజుల తర్వాతే అధికారులు ఆ సమాచారం అందిస్తున్నారని, పైగా అందుకోసం దరఖాస్తుదారుడు కనీసం ఐదుసార్లు వారిచుట్టూ తిరగాల్సి వస్తోందని వెల్లడించింది. దాదాపు 43శాతం మంది దరఖాస్తుదారులు రెండు నుంచి ఐదుసార్లు సంబంధిత విభాగాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. బీహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌లలో పరిస్థితి మరీ ఘోరంగాఉందని పేర్కొంది. 20శాతం మందికి పైగా దరఖాస్తుదారులు సంబంధిత అధికారుల వద్దకు పదిసార్ల కంటే ఎక్కువగానే వెళ్లాల్సి వస్తోందని తెలిపింది.

World Public Services: రూ.527 కోసం పదేళ్ల న్యాయపోరాటం

2008-12-22 09:23 AM vdgali (noreply@blogger.com)
పదేళ్ల న్యాయపోరాటం చేసిన ఓ వృద్ధుడు చివరకు విజయం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం తపాలా కార్యాలయం నుంచి బి.ఆర్‌.శర్మ (75) 1996లో రూ.3వేలు రుణం తీసుకున్నాడు. గడువుకు ముందే రుణాన్ని చెల్లించేశాడు. అయినా కార్యాలయం రూ.527 ఎక్కువగా వసూలు చేసింది. దీనిపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రూ.వెయ్యి ఖర్చు చేశారు. పదేళ్ల పోరాటంతర్వాత వినియోగదారుల ఫోరం శర్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతనికి రూ.527తో పాటు న్యాయ పోరాటానికైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. శర్మ న్యాయవాది సునీల్‌ పరేఖ్‌ మాట్లాడుతూ 'ఈ పోరాటం కేవలం రూ.527 కోసం కాదని వ్యవస్థలోని లోపాలపైనేనని' పేర్కొన్నారు.
2010-07-30
2010-07-30 08:56 AM manyasima - మన్యసీమ
కర్నూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చందనాఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోని సమావేశ మందిరంలో సర్వశిక్ష అభియాన్‌ పనితీరు, విద్యా హక్కు చట్టం, సాక్షరభారత్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చందనాఖాన్‌ మాట్లాడుతూ విద్యాలయాల్లో గదుల కొరత వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, యుద్ద ప్రాతిపదికన అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సకాలంలో త్వరితగతిన [...]
2010-07-30 08:56 AM manyasima - మన్యసీమ
హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కావేటి సమ్మయ్య విజయం సాధించారు. ఇక్కడ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇంద్రకిరణ్‌ రెడ్డి ఆధిక్యం సాధించినా అనంతరం అన్ని రౌండ్లలో తెరాస ఆధిక్యం సాధించింది. కాగా, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి గడ్డం అరవిందరెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆర్‌.కృష్ణారావుపై విజయం సాధించారు. కరీంనగర్‌ జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి చెన్నమనేని రమేష్‌ విజయం సాధించారు. [...]
2009-12-16
2009-12-16 04:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-07-27
2009-07-27 02:07 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Priyanka Kothari Hot & Sexy Images
2009-05-18
2009-05-18 03:13 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న
2009-05-18 02:46 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా
2009-04-22
2009-04-22 05:46 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-04-10
2009-04-10 07:19 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Earth is an award-winning British natural history film from the BBC Natural History Unit. It was released in cinemas internationally in 2007 and is due to be released in the US on 22 April 2009. The British version was narrated by Patrick Stewart and the US version is to be narrated by James Earl Jones. A UK-German co-production, it was filmed entirely in high-definition and 35mm using the
2009-04-03
2009-04-03 06:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Cloudy with a Chance of Meatballs is a 2009 computer-animated forthcoming 3D film produced by Sony Pictures Animation and distributed by Columbia Pictures. It is scheduled for a theatrical release on September 18, 2009 and is inspired by the children's book of the same name by Judi Barrett and Ron Barrett. It is the Sony Pictures Animation's third film. Whereas the book had one speaking
2009-03-30
2009-03-30 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-28
2009-03-28 12:12 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు
2009-03-16
2009-03-16 05:24 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్
2009-03-14
2009-03-14 07:04 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-14 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child
2009-03-14 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
“X-Men Origins: Wolverine” WallpapersVenkateshwarlu Bulemoni
2009-03-12
2009-03-12 09:14 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అఫిషియల్ ట్రైలెర్
2009-03-11
2009-03-11 05:30 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival. Basic PlotThe film tell the story of the unlikely pen-pal friendship between Mary, a chubby lonely 8-
2009-03-10
2009-03-10 08:04 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి
2009-03-10 07:58 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు
2009-03-07
2009-03-07 05:55 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-02
2009-03-02 06:00 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-23
2009-02-23 10:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-21
2009-02-21 06:40 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and
2009-02-21 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Tollywood lead actress Charmme’s latest Telugu film 16 days is all set to release on 20 February. This film deals with 16-day-long period in the life of the lead pair, besides the situations that would surround them. Charmme is playing the role of Angelina who has the special talent of mimicking Pawan Kalyan, Ravi Teja, Sunil etc. Arvind plays male lead.
2009-02-20
2009-02-20 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-17
2009-02-17 05:47 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-14
2009-02-14 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Sontha Vooru is a Telugu Movie, starring Raja and Theertha as the lead pair, directed by P Sunil Kumar Reddy. Produced by Y Ravindra Babu & Kishore Baasireddy, and music composed by . The film Shooting is in progress.
2009-02-12
2009-02-12 10:56 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Shriya Saran (born September 11, 1982) is an Indian film actress. She began her career acting in music videos, while also attending an acting studio to follow her dream to act. After her debut in 2001 with Ishtam, she gained Telugu cinema's attention in 2002 by playing the role of Bhanu in Santhosham, her first major hit. Following the film she appeared in several Telugu films with prominent
2009-02-11
2009-02-11 06:27 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Drona is a Upcoming Telugu film, starring Nitin, Priyamani, Kelly Dorge, Mukhesh Rushi, Sita, Sunil, Raghubabu, directed by J Karunakumar. Produced by DS Rao, and music composed by Anoop Rubens. The film shooting is in progress.
2009-02-10
2009-02-10 07:12 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
భారతీయ చిత్రంగా నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పిటికే ఆస్కార్ నామినేషన్‌ను సాధించుకున్న ఈ చిత్రం ఆదివారం మరో ఘనతను సొంతం చేసుకుంది.బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్‌టీసీ) అవార్డు ఈ ఏడాది స్లమ్‌డాగ్ మిలీనియర్ సొంతమైంది. బాఫ్టా అని పిలవబడే ఈ అవార్డులు మొత్తం ఏడింటిని స్లమ్‌డాగ్ మిలియనీర్ దక్కించుకోవడం
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish