2012-05-16
Welcome to Avakaaya.com: 'తెలుగు విలన్లు' కావలెను
కాలానుగుణంగా మారిన పరిస్థితులు, మారుతున్న ఇతివృత్తాలు సాకుగా తీసుకొని, కొత్త ముఖాల కోసం మన నిర్మాతలు చేసే అన్వేషణ ఉత్తరాది నుండి చేసుకునే దిగుమతులతో ఆగుతుంది. పరిస్థితులు ఇలాగా కొనసాగితే, ఒకానొకనాడు తెలుగు సినిమాలలో తెలుగువారు ఉండేవారు అని చెప్పుకోవాల్సిన దుస్థితి కూడా వచ్చి తీరుతుంది.
కళాత్మక ప్రతిరూపాలుగా చెప్పుకునే మన సగటు సినిమాల్లో హీరోయిన్ పాత్రకుండే పరిధులు తెలుసు కాబట్టి, ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్ల గురించి అంత బెంగ పడాల్సిన పని లేదు. కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలే. కాని, ప్రతినాయకుడి పాత్రల కోసం కూడా మన నిర్మాతలు పరభాషా నటుల కోసం ముఖ్యంగా ఉత్తరాది నటుల కోసం వెంపర్లాడటం అర్ధంకాని విషయం.
ఒకప్పుడు నాయకుడికి ధీటుగా ప్రతినాయక పాత్రలో అశేషజనావళిని రంజింప జేసిన గోవిందరాజుల సుబ్బారావు, ఆర్.నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, నాగభూషణం, సత్యనారాయణ, రావుగోపాలరావు, రాజనాల, ప్రభాకరరెడ్డి, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు లాంటి తెలుగు పేర్లు వెండితెరపై చూసి చాలా కాలమే అయ్యింది.
ఇప్పుడు సాయాజి షిండెలు, అశుతోష్ రాణాలు, అశీష్ విద్యార్ధిలు, ముఖేష్ ఋషి లాంటి పేర్లే కనిపిస్తున్నాయి. వీరి నటనను తక్కువ చేసి చెప్పటమైతే కాదు కానీ, ఆ మాత్రం నటులు మన తెలుగులో లేరా అని అనుమానం వస్తుంది. వీరి కోవలో వస్తున్న ప్రదీప్ రావత్ లు, రాహుల్ దేవ్ వంటి మరెందరో విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి మాత్రమే.
ఒకప్పటి ఎస్వీరంగారావు లేదా ఇప్పటి ప్రకాష్ రాజ్ తరహా ప్రతినాయకులు ఆంద్రదేశంలో లేరనే ఒప్పుకోవాలేమో!
పుస్తకం: అనువాదకుడి మరణం
2012-05-15
Welcome to Avakaaya.com: ధూపం
కాల్చిపారేసిన సిగరెట్టు
యాష్ ట్రేలో ఆఖరి శ్వాస వదులుతుంది
దీని త్యాగాన్ని ఊరకే పోనీను.
ఊపిరితిత్తుల్లో భద్రంగా దాచుకుంటాను.
స్లో మోషన్ లో చావును అనుభవిస్తున్నా
జాస్మిన్ నవ్వు నాకింకా గుర్తున్నదంటే
గ్లాసులా తెరుచుకున్న గొంతులో
గిరికీలు కొడుతున్న షివాస్ రీగల్ కారణం కావొచ్చు
సిల్లీగా ఊదిన సిగరెట్ పొగా కావొచ్చు.
పాయిజన్ పరిమళంకన్నా మత్తెక్కించే రాత్రి నిషా
పరస్పర పరామర్శల తర్వాత
సీసాలా పారదర్శకమైనప్పుడు
సానికొంపలా తెరుచుకున్న ఆకాశంలోకి
పగలబడి నవ్వుకుంటూ
సూర్యుడిలా బయటకు వచ్చి
మళ్ళీ సూర్యుడిలానే లోపలికీ వెళ్తాను
ప్రపంచమంత యాష్ ట్రేలో దగ్ధమౌతూ
చితాభస్మాన్ని చీకటికి పూస్తూ....
పుస్తకం: కవిత్వం:కొన్ని ఆలోచనలు
పుష్కరిణి: శ్రీ నందన వైశాఖ సంపాదకీయం
మే 2012 సంచిక
ఆంతరిక ప్రపంచమే సత్యము
అందఱము నొక ప్రపంచములోననే జీవించుచున్నామని తలపోయుచున్నారము. కాని చూచుచున్నది ఒక్క ప్రపంచమునే అయినను అందఱము దాని నొక్కతీరుగనే అర్థము చేసికొనుట లేదు. కాబట్టియే దృశ్యమాన ప్రపంచమును గూర్చి మనందఱి భావము లొక్కవిధముగా లేవు. చూచుచున్నది కన్నులని మన భావన. కాని వాస్తవముగా కన్నుల ద్వారమున మనస్సే చూచుచున్నది. కన్నులను సాధనములుగా గైకొని మనస్సే వాని స్వరూపమును అంచనా కట్టుచున్నది మఱియు భాష్యము చెప్పుకొనుచున్నది. లేనియెడల కన్నులు మూసికొన్నప్పుడు అంతకు ముందెన్నడును కన్నులు చూడని దృశ్యములేల మనస్సునకు కానరావలె ? అపరిచిత వ్యక్తి నొక చిన్నబిడ్డ అంకుల్ అని పిలచును. మనమాతనిని దొంగగా చూచెదము. తేడ ఎచ్చట కలదు ? మనలోననే ! ఏలన, నిజమైన దొంగ మనలో నున్నాడు. మన భావములలోను, అనుభవములలోను ఉన్నాడు. చిన్నబిడ్డకు మట్టుకు అందఱిలోను అంకుల్స్ మాత్రమే ఉన్నారు.
అట్లే ఒకే వ్యక్తి ఒకఱికి కుమారుడుగా, మఱియొకఱికి భర్తగా, వేఱొకఱికి అన్నగా, ఇంకొకఱికి శిష్యుడుగా, మఱియొకఱికి గురువుగా, వేఱొకఱికి యజమానుడుగా కానవచ్చుటయు మానసిక ప్రపంచమునకు సంబంధించిన విషయమే కదా ! లేనిచో ఆఱడుగులు ఎదిగిన వ్యక్తి ఒకఱికి తన ముద్దుల చిన్నిబిడ్డగా గోచరించుట ఏమి ? ఆతడు తిండి తినకుండ ఆఫీసునకు వెళ్ళినాడని ఆతని తల్లిదండ్రులింటివద్ద ఆందోళన చెందుట యేమి ? మఱి ఈ భావములు వాస్తవములా ? మన భ్రమలా ? అని ప్రశ్నించినచో - ఇవి యొక విధముగా వాస్తవములున్ను, మఱియొక విధముగా భ్రమలున్ను అని సమాధానము చెప్పవలసియుండును. ఈ భావములకు మూలమైన వాస్తవములు గతించిపోయినవగుటచే, అవి యిప్పుడు మన జ్ఞాపకములలో తప్ప ప్రత్యక్షమైన ఉనికిలో లేకపోవుటచే నివి భ్రమప్రాయములే. కానీ యేవి లేక, వర్తమానమును గానీ, భవిష్యమును గానీ నిశ్చయింపలేమో, యేవి లేక కార్యాచరణమునకు కడంగలేమో అవి భ్రమలెట్లగును ? వాస్తవములే అగును. మతి గల ప్రతి మానవుని భావములు ఎంతయోకొంత సత్యమే. కనుక మన మనో ప్రపంచము కూడ సత్యమే. నిజమునకిది బాహ్యప్రపంచము కంటెను ఎక్కువ సత్యము. ఏలన, దీని ఆలంబనము లేకుండ మనము బాహ్యప్రపంచమును అర్థము చేసికొనజాలము.
మన మనస్సే తదుపరిదశలో వాక్కగుచున్నది. వాక్కు చేష్టలగుచున్నది. చేష్టలు మన స్వభావమగుచున్నవి. మన స్వభావమే మన భవిష్యద్ గతిని నిర్ణయించుచున్నది. కనుక వర్తమాన వాస్తవమనియు, జీవితమనియు మనము భావించుచున్నవి యెల్ల, నిజమునకు ఒకప్పటి మనోభావముల ఫలితములే అయియున్నవి. అవ్యక్తము నుండియే వ్యక్తము ప్రభవించుచున్నది గానీ వ్యక్తము నుండి అవ్యక్తము ప్రభవించుట యెన్నడును లేదు. ఆంతరిక ప్రపంచమే ఆ అవ్యక్తస్వరూపము. మనస్సు సంకల్పించిన తరువాత ఆ సంకల్పమే బాహ్యవస్తుసంచయముగా, శారీరిక మార్పులుగా, అనుభవములుగా పరిణతమగుచున్నది. చేయు పని ఒక్కటియే అయినను, లోపలి సంకల్పపు మంచిచెడ్డలను బట్టియే వానికి తప్పొప్పులేర్పడుచున్నవి. ఆ తప్పొప్పులను బట్టి దండనములును, బహుమానములును సంప్రాప్తించుచున్నవి. పూర్వజన్మలో అందమైన సంకల్పములు గలవారు ఈ జన్మలో అందముగా జన్మించుచున్నారు. అప్పుడు వికారపు సంకల్పములు గలవారిప్పుడు వికారముగా జన్మించుచున్నారు. ఇది భగవంతుని ప్రత్యక్షకర్మ కాదు. మనస్సు తదుపరిదశలో సహజముగా సంతరించుకొను స్వరూపమే.
లోకసాధారణ జీవనమున మనుజులు "నిజము చెప్పుము, నీ యథార్థాభిప్రాయమును బయటపెట్టుము" అని ఇతరులను నిలదీయుట ద్వారా ఏమని ఉద్దేశించుచున్నారు ? బాహ్యముగా వ్యక్తమగుచున్నదానితో తాము సంతుష్టులగుటలేదనియే ! తమకు లోగుట్టు సైతము కావలెననియే ! లోపలి స్వభావము సత్యమనియే ! కనుక బాహ్యప్రపంచమెంత నిఖారసుగా కనిపించినను అది పర్యవసానరూపమే తప్ప మూలము కాదనియు, యథార్థమైన మూలము మనస్సే అనియు గుఱుతెఱిగి మానవుడు ఆ ఆంతరిక ప్రపంచమును పరిశుద్ధముగా నుంచుకొనుట నభ్యసింపవలెను.
--సంపాదకుడు
2012-05-14
పుష్కరిణి: శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామస్తోత్రము
దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||
ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభి యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్
పుస్తకం: హరిశంకర్ పార్శాయి రచనల ఆడియో
2012-05-13
Welcome to Avakaaya.com: పార్లమెంటుకు షష్టిపూర్తి
పుస్తకం: మావోయిస్టుల పోరాటానికీ, ఆదివాసీల సమస్యలకు అద్దం పట్టే పుస్తకం
2012-05-12
కౌముది మాసపత్రిక: మాతృదేవోభవ
కౌముది మాసపత్రిక: కౌముది - మే 2012 సంచిక విడుదలైంది
Welcome to Avakaaya.com: నిన్ను చూసినంతనే
జ్ఞాపకాల గుబురులో ఆకుపచ్చని ప్రశాంతం ||నిన్ను||
ఆ ఆకసాన తేలు జాబిలికి చాలు ఒక పున్నమి
నా జాలితనము కోరునే ప్రతిరోజు వెన్నలని
ఇది వరమో శాపమో లేక సుమశరుని జాలమో!
సిరిమల్లె మురిసి విరిసేటి మధుర కాలమో! ||నిన్ను||
అలలేని సాగరమా నీవు! మేఘాలు చూడని సౌందర్యమా!
నునులేత చివురుల ముద్దులిడే మంచుముత్యమా!
ఇది కన్న కలనా విన్న కథనా లేక జన్మజన్మల స్మృతినా?
సెలయేటి నీటి పాటలో కదిలే వర్షగీతమా? ||నిన్ను||
కొలనులోని కలువకు ఆ నీరే అద్దమా!
ఒక చూపురాయి వేసినంతనే చెదిరేది అందమా?
నిష్పల ఎడారి దారిలో ఏలనో పూల నర్తనం?
కశ్మలమంటని గుండె లోతులో కన్నీటి వర్తనం! ||నిన్ను||
2012-05-11
Welcome to Avakaaya.com: వైకుంఠపాళీ - ఎనిమిదవ భాగం
| గతవారం: సుబ్రహ్మణ్యం అనే పదహారేళ్ళ యువకుణ్ణి తీసుకువచ్చిన శర్మ ఆ అబ్బాయి తన తండ్రి గురువుగారి మనవడిగా సుమతికి పరిచయం చేస్తాడు. ఆ అబ్బాయికి పౌరోహిత్యం నేర్పించడానికి తీసుకువచ్చానని చెబుతాడు. సుబ్రహ్మణ్యం శర్మ ఆశించిన విధంగా ఆసక్తి చూపకపోవడంతో సుమతిని కారణాల్ని కనుక్కోమంటాడు. సుమతి ఎన్నోవిధయం ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అతనికి పౌరోహిత్యం నేర్పిస్తానని పట్టుబడతాడు కేశవశర్మ. దాంతో సుమతి ఆందోళనకు గురౌతుంది. మరోవైపు ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ దిగాలుగా కాలం గడుపుతుంటాడు. |
“నాలుగు నెలల క్రితం ఇలాంటి దృశ్యమే ఉండింది. అనంత్ పనిచేస్తున్న కంపెనీ మూతపడి పోయిందని తెలిసినప్పుడు జరిగిన రభస గుర్తుకొస్తోంది. అప్పట్లో ఉన్న అలజడి ఇప్పుడు తనలో లేదు. ఈ ఓరిమి ఎక్కడినుంచి వచ్చింది? నాలుగు నెలల్లో ఇంతలా మారడం ఓ మనిషికి సాధ్యమా? ఇప్పుడు అనంత్ ను చూస్తుంటే కోపం రావడం లేదు. ఓ నాన్న తన కష్టార్జితంతో కొనిచ్చిన ఖరీదైన కలాన్ని ఎక్కడో పారేసుకొచ్చిన కుర్రవాణ్ణి లాలించి, ధైర్యం చెప్పే తల్లిలా ఉంది తన మనసు.”
మళ్ళీ తల్లి పోలిక రావడంతో లోలోపలే ఉలిక్కిపడింది రంజని – “పావని తనను అమ్మతో పోల్చింది. ఇప్పుడు తన మనసు తనే తల్లితో పోల్చుకొంటోంది. ఏమిటీ తల్లిదనం? నాలుగు నెల్ల క్రితం పోగొట్టుకున్నానని బాధపడింది దీని కోసమేగా!” – రంజని మనసులో ఆలోచనల పరంపర సాగిపోతూనే ఉంది.
“నువ్వలా సైలెంటుగా ఉంటే నీకు కోపమొచ్చిందేమోనని నాకు భయం.” అన్నాడు అనంత్. తనని తాను ఇంకా ముణగదీసుకుని పడుకున్నాడు.
“నాకెలాంటి కోపం లేదుగా! నువ్వు పడుకొన్నావేమోనని ఊరకేవున్నా!” అంది రంజని.
“లేదు. నాకు నిద్ర రావడం లేదు. ఏదైనా మాట్లాడు. ప్లీజ్!” అన్నాడు అనంత్.
కంపెనీ నుండి బైటపడి ఇంటికి వచ్చినరోజు నుండీ రంజనితో మాట్లాడే ప్రతి వాక్యం చివరా “ప్లీజ్” చేర్చడం అలవాటైపోయింది అనంత్ కు. ఆ రెండక్షరాల్లో అతని మనసు, దేహంలో పేరుకుపోయిన నిస్సహాయత ప్రతిధ్వనిస్తోంది.
“కాలేజ్ లో నాకు సుత్తి రంజని అనే టైటిలుండేది. అదిప్పుడు పనికొస్తోంది.” అంది రంజని.
“ఊ…” అన్నాడు అనంత్.
గొంతు సవరించుకుని “ఆన్ ద పాపులర్ డిమాండ్ ఆఫ్ అవర్ లిజనర్స్…వుయ్ ఆర్ బ్రింగింగ్ టు యూ సమ్ బోన్ టికిలింగ్ జోక్స్…ఎంజాయ్ గైస్..” అని గట్టిగా అరిచింది రంజని. అనంత్ కూడా నవ్వాడు. “ఇంకా జోకే చెప్పలేదు అప్పుడే నవ్వితే ఎట్లా లిజనర్…సేవ్ యువర్ లాఫ్….హియర్ వుయ్ గో…” అని మళ్ళీ అరిచింది రంజని.
“ముగ్గురు ఫ్రెండ్స్ ఎడారిలో చిక్కుకుపోయారు. వాళ్ళకి ఓ మ్యాజిక్ లాంప్ దొరికింది. దాంట్లో నుండి ఓ భూతం బైటకొచ్చి ఆ ముగ్గుర్నీ ఒక్కో కోరిక కోరుకోమంది. మొదటివాడు ఇంటికెళ్ళిపోవాలన్నాడు. వూ..ఫ్…వెళ్ళిపోయాడు. రెండో వాడూ అదే కోరుకొన్నాడు. వాడూ వెళ్లిపోయాడు. అప్పుడు మూడో వాడూ ’భూతం! భూతం! ఒక్కణ్ణైపోయి బోర్ కొడ్తోంది. నా ఫ్రెండ్స్ ను ఇక్కడకు పిలిపించు’ అన్నాడు.”
“ఓల్డ్ జోక్!” అన్నాడు అనంత్.
“ఓ..రియల్లీ! ఓకే…హియర్ వుయ్ గో ఫర్ ద సెకండ్ జోక్…బిల్ గేట్స్ చచ్చి పైకిపోయాడు. అక్కడన్న దేవత ఒక పెద్ద స్క్రీన్ పై రెండు లోకాల్ని చూపించి నీకేది కావాలో కోరుకో అంది. గేట్స్ బాగా చూసాడు. రెండో లోకం బ్యూటిఫుల్గా కనబడింది. ’ఇదేం లోకం?’ అన్నాడు. ’నరకం’ అంది దేవత. ’రియల్లీ! నరకమంటే భయంకరంగా వుంటుందనుకొన్నానే ఇట్స్ లుకింగ్ ఫెంటాస్టిక్. నేనక్కడికే వెళ్తా’ అన్నాడు. బిల్ వెళ్ళి నరకంలో పడ్డాడు. అది నిజంగానే భయంకరంగా ఉంది. అక్కడున్న ఓ యమకింకరుణ్ణి పట్టుకొని ’బాస్! ఇటీజ్ రియల్లీ హారిబుల్ ఓవర్ హియర్. ఆ దేవత చూపించిన స్క్రీన్లో నరకం బ్యూటిఫుల్గా కనబడిందే!’ అన్నాడు. దానికి ఆ కింకరుడు నవ్వి ’బాస్! నువ్వు చూసింది మా స్క్రీన్ సేవర్ని’ అని కెవ్వుమని కేకలేస్తున్న గేట్స్ ను తోసుకొంటూ పోయాడు.”
“హాహాహా…బాగుంది. వన్ మోర్!” అన్నాడు అనంత్.
“కొన్ని రోజులు నరకంలో ఉన్న గేట్స్ స్వర్గాని కెళ్ళాడు. అక్కడున్న దేవదూత గేట్స్ ను పెద్ద తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడంతా పాలరాతి జారుడుబండలు ఉన్నాయి. బిల్ గేట్స్ కి జారుడుబండలంటే చాలా ఇష్టం. వెంటనే ఒక పేద్ద జారుడుబండ ఎక్కి జర్రున జారాడు. ఆ బండ చివరికి వస్తుండగా గేట్స్ పిర్రకు ఒక చిన్న రాతి ముక్క గీసుకుపోయింది. చాలా బాధతో గట్టిగా అరిచి ’వాట్ ఈజీదిస్ ఏంజెల్ గారూ!” అన్నాడు. ’ఓహ్! సారీ సర్! ఐ థింక్ ఇట్స్ ఏ స్మాల్ బగ్ ఆన్ ఎ బిగ్ ఫాల్. ఐ విల్ ఫిక్సిట్ మిస్టర్ గేట్స్’ అందా ఏంజెల్.”
అనంత్ గట్టిగా నవ్వాడు.
“నీకు అటల్ బిహారీ వాజపేయీ, జనరల్ ముషర్రాఫ్ జోక్ తెలుసా?” అంది.
పుస్తకం: Tree, My Guru – పరిచయం
2012-05-10
Welcome to Avakaaya.com: ఎక్కడ నీ చిరునామా?
చరిత్ర అలల పల్లకీనెక్కి
లోకసంచారం చేస్తూనేవుంటుంది.
నీతి పద్యాల పాదాలు అరువడిగి
యుగాల పుటలనిండా
శిలా శాసనాల చిత్ర పటాల్ను
ఆవిష్కరిస్తూనే పోతుంది.
అవాస్తవికత అద్దాల్లో
అందని ప్రతిబింబమై
వగలు పోతూనేవుంటుంది.
స్వప్న ద్వీపాల్లో సంచరించే
కలల కౌగిలి కొలువులా
వుండీ లేనట్టు
శూన్యం చెట్ల మధ్యన
ఈదురు గాలిలా ఊయల్లూగుతూ
చీకటి చాటున గొంతుచించుకునే
కీచురాయి శృతిలా
గానలహరి పంచుతూనేవుంటుంది.
ఎన్నాళ్ళీ దాగుడు మూతల దండాకోర్?
ఎన్నాళ్ళీ వంచన పరదాల వెనక
వామన గుంటలాట?
నేనూ నా ఉనికే ప్రపంచ మనుకున్నప్పుడు
రెక్కలు పుట్టిన అహం పెదవుల మీద
వంచన నయగారాలు కువకువలాడే వేళ
మౌనంగా నన్ను నిలదీసే నాప్రశ్నకు జవాబుగా
ఎక్కడని గాలించను?
అలిగి కూర్చున్న ఆశల చిన్నారిని
ఏ బొమ్మతో బులిపించి
నీ ఉనికిని ఏమార్చను?
బ్రతుకంతా పరచుకున్న నడి సంద్రపు హోరు
ఏ కట్టుగొయ్యలకు బంధీని చెయ్యను?
వేడి తగలని కార్చిచ్చులా
మందులేవీలేని మహమ్మారి రోగంలా
రూపమెరుగని మారణాయుధంలా
క్షణ క్షణం గుండెల్లో శిధిలాల్ను పేర్చే
కసాయితనం కళ్ళనీడల్లో
చూపుకోల్పోయిన మేం
ఎక్కడని పరిశీలించం?
గాలానికి వేళ్ళాడే
కొనవూపిరి నిట్టుర్పుల
జీవచ్చవాల కళేబరాల్లో
సొమ్మసిలిన
మానవ మేధస్సు
మలుపుల్లో నీరెండగా మలిగి పోయే
మానవతా ఎక్కడ నీచిరునామా?
పుస్తకం: మళ్ళీ బాపు కొంటె బొమ్మలు
2012-05-09
Welcome to Avakaaya.com: వేంకటేశ్వర (విన్నప) గద్యము
(మూల రచయిత పేరు తెలియదు)
2012-05-08
పుస్తకం: డి. కేశవ రావుగారి మృతి
Welcome to Avakaaya.com: కమ్యూనిజం, సోషలిజం వగైరాలు కొత్త సిద్ధాంతాలా?
ఆర్ధిక నిపుణుడైన కార్ల్ మార్క్స్ కే ఇంత దార్శనికత ఉంటే మన ఋషులకు ఎంత ఉండి ఉంటుంది? వాళ్ళు దర్శించి, శిష్యులకు అందచేసిన విజ్ఞానం కలి ప్రభావం వల్ల వక్ర భాష్యాల, ప్రక్షిప్తాల మరుగున పడి ఎవరో ఎప్పుడో మహాత్ములు బయటకు వచ్చి వివరిస్తుంటే విస్తుపోతున్నాము మనము.
మన స్థితి అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసి ఇంట్లోనో బ్యాంకు లాకరు లోనో దాచి అక్షయమైన బంగారాన్ని పొందిన అనుభూతుని అనుభవించే స్థాయిలో ఉంది. పెరుగుట విరుగుట కొరకే అనే నానుడి సర్వకాల సర్వావస్థలలోనూ వాస్తవం. ఇప్పుడు పర్యావరణం పై పెరుగుతున్న ప్రేమ, సహజ ఉత్పత్తుల వినియోగం పై మోజు, అలాగే సమాజంలో పెరుగుచున్న భ్రష్టాచారం, వైదికత పట్ల ఆశక్తి మొ. నవి సమాజ పరిణామ క్రమంలో భాగాలే.
అసలైన కమ్యునిజం "వసుధైవ కుటుంబం" అనే వేదోక్తి నుంచి వచ్చినదే. సహజమైన (ఆరోగ్యకరమైన వస్తు, సేవల ఉత్పత్తి ద్వారా కలిగిన) సంపద అవసరమే ఆధారమైన తారతమ్యమేరుగని సంపద పంపిణీ వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసి భావి పరిణామాలు అనడంలో మనం సందేహపడవలసిన అవసరం లేదు. అలాగే విజ్ఞానం వికసించి ప్రజలకు అందుబాటులోకి వచ్చినపుడు దానితో పాటు వెర్రితలలు వేసిన అవినీతి కూడా ఆ విశిష్టమైన విజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది. ఇక్కడే మానవ జాతి నైతికత పరీక్షకు గురౌతుంది.
ప్రాచీనులు ప్రవచించిన జీవన విధానాన్ని ఒకసారి సరిగ్గా పరిశీలించి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు దొరికాయి నాకు. అవేవంటే
- అనవసరపు కోర్కెల్ని అదుపులో పెట్టుకోవడం.
- అక్రమంగా డబ్బు సంపాదించకుండా ఉండడం.
- Investment కంటే Divestment కే ప్రాధాన్యతను ఇవ్వడం
- ఉన్నదాంట్లో కొంతభాగాన్ని ఇతరులకు పంచడం.
- నియమబధ్ధమైన జీవిన విధానాన్ని కలిగివుండడం.
- నోటితో చెప్పడమే కాకుండా ఆచరించి చూపడం.
- ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం.
పైవాటిల్లో ఆధునికులు పెదవి విరిచే సో కాల్డ్ "మూఢనమ్మకం" ఏదో అర్థం కాలేదు! ఏమైనా, మన మూలాల్ని మరోసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలావుంది.
Better late than never.
2012-05-07
పుస్తకం: We’re back! (అని అనుకుంటున్నాం :) )
2012-05-06
Welcome to Avakaaya.com: నాలోపటి సూరీడు
ఆకాసంలో అంటుకొన్నాడు చందమామ
ఆకలేసిన బిచ్చగాడికి ఇంతకంటే కవిత్వం రాదు
గ్లాసంచున దుమకబోతున్న
ఐసు చుక్కలా చందమామ
నషా కాషాయ తాషామర్ఫాలో
జోగుతోన్న జోగి, జోగినీమణికి
అంతకంటే పైత్యమెక్కవే!
చీదగా మిగిలిపోయిన
చీమిడి చుక్కలా చందమామ
మొగుడు చాటు పెళ్ళాంకు
అప్పుడు, ఇప్పుడూ వొకే చంద్రడు
చిట్లిపోయిన చుక్కల్ని చూసి
చంద్రుడు బావురుమంటుంటే
మంటల తలతో నవ్వతాడు
నాలోపటి సూరీడు!
2012-05-04
Welcome to Avakaaya.com: వైకుంఠపాళీ - ఏడవ భాగం
| గతవారం: భర్త చెప్పిన విధంగా చుట్టుపక్కల వున్న చిన్నపిల్లల్ని పిలిచి తినుబండారాలను పంచుతుంది సుమతి. తన భార్యలోని ప్రాయశ్చిత్తభావనకు, తన మాటల పట్ల ఆమెకు వున్న విశ్వాసాన్ని చూసి సంతోషిస్తాడు శర్మ. కొత్త కంపెనీలో చేరిన అనంత్ తన అహంభావ పోకడల్తో కంపెనీ యజమానితో గొడవలు నిర్లక్ష్యం చేస్తాడు. అవకాశం కోసం వేచిచూస్తున్న ఆ యజమాని కొన్ని చిన్న కారణాల ఆధారంగా అనంత్ ను ఉద్యోగంలోంచి తీసేస్తాడు. |
పదిహైదు, పదహారేళ్ళ అబ్బాయిని వెంటబెట్టుకు వస్తున్న భర్తను చూసి, వరండాలోకి వచ్చింది సుమతి.
“సుమతీ! ఈ అబ్బాయి తాతగారి దగ్గర మా నాన్నగారు వేదాధ్యయనం చేసారు.” లోనికి వస్తూనే సూటిగా విషయంలోకి వచ్చాడు శర్మ.
“ఓ! అవునా! ఏం పేరు బాబూ?” అని అడిగింది సుమతి, శర్మ చేతిలోని సంచీని తీసుకుంటూ.
“సుబ్రహ్మణ్యం” అన్నాడా అబ్బాయి.
“లోపలికి రా!” అంది సుమతి, గుమ్మం దగ్గరే నిలబడిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూసి.
“ఏరా అబ్బాయ్! ఆచార్య పదాన్ని వదిలేసావెందుకు?” అన్నాడు శర్మ, మందలిస్తున్నట్టుగా.
“ఓహో! సుబ్రహ్మణ్య ఆచార్యనా!” అంది సుమతి నవ్వుతూ.
అవునన్నట్టు తలూపాడా అబ్బాయి.
సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ “పెరట్లో కెళ్ళు. స్నానాలగది అక్కడే ఉంది. కాళ్ళుచేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళు.” అన్నాడు శర్మ.
అలాగేనన్నట్టు తలూపాడు సుబ్రహ్మణ్యం.
“సుమతీ! వీడికి సంధ్యావందనం పాత్రలివ్వు. సాయంసంధ్య నేర్పించాలి.” అన్నాడు శర్మ.
------
2012-05-02
కొత్తపల్లి: ఒక పిల్లి స్వగతం
రచన: డా.ఉమాశంకరి, సునీత, వెంకట్రామాపురం, చిత్తూరు జిల్లా.
కొత్తపల్లి: కాలం విలువ
రచన: యస్.రాజేశ్వరి, 8వతరగతి, జిల్లాపరిషత్ హై స్కూల్, పెద్దపప్పులగ్రామం, అనంతపురం జిల్లా.
2012-05-01
భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక: అగ్నిపుత్రి
ఈమాట: ఈమాట మే 2012 సంచికకు స్వాగతం!
ఈమాట: ఒక పుస్తకం
ఈమాట: లక్ష్మణదేవర నవ్వు
ఈమాట: చందవరం, ప్రకాశం జిల్లా
ఈమాట: పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2
ఈమాట: వలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున
ఈమాట: బ్రహ్మ సృష్టి
ఈమాట: అద్దంలో జిన్నా
ఈమాట: కాల్వీనో కథల నుంచి - 3
ఈమాట: అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం
ఈమాట: నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన
ఈమాట: కినిమా పత్రిక నుంచి - 3
ఈమాట: తేనీటి సమయం
ఈమాట: సురవర తెలుగు కీబోర్డ్
ఈమాట: ఆషాఢస్య ప్రథమ దివసే
ఈమాట: బాల బేలవు ముద్దరాల
ఈమాట: మూడు లాంతర్లు -11
ఈమాట: మేఘసందేశం - ఆడియో రూపకం
ఈమాట: హాబూ నిప్పు
ఈమాట: ఓ నాలుగు చిన్న కవితలు
ఈమాట: జాతర
ఈమాట: దీక్షా లాక్షా రాగ రేఖ
Mydukur | మైదుకూరు: గోవింద నామస్మరణతో మారుమోగుతున్న బ్రహ్మంగారిమఠం
2012-04-30
విహంగ: సంపాదకీయం
చాలా ఆలస్యంగా ఈ సినిమా ఇవ్వాళే చూశాను. విపరీతంగా నచ్చేసింది. The characters are still playing on my mind! Amazing movie.
I think Annu Kapoor just rocked it! He was fabulously good! Since I was so used to watch Ayushman on MTV, I knew he’d do it well. I liked the Punjabi attitude of his character, even in most intense emotional scenes. Yami is Fair and Lovely gal, and it was only matter of time, before she appeared on the big screen. (I feel, this- most of the gals enacting an ad for F&L end up on big screens – is the biggest selling point of the product, than some of its crappy ad film ideas.)
But above all, the true hero of this venture was Juhi Chaturvedi. OMG! She did an incredible job and with such ease?! Mindbogglingly good. The movie was so Indian, that I wouldn’t mind even if it is lifted from elsewhere. Bollywood is going places, at least sincerely attempting to learn to fly!
raama gaaru: Here is the link.
ఆ డీ ఎల్ ఐ లింకు ఏదో ఇక్కడ ఇచ్చేస్తే మరింత మంది చదివేస్తాము కదండీ?
మీ మీ అందరి అభిప్రాయాలకు కృతజ్ఞతలు
మూసుకోండి rarey cinema theesama డబ్బులు వచ్చాయా అంతే ఎందుకు రా ఇవన్ని సోది …
500044 కరెక్ట.
మీ పిపిన్ను కొదు ఎది? 500 044? లెక 500 016? సాహితి కి జవాబు చూడండి.
kamal is very best hero in south indian film industry, there is no alternate hero
సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. - కామేశ్వరరావు
చదివాను. నచ్చింది.
లైలా.
“మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు.”
It looks (at least for the duration of this essay.:-)) the essayist views Meghadutam primarily as a ‘viraha kavyam.’ And, Since he is thinking along those lines, he tries to attribute to the meter Mamdakramta, traits of -graveness, sadness.
I do not buy into either premise.
After reading all poems in Meghadutam, I do not think, over all, the poetry is about ‘viraham.’ I am not denying viraham’s presence in this writing. I am saying it is a smaller component of a bigger theme.
Why should one ignore the recurring themes of cloud-earth, cloud-river. The cloud (who is continuously instructed by Yaksha himself, to be a ‘dakshina nayaka’ and enjoy himself, all the way.) - What about the mythical characters and lovely anecdotes about them, that come up in several Mandakranta poems and charm us.
I really don’t think Kalidas has much interest to tell the readers, the story of Yaksha. Nor to make his grief the main focus of his writing. Did you look at the fastness with which he disposes off the outline of the story, in the very first poem. The poet could not wait to get out of it and get into the beautiful outdoors.
Notice the poet did not even bother to complete Yaksha’s story, whether he is reunited with his beloved wife or not?:-)
The Meghaduta kavyam is neither a Viraha kavyam nor a Samdesa kavyam, in the way the writer projects, in this essay. If there is a message in the kavyam, it is a bigger and broader message, and please! give me a break - it is not spiritual. :-) :-) in the sense, the Indian religious tend to use it. God! It is not Svami and Yogi spiritual. Kalidasa is more with clouds, daffodils, and woods, more with that Shelley, that Wordsworth, and that Frost here. The poetry is a Mapquest mapping of a scenic route -for the meandering, exploring, the nature loving, and erotic soul. People get on aeroplanes, get in cars, go trekking when they read stories and poetry such as this one.
If one must catalogue :-) I would rather see the Meghadutam kavyam thrown under “Travel” section. Put it next to Peter Mayle’s book “A year in provence” - They will sit well together. And keep giving incredible happiness to millions of readers.
లైలా
ఉమా గారు ..హిందీ నాకు తెలుసును,
) మంచు బిందులు సూర్య కిరణాలు తాకిడికి కరిగిపోక తప్పదు. కిరణం స్వభావం చీకట్లను చీల్చడమే..కదా! థాంక్ యు వేరి మచ్.
“శబ్నం” అ౦టే మ౦చు బి౦దువు అని అర్థం! అ౦టే ‘dew drop ” అని!
తఃతః గారు,
రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము -
కం. గణనియమ విపర్యాసదొ-
లేణెవడెదొళ్పెసెదు మాత్రె సమనాగె గుణా-
గ్రణియ మతదింద తాళద
గణనెగొడంబట్టు దదువె రఘటాబంధం (నాగవర్మ)
ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు -
స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః
ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.
విధేయుడు - మోహన
ప్రసాద్ గారూ,
అ. బండరాళ్ళ ప్రదేశాల్లో ఉండేవాళ్ళకి కొన్ని రాళ్ళ మీద చట్టులా ఉండి, అందులో నీరు నిలవడమూ, ఆ నీటి కోసం కాకులు ఆ బండ మీద చేరడమూ ఒక దృశ్యానుభవం. లేదూ ఆ బండ ఒక బావి బండగా, ఆ చట్టు బిందెలు, కుండల ఒరిపిడి వల్ల వచ్చినదీ కావచ్చును. ఆ చట్టులో నీరెండిపోయినా కూడా కాకులు అలవాటుగా దాహమేసినప్పుడల్లా ఆవైపుకు రావడం, బండ మీద వాలడం, లేకపోతే ఒకసారి బండ చుట్టు తిరిగి వెళ్ళిపోవడం కూడా పరిచయమైన దృశ్యమే. ఇంకెక్కడా నీళ్ళు దొరకని కాకి నీరున్నా లేకపోయినా ఈ బండమీదే చివరికి వాలిపోతుంది. ఈ అనుభవం ఉన్న పాఠకుడికి బండమీద కాకులు చచ్చెను అన్న పాదం వేసవి గురించిన కవితలో అసహజంగా కనిపించదు సరికదా ఎంతో ఔచిత్యంగా కనిపిస్తుంది. అంతే కాకుండా, పాదభావాల పునరుక్తితో గతిని సాధిస్తున్న కవి, ఎండనూ చావునూ ఆ తర్వాత వచ్చే పాదాల్లో మళ్ళీ కలిపే వాడుకోవటం ద్వారా కవిత నిర్మాణంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించాడని అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వానుభవపు లేమి కవి లోపం కాక, పాఠకుని వైయక్తిక పరిమితిగా కూడా పరిశీలించవచ్చునని నాకనిపిస్తున్నది (ప్రత్యేకించి, ఇతరత్రా పకడ్బందీగా ఉన్న కవితలో.)
ఆ. ఇకపోతే, ఔచిత్య భంగానికి -
లౌక్యంగా బయటి సామాజికులు - అంటే విమర్శకులు, పాఠకులు, సంపాదకులు వంటివాళ్ళను దృష్టిలో ఉంచుకొని శిల్పాన్ని పూర్తిచేసేడా లేక కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్నాడా, అసలు శ్రద్ధ పెట్టి పని పూర్తి చేసేడా లేదా అనేది పట్టి చూస్తే తెలిసిపోతుంది.
- అన్న అభిప్రాయం పూర్తిగా సరి కాదని నాకనిపిస్తున్నది. బైటివారినెవరినో దృష్టిలో ఉంచుకొని సృజననీ, శిల్పాన్నీ ఎవరైనా ఎలా ప్రయత్నిస్తారు? (రిటైర్మెంట్ ఫంక్షన్లో అలవాటుగా ఇచ్చే గడియారపు ఫలకం మీద అచ్చేయడం కోసం మా బాబాయి చేత అందరూ రాయించుకునే పంచరత్నాలు అనే ఐదు వృత్త పద్యాలు మినహాయింపు, ఇందుకు.) ఈ కారణం వల్ల ఔచిత్య భంగం జరిగిందనే ఊహకు ఆధారమేమైనా ఉన్నదా?
లౌకిక కల్మషంలేని సృజనలో కూడా ఔచిత్యభంగానికి, ఉద్వేగపులేమికి నాకు కనిపించిన రెండు కారణాలు.
1. మీరు చెప్పినట్టు కాకుండా మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని అన్నది అసలు ఒకటుందనీ, అది చాలా శ్రద్ధతో చేయాలనీ తెలియకపోవడమే కాదు, అంతకు మించి ‘ఔద్వేగిక ప్రధానంగా దాదాపు అప్రయత్నంగా వెలువడినదే‘ నిజమైన కవిత్వమనీ, దానినేమాత్రం సవరించబోయినా, భావావేశం చచ్చిపోయి అది కవితే కాకుండా పోతుందనీ ఒక బలమైన అపోహ ఎంతోమందిలో (ఎంతో చదువుకున్న వారిలో కూడా) ఉండటం వల్లనే రచనలో అపరిపక్వత, దాని వల్ల ఔచిత్యభంగం కలుగుతున్నది. ఈ అపోహ మరీ అరుదైనది కాదని ఎక్కువ శ్రమపడకుండానే నిర్ధారించుకోవచ్చును.
2. ‘బైటివారి కోసం’ శిల్పాన్ని పూర్తి చేయడం కంటే ‘బైటివారికి దూరంగా’ అనేది ఇంకో కారణం. …కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్న కవి, ఆ సృజనపై ఒక మూఢానురాగాన్ని పెంచుకోవడం ఇది. గుడ్డిప్రేమ అని అంటారే అలా, తన రచనలో (తనలో) లోపాన్ని తనే గమనించలేకపోవడమూ ఉన్నది. నాకు పుట్టి నేను పెంచిన బిడ్డ బాగోగులు నాకంటే బాగా ఇంకెవరికీ తెలియవు అని బలంగా నమ్మే ఒక తండ్రి లేదా తల్లి మనస్తత్వం ఇలాంటిదే. విమర్శలకు, సలహాలకు వెఱపు ఇందువల్లేనని నా అభిప్రాయం. దానివల్ల, తన రచనను తాననుకున్న విధంగా మాత్రమే కాకుండా ఇంకోరకంగా కూడా ముస్తాబు చేయడానికి, ఆ రచనలో తానుద్దేశిస్తున్న ఉద్వేగాన్ని ఔచిత్యాన్ని, తానూహించినదానికి భిన్నంగా, మరింత బలపర్చడానికి వెసులుబాటు ఉండవచ్చునని నమ్మలేక పోవడం వల్ల, ఎంతో శ్రద్ధ పెట్టి చిత్రణ పూర్తి చేస్తున్నా కూడా ఔచిత్యభంగం కలుగుతూనే ఉన్నది. ఈ ప్రవృత్తి అహం లానే పైకి కనిపించినా నిజానికి కాదు. అహం కూడా కొంతమందిలో ఒక కారణమైనా, అది లౌకిక తత్వ సంబంధి కాబట్టి అప్రస్తుతం.
నాకు చాలా కాలం క్రితం సినిమాలకి ఎడిటర్, డైరెక్టర్ వేరే వేరే ఎలా ఉండగలరు, అని సందేహం పట్టి పీడిస్తుండేది. తీసే సినిమా మొత్తం (కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం) దర్శకుడి సృజన అయినప్పుడు, ఆ సృజనను ఎలా ఆవిష్కరించాలో, ఎలా సమర్పించాలో అతనికంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అందువల్ల డైరక్టరే ఎడిటర్ కూడా కావాలి కదా. మరి అలాంటప్పుడు, వేరే వ్యక్తి ఎలా ఆ సినిమాను ఎడిట్ చేయగలడు? కానీ ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాలకు కూడా ఎడిటర్లున్నారు. తన సృజనకు (దీటైన భాగస్వామిగా) చక్కగా మెరుగు పెట్టగలడన్న నమ్మకం తన సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న దర్శకుడికి ఉండటం వల్లనే కదా ఇది సాధ్యం; లేని పక్షంలో పైన చెప్పిన మూఢానురాగం ఇందుకు అడ్డుపడి ఉండేది. సృజనకు, ఆ సృజన మూలాన్ని తత్వాన్ని గుర్తించి చక్కగా ముస్తాబు చేసి సమర్పించడం అనే ప్రక్రియకు ఉన్న నాజూకైన తేడా గమనికకు రావడంతో ఆ సందేహం నాకు తీరిపోయింది.
దిశానిర్దేశం చేయగలిగిన విమర్శకులు, పాఠకుల తోడ్పాటు లేకపోవడం అనే లోటుని కూడా నేను గమనించాను. ఉదాహరణకి, ఆదివారం మధ్యాహ్నం కవయిత్రికి మీలాంటివారు పరిచయమై ఉండి, (ఆమె కేవలం ఔద్వేగిక / అప్రయత్న కవి కాకపోయి ఉండి) మీ విమర్శ తోడ్పాటు ఆమెకు ఉండి ఉన్నట్టయితే, ఆ కవిత మరింత బలంగా ఉండేది కదా! అలా జరిగిందో లేదో (అంటే ఆ కవితను ముందుగానే చదివి ఆమెకు ఎవరైనా విమర్శ, సలహా ఇవ్వడం వంటివి) నాకు తెలియదు కాబట్టి, ఇది కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను.
మాధవ్
సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. మోహనగారీ వ్యాసంలో మందాక్రాంత ఛందస్సును గురించి చేసిన విశ్లేషణ వంటిదే ఈ పరిశోధనాపత్రంలో కూడా ఉంది. ఇందులో రచయిత ప్రతిపాదిస్తున్న కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవారికి (ముఖ్యంగా మోహనరావుగారికి!) యిది చాలా ఆసక్తికరమూ, ప్రయోజనకరమూ అవుతుందని భావిస్తున్నాను.
really mother is great person in life . nice poem .
ఇంత కాలంగా మీరు మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసారు. చాల థాంక్స్ ఉమా గారు.రియల్లీ ఇట్ ఇస్ వండరఫుల్ ఇంటర్వ్యు. congrats both of you . hemalatha putla and you .
మహీధర గారు నేను ఈ..క్రింది మీ అభిప్రాయం తో.. ఏకీభవిస్తాను.
వివాహ బంధంలో ఇలాంటివి స్త్రీ చేసినా , పురుషుడు చేసినా తప్పు తప్పే.
అందరూ చేస్తున్నారని , మేము చేస్తే తప్పేంటని ప్రశ్నించటం వివేకం కాదు ఎవరికైనా.
స్త్రీ ,పురుషుల మధ్య ఆకర్షణలు సహజమే. వాటికి లోనవ్వడం కూడా అంతే సహజం .
ఒక బంధానికి కట్టుబడ్డ వారికి నిగ్రహం కూడా అవసరమే.ఇతరుల కుటుంబాలను , ముఖ్యంగా కన్న పిల్లలను ఛిద్రం చేసుకోవటం ఆధునికతా?
ఈ సంబంధాలలో బాగా నష్ట పోతున్నది అమాయకులైన భార్యలు.పిల్లలు.ఇంకో కొత్త కాపురం పెట్టుకొని బిడ్డల్ని కంటూ ,సర్వ సుఖాలు అనుభవించే వారు , ఆర్ధిక ఆలంబన లేని తమ భార్య పిల్లలు లేదా భర్త ఆ తర్వాత ఎలా బతుకులు ఈడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?చదువులు చెప్పించే వాళ్ళు లేక జులాయిలై తిరిగే కొడుకుల గురించి, చదువులు మానేసి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాలను పోషించే కూతుళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించ గలరా?
బాధించే భర్తలని వదిలేసి కొత్త జీవితం ప్రారంభించటం వేరు.అది అవసరం కూడా.”
ఇక్కడి వరకు మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను.మహీదర గారు.
ప్రేమించే భర్తలు వున్నా కూడా ఇలాంటి వాటికి లోనవడం స్త్రీ వాదమా?
స్త్రీ వాదం దృష్టిలో ఈ నవల ని నేను చూడలేదు.
పెళ్ళయిన స్త్రీ మనసులో కూడా “ప్రేమ” పుట్టవచ్చును..అనే కోణం లోనే.. ఫీలింగ్స్ దృష్ట్యా..మాత్రమె నేను ఈ “తన్హాయి” నవలని చూసాను.
అయినా ప్రేమ అన్నీ ఆలోచించుకుని పుడుతుందా ..చెప్పండి?
“లవ్ హాజ్ నో సీజన్ నాట్ ఈవెన్ రీజన్”
ప్రేమ పుట్టిన తర్వాత మంచి-చెడు,విచక్షణ గుర్తుకువచ్చి మరో స్త్రీ జీవితం లో ప్రవేశించ కూడదు అనుకుని ఆలోచించి..విజ్ఞత తో వ్యవహరిస్తుంది.
అలాంటి పాత్ర “కల్హార” paaThakudu మెచ్చినా, మెచ్చకపోయినా..ఆ పాత్ర స్వభావం అది
పాఠకుడిగా మీకున్న సందేహాలకి ..సమీక్ష వ్రాసిన నేను .సంతృప్తి కలిగే రీతిలో వివరణ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంతటితో ఈ చర్చని ముగిద్దాం.
సుదీర్గమైన మీ అభిప్రాయానికి ధన్యవాదములు మహీధర గారు.
మోహన గారికి నమస్కారాలు. గణాలకు తగ్గట్టుగా విరిచి రాయడమా రాయక పోవడమా అన్నది (ప్రతిభా వంతుడైన ) కవి ఇష్టం. ‘పీరులు’/ విమర్శకులు /అధ్యయనశీలురు, కవితా గుణావగుణాలను కాక ఛందస్సును మాత్రమే పరిశీలించటానికి పూనుకున్నప్పుడు ఆ పరిశీలనలో భాగంగా, ‘తెలుగులో సంస్కృత ఛందమయిన రగడను వాడినా కొన్ని చోట్ల గణాలకు తగ్గట్టుగా విరిచిరాయక పోవడం కూడా ఉంది’
అని అనవచ్చేమో గానీ ‘పెద్ద లోటు’అన్న ఒక ‘విలువ’ ను ఆపాదించటం సబబేనా? ఇది ఛందానికి కూడా లోటు కాక పోవచ్చు దాన్ని తెలుగులో విరుపులు లేకుండా ఉపయోగించుకోవటంలో కవి కొన్ని కొత్త అందాలను కూడా తెచ్చిపెట్టి ఉండవచ్చు.
మిత్రుడు
తః తః
మానవ సేవే మాధవ సేవ అని తెలిసి రావడానికి ఇలాంటి కథలు ఎన్ని రావాలో .అమెరికా వాతావరణాన్ని చాలా బాగా చూపించారు.
.అందుకే ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ” అనుకుంది మనసులో.
ఇలా అనుకునే బదులు భర్తని వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అనిపించుకునేది.
ఇది మీ అభిప్రాయం .ఓకే.. స్వాగ తిద్దాం.. మహీదర గారు.
నిజ జీవితాల లో ఇలాటి వాటిని స్వాగతించి దైర్యం కల “కల్హార”లని ఆమోదించి నిజాయితీకి పట్టం కట్టడం.. మంచిదని అనుకుంటే.భారతీయ నాగరిక సమాజం తప్పక హర్షిస్తుంది.
ఈ భారతీయ స్త్రీలకి “భర్త” పిల్లలు వద్దు..ప్రేమికుడు..చాలు అనుకునేంత ఎదగాలని నేను కోరుకోవడం లేదు.
నేను కొంచెం చాందస భావం ఉన్నదానిని. ఏమనుకోకండి. “కల్హార”లు గడప దాటకూడదు.. అనుకుంటాను. అలాగే ఏ ప్రేమో,దిక్కు మాలిన ఆకర్షణ పుదితెనో.. రహస్యంగా మనసులో దాచుకో..అనే చెప్పే రచనలే చేస్తాను.
మనసా,వాచా,కర్మణా.. నూటికి నూరు పాళ్ళు పాటించి. భర్త నిమాత్రమే ఊహించి,ప్రేమిస్తూ….. ఏమైనా పిదప బుద్దులు పుడితే..
గౌరవంగా ఎన్కౌంటర్ చేసి పడేసి..పూటకొక గర్ల్ ప్రెండ్ తో తిరిగొచ్చిన భర్తకి పాద పూజ చేసి కళ్ళు వత్తుకుంటూ, కాళ్ళు వత్తుతూ. భారతీయ స్త్రీ ,సంప్రాదాయం అంటూ జేజేలు కొట్టించే రచనలు చేయాలని,వాటికి పొగుడుతూ వ్రాసే సమీక్షలు రావాలని కోరుకునే వాళ్లకి.. ఈ “కల్హార ; నచ్చదు,నచ్చదు,నచ్చదు. ..
గౌరవం గా కాపురం చేసే భార్య భర్తల మనస్సులో ఎవరి మనసులో ఏముందో..తెలియకుండా
ఉన్నంత కాలం ..అన్నీ పవిత్ర బంధాలే! అప్పుడు మానసిక వ్యభిచారాలు కనబడవు.
“కల్హార” లా బయట పెడితే.. అలా బయటపెట్టాక కూడా భర్త తోనే కలసి జీవిన్చాలనుకుంటే. మాత్రం మానసిక వ్యభిచారం.
ఇలా ..ఆలోచించే వారికి కల్హార నచ్చక పోవడం లో ఆశ్చర్యం లేదు.
నచ్చిన వాడితో..వెళ్ళిపోయే “కల్హార” కావాలి. ఆమెని భర్త,పిల్లలు..నిజాయితీగా మెచ్చుకోవాలి.
ఇలాటి రచనలు ఎప్పుడు వస్తాయో!
అప్పుడు తప్పకుండా సమీక్ష రాస్తాను.
ధన్యవాదములు. సెలవు.
.
రవి గారు,
1) సంస్కృత కవులు ఒకే విధమయిన వృత్తముతో ఆశ్వాసాలను వ్రాసారు, తెలుగు కవులు ఎన్నో విధములయిన పద్యాలతో వ్రాసారు. రెండు భాషలలో మంచి కవులు తమ ధ్యేయాన్ని సాధించారు. ద్విపదలో వ్రాయబడిన ఏకాంతసేవ టాగూరు గీతాంజలికి సమానమైనది కాదా?
2) నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే అక్షరసామ్య యతి లేక వడి ఉన్నది. తమిళములో నియమాలు తెలుగులోలా అంత కఠినమయినవి కావు. ఉదాహరణ - వ, మ లకు యతి చెల్లుతుంది. బహుశా మామ, మావ వంటి పదాలు దీనికి కారణము కావచ్చును. కన్నడములో విరామయతిని కూడ యతిని పాటించరు.
3) ద్రావిడ ఛందస్సులో ముఖ్యమైనది ద్వితీయాక్షర ప్రాస. ఇది అన్ని భాషలలో ఉన్నాయి, తెలుగులో మాత్రము ఉపజాతులలో యిది లేదు.
4) తమిళములో, కన్నడములో దేశి ఛందస్సులో కావ్యాలనే వ్రాసినారు. షట్పదులలో, సాంగత్యములలో (సీసములో చివరి సూర్యగణము సాంగత్యములో లుప్తము) సంపూర్ణ కావ్యములు ఉన్నాయి కన్నడములో. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే వీటిని పాడుకోవచ్చును. అంటే కన్నడములో, తమిళములో పాడుకోడానికి అనుకూలముగా కావ్యాలు ఉన్నాయి. కాని తెలుగులో యిట్టివి అరుదు. తెలుగు కావ్యాలు చదువుకోడానికి మాత్రమే వ్రాయబడ్డాయి. పాడుకోడానికి ప్రాస బాగుంటుంది.
5) వేమన పద్యాలు అందముగా నుండడానికి కారణము పదాల విరుపు, అందరికీ అర్థమయ్యే భాష. పాదాంత యతి ఉపజాతులలో ఎప్పుడూ ఉంటుంది.
6) యతి తద్దినము మాత్రము కాదు. తెలుగుతో కూడ అన్ని ద్రావిడ భాషలలో సామెతలు ఆదినుండి ఉన్నవి. అవి మన సంస్కృతికి ఒక కాణాచి. ఈ సామెతలలో అక్షరయతియో లేక ప్రాసయతియో ఎప్పుడూ ఉంటుంది. యతి, ప్రాసయతి వీటినుండి పుట్టాయని ఒక ఊహ. ఈ సామెతలపైన సురేశ్ గారి వ్యాసాన్ని ఎదురుచూస్తున్నాను :-)
విధేయుడు - మోహన
సృజనశీలికి జీవితం యావత్తూ ఉద్వేగ ప్రధానము, రస ప్లావితమైన అనుభవం - బయటికి తనకే స్పష్టాస్పష్టమైనా, లోలోతుల్లోన ఎల్లప్పుడూ తప్పనిసరి అయిన సృజన వేళ. సృజనశీలి జీవితాన్ని నిరంతరం ఇలా సృజనాత్మకంగా అనుభవిస్తూ, ఏ కొన్ని అనువైన ఘడియల్లోనో ఏవో కొన్ని అనుభవాల్నో మాత్రం సృజనగా వెలువరించుకోవటంలో కృతకృత్యమౌతున్నాడు. అంటే అతను తప్పనిసరిగా, తదేక ధ్యాసతో తలకెత్తుకున్న పని - సృజన లోన, దాదాపు ఎల్లప్పుడూ పరాజితుడు.
చాలా బాగా చెప్పారు కనక ప్రసాదు గారు.
ఇంద్రాణి పాలపర్తి .
యే భాషలోనైనా యేదైనా ప్రక్రియకు ఐనా మొట్టమొదట అనుసరించినవారి మార్గమే తర్వాతి వారికి అనుసరణీయమవుతుంది. ఆ తర్వాత మార్పు వచ్చినా ఆ మార్పు మొదటి మార్గానికి అనుబంధంగా ఉండడమే కద్దు తప్ప పూర్తి భిన్నంగా ఉండడం చాలా అరుదు. ’యతివిరామం’ పాటిస్తూ కావ్యరచన చేయడం తెలుగుకు నప్పదనో, అలా చేస్తే కావ్యసౌందర్యం సాధించటం కష్టమనో వ్యక్తిగతంగా నాకు నమ్మకం కలుగడం లేదు. వేమన ఒక చక్కని ఉదాహరణ. వేమన పద్యాలు ఒక కావ్యం తాలూకు భాగాలు కాకపోయుండవచ్చు, ప్రబంధవర్ణనలు లేకపోయుండవచ్చు, అయితే ’అక్షరసామ్యం’ లేదా ’ప్రాసయతి’ అనే తద్దినాన్ని అమలు జరుపుతూనే సాధ్యమైనంతవరకూ యతివిరామం పాటించి చూపించాడాయన. ఈ విషయం మీద వేమన వ్యాసాలలో రాళ్ళపల్లి వారు కొంత చర్చించారు. ఇక సంస్కృతసమాసాలతో, పదాడంబరత్వంతో ప్రయోగాలు చేసి, సమర్థించుకుందుకు ప్రౌఢివాదాలు చేసిన తెలుగు కవులు నాడూ నేడూ తప్పక కనిపిస్తారు.
>>అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి.
>>అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.
మరి రామాయణాన్ని, బసవ చరిత్రను, భాగవతాన్ని తదితర కావ్యాలను ద్విపదకావ్యాలుగా లేదా ఒకే వృత్తంలో చివరివరకూ మలచిన వారున్నారు కదండి? వాటిలో రసం కొఱవడిందని చెప్పడానికి వీలులేదు. అలాగే తెలుగులో వృత్తాలు లేకపోతే సంగ్రహత్వం సాధించడం కష్టం అన్నది కొంతవరకూ నిజం అయినా, సంగ్రహంగా దేశీఛందస్సులలో చెప్పగలిగిన భావాలను క్లిష్టంగా, ప్రౌఢంగా తీర్చిదిద్దడానికో, పాండిత్యప్రకర్షకో కవులు వాడుకుని, సామాన్యులకు దూరంగా తీసుకువెళ్ళటానికి కంటికెదురుగా నిదర్శనాలు కనిపిస్తున్నా ఎలా కాదనగలం?
ఈ పరంపర ఇలా కొనసాగడం వల్లే దేశీ ఛందస్సులలో సులభంగా ఇమడగల గాథాసప్తసతి వంటి కావ్యాలను శ్రీనాథుని తర్వాత ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. (రాళ్ళపల్లి వారి అనువాదం 300 పద్యాలవరకే ఉంది. శ్రీనాథుని కావ్యం ఇప్పుడు అలభ్యం)
>>యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం
>>జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు.
ఆ నియమం పాటించకపోవడానికి తగినంత స్వేచ్ఛాయుతవాతావరణం లేనప్పుడు, ఆధారాలు ఎలా వస్తాయండి?
అద్రుష్థ వశాత్ ఈ ప్రదేశం చూడటం జరిగింది. కళాపూర్నొదయం అందిస్తున్నందుకు క్రుతఘ్నతలు.
వెంకట.రెడ్డి.
You could get these handbags for each occasion. There is a huge variety for sale in these bags which might be available at specific stores. Whether you are a socialite or a working woman, http://www.goyardonline.com
offers Goyard bags for everyone. The internal designing is conducted inside a smart way. There is ample space to ensure you can place your valuable or documents in the proper way. You’ll have the ability to purchase a major handbag in accordance with your need. These handbags have some of pockets so that you may carry your money, mobile, stationary as well as other things separately in those pockets.
Goyard handbags really are a popular accessory among women. You are able to also gift this gorgeous asset in your friend, sister, mother or any lady to exhibit your respect and love on any occasion. Other than Goyard handbags stores -http://www.goyardreplica.com
, you can also find these bags over the shopping websites. This is a fairly easy way to find the best handbag for you without the confusion. You are able to search for various models of these handbags and judge a suitable model. It is very simple to position an investment and make payment because of these bags through shopping sites. Through this facility, you can find your favorite handbag your desired http://www.goyardreplica.com
in few days only.
అమ్మా! సాహిత్యాన్ని మీ కళ్ళతో చూడాలని , మీరు అర్ధం చేసుకున్నట్టే అందరు అర్ధం చేసుకోవాలని భావించకండి.
రామరాజభూషణుడు చెప్పినట్టు కవి, విమర్శకుడు ఇద్దరూ సహృదయత కలిగిన వాళ్ళు అయివుండాలి.
పాఠకులందరూ కూడా నిందలు వేసే దృష్టితోనే చదవరు. ఇలా మీ రచనని పాఠకుల కోసం వారి ముందు వుంచినప్పుడు నిజమైన నిందలు వేసిన వారిని వదిలేయటమో, అపార్ధం చేసుకున్న వారికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీది.రచయిత్రిది కూడా.
పాఠకుని అభిప్రాయం ఏదో దాన్ని గురించి ఆలోచించాల్సి న అవసరం రచయితలకి వుంటుంది.
వ్యక్తిగత జీవితాలు వేరు, రచనలు వేరుగా చూడరు పాఠకులు. రచయితల గురించి తెలియనప్పుడు మాత్రమే రచనలనే ఉన్నది వున్నట్టు చదవగలరు. అది మానవ నైజం కూడా.
ఇంక హిట్లర్ రచయిత కాదు సరే.అది ఒక పోలిక మాత్రమే. పోలిక లేకుండా చెప్తే మీకు నచ్చుతుందా?అది భావ్యం కాదనే కదా అలా చెప్పింది.
కవిగా అందరికీ నచ్చిన ఒక కవి ఒక రోజు తన ఇద్దరు భార్యల భుజాల మీద చేతులేసి ఫోటో దిగి జనాలకి చూపిస్తే , ఏ స్త్రీ అయినా దగా పడ్డ ఆ స్త్రీలని గురించి ఆలోచించదా ? ప్రశ్నించరా ?
ఆ భార్యలే అంగీకరించారు మీకెందుకు అంటారా?
ఒక స్త్రీ తెలిసి కూడా మరో స్త్రీ జీవితంలోకి , కాపురంలోకి ప్రవేశించి ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన తర్వాత కూడా , తప్పని పరిస్థితుల్లో సర్దుకు పోక ఏం చేస్తుంది మొదటి భార్య ? కావాలనే భార్యని మోసం చేసినా కూడా అక్కడికి మొదటి భార్యని తరిమెయ్యకుండా బాగా చూసుకుంటున్నాడు అని ఆ భర్తని నెత్తిన పెట్టుకుంటారా మీరు ?
తన్హాయీ నవలలో జరిగింది కూడా ఇదే.
ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవిత భాగస్వాములని మోసం చెయ్యటం,తప్పని పరిస్థితుల్లో తనని మోసం చేసిన భర్తతో కలిసి కాపురం చెయ్యటం.
చివర్లో కుటుంబం కోసం అన్ని అక్రమ సంబంధాలు వదిలేసుకుని కలిసి కాపురం చేద్దాం అని నిర్ణయించుకున్నా , అప్పటికే భార్య మీద నమ్మకం కోల్పోయి గాయ పడ్డ చైతన్య మళ్ళీ ఆమెని సోల్ మేట్ గా కూడా చూడగలడా? కేవలం శరీరం లాగానా ?
కల్హార అంత చేసిన తర్వాత కూడా భర్తతో కలిసి జీవిచాలని నిర్ణయం తీసుకుంది సరే.బానే ఉంది.
ఇంకెప్పుడు అతన్ని ప్రస్తావన మన మధ్య తీసుకు రావద్దు . అతనెవరో, మనమెవరమో.ఇక్కడితో అతని గురించి మర్చిపో అని ఎంతో నిజాయితీతో చెప్తాడు చైతన్య.
”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ.అలా అతన్ని పంపించెయ్యాలని ముందే తెలిస్తే అతన్ని నా మనసులోకి రానివ్వకుండానే వుండేదాన్ని” అని మనసులో అనుకుంటుంది.
ఇది ఏ రకమైన నిజాయితీగా మీరు గుర్తించారు వనజ గారూ?
నిజాయితీ వున్నది చైతన్యకా? కల్హారకా? కాపురం ముసుగులో కల్హార మానసికంగా ఏం చేస్తుంది ఆ తర్వాత ?
కల్హార లో వచ్చింది నిజమైన మార్పు కాదని ,కేవలం కుటుంబం కోసమే అని నవల చదిన ఎవరికైనా అర్ధం అవుతుంది.
వివాహ బంధంలో ఇలాంటివి స్త్రీ చేసినా , పురుషుడు చేసినా తప్పు తప్పే.
అందరూ చేస్తున్నారని , మేము చేస్తే తప్పేంటని ప్రశ్నించటం వివేకం కాదు ఎవరికైనా.
స్త్రీ ,పురుషుల మధ్య ఆకర్షణలు సహజమే. వాటికి లోనవ్వడం కూడా అంతే సహజం .
ఒక బంధానికి కట్టుబడ్డ వారికి నిగ్రహం కూడా అవసరమే.ఇతరుల కుటుంబాలను , ముఖ్యంగా కన్న పిల్లలను ఛిద్రం చేసుకోవటం ఆధునికతా?
ఈ సంబంధాలలో బాగా నష్ట పోతున్నది అమాయకులైన భార్యలు.పిల్లలు.ఇంకో కొత్త కాపురం పెట్టుకొని బిడ్డల్ని కంటూ ,సర్వ సుఖాలు అనుభవించే వారు , ఆర్ధిక ఆలంబన లేని తమ భార్య పిల్లలు లేదా భర్త ఆ తర్వాత ఎలా బతుకులు ఈడుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా?చదువులు చెప్పించే వాళ్ళు లేక జులాయిలై తిరిగే కొడుకుల గురించి, చదువులు మానేసి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాలను పోషించే కూతుళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించ గలరా?
బాధించే భర్తలని వదిలేసి కొత్త జీవితం ప్రారంభించటం వేరు.అది అవసరం కూడా. ప్రేమించే భర్తలు వున్నా కూడా ఇలాంటి వాటికి లోనవడం స్త్రీ వాదమా?
మరొక రచయిత్రి భావించినట్టు సహృదయ అయిన కల్హార ఆర్ధిక స్వావలంభన, విజ్ఞత కలిసి వున్న రాజేశ్వరి . ఆమె ఆర్ధిక స్వావలంభన ,విజ్ఞత వున్న స్త్రీ కాబట్టే ,ఒంటరిగా బ్రతకగలననే ధైర్యమే ఇలా చేసే ధైర్యాన్నిచ్చిందా ? ఆమె సహృదయతే ఇంకొక స్త్రీ భర్తని కోరుకుందా? సంఘర్షణనీ , పర్యవసానాల్ని చిత్రించినా కల్హార లో నిజమైన పశ్చాత్తాపం లేదు. ఆమెని అభినందించాల్సింది చలం కాదమ్మా. ఆమె భర్త. కూతురు. అవతల వాడి భార్య.
ఆమె తప్పని సరయ్యి ప్రియుడిని వదిలానని అనుకుంది కానీ మానసికంగా ఆమె వదలలేదు.అందుకే ”ఈ మనసులోకి వచ్చినంత సులభంగా అతను తిరిగి వెళ్ళలేడు చైతూ” అనుకుంది మనసులో.
ఇలా అనుకునే బదులు భర్తని వదిలేసి వెళ్ళటమే నిజాయితీ అనిపించుకునేది.
సెలవు .
1) సంస్కృతములో కావ్యములను వ్రాసే పద్ధతి వేరు, తెలుగులో వ్రాసే పద్ధతి వేరు. సంస్కృతములో ఒక ఆశ్వాసాన్ని ఒకే వృత్తములో వ్రాస్తారు (ఉదా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వీటి రెంటితో ఉపజాతులు, వియోగిని, శ్లోకము, స్వాగతము, ఇత్యాదులు). ఆశ్వాసాంతములో మాలిని మున్నగు విశేష వృత్తాలను వాడుతారు. సంస్కృతములో వృత్త వైవిధ్యాన్ని నాటకాలలో చూపుతారు, కావ్యాలలో కాదు. తెలుగులో సంస్కృతములా కాక ఒక ఆశ్వాసాన్ని అన్ని వృత్తములలో వ్రాసినారు.
2) కన్నడ భాషలో మొట్ట మొదట చంపూ సంప్రదాయములో కావ్యాలు వచ్చాయి, దానినే తెలుగులో కూడ అనుసరించారు. ఏవో కొన్ని నిర్వచన కావ్యాలు తప్ప తెలుగులో చంపూ కావ్యాలే ఎక్కువ. ఇందులో గద్యపద్యములు రెండూ ఉంటాయి.
3) కన్నడములో మొట్టమొదట అనుష్టుభ్ శ్లోకాలను వాడారు. కాని తెలుగులో పూర్వ కవులు శ్లోకాన్ని వాడలేదు. తెలుగు కన్నడ కవులు ఆ శ్లోకస్థానములో కందమును వాడారు. ఇది చిన్న పద్యము, కథను సాగించడానికి చక్కగా ఉంటుంది, అందువల్ల.
4) తరువాత ఎక్కువగా వాడిన వృత్తాలు చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము - ఈ క్రమములో. అందుకే నేనొక చోట అన్నాను, తెలుగులో శార్దూలానికన్న మత్తేభాన్ని ఎక్కువగా వాడుతారు అని, ఎందుకంటే అందులో ప్రారంభములో శార్దూలములా మూడు గురువులు ఉండవు. సంస్కృతములో ఉపజాతుల స్థానాన్ని తెలుగులో తేటగీతి, ఆటవెలది ఆక్రమించాయి.
5) ఇక యతి విషయము. పదాన్ని యతి స్థానములో విరిచితే కొన్ని సమయాలలో బాగానే ఉంటుంది (ఉదా. లాస్యము లాడవా పలు వి-లాసములన్ …), కొన్ని చోటులలో బాగుండవు (ఉదా. టంగుమని మ్రోగె గంట ప-డతి వినంగ …). జాత్యుపజాతులలో సామాన్యముగా పాదాంత విరామమును వాడుతారు. ఇది ద్విపదలకు, రగడలకు తప్పక ఉండాలి.
6) తెలుగులో పాదాంత యతి ఎందుకు లేదన్నదానికి, కోవెల సంపత్కుమారులు ఇలాగన్నారు. తెలుగులో ప్రాస ఉన్నది, అందువల్ల ఒక్కొక్కప్పుడు, పదములోని రెండవ అక్షరము ప్రాసాక్షరముగా అమరకపోవచ్చు. ముందటి పాదమునుండి పదము ఆరంభమయితే ప్రాసకు సౌలభ్యము దొరుకుతుంది. పదాన్ని ఇలా విరిచినప్పుడు, నా ఉద్దేశములో ముందటి పాదములో చివర పదానికి ఒక అక్షరముకంటె ఎక్కువగా ఉంటే వినడానికి అంత బాగుగా నుండదు.
7) మొట్టమొదట ఉత్పలమాలను, మత్తేభవిక్రీడితమును సంస్కృతములో వ్రాసినప్పుడు వాటికి పాదాంతయతిని ఉంచలేదు మన కవులు. కొన్ని శాసనాలలో ఈ విషయాన్ని గమనించవచ్చును.
8) మాత్రాగణములతో ఉండే రగడలలో కూడ తెలుగు కవులు కొన్ని సమయాలలో పదాలను గణాలకు తగ్గట్లు విరిచి వ్రాయకుండడము నిజముగా ఒక పెద్ద లోటే.
విధేయుడు - మోహన
“తిరుపతి తుంగ శృంగవసతీ! విన వచ్చెనుసుప్రభాతగీత రవము …” గుడిగంటల్లో కాటూరి
“శ్రీకరశైవలింగ పరిషిక్త ఘృతస్ఫటికంబు కంటె కార్తీకము కంటె పూర్ణవిధు దీపిక కంటె కృపాంత నాటక శ్లోకము కంటె …” రెల్లు తెల్లదనాన్ని వర్ణిస్తూ చల్లా సీతారామాంజనేయులు
“రాజా వీడు కోదండబాహావిధ్వస్త దిగంతరాహితధరాప్రాణేశచూడామణిగ్రీవామంజులహారరత్న రుచిర శ్రీ పాదకంజుండగున్ …”ఆంధ్ర ప్రశస్తి లో విశ్వనాథ
మందాక్రాంత (నిర్మాణ వైవిధ్య) సౌందర్యాన్ని చూపిస్తూ శ్రీ మోహన రాసిన వ్యాసం తెలుగుయతులమీద చర్చకు దారి తీస్తే ఈ తెలుగు కవుల పలుకులు గుర్తుకు వచ్చాయి. పదంలో మధ్యలో ఉన్న అక్షరముతో యతి వేస్తూ విరామాలు లేకుండా — సంస్కృతాన్ని స్వతం చేసుకుని — వాళ్ళే పెట్టుకున్నపద్య నిర్మాణ నియమాలని నిర్వహిస్తూ ఇంత అందంగా రాయగలరా తెలుగుకవులు అని హాయిగా మరొక్క సారి ఆశ్చర్య ఆనందాలతో విస్తుపోతూ గర్వించాను.
తః తః
తెలుగు ఛందస్సులకు సంస్కృత ఛందస్సులకు మధ్య ఉన్న తేడాలకు సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో ఉన్న తేడాలు కారణమని, ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు ఛందస్సును తక్కువచేసి మాట్లాడటం సరికాదని కామేశ్వర రావుగారు చక్కగా చెప్పారు. విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా poly-agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని ఇంతకు ముందు నేను కూడా ఎక్కడో చర్చించినట్లు గుర్తు. ఛందస్సుపై పరిశోధనలు చేస్తున్న వారెవరైనా విరామయతి, పాదాంత విరామం తెలుగు వాక్యనిర్మాణానికి ఎందుకు అంతగా ఒప్పవని సోపపత్తికంగా విశ్లేషిస్తే చదవాలని నా ఆశ.
శ్యామలరావుగారు,
మీ వ్యాఖ్యలో కొన్ని విషయాలను మరికొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
“బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యితర వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది.”
“తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు.”
వృత్త వైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం సంస్కృత కవులలో కూడా ఉన్నదే. ఒక కావ్యంలో భిన్న భిన్న వృత్తాలు వాడడం సంస్కృత కావ్యాలలో కూడా కనిపిస్తుంది కదా. మీరన్న వృత్త చతుష్కం కన్నా కూడా కందాలు తెలుగు కవులు ఎక్కువ వాడారు. అలాగే ఆటవెలది తేటగీతులు కూడా. సందర్భానుసారంగానే సీస పద్యాలు, అక్కడక్కడ ఇతర దేశి ఛందస్సులూ కూడా వాడారు. ఇతర వృత్తాలను అరుదుగానే వాడారు. అయితే వాటిని విరివిగా ఎందుకు వాడలేదు అనే దానికి కారణాలను వెతికితే మనకి కొంత విషయ పరిజ్ఞానం కలగవచ్చు. కాని, వాళ్ళ తెలివితక్కువ తనం వల్ల, స్పృహ లేని కారణంగా మానేసారని సమాధాన పడితే దాని వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు నిజంగా ఎందుకు వాడలేదో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం ఎలాగూ లేదు.
వృత్తౌచిత్యమన్నది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి - చెప్పే విషయం, రెండు - చెప్పే భాష. ఉదాహరణకి మందాక్రాంత వృత్తాన్నే తీసుకుందాం. మొదటగా, చెప్పే విషయం. కాళిదాసు మందాక్రాంత వృత్తంలోనే మొత్తం ఒక కావ్యం వ్రాసాడంటే, ఆ కావ్యం ఎలాంటిది? అది కథా కావ్యమా? కాదు. అందులోని వస్తువూ, రసమూ, పాత్రలూ ఇంచుమించుగా మొదటి నుండి చివర వరకూ ఒకటే విధంగా ఉంటాయి. అంచేత ఆ కావ్యమంతా ఒకే వృత్తంలో రచించడంలో ఔచిత్యం ఉంది. అదే కాళిదాసు రఘువంశంలోనూ, కుమారసంభవంలోనూ అనేక వృత్తాలు ఎందుకు వాడవలసి వచ్చింది? అవి కథా కావ్యాలు కాబట్టి. అందులో వివిధ సన్నివేశాలు, పాత్రలు, రసభావాలు ఉంటాయి కాబట్టి.
కాబట్టి, తెలుగులో మందాక్రాంత విరివిగా ఎందుకు వాడబడ లేదు అనే ప్రశ్న వేసుకొనే ముందు, తెలుగులో మేఘదూతం వంటి కావ్యాలు ప్రాచీన కాలంలో ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకోవాలి. అది వేరే చర్చ, కాబట్టి దానిలోకి నేను వెళ్ళడం లేదు. అలాంటి కావ్యాలు రానందువల్ల, ఆ వృత్తం అంత విరివిగా వాడబడలేదు. అది మొదటి కారణం. ఇక రెండవ కారణం భాష. మోహనరావుగారు, మీరూ చెప్పినట్టుగా మందాక్రాంత వృత్తం మొదటి నాలుగు గురువులూ తెలుగుకి ప్రతిబంధకం. గురువు లఘువుల సంఖ్యే కాదు, వాటి క్రమంలో కూడా వివిధ భాషల స్వరూపంలో తేడా ఉంటుంది. వృత్త చతుష్కం కాక మిగిలిన వృత్తాలు తెలుగులో విరివిగా లేకపోవడానికి యిది కూడా కారణమేమో పరిశీలించాలి.
“మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?”
వృత్తాన్ని విరుపులతో వ్రాయాలనే తాపత్రయం లేదు కాబట్టే తెలుగులో యతి విరామ స్థానంగా కాక అక్షర సామ్యంగా మారింది. కావ్యం మొత్తమూ పద్యాల విరుపుల అందం ఒక్కటే ఉంటే సరిపోదని మీకు నేను చెప్పనక్కరలేదు. సంస్కృతంలో కూడా రామాయణ భారతం వంటి కావ్యాలు ఇంచుమించు పూర్తిగా, కేవల పాదాంత విరామం మాత్రమే ఉన్న అనుష్టుప్పుతో నడిపించారు. ఇతర కావ్యాలలో కూడా కథా గమనం కోసం అలాంటి ఛందస్సే వాడబడింది. మందాక్రాంత వంటి అనేక విరుపులున్న పద్యాలు మేఘదూతం వంటి కొన్ని కావ్యాలలో మాత్రమే ఇంత విరివిగా వాడబడింది. తెలుగులో కూడా సందర్భం వచ్చినచోట చక్కని విరుపులతో హొయలుపోయే కందాలూ, సీసాలు మొదలైన మన దేశి ఛందస్సులో వ్రాసిన పద్యాలు ఉన్నాయి. మందాక్రాంత, మత్తకోకిల, లయగ్రాహి మొదలైన పెద్ద వృత్తాలకి విరుపులు లేకుంటే పద్యం అందం చెడిపోతుంది. తెలుగు కవులు ఈ వృత్తాలను వాడిన కొన్ని చోట్ల యీ అందాన్ని దృష్టిలో పెట్టుకో లేదన్నది మాత్రం నిజమే. కథాగమనం కోసం వృత్త చతుష్కంలో పద్యాలు వాడినప్పుడు వాటికున్న ఒక్క విరామ స్థానం అవసరం మన కవులకి కనిపించ లేదు. అందుకే వాటిని పాటించలేదు. పైగా, వాటికి మందాక్రాంత వంటి నిర్దిష్టమైన (మూడు విరుపులతో కూడిన) నడక లేకపోవడం వల్ల, ఆ ఉన్న ఒక్క విరామాన్ని పాటించకపోవడం వల్ల పద్య సౌందర్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా విరామ స్థానంలో విరుపు పాటించనవసరం లేని వృత్తాలనే తెలుగు కవులు ఎన్నుకున్నారనీ, అవే వృత్తచతుష్కమనీ నా ఊహ.
కొంతమంది మరొక అభియోగం చేస్తూ ఉంటారు. కథా గమనానికీ సంభాషణలకీ సంస్కృతంలో లాగా చిన్న చిన్న పద్యాలు వాడకుండా యీ చాంతాడు వృత్తాలని తెలుగులో వాడారన్నది. ఇది కూడా అంత సమంజసంగా అనిపించదు. ఒకటి, తెలుగు కవులు కూడా చిన్న పద్యమైన కందాన్ని విస్తృతంగానే వాడారు. రెండు, సంస్కృతానికీ, తెలుగుకీ భాషా స్వరూపంలో చాలా తేడా ఉంది. పదాలలో, వాక్యాలలో సంక్షేపము (brevity) ఎక్కువగా సాధించే లక్షణం సంస్కృతానికి ఉంది. అది ఒక రకంగా formal language కాబట్టి దానికా గుణం ఉంది. తెలుగు భాషా స్వరూపం వేరు. ఇది పూర్తిగా వాడుక భాష. నిత్యవ్యవహారంలో సంక్షిప్తంగా మాట్లాడడం అన్నది సహజమైన విషయం కాదు. అందుకే సంస్కృత భాషలో సాధించ గలిగే సంగ్రహత్వం తెలుగులో సాధించడం సాధ్యం కాదు. అలా సాధించాలని చూస్తే అది సహజ సౌందర్యాన్ని కోల్పోయి కృతకంగా తయారవుతుంది. అంచేత కథ చెప్పడంలోనైతే నేమి, సంభాషణల్లోనైతే నేమి, కొన్ని చోట్ల మనకి పెద్ద వృత్తాలు అవసరం అవుతాయి. ఈ సంగతులన్నీ ఆలోచించకుండా, సంస్కృతంతో పోల్చి, తెలుగు కవిత్వంలో సంక్షిప్తత తక్కువ అని పెదవి విరిచెయ్యడం సరి కాదు.
“అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.”
వృత్త విరామాల గురించి పైన చెప్పాను. ఇక యతి ప్రాసల నియమాలు వదిలి పద్య రచన చేసే సాహసం గురించి. ఎందుకు చెయ్యలేదూ, అలాంటి సాహసాలు కవులు చేసారు! ఈ వ్యాసంలోనే మోహనరావుగారు పేర్కొన్నట్టు రాయప్రోలు సుబ్బారావుగారు మేఘదూతానికి అనువాదమయిన దూతమత్తేభమనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని మత్తేభాలతో రచించారు. అలాగే మల్లవరపు విశ్వేశ్వరరావుగారు చిత్రాంగద అనే కావ్యాన్ని యతిప్రాస నియమాలు లేని పద్యాలతో రచించారు. యతి ప్రాస నియమాలు పాటించని కందాలు శ్రీశ్రీ సిప్రాలిలో కూడా మనకి కనిపిస్తాయి. ప్రాచీన కవులు ఎందుకలా రాయలేదు అంటే, బహుశా వాళ్ళకా ‘అవసరం’ కనిపించకపోయి ఉండవచ్చు. యతిప్రాసల నియమాలు పాటించడం వల్ల కవిత్వం పలచబడడం, వాటిని పాటించకపోవడం వల్ల గొప్ప పద్యాలు సృష్టింపబడటం జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవు. అక్కిరాజు ఉమాకాంతంగారు అలా జరిగిందని అభిప్రాయపడ్డారు కాని, అది పైన చెప్పినట్టుగా సంస్కృతంతో పోల్చడం వల్ల ఏర్పడిన అభిప్రాయమే అని నేననుకుంటాను. యతిప్రాసల నియమాలు కవికి ఒకోసారి ఎలా ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించే వ్యాసం, ఈమాటలోనే యిక్కడ ఉంది.
ఆ మూలనున్న కుండీలో ఎర్రటి మొక్క, కిటికీలోంచి కనపడుతున్న విచ్చిన మొగ్గల మేగ్నోలియా, నిశ్శబ్దంగా నిటారుగా నిలబడి వొంటి కాలుపై తపస్సులో మునిగిపోయిన ఆ పైన్ చెట్లు, వీటి మధ్య కాలం గలగల పారే సెలయేరులా కాకుండా మెత్తగా పాకి పైకి పోయే పొగమంచులా కరగిపోతుందేవో కదా. బావుందండీ మీ కవిత, నేనైతే ఆ టీ కప్పు గ్లాస్ కి తగిలే శబ్దం కూడా రాకుండా మడతేసిన పేపర్ నేప్కీన్ ని టేబుల్ పై పెట్టుకుంటాను. కొన్ని సార్లు నిశ్శబ్దం ఒక గొప్ప కమ్యూనికేటర్ కదా!
-తిమ్మిరెడ్డి
Good News To (Low Budget) Telugu-Film Producers..
Recently New 3D Technology has been came,Why should make Love and Cool Romantic and Comedy Movie with 3D, It is Good Experience to Youth. I am Ready to Make and Give Best Film Direction to Telugu Movie Making in 3D. I have good Love,Romantic and Comedy Script,Along with Good Story Writers Team.
Please Contact to My Email: filmdirection1@gmail.com
By,
Film Director,
Trained By:
MADHU FILM INSTITUTE-Hyderabad-A.P/INDIA.
(Batch Number:2009)
Member of A.P Cine Writers Association-Hyd.
Expert in 3D,polarized 3D Glass Technology.
Date:May,09,2012/Time:10:00pm
Good News To (Low Budget) Telugu-Film Producers..
Recently New 3D Technology has been came,Why should make Love and Cool Romantic and Comedy Movie with 3D, It is Good Experience to Youth. I ready to Make and Give Best Film Direction to Telugu Movie Making in 3D. I have good Love,Romantic and Comedy Script.
Please Contact to My Email:filmdirection1@gmail.com
By,
Film Director,
Trained By:
MADHU FILM INSTITUTE-Hyderabad-A.P/INDIA.
Expert in 3D,polarized 3D Glass Technology.
Good News To (Low Budget) Telugu-Film Producers..
Recently New 3D Technology has been came,Why should make Love and Cool Romantic and Comedy Movie with 3D, It is Good Experience to Youth. I ready to Make and Give Best Film Direction to Telugu Movie Making in 3D. I have good Love,Romantic and Comedy Script.
Please Contact to My Email:filmdirection1@gmail.com
By,
Film Director,
Trained By:
MADHU FILM INSTITUTE-Hyderabad-A.P/INDIA.
Expert in 3D,polarized 3D Glass Technology.
I have read your article. It is a good detailed analysis. I read Maidaanam but I did not like it for something was missing. If I was asked why I did not like the book I couldn’t tell. From today I can say why I did not Like Maidaanam. I got words from your article. Thank you.
మీలాగే సినిమాల నుంచి మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకున్న మరొకరు రాసిన వ్యాసం:
http://www.softwarequalityconnection.com/2012/05/5-things-i-learned-about-business-negotiating-from-watching-movies/
ఈరకం కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రచయితని ‘మామూలు మాటలని కవితలుగా మలచగల అద్యుభయ కవయిత్రి’ అనచ్చు
జీవితాన్ని అనుభవించాలంటే బెంజ్ లూ, బీచ్ ఫ్రంట్ ఇళ్ళూ అక్కర్లేదు, మంచి కాఫీ, మరీ ముఖ్యం, దాన్ని అనుభవించగలిగే దర్జా ఉంటే చాలు. ఎంత బాగా రాసారండీ !
ఇటీవలనే లండన్లో దొరికిన 1912 నాటి కలకత్తా ఫోటోలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. మన దేశంలో గత వందేళ్ళుగా మారకుండా ఉన్నవి ఎటువంటివో మనం గమనించవచ్చు.


