2009-07-03
పొద్దు: అతిథి
పొద్దు: An Apology of a Telugu fa(lu)natic
జాబిల్లి: జులై జాబిల్లి సంచికలో…
జాబిల్లి: విహార యాత్రా చిత్రాలు
జాబిల్లి: తమాషా లెక్కలు
జాబిల్లి: ఒక్క వెంట్రుక రాణి
జాబిల్లి: ఏడు చేపలు - చెక్కిలిగిలి కథ
సాహిత్య అవలోకనం: వృద్ధుల సమస్య గురించి రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం
వృద్ధుల సమస్య గురించి “మానవ సమాజం” పుస్తకంలో రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం చదివాను. వృద్ధులు వృద్ధాశ్రమాలలోకి తోసి వెయ్యబడుతున్న పరిస్థితుల గురించి రంగనాయకమ్మ గారు మరింత వివరంగా వ్రాసి ఉంటే బాగుండేది. తల్లితండ్రుల చేతివాటం కూడా పిల్లలు తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలేసే పరిస్థితులు కలిగించవచ్చు. ఒక హోమియో డాక్టర్ తన కొడుకుని చిన్నప్పుడు ఫిజికల్ గా హింస పెట్టినట్టు, తన కొడుకు తనతో మాట్లాడడం మానేసినట్టు రంగనాయకమ్మ గారి దగ్గర తన బాధ వినిపించాడు. పిల్లాడిని కొట్టేటప్పుడు అలా చెయ్యడం మీకు తప్పు అనిపించలేదా అని అడిగితే తన చిన్నప్పుడు తన స్కూల్ మాస్టర్ కూడా తమని అలాగే టార్చర్ చేసేవాడని, ఆ వాతావరణంలో పెరగడం వల్ల తనకి కూడా అలా చెయ్యడం తప్పు అనిపించలేదని ఆ హోమియో డాక్టర్ సమాధానం చెప్పాడు. మన చదువులు మనకి సంస్కారం నేర్పలేని స్థితిలో ఉన్నాయని అతని సమాధానం వింటే అర్థమవుతుంది.
పిల్లల్ని చదువు చదువు అంటూ బెల్ట్ తో కొట్టే తల్లితండ్రులని చూసాను. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి తమ తల్లితండ్రులని వృద్ధాశ్రమంలో వదిలెయ్యడం తప్పు అనిపించదు. పిల్లలు బాగా చదివితే గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యి బాగా డబ్బులు సంపాదించి తెస్తారు అని ఆశ. డబ్బులే పరమార్థం అనుకుంటే గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వడమే ఎందుకు? మాఫియా లీడర్ అయినా సారా పాకెట్లు రవాణా చేసో సుపారీ హత్యలు చేసో బాగా సంపాదించొచ్చు. మాఫియా కార్యక్రమాలు చేస్తే పరువుతక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ అయితే పరువుతక్కువ కాదు. రహస్యంగా లంచాలు తీసుకోవడం, నిధులు దుర్వినియోగం చెయ్యడం ద్వారా అదనపు ఆదాయం కూడా సంపాదించొచ్చు. ACB వాళ్ళకి దొరక్కపోతే పరువేమీ పోదు. ఇది పిల్లల్ని బెల్ట్ తో కొట్టి చదివించే తల్లితండ్రులు నమ్మే దుర్నీతి. స్వయం ఉపాధి (self employment) పెట్టుకోవాలనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు స్వయం ఉపాధిని కాదని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఇంతలా ఎగబాకడం ఎందుకు? తమ పిల్లలని గవర్నమెంట్ ఆఫీసర్లు చెయ్యాలనే ఆశతో వాళ్ళని అనారోగ్యకరమైన వాతావరణంలో పెంచుతూ!
2009-07-02
నవతరంగం: అంతర్జలి యాత్ర
స్త్రీలను సతీ అనసూయలుగానూ, సతీ సావిత్రులుగానూ, మహా పతివ్రతలుగానూ చిత్రిస్తూ మన భారతీయ సినిమాల్లో అనేక చలన చిత్రాలు వచ్చాయి. కాని సతీ సహగమనాన్ని కథాంశంగా తీసుకుని దాన్ని సమర్ధిస్తూనో, లేదా వ్యతిరేకిస్తూనో వచ్చిన చిత్రాలు స్వల్పం. సతీ సహగమనాన్ని మూఢాచారంగా ఖండిస్తూ సాహిత్య రంగంలో అనేక రచనలు వచ్చాయి. ఓ పెద్ద సామాజికోద్యమమే వచ్చింది. అయితే సతీ సహగమనాన్ని కమల్ కుమార్ మజుందార్ రాసిన నవల ఆధారంగా గౌతం ఘోష్ నిర్మించిన “అంతర్జలీ యాత్ర” విషయ పరంగానూ, చిత్రనిర్మాణ పరంగానూ దర్శకుడి ప్రతిభకు ఆనవాలుగా నిలిచింది. గౌతం ఘోష్ మన తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమయిన పేరు.. ‘మాభూమి’ చిత్రం ద్వారా మన తెలుగు చిత్రసీమకి నవ్య చిత్ర దృక్పధాన్ని, ఒరవడిని చవి చూపించిన ప్రతిభావంతుడాయన. తెలంగాణాలో పెల్లుబికిన నిజాం వ్యతిరేక పోరాటాన్ని నడిపిన అశేష జనవాహిని చరిత్రను ‘ మాభూమి ‘ నిజాయితీగా చిత్రించింది. ‘మాభూమి’ తర్వాత గౌతం ఘోష్ ‘ థకల్, పార్’ లాంటి చిత్రాల్ని నిర్మించాడు. 1987 లో ఆయన ‘అంతర్జలీ యాత్ర’ కు దర్శకత్వం వహించాడు. 1960లో శుద్ధ బెంగాలీ భాషలో విరచితమైన నవలను మూలకథగా తీసుకొని స్వల్పమైన మార్పులతో చిత్ర నిర్మాణం చేపట్టాడు గౌతం. నవలలోని మౌళికాంశం చెడకుండా అతి సున్నితత్వంతో కళాత్మకతతో ఈ చిత్రాన్ని నిర్మించాడు.
నిజానికి ‘సతీ సహగమనం’ స్త్రీలకు వ్యతిరేకమైన విషయం. ఆ విషయాన్ని కథాంశంగా ఎన్నుకొని దాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీల పక్షాన నిలబడి చిత్రాన్ని పాజిటివ్ నోట్తో ముగిస్తాడు. సరిగ్గా ‘అంతర్జలీ యాత్ర’ చిత్రం నిర్మాణంలో ఉండగానే రూప్ కన్వర్ సతీ సహగమనం సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా దానికి వ్యతికేఅకంగా ఉద్యమ స్థాయిలో నిరసనలు పెల్లుబికాయి. ఆ సందర్భంలోనే అంతర్జలీ యాత్ర చిత్రం నిర్మితమవుతూ ఉండడంతో గొప్ప ఉత్కంటత రేకెత్తింది. ప్రగతిశీలి అయిన గౌతం ఎలాంటి గందరగోళానికి గురవకుండా ముందుకు సాగిపోయాడు.
‘అంతర్జలీ యాత్ర’ చిత్ర కథ 1830 ప్రాంతం నాటిది. గంగానదీ తీరాన డెల్టా ప్రాంతంలో చిత్రకథ యావత్తూ జరుగుతుంది. గంగానదికి దాని పక్కనే ఉన్న చిన్న గ్రామానికి నడుమ కథాకథనం కొనసాగుతుంది. ఆ ఒడ్డుపక్కనే స్మశానముంటుంది. దాని కాపరి చండాల్ భైజూ అక్కడనే నివసిస్తూ ఉంటాడు. ఓ పక్క ప్రవహించే నది జీవితానికి సంకేతంగా ఉంటే మరోవైపు స్మశానం చావుకు ప్రతీకగా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రధారి చావుకు సిద్ధంగా ఉన్న ముసలి బ్రాహ్మడు సీతారాం. చావుబతుకుల మధ్య కొడిగట్టనున్న దీపంలా రెపరెపలాడుతున్న సీతారాంని గంగానది ఒడ్డుకు తెస్తారు. స్థానికంగా ఉన్న ఓ జ్యోతిష్కుడు సీతారాం మరో మూడు రోజుల్లో చనిపోతాడని అయితే అతనితో సహగమనం చేసే భార్య ఉంటే పున్నామ నరకాలనుండి తప్పించుకుని ఉన్నత లోకాలకు వెళతాడని చెబుతాడు. కాని చట్టరిత్యా సహగమనం అప్పటికే నేరం. అయినా ఆ ఊరి పెద్దలంతా కలిసి చావుకు సిద్ధంగా ఉన్న సీతారాంకి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తారు. ఆ ఊర్లోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కృష్ణప్రసాద్(బసంత్ చౌదరీ) తన కూతురు యశోబతిని సీతారాంకివ్వడానికి అంగీకరిస్తాడు. ఆమెకు కర్మ సిద్ధాంతాన్ని తన పేదరికాన్ని చూపి సతికి అంగీకరింప చేస్తాడు. నది ఒడ్డునే సీతారాం, యశోబతిల పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతాయి. ఊరంతా ఈ పెళ్ళిని అంగీకరించినా కాటికాపరి బైజూ మాత్రం వ్యతిరేకిస్తాడు. కాని నిమ్న జాతికి చెందిన అతని ఎవరూ లక్ష్యపెట్టరు. పెళ్ళి జరిపించి తర్వాత ఆ ఇద్దరిని అక్కడే వదిలేసి అంతా వెళ్ళిపోతారు. పెళ్ళి అవగానే ఉరకలేసిన సీతారాం భార్యతో శోభనానికి సిద్ధపడతాడు. కాని ముసలి శరీరం సహకరించక విఫలం చెందుతాడు. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చి ఆ స్థితిలో కూడా సీతారాం యశోబతిపై విరుచుకు పడతాడు. ఆ అమ్మాయి అపప్టికే కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించి సతివల్ల ఒనగూడనున్న మంచిని తలపోస్తు అన్నీ సహిస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న బైజూ ముసలివాన్ని వదిలేసి పొమ్మని యశోబతికి బోధిస్తాడు. పలు విధాలుగా కోపంతోనూ, దుఃఖంతోనూ యశోబతికి చెప్పి చూస్తాడు. సతి గురించి అధికారులకు చెప్పేందుకు కూడా విఫలయత్నం చేస్తాడు. ఎంతగా చెప్పినా యశోబతి అంగీకరించకపోవడంతో సీతారాంను గంగలోకి తోసేందుకు కూడా బైజూ ప్రయత్నిస్తాడు. దాంతో యశోబతి కోపంగా బైజూను కర్రతో బాదుతుంది. నది ఒడ్డున బురదలో గాయపడ్డ బైజూ విలవిలలాడతాడు. కొంతసేపటికి యశోబతి బైజూ చెంతకు చేరి గాయల్ని తడిమి బాధగా ఉందా అని అడుగుతుంది. ఆమె స్పర్శ బైజూలోనూ, బైజూ శరీరం ఆమెలో సంచలనం కలిగిస్తుంది. ఇద్దరూ ఒకటవుతారు. ఇంతలో ఉప్పొంగిన నది సీతారాంని ముంచెత్తుతుంది. అతన్ని రక్షించే యత్నంలో యశోబతి కూడా ప్రవాహంలో పడిపోతుంది. రక్షించండి.. రక్షించండి అంటూ యశోబతి నీటిలో కొట్టుకుపోతుంది. బైజూ ప్రేక్షకుడిలా నిలుచుండిపోతాడు. మొదట్నించీ చివరి దాకా నది ఒడ్డునే ఉన్న కర్ర పడవపై ముద్రించి ఉన్న రెండు కళ్లు ఈ మొత్తం జీవన్మరణ సంఘటనల్ని వీక్షిస్తూనే ఉంటాయి.
నవలలోంచి మొత్తం వివరాల్ని చిత్రంలో అందించిన దర్శకుడు చిత్రీకరణలో ఎనలేని ప్రతిభను కనబరుస్తాడు. అతని సృజనాత్మక ఆలొచనలకు, ఆయనకున్న సాంకేతిక పరిజ్ఞానం తోడై గొప్ప చిత్రంగా రూపొందింది. మొత్తంగా నది ఒడ్డునే సాగె ఈ చిత్రంలో రాత్రిని, పగటిని రోజులోని భిన్న స్మాయాల్ని చిత్రించడంలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయయ ఉపయోగించిన లైటింగ్ ఆయా మూడ్స్ ని సాధించడంలో విజయవంతమయింది. చిత్రంలో ధ్వని గొప్ప భావుకతను అందిస్తుంది. కేవలం సంభాషణలున్నప్పుడు మాత్రమే నేపధ్య సంగీతం వినిపించి మిగతా సమయాల్లో గంభీర నిశ్శబ్దం చిత్రనికే విలక్షణతను ఆపాదించింది. అపుడపుడూ గంగానది పైనించి వీచే గాలి సృష్టించే మంత్రధ్వని దుఃఖాన్ని, తీవ్రమైన ఎమోషన్ ని ధ్వనింప చేస్తుంది. నిజానికి చిత్రంలోని నిశ్శబ్దమే గొప్ప సినిమాటిక్ సంగీతం. చిత్రం చివరన నది ఉప్పొంగి ఉధ్వేగభరితమయిన సన్నివేశంలో సంగీత ధ్వని కోపాన్ని, ఆవేశాన్ని ప్రతిధ్వనింప చేస్తాయి. నటీనటుల విషయంలో శతృఘ్న సిన్హా తన జీవిత కాలంలో గొప్ప పాత్ర పోషించారు. ఇక యశోబతి పాత్రలో నూతన నటి షంపా ఘోష్, ముసలి సీతారాం పాత్రలో ప్రమోద్ గంగూలి (80) సజీవంగా నటించారు. అలనాటి స్త్రీ సమస్యని అత్యంత ప్రతిభతో చలన చిత్రంగా మలచి గౌతం ఘోష్ గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా వచ్చింది. ‘అంతర్జలీ యాత్ర’ బెంగాలీ చిత్రం కాగా, ‘మహాయాత్ర’ హిందీ చిత్రం.
అంతర్జలీ యాత్ర ( బెంగాలీ )
సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం – గౌతం ఘోష్,
నిర్మాణం – ఎన్.ఎఫ్.డి.సి,
నటీనటులు – శతృఘ్న సిన్హా , షంపా ఘోష్,
జాబిల్లి: చందు - సూర్య
జాబిల్లి: స్నేహం
సాహిత్య అవలోకనం: రెంటాల కల్పన గారి “అయిదో గోడ” కథ పై రివ్యూ (పార్ట్ 3)
భార్య చనిపోయిన వ్యక్తి నెల తిరగకుండానే రెండవ పెళ్ళి చేసుకున్న ఘటనలు చూశాను. ఆడది భర్త చనిపోయిన నెల తరువాత రెండవ పెళ్ళి చేసుకుంటే తప్పా? రెంటాల కల్పన గారి అయిదో గోడ కథ పై రమణి గారు చేస్తున్న విమర్శలు మూఢ నమ్మకాలని ప్రోత్సహించేలా, స్త్రీలని కించ పరిచేలా ఉన్నాయి. ఇలాంటి విమర్శల వల్ల భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టడం లాంటి ఆచారాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. చనిపోయిన భర్త కోసం గుండు గియ్యించుకుని తెల్ల చీర కట్టుకుని జీవితాంతం ఒంటరిగా ఉండడం హాస్యాస్పదం. ఇది స్త్రీల ప్రగతికి వ్యతిరేకం. ఇది స్త్రీలు సాధించిన కొద్ది పాటి ప్రగతిని కూడా వెనక్కి తిప్పుతుంది.
ఒక హిందూత్వవాది అన్నాడు “ప్రపంచంలో చాలా మతాలలో విధవా వివాహాలని ప్రోత్సహించడం లేదట!” అతను హిందూ మత భావాలని ఇతర మతాలకి కూడా అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా మత గ్రంథాలు చదివాను. ప్రపంచంలో ఏ మతమూ విధవా వివాహాలని నిషేధించలేదు. హిందువులలో కూడా ఒకప్పుడు భర్త చనిపోయిన స్త్రీలకి వయసుతో నిమిత్తం లేకుండా మరిదితో వివాహం జరిపించే ఆచారం ఉండేది. ఇప్పుడు కూడా ఉత్తర భారత దేశంలోని కొన్ని హిందూ, సిక్కు కుటుంబాలలో ఆ ఆచారం కనిపిస్తుంది. ఆచారాన్ని వారు ఖరేవా అంటారు.
జానకి విముక్తి నవలలో జానకి వెంకటరావుతో కాపురం చేస్తున్నప్పుడు తాను చేస్తున్న తప్పేమిటో తెలుసుకోలేకపోయింది. జానకి అన్న సత్యం ప్రభావం వల్లే జానకి వెంకటరావుని వదిలేస్తుంది. సత్యం ప్రోత్సాహం వల్లే జానకి ప్రభాకర్ తో కలిసి కొత్త సంసార జీవితాన్ని ప్రారంభిస్తుంది. స్త్రీ మొదట్లో తెలియక తప్పులు చేసినా తెలిసిన తరువాత తప్పులు దిద్దుకోగలదు. అయిదో గోడ కథలో శారదకి భర్త చనిపోయిన తరువాత జ్ఞానోదయం కలుగుతుంది. అలా జరిగినా సంతోషమే కదా. కథలో అర్థం లేదంటూ రమణి గారు చేసిన వాదనకి సమాధానంగా ఇలా వ్రాయవలసి వచ్చింది. పాతికేళ్ళ పాటు ఇష్టం లేని కాపురం చెయ్యడం తప్పే కానీ అది తప్ప వేరే పెద్ద తప్పులు లేవు అని అర్థం వచ్చేలా వ్రాస్తే ఎలా?
మన్యసీమ: ఆర్టీసీబస్సు, లారీఢీ: ఇద్దరి మృతి

మన్యసీమ: చమురు ధరల పెంపుపై మండిపడ్డ తెదేపా

జాబిల్లి: కాగితంతో బొమ్మ
జాబిల్లి: జులై నెల
జాబిల్లి: ఆగస్టు నెల
జాబిల్లి: అనగనగా ఒక పేను కథ
జాబిల్లి: ఆణిముత్యాలు
జాబిల్లి: నా పేరు చెప్పుకోండి చూద్దాం
పుస్తకం: శశిరేఖ - చలం
రాసి పంపిన వారు: నరేష్ నందం, హైదరాబాదు

గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభిమాని ఉన్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యమే. చలంపై మీకెటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. కానీ అతను ఒక ప్రవాహానికి పాదులు తీశాడు. తెలుగు భాషను శాసించాడు. సంఘాన్ని ధిక్కరించాడు. అవసరమైనప్పుడల్లా తన నాయికల గొంతుతో ప్రశ్నించాడు. చలంకు “శశిరేఖ” మొదటి నవలే అయినా అప్పటి సంఘపు నీతి నియమాలను ప్రశ్నించాడు. కానీ అవే పద్ధతులు ఇప్పటికీ కొనసాగటం గమనార్హం. సమాజాన్ని, కట్టుబాట్లను ఒంటరిగా ఎదిరించేందుకు సాహసించిన చలం తన మిగిలిన రచనల్లో ఆ పద్ధతిని కొనసాగించాడు.
చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
“నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి.” (ఆత్మకథలో 74-75వ పుటలు)
అటువంటి చలం 1921లో వ్రాసిన నవల “శశిరేఖ”. నూటయాభైరెండు పేజీల ఈ నవలను సంక్షిప్తీకరిస్తే..
శశిరేఖ- చలం మాటల్లో చెప్పాలంటే ఏమీ తెలియని ముగ్ధ. అప్పుడే మారుతున్న సమాజంలో నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది మొదట్లో. చిన్న వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మతో వాదనకు దిగుతుంది. తనను ఇష్టపడిన రామారావు సీమనుండి వచ్చి తనను వివాహం చేసుకునేవాడు గదా అని ప్రశ్నిస్తుంది. తనకు ఇష్టంలేని వాడితో “కార్యం”కు ఎలా ఒప్పుకోనంటూ నిలదీస్తుంది. థైర్యంగా భర్తతో చెబుతుంది. “నువ్వంటే ఇష్టం లేదు, కార్యం ఇష్టం లేదు, బలవంతం చేయటం న్యాయమా..?” అని. అతను అర్ధం చేసికొనక పోవటంతో కార్యం ముందురోజు రాత్రి తాను ఇష్టపడిన గోవిందపురం లాకుల అధికారి కొడుకు, కృష్ణుడితో ఊరు వదలి వాడపిల్లి వచ్చేస్తుంది.
కృష్ణుడు-శశిరేఖ, ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందాన్ని ఆస్వాదిస్తూ అన్నపానాలను మరచిపోయేవాళ్లు. కృష్ణుడు శశిరేఖ తనతో ఉంటే చాలుననుకుంటాడు. ఆమె కోసం వైద్యవిద్యను మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడే పూసిన మొగ్గల్లే ఉన్న తనని అపురూపంగా చూసుకుంటాడు. ఒకరికి ఒకరు ఎదురు ఉంటే చాలు ఆకలిదప్పులు ఉండవనుకుంటారు. వాడపిల్లిలో ఉన్న కృష్ణుడి మితృడు, డాక్టరు సుందర రావు ఆశ్రయం పొందిన వీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు. మూడేళ్ల తర్వాత తిరిగి సొంతఊరు గోవిందపురం వచ్చేస్తారు, మితృడు సుందర రావుతో సహా!
ఒకనాటి రాత్రి పడవలో షికారుకి వెళ్లినప్పుడు కాలువలో పడిపోతుంది. సుందర రావు దగ్గర వైద్యం చేయించుకుంటుంది. సుందర రావుకి ఆమెపై కోరిక ఉండటం, తనకూ అతనంటే ఇష్టం కలగటం వలన బలవంతంగా అతనితో ఒకరాత్రి గడుపుతుంది. కృష్ణుడిపై ప్రేమ తగ్గిపోయినప్పుడు అతని వద్ద ఉండటం నీతి కాదని సుందర రావుతో ఊరువదలి వచ్చేస్తుంది. తనకోసం ఎదురుచూస్తున్న కృష్ణుడికి తనను మరచిపొమ్మని చీటీ పంపిస్తుంది.
ఈ సంఘటనకు ఉపోధ్ఘాతముగా, చలం అంటాడు.. “ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమె దేహమెక్కడ కందునో అని ఆమెను దేవతగ పూజించు భక్తునితో ఆమెకవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును పిండి, తాగి మూర్ఛనొందించగల ప్రేమనామె వాంచింఛెను. అగ్ని వలె తాపమున దహించు తృష్ణకు, ఉపశమనముగ మహా ప్రళయ, మేఘముల గర్జించు చండవర్షమే కావలెను.”
శశిరేఖతో ఎన్నో అందమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత సుందర రావు బళ్లారిజిల్లాలో ఉద్యోగంలో చేరుతాడు. కాలం గడచిన కొద్దీ, ఆమెను అనుభవించిన కొద్దీ శశిరేఖపై మోహం పోయి ఆమె అతనికి భారంగా కనిపిస్తుంది. అందముగా కనబడేకొద్దీ ఆమెను మాటలతో హింసించాలని చూస్తాడు. చివరికి అతనిపై ప్రేమ మాయమై, అతనిని విడిచి తిరిగి గోవిందపురం వెళ్లటానికి బయల్దేరుతుంది. కానీ సుందర రావుకి ప్రమాదం జరగటం వలన ఆగిపోవలసి వస్తుంది. నెలరోజులపాటు అతనికి సేవలు చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. ఫలితంగా అతను ఆమెతో మళ్లీ ప్రేమగా ఉండాలనుకుంటాడు. సుందర రావుకి వైద్యం చేస్తున్న డాక్టరుని ఎక్కడో చూసిన గుర్తుతో వివరాలు సేకరిస్తుంది. అతనే తనను పెళ్లి చేసుకుంటానన్న రామారావని తెలుసుకుని స్నేహం చేస్తుంది.
రామారావుకి తన గతం గురించి చెప్తుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలో తిరిగే అతను ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. సుందర రావుని వదలి తనతో వచ్చేయమంటాడు. తీసుకెళ్లి వేరే ఇంటిలో ఉంచి పదిహేనురోజుల తర్వాత పెళ్లి అంటాడు. తనతోపాటే ఉంటానంటుంది శశిరేఖ. పెళ్లికి ముందు కలిసి ఉండటం సమాజం హర్షించదంటాడు రామారావు. ఈలోపు సుందరరావు వస్తాడు. పాతవన్నీ గుర్తు చేసి శశిరేఖను చెన్నపట్నం తీసుకునిపోతాడు. ఆమె తనమీద ఆధారపడి ఉన్నదన్న అహంకారంతో మళ్లీ హింసించటం మొదలుపెడతాడు.
సుందర రావుమీద అసహ్యంతో ఇల్లు వదలి వచ్చిన శశిరేఖను బ్రహ్మమత ప్రచారకుడు, నవజివనదాసు ఆదరిస్తాడు. కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్న తర్వాత తనకు తెలిసిన ధర్మారావుతో పెళ్లి చేద్దామనుకుంటాడు. కాని, పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని శశిరేఖ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ప్రేమ లేని చోట తానుండలేనని, పెళ్లి అంటే ప్రేమను వదులుకోవటమే అంటుంది. అడవిలో స్వేచ్చగా తిరిగే చిలుకను పంజరంలో బంధించటమే పెళ్లి అంటుంది.
తన మనసు మార్చేందుకు బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరతాడు నవజీవన దాసు. కలకత్తాలొ జరిగే సమావేశాలకు హాజరైతే ఆమె గతంలో చేసిన తప్పులను తెలిసికొంటుందనీ, ఈశ్వర ప్రేమకు పాత్రురాలవుందనీ తద్వారా.. ధర్మారావుని పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తాడు.
అప్పటికే బ్రహ్మసమాజంలో ఉన్న రామారావు, శశిరేఖను కలకత్తాలో కలుస్తాడు. తనను మోసం చేసిందని నిందిస్తాడు. “నా మనసు నీకే అర్పితం” అంటుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలోని వారిని చూసి ఎంత సంతొషముగా ఉన్నారో అని అనుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేస్తానంటాడు ధర్మారావు. తన మౌనాన్ని అంగీకారంగా భావించిన ధర్మారావు నవజీవనదాసుతో శశిరేఖ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు.
ఈవిషయం రామారావుకి తెలిసి శశిరేఖను నిలదీస్తాడు. తను, “నేను నీ సొంతం” అంటుంది. పెళ్లికి మాత్రం ఒప్పుకోకుండా తనతో ఉండిపోమంటుంది. మగ స్నేహితుల వలే కలిసి ఉందామంటుంది. వివాహమనే బంధం లేకుండా స్త్రీపురుషులు కలిసి ఉండటాన్ని సంఘం హర్షించదంటాడు రామారావు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమంటాడు. చిన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావంటుంది శశిరేఖ. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పమని వెళ్లిపోతాడు రామారావు.
ఆరోజు సాయంత్రం శశిరేఖ రామారావుని శారీరకంగా కూడా కలుస్తుంది. అంతా అయిపోయాక కళ్లుతెరిచిన రామారావు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లి పోతాడు. తన తప్పు తెలుసుకుని తిరిగివచ్చేసరికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. చివరికి అతని చేతిలో కన్నుమూస్తుంది.
———————————————————–
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు ఐదు.
శశిరేఖ, కృష్ణుడు, సుందర రావు, రామారావు, నవజీవన దాసు.
ముందు మాటలో శివశంకర శాస్త్రి అన్నట్లు.. శశిరేఖ ప్రేమైక జీవిని. ప్రేమ లేని చోట తను ఒక్క నిమిషం నిలువలేకపోయింది. రామారావు వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడనుకున్న ఆమే.. పెద్దవాళ్లనెదిరించి కృష్ణుడితో వెళ్లిపోయింది. సుందర రావు ఫిడేలు గానం, తీయని మాటల ప్రభావంతో.. అతనిపై ఆకర్షణ పెంచుకుంది. అందము, సౌందర్యారాధనలొ మునిగిపోయే ఆమె అతని ప్రభావంలో పడిపోయింది. ఆవేశంలో అతను ముద్దుపెట్టి, తర్వాత కోపం ఉందా అంటే లేదని చెప్పింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే ముందు రోజు రాత్రి ఒంటరిగా సుందర రావు ఇంటికి వెళ్లింది. వయసు గారడీ, అతని బలవంతము వలన లొంగిపోయింది. ఉదయం కృష్ణుడి దగ్గరకే వెళ్లమనిన సుందరరావుతో.. “నాకు నీమీద ప్రేమలేకపోతే నా చిటికిన వేలునైనా తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని?” అని ప్రశ్నిస్తుంది. అప్పటి వరకు తననెంతో ప్రేమగా పూజించిన కృష్ణుడిని వదలి వెళ్లుటకు ఇష్టంలేకపోయినా.. అతనంటే ఇప్పుడు ప్రేమ లేదు కనుక ఇంకా అతనితో ఉండటం భావ్యం కాదని భావించింది. సుందరరావుతో ఊరు విడిచి వెళ్లిపోయింది. మోహం తీరిన సుందరరావు కౄరత్వాన్ని చూచిన ఆమెకు అతనిపై ప్రేమ తగ్గిపోయింది. తర్వాతి పరిణామాల వలన చిన్ననాటి మితృడు రామారావుతో కలిసి జీవించాలనుకుంటుంది. అతను పెళ్లికి పట్టుపడితే.. పెళ్లి తర్వాత ఇతను మాత్రం వదిలేయడని ఋజువేంటని ఆలోచిస్తుంది. పెళ్లి అంటే స్వాతంత్ర్యమును కోల్పోవటమేనని, “ఒకవేళ పెళ్లితర్వాత ఇప్పుడున్న ప్రేమ పోతే నన్ను ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తారా?” అని అడుగుతుంది. తప్పనిసరై పెళ్లికి ఒప్పుకున్నా, సుందర రావు బలవంతముతో మళ్లీ అతనితో వెళ్లిపోతుంది. చెన్నపట్నంలో నవజీవనదాసు ఆశ్రయంలో కొన్నాళ్లు సంతోషంగానే గడిపినా, తనకు పూర్వ జీవితమే బాగుందనిపిస్తుంది. కలకత్తాలో రామారావును మళ్లీ కలిసిన తర్వాత అతని ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనిపిస్తుంది. ఓక రాత్రి అతనితో కలిసిన తర్వాత, అతని ప్రేమను తట్టుకోలేక గుండెనొప్పితో కన్నుమూస్తుంది.
కృష్ణుడు అందాన్ని ఆస్వాదించే వాడైతే.. సుందరరావు అనుభవించాలని చూసేవాడు. కృష్ణుడు శశిరేఖ అమాయకత్వాన్ని, అందాన్ని, దోసిలిలో పట్టి ప్రేమగా చూసుకుంటే.. సుందర రావు ఆమె శరీరాన్ని గుప్పెటలో నలిపి వేశాడు. తనను వదిలి వచ్చిన తర్వాత శసి క్షేమం కోరుతూ కృష్ణుడు ఉత్తరం వ్రాస్తే.. సుందర రావు మోహం తీరిన తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటివేసాడు. వీళ్లిద్దరూ భిన్నదృవాళ్లా, నాణేనికి చెరో వైపులా కనిపిస్తారు. శశిరేఖ కృష్ణుడి వద్ద ఉన్నంతకాలం ఆమె కోసం వెంపర్లాడిన సుందరరావు, ఆమె తనతో వచ్చేయగానే ఆమె ఎక్కడికి పోతుందన్న నిర్లక్ష్యము ఏర్పడింది. కొన్నాళ్లకు ఆమె మోయలేని బరువుగా తోచింది. ఫలితంగా ఆమెకు దూరమైనాడు.
రామారావు అప్పటి బ్రహ్మసమాజపు ప్రతినిధి. ఉన్నత విద్యలు చదివినా సంఘం నిర్మించిన చట్రాన్ని, గీసిన గీతను కాదనే సాహసం చేయలేకపోయాడు. చిన్నప్పుడు శశిరేఖకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపించినా, ఒక చెడిపోయిన స్త్రీని బాగుచేశానన్న పేరు కోసమే అతను నడచుకున్నట్లు కనిపిస్తుంది. వెలుతురులో ఎన్నో ఆదర్శాలు పలికే వారు చీకటిలో తప్పులు ఎలా చేస్తారో, నిగ్రహాన్ని ఎలా కోల్పోతారో రామారావు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.
నవజీవనదాసు బ్రహ్మసమాజపు ప్రచారకుడు. తప్పుడుదారిలొ నడచే అమ్మాయిని బాగుచేసి, పాపాలకు పరిహారం చూపి, ఆమెకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశించాడు. ఐతే ధర్మారావుతో ఆమె పెళ్లికి నిరాకరించటం, రామారావుతో సన్నిహితంగా మెలగటం అతనికి కోపం తెప్పిస్తుంది. కాని, ఆమె తన కూతురివంటిదనీ, ఆమె కోరుకున్న జీవితం గడపవచ్చనీ అనే సమయానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రి, కలలో దేవదూతలతో అతను “ఈమె ధన్యురాలు, ప్రేమించినది” అనటం ద్వారా మార్పుని ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది.
జాబిల్లి: జాబిల్లి
జాబిల్లి: పంచతంత్రం — 2
కొత్తపల్లి: నేను కొనబోయే ఆవు కథ
మూలం: ఏ.కే.రామానుజన్, ఫోక్ స్టోరీస్ ఫ్రం ఇండియా. అనువాదం: నారాయణ
కొత్తపల్లి: పులి-మేక
రామానుజన్ గారు చెప్పిన పాత కథ ఒకటుంది. మేకపిల్ల ఒకటి ఒక రోజున ఒంటరిగా వాగులో నీళ్లు తాగుతున్నది. దానికి...
జాబిల్లి: ప్రయాణంలో ఒక సరదా ఆట
జాబిల్లి: సరదా సరదా
జాబిల్లి: మహాత్ముడు
జాబిల్లి: కృష్ణాష్టమి
జాబిల్లి: మీకు తెలుసా
2009-07-01
నవతరంగం: The Last King of Scotland
ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో ‘ఇండిపెండెంట్’గారు, ‘కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల’ గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు. వీడియో పని చెయలేదు గానీ, దాన్ని గురించి అపుడే వికీపీడియాలో చదివి థ్రిల్ అయ్యాను. ఈ సినిమాలో ఆపరేషన్ ఎంటెబ్ కొంచెం కల్పితంగా ఉంటుంది.
ఈ సినిమా ప్రధానంగా, ఉగాండా నిరంకుశ అధినేత, నరరూప రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న ‘ఈడీ ఆమిన్’ జీవితం గురించి – సగం నిజం, సగం కల్పనా కలిపి, ప్రముఖ జర్నలిస్ట్ గైల్స్ ఫోడెన్, తన కళ్ళారా చూసిన వాస్తవాల సాయంతో రాసిన నవల, ‘The Last King of Scotland’ ఆధారంగా తీసినది. సినిమా – స్కాట్లాండు లో అపుడే వైద్య విద్య లో పట్టబధ్రుడైన – విలాస పురుషుడు – జీవితంలో కొంత వినోదం, కొంత సాహసం ఉండాలనుకునే నవ యువకుడి పరిచయంగా – హీరో – డా.నికోలస్ గారిగన్ పరిచయంతో మొదలు ! కేవలం – సరదాకి, కొంచెం సాహస జీవితం అంటే ఉన్న కుతికీ – కోతి లాంటి బుద్ధితో, కేవలం చాన్సు తీసుకుని ఆఫ్రికన్ దేశమయిన ఉగాండా కి ఒక మిషనరీ కోసం పనిచేయడానికి వస్తాడు నికోలస్.
నికోలస్ దిగేసరికీ, దేశం అంతా, తుపాకులూ, టాంకులూ, సైనికులూ – భీభత్సంగా ఉంటుంది. ఇదేంటీ – అని అడిగితే, మిషనరీ నడిపే వ్యక్తి భార్య ఇది ‘కూ’ (సైనిక తిరుగుబాటు) అనీ, ‘మిల్టన్ ఒబటు’ ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్తగా ‘ఈడీ అమిన్’ అధ్యక్షుడయ్యాడనీ, అందుకే ఈ సంత అంతా అని, కూల్ గా చెప్తుంది. ఉగాండా చాలా అస్థిరమైన దేశం. ఇక్కడ సైనిక పాలనా, తిరుగుబాట్లూ, నియంతృత్వం, ఆటవిక పాలనా, సర్వ సాధారణం.
మొత్తానికి ఆ దేశంలో జరుగుతున్న ‘సంబరాన్ని ‘ కాస్త దగ్గరగా చూసే అవకాశం వస్తుంది. కొత్త అద్యక్షుడి స్వాగతం (!) కోసం నికోలస్ పని చేస్తూన్న మారుమూల ప్రాంతాల్లో, గన్ పాయింటు కింద ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంబరాలకు ఈడీ అమిన్ వస్తాడు. ప్రజల ముందు ‘నేనూ మీ వాడినే – అని ఉపన్యసిస్తాడు. ఆఫ్రికన్ పాటలు పాడతాడు. నృత్యాలు చేస్తాడు. అచ్చం మన రాజకీయ నాయకుల్లానే, ప్రజల మనసు గెలుచుకునే ఫీట్లు చేస్తాడు. ఇక్కడే అమిన్ ను మొదటి సారి చూసిన నికోలస్, ఈ అధ్యక్షుడు మంచివాడేనేమో అనుకుంటాడు. కానీ ఆ దేశంలో చాలా ఏళ్ళుగా ఉన్న మిషనరీ సభ్యురాలు మాత్రం, ఇదంతా బూటకమని చెప్తుంది.
ఇలా ఉంటూండగా, ఒకసారి, డాక్టర్ని వెతుక్కుంటూ, నికోలస్ దగ్గరికి సాయుధ సైనికులు కొందరు వస్తారు. అధ్యక్షులవారికి ఆ పల్లెటూరి దారెమ్మట వెళ్తూంటే, రోడ్డు పక్కన నడుస్తున్న ఒక ఎద్దు కొమ్ము తగిలి, చేతికి గాయమైంది. ఎద్దు కూ ఆయన ప్రయాణిస్తున్న జీపు తగిలి గాయాలయ్యాయి. ఎద్దు మరణ యాతన పడుతూ ఉంటుంది. దాన్నీ, దాన్ని పట్టుకున్న రైతునూ రోడ్డు పక్కకు ఈడ్చి, అధ్యక్షులు నొప్పితో చిందులు వేస్తుంటే, ఆ పల్లె లో డాక్టరు కోసం వస్తారు వీళ్ళు. నికోలస్ – వెంటనే వెళ్ళి, ఆమిన్ కు పరిచర్య చేస్తాడు. ఈ లోగా ఎద్దు – ఆ పక్కనే పడి, గోల గోలగా రోదిస్తూంటే, విసుక్కుని, ఆమిన్ పిస్టల్ తీసుకుని దాన్ని కాల్చి చంపేస్తాడు నికోలస్. ఆ ధైర్యానికి, ఈడీ అమిన్ పిస్టల్ నే తీస్కుని, అతని ఎదుటనే – ఎద్దుని చంపిన అతని సాహసాన్నీ, ఈడీ అమిన్ అభిమానిస్తాడు. మాటలు పొడిగిస్తూ, నికోలస్, స్కాట్ లాండ్ నుండీ వచ్చినట్టు తెలుసుకుని, ఈడీ ఆమిన్ స్నేహ హస్తం చాస్తాడు.
తనకు పెర్సనల్ డాక్టర్ గా ఉండమని, నికోలస్ ను కంపాలా వచ్చేయమని, ఆహ్వానిస్తాడు. మొదట ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ, అమిన్ చరిష్మా ని చూసి, భ్రమలో – నికోలస్ ఒప్పుకుంటాడు. సహజంగా, అతను స్కాటిష్ బూర్జువా కుటుంబం నుంచీ వచ్చినవాడు కావడం వల్ల, కంపాలా లో విలాస వంతమైన జీవితం, పూల్ సైడ్ పార్టీలూ, అందమయిన భవంతులూ, అమిన్ స్వయంగా బహూకరించిన మెర్సిడెస్ కారూ, నికోలస్ది కూడా, ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం – అనుకునే తత్వం వల్ల… అతను ఉగాండా దేనికొచ్చాడో మరిచిపోయేలా – చేసి, చూస్తూండగానే నికోలస్ రోజు రోజుకీ ఊబిలో కూరుకు పోతూంటాడు.
ఈ లోగా బ్రిటిష్ డిప్లోమాట్ లు – నికోలస్ తో మంతనాలు చేస్తుంటారు. నికోలస్ ఈ నియంత కు వ్యక్తిగత డాక్టర్, పైగా సన్నిహితుడు గాబట్టి, అతని ద్వారా, ఈ నియంతను తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే, ఈడీ అమిన్ – దురాగతాల గురించి చూచాయ గా తెలిసినా, ఉగాండా గురించి అతను ఏదో కల కంటున్నాడనీ, ఉగాండా లో మంచి పరిస్థితులు రావడం కోసమూ, ప్రత్యర్ధులను తొలగించుకోవడం కోసమూనే అమిన్ అలా రాక్షసుడి లా మారణ హోమాలు జరిపిస్తున్నాడనీ, అమిన్ మామూలుగానైతే మంచోడే అని – తాను ఇందులో పార్ట్ కాననీ – నికోలస్ భ్రమల్లో ఉంటాడు.
చూస్తూండగా, ఆమిన్ – 5గురు భార్యల్లో, నాలుగో భార్య, అందమయిన నల్ల శిల్పం, ‘కే’ తో పరిచయం మొదలవుతుంది. అప్పటికి – ‘కే’ కు ఒక మూర్చ వ్యాధిగ్రస్తుడైన కొడుకు పుట్టినప్పట్నించీ, అమీన్, ఆమెను దురదృష్టవంతురాలిగా భావించి, మిగిలిన భార్యల కు దూరంగా వేరొక భవంతి లో పెడతాడు. ఈ దురదృష్టవంతురాలికీ, నికోలస్ కూ ప్రేమ – ఆకర్షణా, రహస్య ప్రణయం కొనసాగుతాయి. కే కు తాను గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయం భర్త కు తెలిస్తే, తనని చంపేస్తాడని భయబ్రాంతురాలైన ఆమె, డా.నికోలస్ ను ఎబార్షన్ చేయమని అడుగుతుంది. కానీ అప్పటికే – అమీన్ – అన్ని రకాలుగా నికోలస్ ను చుట్టుముట్టి ఉంటాడు. తీయగా మాట్లాడుతూ, అనూహ్యమైన ఎత్తులు వేస్తూ, అతని పాస్పోర్ట్ కూడా నాశనం చేసి, అతనికి ఉగాండన్ పాస్పోర్ట్ ఇచ్చి – దిగ్భంధనం చేసేస్తాడు.
తీరా – అనుకున్న సమయానికి నికోలస్ రాలేకపోవడంతో నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళిన ‘కే’ ను అమిన్ ఆదేశాల మేరకు సైనికులు హత్య చేసి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు గా నరికి, ప్రదర్శనకు పెడతారు – ‘అధ్యక్షుడిని మోసం చేసే వారి గతి ఇంతే!’ అని ప్రజలను భయపెట్టేందుకు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న నికోలస్, ఆమె శవంలో, ఆమిన్ – రాక్షసత్వాన్ని చూసి, వెర్రెక్కిపోతాడు. అంతకు ముందే అధ్యక్షుడిని వ్యతిరేకించిన వారూ, ఉదారవాద ఉగాండన్లూ – అహింసావాదులూ ఒక్కొక్కరూ అదృశ్యం అవుతూండటం గురించి బ్రిటిష్ డిప్లొమాట్లు నికోలస్ తో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా ‘కే’ చావు, తదనంతరం-తన చావు, తన ముందు కనిపిస్తూండే వరకూ, అమిన్ రాక్షసత్వాన్ని అర్ధం చేసుకోలేని నికోలస్, ఆ క్షణంలో ఆవేశంతో ఊగిపోతాడు. బ్రిటిష్ డిప్లొమాట్ ను కలిసి, తన పరిస్థితి చెప్పి, దేశం వదిలి వెళ్ళడానికి సహాయం కోరతాడు. ఆ డిప్లొమాట్ – అమిన్ ను చంపే షరతు మీద సహాయం చేస్తానంటాడు.
క్లైమాక్స్ లో అమిన్ కు తల నొప్పి మందు ఇచ్చే మిష మీద కలవడానికి వెళ్తాడీ డాక్టర్. అక్కడ ఈలోగా వివిధ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న కొందరు కరుడుగట్టిన పాలస్తీనియన్ తీవ్రవాదుల విడుదల కోసం, ఏర్ ఫ్రాన్స్ విమానం ఒకటి పాలస్తీన్ తీవ్రవాద సోదరుల చేత హైజాక్ చేయబడి కంపాలాలో ఎంటెబ్ విమానాశ్రయంలో దిగిందని కబురొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు అమీన్, వెంటే, నికోలస్! ఈ లోగా నికోలస్ మీద అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు అధ్యక్షుడి అంగరక్షకులు! నికోలస్ అధ్యక్షుడికి ఇవ్వబోయేవి తలనొప్పి మందులు కావనీ, విషం అనీ కనిపెడతారు. అమిన్, ఇజ్రాయెలు ప్రభుత్వం తోనూ, అంతర్జాతీయ సమాజం తోనూ సంప్రదింపులు జరుపుతూ, తన దేశపు విమానాశ్రయాన్ని తీవ్రవాదుల అడ్డా గా ఉపయోగించుకోవడాన్ని సమర్ధిస్తూ – ఈ మధ్య లో ఒక సారి – నికోలస్ ను కలుసుకోవడానికొచ్చి, ‘నీ గురించీ, కే గురించీ నాకు తెలుసు నికోలస్ – మా గ్రామంలో ఇలా ఇంకొకరి భార్య ను తీసుకున్నవాణ్ణి ఏమి చేస్తారో తెలుసా ? వాడి చర్మానికి హుక్స్ తగిలించి, వాణ్ణి అలానే చెట్టుకి ఎత్తులో వేలాడేస్తారు – ఆ రక్తం కారి కారి ఏ మూడు నాలుగు రోజులకో వాడు చస్తాడు. నువ్వూ అలానే చావాలి కాన్నా !’ అని చెప్పేసి, విశ్రాంతి తీసుకోవడానికి వెళిపోతాడు. సరిగ్గా ఇదే శిక్ష ని నికోలస్ కి అమలు చేస్తారు !
అప్పటికి – బందీ ల విషయం లో కొంత నిగోషియేష్ నడిచి, ఒక 100 మంది దాకా యూదులు కాని వారినీ, ఇజ్రాయిలీ లు కానివారినీ విడుదల చెయాలని నిర్ణయం జరుగుతుంది. మిగిలిన 122 మంది బందీలూ ఎంటెబ్ లాబీ లో ఉండిపోతారు. వీరిని తీసుకెళ్ళడానికి ఒక కార్గో విమానం వస్తుంది. దాన్లో వెళ్ళేందుకు బందీలను గుంపులుగా విడదీస్తూ ఉంటారు.
ఈ భయానక పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం – అమిన్ కు ఇంతకు ముందు పెర్సనల్ డాక్టర్ గా పని చేసి, ఇప్పుడు కంపాలా లో అధ్యక్షుడు నిర్మించిన ఇంకో ఆధునిక ఆస్పత్రి లో పని చేస్తున్న డాక్టర్ – జుంజూ, ఆ సమయానికి విమానాశ్రయం లో క్షతగాత్రులయిన ఏర్ ఫ్రాన్స్ ప్రయాణీకుల కోసం వచ్చి వుంటాడు. అతనికి నికోలస్ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. అప్పటికి – మొదట్లో నికోలస్ ను కొంచెం తిరస్కారంగా చూసినా, నికోలస్ కు మానవత్వం ఉందని, అతను అమిన్ కు అత్యంత సన్నిహితుడయ్యేంత రాక్షసుడు కాడనీ – అతను కేవలం ట్రాప్ చేయబడ్డాడనీ, అర్ధం చేసుకున్న డా. జుంజూ – ఒక హాలు లో చాతి కి ఇనుప కొక్కేలు తగిలించి సీలింగ్ కు వేలాడుతున్న నికోలస్ ను ఎవరూ చూడకుండా రక్షించి, డ్రెస్సింగ్ చేసి, రక్తాన్ని తుడిచి – ఇంక నువ్వీ దేశం లో ఉండొద్దు, బైటి ప్రపంచానికి ఈ దేశాన్ని గురించీ, అమిన్ గురించీ చెప్పు – అని – సగం మంది ప్రయాణీకులు విడుదల అవుతున్నారు – నువ్వు వాళ్ళలో కలిసిపో ! అని చెప్పి, నెమ్మదిగా విడుదల ఔతున్న కొందరు నాన్-ఇజ్రాయిలీ బందీ లతో నికోలస్ ను కలిపేస్తాడు. ఇలా నికోలస్ ను రక్షించినందుకు జుంజూ ను కాల్చి చంపేస్తారు.
నికోలస్ ఆ విమానంలో ఉన్నడని అమిన్ కి తెలిసేసరికీ, విమానం టేక్ ఆఫ్ అయిపోతుంది. అలా మృత్యువు కోరల దాకా వెళ్ళి, వచ్చిన డా.నికోలస్ – కేవలం కల్పిత పాత్రే అయినా, అమిన్ రాక్షసత్వాన్ని, మానసిన అసంతులితనూ బయట పెట్టేందుకు – చక్కని ఉదాహరణ ! కనీసం మూడు మిలియన్ల మంది అమాయక ఉగాండన్ ప్రజల్ని ఈడీ అమిన్ మట్టు పెట్టాడు. ఎపుడు తన మీద దాడి / హత్య కు కుట్ర జరిగినా తను ఎలా చనిపోతాడో,తనకు తెలుసు అనీ , తన చావు తన కల లోచూసాడనీ అంటూ – ఆవేశంతో మరిన్ని హత్యలకు పూనుకునే అమిన్ – ఫక్తు బ్రిటిష్ వ్యతిరేకి. స్వప్రయోజనాల కోసం, వివిధ దేశాల్లో పావులు కదుపుతూ, రాజకీయ అస్థిరత కు వాళ్ళే కారణమనీ, బ్రిటన్ పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసుల్లానే తమదీ, బ్రిటన్ తో పారంపరిక శతృత్వం అనీ, అందుకే స్కాట్లు తమ సోదరులనీ, తాను స్కాటిష్ కింగుననీ, తనకు తానే బిరుదిచ్చుకున్న ఘనుడు !
నెనెన్నో డీటైల్స్ చెప్పకుండా వొదిలేశాను గానీ – ఈ సినిమా లో – అమిన్ నిరంకుశత్వాన్ని, అతని రాక్షసతాన్నీ చూసేసరికీ గుండెలవిసి పోతాయి. పైగా నికోలస్ తో కూల్ గా చరిస్మాటిక్ గా వ్యవహరిస్తూ, పెద్ద ఉదారవాది లాగా ప్రపంచానికి ఫోసిచ్చే ఈ నియంత – రెండో కోణం – అత్యంత హేయం !!
అమిన్ గా నటించిన ఫారెస్ట్ స్టీవెన్ విటేకర్ కు అకాడమీ అవార్డ్ లభించింది. క్షణానికో మూడ్ లో ఉండే ఈ భయంకర పాత్ర పోషించినందుకు అతనికి జోహార్లు. మన ఎక్స్ ఫైల్స్ హీరోయిన్ స్కల్లీ ఎంతో అందంగా కనిపిస్తుంది మిషనరీ నడిపే అతని భార్యగా ! భీభత్సాన్ని తట్టుకోగలిగితే – తప్పకుండా చూడొచ్చు.
ఈ సినిమా కల్పిత ముగింపు తరవాత, ఎన్ని చర్చలు జరిపినా వినట్లేదని, నిజంగానే ఆపరేషన్ ఎంటెబ్ – అనే మిలిటరీ ఆక్షన్ ద్వారా – ఓ చీకటి వేళ, ఎంతో పక్కాగా ప్రణాళిక తొ సిద్ధమయి, నాటకీయంగా దాడి చేసి, ఎంటెబ్ విమానాశ్రయంలో ఏర్ ఫ్రాన్స్ బందీలందర్నీ ఇజ్రాయిలీ సైన్యం విడిపించుకు పోయింది. ఇలా దాడి చేసి, ఒక దేశపు సార్వభౌమత్వానికి విఘాతం కలిగించారని ఉగాండా – ఐక్యరాజ్య సమితి లో దొంగ ఏడుపులు ఏడిచింది. ఇలాంటి సినిమాలు చూస్తే, స్వతంత్ర భారత దేశం లో పుట్టినందుకు మనమెంతో పుణ్యం చేసుకున్నామని అనుకోవాలి.
ఈమాట: జూలై 2009 ఈమాటకు స్వాగతం
ఈమాట: హాయిహాయిగా ఆమని సాగే
ఈమాట: కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?
ఈమాట: నాకు నచ్చిన పద్యం - నిగమశర్మ అక్క పలకరింపు
ఈమాట: గోవిందా! గోవిందా!
ఈమాట: పెట్టె బయట
ఈమాట: ఈ కానుకనివ్వలేను
ఈమాట: ఏడు గంటల వార్తలు
ఈమాట: కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి
ఈమాట: రాగమాలిక
ఈమాట: పట్టుకో పట్టుకో
ఈమాట: పడమట సంధ్యారాగం
ఈమాట: నిద్రిత నగరం వైదేహి ప్రపంచం
ఈమాట: ఫాదర్స్ డే
ఈమాట: అంచులలో అందాలు
ఈమాట: అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?
పుస్తకం: Sunday @Abids - Version 3
రాసి పంపిన వారు: శ్రీరాం చదలవాడ
(తెలుగులో రాయడం రాదని ఇంగ్లీషులో రాసారు. మాటామంతీ హిందీలో సాగాయి)
గమనిక: అబిడ్స్ ఇంటర్వ్యూలు - సౌమ్య, పూర్ణిమ లవి ఇదివరకే పుస్తకంలో వచ్చాయి. ఇవి మూడో దిక్కులో ఎదుర్కున్న అనుభవాలు.
An interesting interview with a book vendor at the Abids Sunday Market
———————————————————————
On one sunday, pustakam.net interviewed a family run shop owned by the uncle Mr. Mohammad Aziruddin and helped by his young nephews Syed Ijaz and Mohammad Ibrahim Jameel.
1. How long have they been in this business?
Ans: Mr Mohammad Aziruddin proudly mentions that their establishment was set up on 14th Jan 1982.
2. What are the recent best sellers?
Ans: Chetan Bhagat, Sidney Sheldon, Jefferey Archer.
3. Current buying patterns
Ans: Interior design books.
4. If a customer were to ask for a book not in stock, how long would they take to obtain it?
Ans: 1 - 2 days only. But it could take longer if they need to get the book from Mumbai or Delhi.
5. Future plans?
Ans: Mr. Aziruddin emphasises that printed books are evergreen but possibly they could have a presence on the internet.
6. How are customer buying stats compared to good old days?
Ans: Purchases of children’s books have reduced. Everyone seems to prefer cartoons/games nowadays.
7. Who come more often to these people to buy books?
Ans: All kinds of customers. Highly ranked officials and ministers are among their patrons.
8. What profit do they get? How much do they earn per month?
Ans: Around Rs. 8-10,000
9. So, what do they do on non-sundays?
Ans: They have a regular shop close by and everyone is invited there.
10. What are their challenges, say during the rainy season?
Ans: Books do get wet and pages stick. But they take precautions to avoid such situations.
11. How do they price their books? Is the price uniform throughout all of their shops?
Ans: The price they sell is usually 50% less than the printed price.
*******************************************************************
అదీ సంగతి. అడగ్గానే వచ్చినందుకూ, తరువాత ప్రశ్నోత్తరాల సారాంశం రాసి పంపినందుకూ పుస్తకం.నెట్ తరపు నుండి రచయితకు ధన్యవాదాలు.
ప్రాణహిత: ఒక కొడుకు
ప్రాణహిత: యుద్ధం మొదలయ్యేదే…
గౌతమ్ ఘోష్ గొప్ప దర్శకుడే కాకుండా, మొదట గొప్ప సినిమాటోగ్రాఫర్ కూడా. దృశ్య చిత్రీకరణ చూడాలంటే, ఆయన సినిమాల్లోనే చూడాలి. భావ వ్యక్తీకరణలో కూడా దిట్ట. ఆయన సినిమాలు ఎక్కువగా చూడలేక పోయినా, చూసినవి మార్పుకు రానివి. ‘అంతర్జలి యాత్ర’ గురించి వారాల ఆనంద్ గారి సమీక్ష క్లుప్తంగానూ, సూటిగానూ ఉంది. డివిడి దొరికితే తీసుకుంటాను.
baagundi…………..
రవికిరణ్ గారు,
మీ పై పోస్టుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను (ముఖ్యంగా చివరి పేరాతో).
మీరు చెప్పినట్టు దీనికోసం సంఘటితంగా అర్థవంతంగా చర్చించి, చెయ్యవలసినదీ చెయ్యగలిగినదీ మనం చేద్దాం. నేను దీనికి పూర్తిగా సిద్ధం. మీరన్నట్టు కీబోర్డు కదిలిపోవాలంటే కష్టమే అయినా, సాధ్యమైనంత వరకూ కదులుదాం.
ఏవిటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఆలోచించి ఒక పద్ధతి ద్వారా అంగీకారానికి వచ్చి దాన్ని ఆచరణలో పెడదాం. ఏమంటారు? నా వెటకారపు రాతలతో మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి (ఇది రెటోరిక్కుకో వెక్కిరింపుకో అంటున్నది కాదు, మనస్పూర్తిగా అంటున్నది!).
సంపాదకులకు,
రవికిరణ్ గారు చెప్పిన దానికి ఇక్కడ మిగతావాళ్ళు కూడా సిద్ధమే అయితే, పొద్దులోనే దీనికొక వేదిక ఏర్పరిచే ఆలోచన చేస్తే బాగుంటుందేమో.
రోహిణీ ప్రసాదు గారు,
తెలుగు ఏ రూపంలో నిలబడి వుందో, ఏ రూపంలో కొనసాగబోతుందో వీలుంటే వివరించమన్నారు. మీరు ఏ భాషా శాస్త్రవేత్తనో, సామాజిక తత్వవేత్తనో అడిగుంటే, లేకపోతే వాళ్ళెవరైనా పూనుకుని ఈ వివరణ ఇచ్చుంటే బావుండేది. కాకపోతే శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతోపాటూ, సామాన్యులకి కూడా వారి, వారి పరిధిలో, వారికున్న అవగాహనలో, ఈ విషయం మీద కొన్ని అభిప్రాయాలుంటాయి కనుక, ఆ నా అభిప్రాయాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.
తెలుగు ఏ రూపంలో నిలబడి వుంది? ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకునే ముందు, మనం మరికొన్ని ప్రశ్నలకి కూడా జవాబు చెప్పుకోవాలి. అవి భాషకి సమాజంతో సంబంధంలేకుండా ఒక ప్రత్యేక అస్థిత్వం ఉందా? భాష దేశకాలాతీతవా?
భాషకి సమాజంతో సంబంధంలేకుండా ఒక ప్రత్యేక అస్థిత్వం ఉందా? దీనికి జవాబుగా మరొక ప్రశ్న వస్తుంది. భాష ఏవిటి? ఏవిటి భాష? ఎక్కడ నుంచి వచ్చింది? సృష్టి ఆది నుంచి వుందా? ఆఫ్రికాలో తిరుగాడిన మొదటి మనుషులకి ముందుతరాల కోతులకి (కోతి పదం తప్పు, కానీ ఏప్ అనే ఆంగ్ల పదానికి తెలుగు తెలియదు క్షమించ గలరు) సంఘ జీవనం ఎలా వీలయ్యింది భాష లేకుండా? ఇంకా వెనక్కి, వెనక్కి పోకుండా ఇక్కడతో మొదలెడదాం. భాష లేని సంఘ జీవనం ఊహించను కూడా లేనటువంటి విషయం. అది మూడు, నాలుగు కోతుల గుంపేకావచ్చు, కానీ ఆ మూడు నాలుగు కోతులు ఒకదానితో ఏదోరకంగా సంభాషించుకోలేకపోతే అవి ఒక సంఘంగా నిలబడలేవు. ఆ సంభాషణ సైగలే అవొచ్చు, శబ్ధాలే అవొచ్చు, మన ఊహకందని మరింకేదో అయ్యుండొచ్చు. పరిణామక్రమంలో ఎంతో పరిణితిచెందిన ఇరవై ఒకటో శతాబ్ధపు మానవుడులాగా, ఆ కోపం, భయం, ఆకలి, సెక్సు, అమ్మకి పిల్లల పట్ల భాద్యత, ఇలాటి అతికొద్ది భావాలకి రూపవిచ్చిన ఆ కొద్ది సైగలు, శబ్ధాలు ఈరోజు అనంతవైన వ్యక్తీకరన సాధనంగా, ఎన్నెన్నో రూపాల్లో, ఎన్నెన్నో భాషలుగా మార్పు చెందటం మనకు తెలుసు. ఆ మొదటి మానవుల నుంచి, కోపం, భయం, ఆకలి, సెక్సు, అమ్మకి పిల్లల పట్ల భాద్యత మొదలైన ఆ ఆది భావాలు ఇంత పరిణామం తర్వాత కూడా ఎట్లాగ మన మానవ సమాజాన్ని, దాని పరిణామాన్ని నిర్వచిస్తున్నాయో, పరస్పర వ్యక్తీకరణ మూలంగా జనించిన ఆ భాష పరిణామక్రమంలో ఈరోజు కూడా ఆ వ్యక్థీకరణ (కమ్యునికేషన) అనే అంశాన్నే ఆధారం చేసుకుని రూపుదిద్దుకుంటుంది. ఇన్ని లక్షల సంవత్సరాలనుంచి ఆ ఆధారంగానే ఇంకా రూపు దిద్దుకుంటూనే వుంది. మానవ పరిణామంతో ముడిపడిన భాషా పరిణామం అన్ని దేశాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ, అన్ని కాలాల్లోనూ జరుగూతూనే వుంది. ఈ నిరంతర ప్రక్రియలో తెలుగుగా రూపు దిద్దుకున్న ఒకానొక పాయ ఈ రెండువేల (?) సంవత్సరాల కాలంలో ఎన్ని సార్లు తన కుబుసాన్ని విడిచిందో, ఎన్ని మార్పులకి లోనయ్యి ఈ రోజు మన నోటిలో నానుతుందో ఒక సారి ఆలోచించండి. పరిణామవే సహజ లక్షనవైన ఆ మహాద్భుతానికి, సంస్కృతం, తెలుగు తనకు పుట్టిన కూతురు కాకపోయినా, తన తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా, తెలుగు పైన అధికారం చెసినందుకు ప్రతిగా తన పద భండాగారాన్ని తెలుగుకి సమర్పించుకుంది. తెలుగు ఆ దిశలో తనని తాను ఎంతో మార్చుకుంది. తెలుగు సంస్కృతాంద్రవై, ఆ సంస్కృతపదాల్ని అరగదీసుకోని కుబుసం విడిచిన పావులా మరింతగా తళతళలాడింది. మరపొచ్చుకాని, మాన్పరాదని ఒక సావెతుంది కదా, సంస్కృతాన్ని కొల్ల గొట్టిన తెలుగు, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం తదితర భాషల్ని కూడా కొల్లగొట్టటం మొదలుపెట్టింది. అవకాశం దొరక్క కొంతకాలం మన్నుతిన్న పావులాగున్నా, ఈ గ్లోబల్ గ్రామాల సంస్కృతిలో ఆంగ్లాన్ని ఎడాపెడా కొల్లగొట్టి తనలో కలిపేసుకుంటుంది. ప్రస్తుతం అక్కడుంది. రెండు దశాబ్ధాలముందు లేని మలుపులో ఇప్పుడుంది. ఒకప్పుడు తన అస్తిత్వానికే ఎసరు తెచ్చేంతగా సంస్కృతాన్ని తనలో కలిపేసుకున్న తెలుగు ఈ రోజు తిరిగి అదే రకంగా ఆంగ్లాన్ని తనలో కలుపుకుంటుంది. ఈ మార్పు తెలుగు మరణానికి మొదటి మెట్టా?
ఒక మెట్టు కాదు, చాలా మెట్లెక్కెవెవో అని కొందరి బాధ. తెలుగు మన భాష. మన ఆత్మ, మన బంగారు అమ్మ. మన తోడబుట్టిన, మనతోనే, మనలోనే పుట్టిన మన ప్రాణం. బాధ కలగడం ఎంతో సహజం (మీరు తెలుగు గురించి బాధ పడుతున్నారు, నెను మరీ ఘోరం, నెల్లూరు తెలుగు గురించి బాధ నాకు. కందిపులుసు (సాంబారు) పదం అదృశ్యవపోతుందే అని దిగులు. మొన్న నెల్లూరినించి ఒకరొస్తే, “ఏందయ్యా మందల” అనడిగే, ఆయనకి మందలంటే ఏవిటో తెలీదు, ఎంత టవున్ లో పుట్టి పెరిగితే మాత్రం “మందల” తెలీని నెల్లూరోళ్ళుంటారని నేననుకోలా, దిగిలు). దిగులు దిగులే, కానీ మార్పుకి కారణవైన సామాజిక, చారిత్రక, ఆర్ధిక నేపద్యాల్ని అవగాహన చేసుకోవాల. మార్పు భాషకి ప్రత్యేకవేవీకాదు, భాషకి మాత్రవే ప్రత్యేకం కాదు. ఈ గ్లోబల్ గ్రామాల సంస్కృతి మాత్రవే దానికి కారణం కాదు. పూర్వం ఉన్నట్టు ఏ గ్రామానికాగ్రామం స్వయం సమృద్దిగా వున్న రోజుల్లో తెలుగు పరిణామం ఆగిపోలేదు. ఆ పరిస్తుతులకి అణుగుణంగా తెలుగు మార్పు చెందుతూనే వుంది. రాజ్యాలు, సామ్రాజ్యాలు మొదలైన రోజుల్లో ఆ జీవన పరిస్థితులకి అణుగుణంగా తెలుగు పరిణామ క్రమం మారింది. ఆ దిశలోనే తెలుగులో ఇన్ని రకాల ప్రాంతీయతలు, మాండలికాలు అభివృద్దిలోకొచ్చినాయి. భారతవంతా ఒక దేశవైన ఆంగ్లేయ కాలంలో, రోడ్లు, కమ్యునికేషన్లు మరింతగా విస్తరించిన ఆ కాలంలో, జన సామాన్యంనుంచి వేరుబడిన గ్రాంధీకాన్ని త్రోసిరాజని వ్యవహారికం సెంటర్ స్టేజిమీదకొచ్చిన నిజాన్ని కాదనలేం. వివిధ కాలాల్లో వివిధ రూపాలు తీసుకున్న తెలుగు, ఆ దెశ, కాల పరిస్థితులకణుగుణంగా తన పరిణామక్రమాన్ని నిర్వచించుకుంటూ వచ్చింది. తెలుగుకి, సంస్కృతపు మంచేదో అది చెసింది. సంస్కృతభరితవైన తెలుగు తన భాద్యతని తాను నిర్వహించింది. గ్రాంధీకం తన కర్తవ్యాన్ని తాను నిర్వహించి ప్రక్కకు తప్పుకుంది. పాత వ్యవహారికం తప్పుకుంటూ, క్రొత్త మాండలీకానికి చోటిస్తుంది. సంస్కృత కావ్యాలు, గ్రంధాలు, సంస్కృతాంద్ర గ్రంధాలకి, కావ్యాలకి తమ చోటునిచ్చి ప్రక్కకు తప్పుకున్నట్టుగానే, ఆ తర్వాత తెలుగు గ్రంధాలు, కావ్యాలు, చంధోబద్దవైన, వ్యాకరణ బద్దవైన తెలుగు సాహిత్యం తెరవెనుకకి తప్పుకుంది. రేపు చందస్సులని బద్దలుగొట్టి, వ్యాకరణాల్ని విరగ్గొట్టిన పంతొమ్మిది, ఇరవై శతాబ్ధపు సాహిత్యం కనుమరుగైపోతుంది. అప్పుడు ఇప్పుడు లాగే అయ్యో, గురజాడలు, శ్రీశ్రీలు, కారా మేస్టార్లు, కొడవటిగంటి, రావీశాస్త్రులు, రంగనాయకమ్మలు, శివారెడ్లు, కేతు విశ్వనాధరెడ్లు, నామిని సుబ్రమణ్యం నాయుళ్ళు, కాదీర్ బాబులు, వైదేహి శశిధర్లు, బల్లోజుబాబాలు లేని తెలుగు అసలు తెలుగేనా అని మన ముందు తరాలు బాధ పడే రోజు వస్తుంది. మార్పు ఒక సహజ గుణం. మానవ పరిణామం ఒక అనంతవైన ప్రక్రియ. జీవరసాయనిక పరిణామంతో ముడిబడిన సామాజిక పరిణామం, దాంట్లో భాగవైన భాషా పరిణామం మనం గోడలుగట్టి ఆపితే ఆగేది కాదు. ఐతే గట్టుమీద కూర్చోని కథలు చెప్పడం తప్ప మనవేవీ చెయ్య లేవా? తెలుగుని మనవే విధంగానూ ఉధ్ధరించలేవా, దాని వ్యాప్తికి ఏవిధంగానూ తోడ్పడలేవా?
ఇక తెలుగు భాషోద్దరణ కోసం ఆతృత పడిపోయే వాళ్ళకి ప్రత్యేకంగా నా ఉచిత సలహా ఇది. పేరు వ్రాయటం మాత్రం కూడా రాని డెభ్భై శాతం జన్నభా వున్న సమాజంలో, విశ్వవిధ్యాలయపు చదువులు చదివినా తలకెక్కని పురాతన సాహిత్యాన్ని గురించిన దిగుల్ని ఏ నయాగారాలోకో విసిరెయ్యండి. తెలుగు దేశంలో ప్రతి పౌరుడికి చదువు చెప్పగల ప్రభుత్వ పాఠశాలల కోసం మీరు చెయ్యగలిగినది మీరు చెయ్యండి. ఆ దిశలో సమాజాన్ని నిట్ట నిలువుగా విడగొట్టి, క్రింది తరగతుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రయివేటు పాఠశాలల్ని నిర్మూలించడం అవసరం. కానీ ఆ మాత్రపు చదువు ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పడానికి, చదువుపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చును, నాలుగైదంతరాలు పెంచాల్సిన అవసరం వుంది. ఎన్ని కథలు చెప్పినా పేదరిక నిర్మూలన ఒగదిగే పనికాదు. అందువలన పాఠశాలల్లో విద్యార్ధులకి రెండుపూటలా పౌస్ఠికాహారాన్ని అందించాలి. కాలే కడుపుతో చదివి మహామహులైన వాళ్ళు వున్నారు, కానీ అందరికీ అది వీలు కాదు. మెజారిటీ అమ్మా, నాన్నలు మన దేశంలో తమ పిల్లకి చదువుల విషయంలో ఏమాత్రం సహాయం చెయ్యలేరు. ఒకటి పొట్టనింపుకునే పని వత్తిడి, రెండు వాళ్ళలో వున్న నిరక్షరాశ్యత. ఆ దిశలో సాయంత్రాలు అవసరవైన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆ సహాయం లభించేట్టు చూడాలి. ఇవన్నీ అయింతర్వాత, కనీసం పదవతరగతి వరకు తెలుగు, ఆంగ్లం తప్ప మరో భాషని భోదించకుండా చూడాలి. ఆంగ్లం రెండవ భాషగానే వుండాలి. ఇవన్నీ కావాలంటే పెద్ద పోరాటం చెయ్యాలి. ఆ ఓపిక, తీరిక మనకి వుందని నేననుకోను. భాష గురించి భాదైతే వుంది కాని కీబోర్డుని వదిలి పెట్టి పోవాలంటే మనకి కొంచం కష్టవే. అందుకని కనీసం మన బ్లాగుల్లోనన్నా విధ్యా రంగాన్ని ఎలా మార్చాలో చర్చించండి. వీలైతే కనీసం ప్రభుత్వానికి లేఖలు వ్రాయండి. ఈ చర్చంతా ఏవిటి చెత్త అనుకోకుండా చర్చలో పాల్గొనండి. చేతనైనది చెయ్యండి. అంతే కానీ కీబోర్డుంది కదా అని నాలాగా వుబుసుపోక తెలుగు గురించి మహా బాధపడిపోకండి. కానీ అదేందో సావెత చెప్పినట్టు మాటలకి చింతకాయలు రాలవు. అందుకని పురాతన సాహిత్యాన్ని ఎంత సరళీకరించి సరసవైన ధరలకి తెలుగు సామాన్యానికి అందించినా, తెలుగు మీద విశ్వవిద్యాలయాల్లో ఎన్ని పరిశోధనలు చేసినా, తెలుగుకి ఏ ప్రాచీన భాషా స్టేటస్ తెచ్చుకున్నా, వాళ్ళీచ్చే ముష్టి వందకోట్ల రూపాయలు ఏ తెలుగు పీఠంమీద కర్చుచేసినా ఏవీ ఉపయోగం కనిపించదు. తెలుగుమీద ఊర్కే మదనపడిపోవటం కాకుండా, బస్సుల మీద తెలుగుకోసం, ఎవరికీ అర్థంకాని అంకెలకోసం కాకుండా , చనిపోయిన సాహిత్యాన్ని గురించి, సాహిత్యకారుల గురించి దిగులునొదిలేసి, వాస్తవ ప్రపంచంలో, బ్రతికున్న తెలుగు బాలబాలికలకి ఏక్రొద్దిగానైనా ఉపయోగపడే మార్గం కోసం ఆలోచించి చెప్పండి మాలాటి నలుగుర్ని కూడా ఆ మార్గంలో కలుపుకుని పదండి.
ఈ సినిమా నేను చూసాను. మంచి సినిమా, ఫారెస్ట్ చాలా బాగా చేసాడు.
మైత్రేయి గారూ..
పుస్తకాలను చదవటం నాకు ఇష్టమైన వ్యాపకాలలో ఒకటి.
చలం నాకు పరిచయమయి కూడా సంవత్సరమే దాటింది.
కాకపోతే.. వీలైనంత ఎక్కువగా చలాన్ని చదివేందుకు ప్రయత్నిస్తున్నాను.
చలం ఆత్మకధతో మొదలుపెట్టాను. కానీ మ్యూజింగ్స్ పూర్తిగా చదవలేకపోయాను.
చలం అంటే ప్రత్యేకమైన అభిమానం, ద్వేషం లేకపోయినా..
ఆయన ఎందుకు అంత వివాదాస్పదుడయ్యాడని మాత్రం తెలుసుకోవాలనుకుంటున్నాను.
ఆ ప్రయత్నంలోనే శశిరేఖ కనిపించింది.
అర్ధం చేసుకున్నదీ, అనిపించినదీ వ్రాశాను.
అభినందనలకు ధన్యవాదాలు.
- నరేష్ నందం.
బాల్యం తమిళ నాడు లో జరిగింది భాష పండితులు శ్రీ వెంకటేశ్వరా రావు గారు M A తెలుగు భోదిన్చ్చే వారు wari చలువ వలన Hyderabad వచ్చిన తరువాత తెలుగు కాస్త స్వచ్చంగా పోఅలకడం అలవరుచుకున్నాను కానీ పిల్లలు కేంద్రియ విద్యాలయ లో చదివి తెలుగులో మాట్లాడడం తప్ప ఇంకా ఏమి రాదు
మీ వరస చూస్తుంటే అందరు తెలుగు పట్ల ఆకర్షితులు కావడం ఎంతో దూరం లేదు
అనిపిస్తుంది ముఖ్యంగా google mail వారి సహకారం ఎంతో బాగుంది
గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
-హెచ్చార్కె.
కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
ప్రయత్నమే చెయ్యలేదు,
అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
పట్టుకోలేని నాకు,
వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?
అఫ్సర్ గారికి,
అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
మరోసారి అభినందనలతో,
నండూరి వెంకట సుబ్బారావు.
“చీకటి వంతెన
దిగులు పొలాలు
ఖాళీ ఆకాశాలు”
వెనక్కి తిరిగి చూసుకునే గడియలే నిజంగా బతికిన క్షణాలు
అక్షరాల్లో బ్రతుకును చూపించడం అందరి వల్ల కాదు.
అందుకేనేమో కవిత్వానికి, కన్నీళ్ళకి దగ్గరి సంబంధం ఉందనిపిస్తది.
ఓ మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించిన అఫ్సర్ గారికి అభినందనలు
ఇట్లాంటి కథలు చదివి (విని) ఎన్నాళ్ళయిందో.
ఎవరు రాశారో , ఎట్లా పుట్టాయో, ఎలా ప్రచారం లోకి వచ్చాయో గానీ వీటిలో హాస్యం తో పాటు చక్కని సందేశం, సామాజిక ప్రయోజనం కూడా వుంటుంది.
నేటి తల్లి తండ్రులు ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో వుండేవారు తమ పిల్లలకు ఈ కథలు చెప్పటం మానేశారు.
అమూల్యమైన ఈ మౌఖిక వారసత్వ సంపదను ప్రింట్ మీడియా లోనైనా భద్రపరుస్తున్నందుకు సంతోషం గా వుంది.
అభినందనలు.
ఈ శీర్షిక నిరంతరం నిరంతరాయంగా కొనసాగిస్తున్నందుకు ఈమాటవారికీ బృందావనరావుగారికీ కృతజ్ఞతలు.
‘నిగమశర్మ అక్క’ గుఱించి నాకు మొదటగా పరిచయం చేసినవారు పరుచూరి శ్రీనివాస్గారు - కూడలి కబుర్లలో. ఆ పాత్రౌచితిని గుఱించిన ఒక వ్యాసానికి లంకె ఇచ్చారు. అందులో పద్యాల్లేవు. అంతా వచనమే.
మన్నించాలి, ఈ పద్య పరిచయంలో చిన్న టైపాటు దొర్లినట్టుంది. “నెలపొడుపు కోసం సముద్రంలో నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది.” అని వుంది. సముద్రునివలె అని వుండాలనుకుంటాను.
అలాగే చక్షూరాజీవ యుగమ్ము వాఁచె అనే నుడిని రామకృష్ణుడు పద్యంలో పలికించడాన్ని కూడా ప్రస్తావించివుంటే సంతోషించేవాడిని.
[టైపో సరిదిద్దాము. కృతజ్ఞతలు - సం.]
sir, do not encourage like these games. these games are lead to gambling many disapoinments to traveling. some time’s it may lead to quarel between travelers.
Meher gaaru
Well said..No more comments !
Vamsi
చాలా బాగా రాశారు,మీ విశ్లేషణ చాలా బాగుంది.
పుస్తకం.నెత్ వారికి చిన్న సూచన
హైద్ లొ ఉన్న లైబ్రరీల గురించి కూడా ఒక టపా వేస్తే బావుంటుంది
కొత్తగా పుస్తకాలు చదవాలి అనుకున్నె వారికి కొంచం సాయంగా ఉంతుంది కదా
for both telugu as well as english books
వ్యాసం కొన్ని కొత్త కొణాలను చెపుతుంద. చదివినతరువాత మనసంతా స్తబ్ధుగా అయిపఓయింది.
కన్నీళ్లు తెప్పించారండీ. ముఖ్యంగా ఈ పంక్తులైతే మఱీనూ…
భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు ఆ భగవంతుని వరశాపం.
మాండలీకాలు భాషను పరిపుష్టం చేస్తాయా? లేక ప్రతిబంధకంగా మారతాయా?
పరిపుస్థం చేసేట్లయితే ఎలా? ప్రతిబంధకంగా మారేట్లయితే ఎలా?
pl. kindly throw some light on the above questions please.
bollOJubaba
చాల బాగా వ్రాసారు. మీ శ్వేత మయూరం లాగే మీ పుస్తక వ్యాఖ్యానం కూడా స్వచ్చం గా ఉన్నది.
మీరు అనుకొన్నది వ్రాసారు ఎవరో రుద్దిన అభిప్రాయలు , ఎవరు ఏమనుకొంటారో అని కాక.
పుస్తకం గూర్చి వ్రాసేటప్పుడు ఆ యా పాత్రలను విశ్లేషించాలి కాని రచయితను, అతని వ్యక్తిత్వాన్ని కించపరచ రాదనే ప్రాధమిక జ్ఞానం లేని వాళ్ళు వ్యాఖ్యలు వ్రాస్తున్న ఈ రోజుల్లో ఇది ఈ సైట్ మళ్ళి చూసేలా చేసింది.
పొద్దు సంపాదకులకు,
నావి కొన్ని అనుమానాలు. మీది బ్లాగా, పత్రికా? నాకు తెలిసి ఇలాంటి వ్యాసాలు బ్లాగుల్లో బాగా అమరుతాయి. ఎందుకంటే ఇందులో ఎమోషనూ, రెటోరిక్కూ తప్ప మరేమీ లేదు. పత్రికల్లో వ్యాసాలు, నాకు తెలిసి, తమ వాదనలకి కొన్ని facts జోడిస్తాయి. ఓ అభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా పాఠకుల ముందు పెడతాయి. అలాంటివి ఎన్ని పత్రికలున్నాయని అడిగితే నేన్చెప్పలేను గానీ, పత్రికలున్నవి అందుకు.
నిజానికి ఈ వ్యాసం కన్నా, ఇది ప్రేరేపించిన చర్చలాంటి రచ్చ చూసి నాకీ మాట చెప్పాలనిపించింది. ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడేస్తే చర్చ అయిపోతుందా? ఎవరి కురచ అనుభవాల్ని వాళ్ళు సార్వజనీన సత్యాలు చేసేసి అక్షరాల్లో పరిచేస్తే చర్చ అయిపోతుందా?
కొంతమంది ఆంధ్రప్రదేశ్ పల్లెటూళ్ళన్నింటినీ తన అరచేతి రేఖలంత దగ్గరగా చూసినట్టు అడక్కపోయినా వాటి వకాల్తా పుచ్చుకుని, లేని elite ని ఒకదాన్ని తమ ముందు ఊహించేసుకుని, లేదా తయారు చేసుకుని, “సాహిత్యాన్ని తుంగలో తొక్కడం” లాంటి అవాకులూ చెవాకులూ పేల్తూన్నారు. మరికొంతమంది తెలుగు సంస్కృతి తరపున కత్తీ డాలూ పట్టుకుని కదం తొక్కేస్తున్నారు.
ఈ వ్యాసం మొదటిసారి చదవగానే అనిపించింది, కొన్ని బాధాకరమైన వాఖ్యానాలు చూడాల్సి వస్తుందని. ఎందుకంటే చుట్టూ వున్నవాళ్ళెలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి. కానీ ఇది బ్లాగు కాదు కదా, పత్రిక కదా, అలా జరక్కపోవచ్చని సరిపెట్టుకున్నాను. కానీ అంచనా తప్పింది.
మనుషులపై దాడి చేసే కామెంట్లే మీకు అభ్యంతరంగా కనిపిస్తాయేమో. ఒక సంస్కృతి పైనే నిరాధారమైన నిర్హేతుకమైన మాటలు వదిలేస్తే మీకు అభ్యంతరంగా కనిపించవేమో. ఇలాంటి వెకిలితనం చూపించుకోవడానికి ఎవరికి వాళ్ళకి సొంత బ్లాగులున్నాయి కదా. ఇక్కడ కూడా దానికి చోటు కల్పించడమెందుకు?
నేనిక్కడ తెలుగు భాషపై నాదైన వాదనేదీ జోడించి ఇంకా కంపు పెంచదలచుకోలేదు. కానీ “పొద్దు” పోతున్న తీరు చూస్తే దిగులేస్తుంది. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయల పట్ల సహనం ముఖ్యమే కాదనను. కానీ పత్రికకి ఓ సొంత వ్యక్తిత్వమంటూ వుండడమూ అంతే ముఖ్యం. అదేమీ ఇక్కడ కనిపించడం లేదు. అది నిలుపుకోలేకపోతే మీకూ బ్లాగుకూ తేడా ఏం లేదు.
ఉండాల్సిన అవసరం లేదంటారా. మీరీ కామెంట్ని ప్రచురించాల్సిన అవసరం లేదు.
~ మెహెర్
ohmyroots,
I got ur point. I will practice it in furture. Thanks for correcting me.
అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.
చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది.
అక్కడక్కడా ఇలాంటి వాక్యాలు హృదయాన్ని తాకాయి. సమకాలీనమైన సంఘటనలను కథారూపంలో మలిచిన రచయితకు అభినందనలు.
కథలో నవ్యత ఉంది.
రచయిత చెప్పిన విషయం విన్న తర్వాత నా కీ సంఘటన గుర్తుకొస్తోంది.
నేను ఈ మధ్యనే మా వూరెళ్ళాను. రెండవ తరగతి చదువుతున్న మా తమ్ముడికి విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం స్పెల్లింగ్ లను బట్టీ పట్టించడం నేను కూడా గమనించాను. ఏమి ఇంగ్లీషు మీడియం చదువులో ఏమో!
ఈ సినిమాలో ఫారెస్ట్ విటేకర్ మేకప్ కొంచెం గాడీగా ఉంటుందిగానీ నటనమాత్రం సూపరో సూపరు. నికోలస్ గా ఆ “లవబుల్ హీరో” బాగున్నాడు.
@సురేష్: అబ్బా సురేసూ,అట్టాంటి తెలుగు దెల్సినోళ్ళతో అట్టాగే సెప్పితేతప్ప అరతం గాదప్పా. అందుకే ఈ సోదంతా వాళ్ళ”అచ్చ తెలుగు”లో సెప్తాండా.అయినా పాతోళ్ళు ఆళ్ళు మాట్లాడే బాసలోనే రాసినారు అనేది అంతా అబద్ధం బ్రదరూ. మాట్లాడేబాసనెప్పుడూ రాసేబాసతో సమానంగా సూళ్ళేని సాంపరదాయాల్లోంచీ వచ్చినోళ్ళుగాదాయీళ్ళు. నీకు దెలవందేముంది.
అయినా ఆళ్ళు రాసిందాంతో నాకే కట్టమొచ్చిందీ! అది సెప్పాల్సిన వయసులో పిలకాయలకి సెప్పమనిగదా నా గోలంతా. డిగ్రీలో తెలుగు తీసుకున్న ఆనక వీళ్ళ “పైస్థాయి” తెలుగు నేర్పించమనండి. పదొ తరగతి వరకూ తన గమనాల్ని సక్కంగా తెలుగులో కుదించే కిటుకు నేర్పమనండి. అప్పుడు ప్రజలు తెలుగులో… తనకొచ్చిన తెలుగులో… ఎందుకు రాయరో చదవరో చూద్దాం.
@బొల్లోజుబాబా:”భాషనుంచి సాహిత్యం గానీ సాహిత్యం నుంచి భాష కాదు.” అనే ధోరణిని బలంగా చెప్పడానికి సాహిత్యాన్ని తుంగలో తొక్కమన్నానుగానీ, లిఖిత రూప భాషకున్న ప్రాముఖ్యత తక్కువని కాదు. కాకపోతే ఇలా రాస్తేనే “మంచి తెలుగు” అనే ఆభిజాత్యాన్ని వీడి మౌఖిక భాషలకు యధాతధంగా,గౌరవప్రదంగా అక్షరరూపం ఇస్తేగానీ లిఖితభాషకు మనుగడ ఉండని కాలం ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకం. ప్రస్తుతం “సంక్షోభం” బహుశా అదేనేమో.
భావుకత కరవైపోతోన్న ఇవాళ్టి కాలంలో ఇంద్రాణి గారి కవిత ఆహ్లాదంగా
అన్పించింది. రోజూ మన చుట్టూ ఉండే చిన్న చిన్న అందాలని గమనించలేని
వేగపు బతుకైపోయి ఎవరైనా ‘పట్టుకో పట్టుకో” అని వెనకబడమంటూ..ఊరించే దృశ్యాలని చూపిస్తే “హమ్మయ్య” అని జీవించటానికి
ఇంత నమ్మకం కలగదూ!! అంత నమ్మకాన్నిచ్చింది ఈ కవిత. ఆమెకు అభినందనలు.
యశస్వి.
sujatha garu,
nenu konni nelala kritam ilage anukokunda chusanu. meeru motham kadha antha cheppesaru.kevalam plot gurinchi matrame cheppi unte bagundedi. adi patakullo aasaktini kaliginchedi….
నాకు కూడ కథ శీర్షిక చాలా అకట్టుకుంది. చివరి పేరా హృదయ కవాటాలను ఒక్కసారిగా బిగబట్టినట్లనిపించింది. నేడు మృగ్యమవుతున్న మానవ సంబంధాలను ఎంతో ఆర్ధ్రంగా తెలియచేసారు. కోల్పోతున్నదేమిటో తెలియకుండానే జరిగిపోతుండగా మనిషి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మీ కధలో కనపడింది. నిజానికి కన్నీళ్ళు ఇంకిపోతున్న నేటి తరానికి ఒయాసిస్సు.
ఏడుస్తూ వుండిపోయాను పద్యం చదివి చాల సేపు. ఇన్ని మరణాలూ ఏమీ నేర్పవు మనకు. ఎప్పటికప్పుడు ‘అలవాటు కాని చీకటిలోనే, కొత్త కొత్త చీకట్లలోనే నిలబడ’క తప్పదు. మరణించిన వాళ్లూ ఏమీ నేర్పరు మనకు. చనిపోని ప్రేమను రగిల్చి వెళ్లడం తప్ప. అఫ్సర్, నీతో నొప్పిని పంచుకుంటున్నా, పంచుకోడానికి నొప్పి మాత్రమే వుంటం వల్ల.
హెచ్చార్కె
అది ఒక్క ఆ పోలీసు అధికారి అభిప్రాయం మాత్రమే కాదు. ఈనాటి సగటు భారతీయ పురుషులందరి ఆలోచనాధోరణికి ప్రతిబింబం.
ఆడది అణిగి మణిగి వుండాలి, కొట్టినా తిట్టినా క్కిక్కురుమనకుండా పడివుండాలన్నపురుషాహంకార ధోరణి అది.
స్త్రీలు సమాన హక్కులు, సమానత్వం కోరుతుండడం వల్లనె ఈ సమస్యలన్ని ఏర్పడుతున్నయన్నది ఈ పురుషాధిక్య సమాజపు ఆరోపణ.
వ్యవస్థ మారకుండా ఈ భావజాలం పోదు. వ్యవస్థను వీళ్ళు అంత సులువుగా మారనివ్వరు.
ఇదొక దీర్ఘకాలిక పొరాటం.
వ్యాసం చాలా అలొచనలను రెకెత్తించింది.అ
కథ చాలా బావుంది.
కథలో ఎంతో ఆర్ద్రత వుంది. చని పోయిన అమ్మమ్మకు లేఖ రాయడం అన్న ఆలోచనే విలక్షణంగా అనిపించింది. ఆ అమ్మమ్మ మీదున్న అంతులేని ప్రేమాభిమానాలు ప్రతి వాక్యంలో ప్రతిబింబించాయి. ఈ కాలంలో మసకబారుతున్న మానవ సంభందాల గురించి ఆలోచనలు సారించేలా చేసింది ఈ కథ.
“చేతులు లేని గాజులు” శీర్షిక అర్ధవంతంగా , కథకు దీటుగా వుంది.
>>> అవి నీ చేతులకున్నప్పుడు వాటిని ఒకటి రెండు సార్లు గమనించాను. కాని వాటిలో ఉన్న నీ చేతుల్ని గమనించలేదు. కాని ఇప్పుడూ అమ్మ చూపిన గాజుల్లో లేని నీ చేతులు తప్ప నాకు. ఇంకేమీ కనిపించటం లేదమ్మమ్మా.<<<<<
అన్న ఆఖరి వాక్యాలు చదివేక మనసంతా బరువెక్కినట్టయింది .
రచయిత హరి పద్మప్రియ కు హృదయపూర్వక అభినందనలు.
చాలా బాగుంది మీ కవిత. హృదయ బాధ అనుభవించితె గానీ రాదిటు వంటి కవిత. భాదల మీద అభిప్రాయం చె ప్ప గ ల ధై ర్యం లే దు లే దు నాకు లే దు
శేషగిరి రావు.
మంచి వ్యాసం. మద్రాస్ విశ్వవిద్యాలయంలో బయోఫిసిక్స్ ప్రాధ్యాపకులుగా ఉన్న డాక్టర్ శ్రీనివాసన్ గారు ఒకప్పుడు ఒక పేపర్లో చెప్పిందేమంటే (సాంబమూర్తిగారికి ఇందులో కృతజ్ఞతలు కూడా తెలిపారు, పేపరు రీప్రింటు ఎక్కడుందో వెదకాలి). రాగమాలికలకు ఉపయోగించే రాగాల స్వరాల frequencies మధ్య correlation coefficient ఎక్కువగా ఉంటే ఒక రాగంనుండి మరో రాగానికి వెళ్లడము సులభం అని. అందుకేనేమో సామాన్యంగా ఈ రాగాల మధ్య ఒక స్వరంలో మాత్రం మార్పు ఉంటే మధురంగా ఉంటుంది. అంటే ఇవి రాగాల మధ్య point mutation లాటి్ది అని అనుకొంటా :-)
విధేయుడు - మోహన
చర్చ భలే రంజుగా ఉంది.
భాష జనుల నాలికలపై ఉన్నంతవరకూ చచ్చిపోదు. వాస్తవమే
రవికిరణ్ గారు, మహేష్ గారు మరో సారి ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. కానీ వారి వాదనల్లో భాషకు మౌఖిక రూపము ఒకటీ చాలు అన్న భావం ధ్వనిస్తుంది.
మరి భాషకుండే లిఖిత, పఠన రూపాల మాటేమిటి. (మరీ విడ్డూరంగా మహేష్ గారు తుంగలో తొక్కమంటున్నారాయె)
ఒక భాష పరిణితి చెందాలన్నా, విస్తరించాలన్నా ఈ రెండు రూపాల అవసరం లేదంటారా?
ఒక భాష బ్రతికి ఉండటానికి మౌఖిక రూపం ఎంతైతే అవసరమో లిఖిత రూపం కూడా అంతే అవసరం.
ఎందుకంటే ఈ నాడు సంస్కృతం మౌఖిక భాషగా లేకపోయినప్పటికీ, దాని లిఖిత రూపం వలననే ఇంకా బ్రతకగలుగుతున్నది. దానిలో ఉన్న సారస్వతం కారణంగా మరో వెయ్యేళ్లు బ్రతికినా ఆశ్చర్యపోనక్కరలేదేమో.
అలా కాక లిఖిత రూపంలో లేని ఎన్ని వందల భాషలు క్రమక్రమంగా అంతరించిపోవటంలేదు ఈ ప్రపంచంలో.
అమీన్గా ఫారెస్ట్ విటేకర్ నటన నిజంగానే అకాడెమీ అవార్డార్హం. ఈ మధ్య అకాడమీ అవార్డులు నల్లవారికివ్వటం పరిపాటిగా మారింది గమనించారా? ఇంతకు ముందు డెబ్భయ్యేళ్లలో ఒకడికే వస్తే, ఇప్పుడు ఆరేళ్లలో ముగ్గురు!
సినిమా దగ్గరికొస్తే, హింస పాళ్లు అధికమయ్యాయనిపించింది. కొన్ని సన్నివేశాలు జీర్ణించుకోవటం కష్టం. కధ చాలావరకూ కల్పితం. అమీన్ కౄరుడే కానీ, పాశ్చాత్య మీడియా గగ్గోలు పెట్టే స్థాయిలో (మెదళ్లు తినటం, etc) ఉండేవాడు కాదని ఉగాండా నుండొచ్చిన ఒక నల్లజాతీయుడు చెప్పగా విన్నాను.


