2013-05-20
Home: ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ
"నమస్కారాలు గురూ!"
"వెర్రోహం! ఇదేమిటి శిష్యా? ఎన్నడూ లేనిది కాళ్ళు పట్టి మరీ మస్కారాలు చెబుతున్నావ్! ఏదేనీ ఫిక్సింగాలోచనా?"
"అహో! మీరు మహాజ్ఞానులు...త్రికాలవేత్తులు...ఎన్న తరమా గురువు మహిమా వెర్రి గరిమా ఆహాహాహా!"
"ఇక ఆపు శిష్యా! పాయంటులోకి రా...ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ గురించేగా నీ వెర్రోహ సందేహ సందోహము? "
"అద్భుతం గురూ! మీ దృష్టి యొక్క పౌనఃపున్యము, తరంగదైర్ఘ్యము, వేగము....."
"హు..హు...హు...ఈ ఫిక్సింగు ఇక చాలు శిష్యా!"
"అవశ్యం గురూ! మీరన్నట్టుగా ఐపీఎల్ ఒక కంకాళ క్రీడయే కాదు డొంక లాగితే తీగ తెగే వ్యవహారంలా ఉంది. నాలాంటి వెర్రోహులు అనేకమంది వున్నారు. మీ విజ్ఞానోపదేశాన్ని విప్పి చెప్పి మమ్మల్ని ఉద్ధరించండి."
"అలాగే శిష్యా! మొదటగా ఫిక్సింగ్ పంకిలం అంటుకున్న ఆ ముగ్గురు కుర్రకుంక కంకాళాలలో ఒకడు అశాంతుడు, మరొకడు ఛండాలుడు మూడోవాడు చవట. అవునా!"
"శ్రీశాంత్, అజిత్ చండీలా మరియు అంకీత్ చవాన్ల రహస్యనామాలు విప్పి చెప్పారా గురూ! ధన్యోస్మి ధన్యోస్మి!"
"చూశావురా, ఈ కంకాళ మహిమంతా ఆ పేర్లలోనే దాగివుందిరా. ."
"ఆహా...దివ్యోపదేశము"
"మరి ఈ అస్థిపంజారాలపై బీసీసీఐ శ్రీనివాసుడు కనికరమును చూపెట్టాడెందుకు గురూ!"
"అక్కుపక్షీ! ఆ మాత్రం తెలుసుకోలేవుట్రా? అసలుకే మోసమొచ్చుననే ఈ అసందర్భ కనికార ప్రదర్శనము!"
"అర్థం కాలేదు గురూ!"
"అహో దుర్భరార్భకుడా! విను...అసలు ఈ ఐపీయెల్లే ఒక పెద్ద దగుల్బాజీ వ్యవహారం. దేశాన్ని ప్రతినిధింపజేసే ఒక అంతర్జాతీయ క్రీడలోకి ప్రాంతీయ విభేదాలు సృష్టించి, లేనిపోని అభిమానాల్ని చొప్పించి, ఐకమత్యాన్ని దెబ్బతీయించడంలో ఈ ఐపీఎల్ ఘనత వహించింది. ఆ మధ్యన జరిగిన బెంగళూరు-ముంబై ఆటలో విరాట్ కొహ్లి ముంబాయి ఇండియన్స్ అభిమానుల అతి చేష్టలను నిరసించలేదా? ఐపీఎల్ వచ్చేదాకా క్రికెటర్ల సంపాదనపై దేశప్రజలెవ్వరూ అంతగా దృష్టి పెట్టలేదు. ఈ ముదనష్టపు ఆట వచ్చాక ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయాడన్న ఆరాలు తీయడంలోనే కాలం వ్యర్థమైపోతోంది. సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఆటగాళ్ళు అమ్ముడుపోతున్నారు. ఇలా మూలంలోనే అనేక జాడ్యాలు అంటుకొన్న ఈ మహమ్మారీ ఆటలో లంచాలు పుచ్చుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందుకనే ఈ శ్రీనివాసుడు నోరు కట్టేసుకొని దుష్టుల్ని క్షమించేసినట్టు పోజులు కొడుతున్నాడు."
"అమ్మయ్యోయ్...!"
"శిష్యా! బోర్ద్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అన్న వింతైన పేరున్న ఏకైక క్రికెట్ అథారిటీ BCCI మాత్రమే. ఇందులో రాజకీయుల అరాచక నియంత్రణ తప్ప క్రీడ పైన, దాని ఉన్నతి పైనా, ఆటగాళ్ళ నైతికతపైనా ఎలాంటి నియంత్రణలూ లేకపోవడమే దీని ప్రత్యేకత. బుకీలపైన మాకు నియంత్రణ లేదు అని సదరు శ్రీనివాసుడు నొక్కివక్కాణించడంలోనే అసలు విషయం ఉందిరా!"
"ఇకపై నేను క్రికెట్ మ్యాచులు చూడను గురూ!"
"పోరా వెర్రివాడా! ఈ ఆశ్రమాన్ని దాటి నీ డ్రాయింగు రూములోకి వెళ్ళేవరికేరా నీ క్రికెట్ వైరాగ్యం బ్రతికి బట్టకట్టేది. వందకోట్ల వెర్రిపుచ్చకాయలున్న ఈ దేశంలో కంకాళ క్రీడలు, కళంకిత క్రీడాకారులు బ్రతికిపోయి బట్టకట్టి వీరోచితంగా తిరుగుతూనేవుంటారు. దేశం ఏమైతేనేం, ఎటుపోతేనేం? ఫో! పోయి ఐపీఎల్ మ్యాచుల్లో మునిగు ఛావు."
"గురూ!"
"......."
పుస్తకం: వీక్షణం-32
2013-05-19
ప్రజాకళ: పిడికెడు ఆత్మగౌరవం కోసం.. - కలేకూరి ప్రసాద్
ప్రజాకళ: కర్మభూమిలో పూసిన ఓ పువ్వా - పాట
ప్రజాకళ: పాటకు పత్రహరితం కలేకూరి
2013-05-18
పుస్తకం: ప్రళయకావేరి కథలు – మరోసారి!
2013-05-16
వాకిలి: లోపలి ప్రయాణాలూ సాహసయాత్రలే!
Flash upon that inward eye
Which is the bliss of solitude.
టీనేజీ ఉరుకుల పరుగులలో ఈ వాక్యం మొదటి సారి విన్నప్పుడు ఆ solitude గానీ, ఆ inward eye గురించి గాని నాకు పెద్దగా తెలియదనే చెప్పాలి. కానీ, ఆ వాక్యం విన్నాక Wordsworth గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. బాహ్యజీవితం అంత హుషారుగా అనిపించని ఆ కాలంలో నేను Wordsworth చేతివేలు పట్టుకొని ఏవేవో వూహారణ్యాల్లో దారి తప్పే వాణ్ని, అతనే చెప్పిన ఆ inward eye మెరుపులు చూపుల్ని వెలిగిస్తూ వుండగా!
నిజమే, జీవితం ఎవరికీ సాఫీగా వుండదు. పోనీ అని, సూఫీగానూ వుండలేం! కుదుపులు వుంటాయి, వొళ్లు కదుము కట్టే దిగుళ్లూ వుంటాయి. కానీ, వాటిని కూడా ఉత్సాహంగా తీసుకునే శక్తి సంపాదించుకుంటే…అప్పుడేం చేస్తుందీ పాడు బతుకు?!
అలా ఉత్సాహంగా తీసుకునే శక్తి వూరికే రాదు, inward eye తో మన లోపలి లోకాల్లోకి ప్రయాణాలు చేస్తున్నప్పుడే అది సాధ్యం! ఈ లోప్రయాణం ఎలా వుంటుంది? నిజంగా ఈ ప్రయాణానికి మనం ఎప్పుడేనా సిద్ధంగా వుండగలమా? వున్నా, ఆ ప్రయాణం తుదకంటా వెళ్లగలమా? వెళ్ళినా తిరిగి రాగలమా? రాగలగినా అంతకు ముందులాంటి జీవితాన్ని జీవించగలమా? ఇవి తేలికగా అనిపించే గట్టి ప్రశ్నలు. సమాధానాలు ఎవరిదగ్గిరా సిద్ధంగా వుండవు, సిద్ధంగా వున్న సమాధానాలు ఎవరినీ సమాధాన పరచలేవు. ఎందుకంటే, ఎవరి ప్రయాణం వాళ్ళదే! ఎవరి అనుభవం వాళ్ళదే! కానీ, అనుభవమున్న ఇంకో పూర్వయాత్రికుడు కొన్ని వెలుగురేఖలు చూపించవచ్చు. వేలు పట్టి నడిపించకపోయినా, ముందుకు నడిపించే వొక సంకేతాన్ని అందించవచ్చు. ఇలాంటి వొక సంకేతశిల్పి సాయికిరణ్! గత నెల రోజులుగా ఈ శిల్పి చెక్కిన వొక ‘అంతర్యాన’ చిత్రపటం చేతుల్లో పెట్టుకొని నేను గడిచివచ్చిన కొన్ని దారుల్ని చూపించాలని ఇక్కడ నా ప్రయత్నం. ఇది కేవలం నా దారి, నా ప్రయత్నం. మీ మీ ప్రయాణాలకు వాటి దిగుళ్ళకీ నేను ఏ రకంగానూ పూచీపడడం లేదు.
2
ఎక్కడయినా వొంటరిగా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు వొకట్రెండు పుస్తకాలూ, కొన్ని ఆలోచనల్ని తోడు తీసుకెళ్ళడం నాకు అలవాటు. పోయిన నెల Raleigh-Durham వెళ్తూ, సాయికిరణ్ కవిత్వం ‘అంతర్యానం’ తోడు దొరికింది. ఇక ఆలోచనలు బోలెడు!
ప్రయాణం మొదలయిన కొద్ది సేపటికి ఆకాశ మార్గంలో విమానం కొన్ని మబ్బుల్లో చిక్కుకుంది. తలెత్తి చూస్తే మబ్బులు హడావుడిగా పరుగులు తీస్తున్నాయి. మబ్బుల మెట్ల మీంచి కిందికి దిగే ప్రయత్నంలో వుంది విమానం. అప్పుడు వొక్క కుదుపు ఇచ్చింది విమానం, వొక్కసారిగా రెండు మూడు మెట్లు దూకేసే అల్లరమ్మాయిలాగా! “ఎందుకింత తొందరా?!” అనుకుంటూ నేను అప్పటిదాకా నా లాప్ టాప్ లో చదువుతూ వున్న సాయికిరణ్ కవిత్వ పుస్తకాన్ని పక్కన పెట్టాను. కాసేపు నిబ్బరంగా వున్నాను కానీ, విమానంలోని అనౌన్సర్ ప్రకటనలూ, నా ఇరువేపులా ప్రయాణికుల కంగారూ చూసి నేనూ కాస్త కంగారు నటించక తప్పలేదు. అవును, నటనే! “ఏం ఈ మాత్రం కుదుపులు భరించలేమా?” అన్నది నా లోపలి పొగరుమోతు మోటు సమాధానం! ఆ సమాధానానికి లోపల్నించి సాయికిరణ్ వత్తాసు!
మబ్బుల రాపిళ్లకు
ఆకాశం
రంగు మార్చే లోపు
నీడ పొడవు
నిర్ధారించుకోవాలి.
అంటున్నాడు సాయికిరణ్. వూరికే అనడం లేదు, జీవితంతో చాలా పెద్ద లెక్క తేల్చుకోడానికి సిద్ధపడే ఇంత మాటా అంటున్నాడు. ఇలా అనడానికి సాఫీగా సాగే జీవితాన్నే కాదు, తట్టుకోలేని కుదుపుల్ని కూడా ఎన్నో చూసి వుండాలి సాయి. ఎంతో తట్టుకొని నిలబడితే తప్ప ఈ నిబ్బరపు పాఠం మనకి చెప్పలేడు కదా మరి! ఈ కాలపు కవిత్వంలో ఇదే సాయిమార్గం!
మీరు ఇప్పటికే ఈ పుస్తకం చూసి వుండకపోతే – వొక విషయం మీకు ముందే చెప్పాలి. ఈ పుస్తకాన్ని నేను వెనక నించి చదువుతున్నాను. ఇప్పుడు చెప్పిన కవిత ఈ పుస్తకానికి ‘ముగింపు.’ నాకూ సాయికి (?) కొన్ని సాధారణ అసాధారణ లక్షణాలున్నాయి. అందులో వొకటి: కవిత్వ పుస్తకాన్ని వెనక నించి చదవాలన్న తిక్క. అయితే, నేను వొకే పుస్తకాన్ని అనేక సార్లు చదివే అలవాటు వున్న వాడిని కాబట్టి, మొదటి సారి చదివినప్పుడు తిక్కగా వెనక నించి చదివి, రెండో సారి చదివేటప్పుడు చక్కగా ముందు పేజీ నించి చదువుతాను. ఈ అలవాటుకి కారణమేమిటంటే: నా మటుకు నాకు సస్పెన్సు తట్టుకునే శక్తి లేకపోవడమే! చివరికేమిటీ గొడవ అన్నది మొదలే తేలిపోయిందనుకోండి – సినిమా కవిగారెవరో చెప్పినట్టు- ‘మనసు కాస్త కుదుటపడతది.’ ఇలాంటి అసాధారణ లక్షణాన్ని సాయికిరణ్ చాలా అందంగా కవిత్వం చేశాడు ఇక్కడ –
పుస్తకంలా
విచ్చుకున్న ఆకాశం
ఎగురుతున్న కాగితంలా
సముద్రం
పాతుకుపోయిన కాళ్ళు
పెరుక్కోలేని చెట్టులా
నేను
ఎటు నుంచి చదవాల్సిన
పుస్తకం ఇది?
ఈ కవితలో మొదటి రెండు – ఆకాశమూ, సముద్రమూ(అంటే – పుస్తకమూ, కాగితమూ) చలనశీలమైనవి కవి దృశ్యీకరించిన ప్రకారం చెట్టు (అంటే, ‘నేను’) చలనరహితం. మామూలుగా చెట్టు చలనరహితం కాదు. కాళ్ళు పెరుక్కోలేని తనం వున్నప్పటికీ చెట్టు నిలువునా కదులుతుంది. అయితే, ఈ కవితని కేవలం ఈ వాచ్యార్ధాలలో తేల్చుకోలేం. ఈ కవిత ప్రకృతిలో మన ఉనికి కంటే కూడా ఎక్కువగా మొత్తంగా కవిత్వ అనుభవంలో లేదా జీవిత అనుభవంలో మన ఉనికికి సంబంధించింది. కవిత్వం అనే అనుభవ మంటపంలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కునే కవిత ఇది.
ఆ కవిత చదువుతున్నప్పుడు అందులోని వాక్య సముదాయాలు రేపే సంచలనం ముందు మనం కాసేపు నిశ్చలనంగానే వుండిపోవాలి. తప్పదు. తను ఆ అనుభవాన్ని ఎటు నించి చూడాలన్నది కూడా సందిగ్ధమే. అదీ తప్పదు. కవిత్వంలోని రహస్యం ఏమిటంటే అది అనేకర్ధాల తలుపులు తెరుచుకోడానికి సిద్ధంగా వుంటుంది. వాటిని మనస్ఫూర్తిగా వొప్పుకోవడంతో సాయి ‘అంతర్యానం’లోని వొక చిక్కుముడి ఇట్టే విడిపోతుంది మనకి! ఈ పుస్తకంలోని ఏ కవితనయినా మీరు వొకసారి చదివి పక్కన పెట్టలేరు. ఆ వొకసారి చదివిన అనుభవాన్ని అలా జాగ్రత్తచేసుకుంటున్నప్పుడే సాయి ఇంకోసారి చదివింపజేసుకొని ఇంకో అనుభవద్వారాన్ని తెరుస్తాడు. అందుకే, నేను ఈ కవిత్వాన్ని ఆగి ఆగి చదివాను. ముందుకీ వెనక్కీ వెళ్తూ చదివాను. కానీ, ప్రతిసారీ ‘ఎటు నించి చదవాల్సిన పుస్తకం ఇది?” అన్న ప్రశ్న నాకు మిగిలిపోయింది. తమ్ముడు ఇక్బాల్ చంద్ ఈ కవిత్వాన్ని ‘ప్యూర్ పొయెట్రీ’ అంటున్నాడు. అలా అంటున్నప్పుడు ఆ purity ని తమ్ముడు ఎలా అర్థం చేసుకున్నాడో తెలీదు కానీ, నాకు మాత్రం ఈ పఠనం వల్ల కలిగే వొక స్వచ్చమయిన మెరుపు -పొద్దుటి కొద్దిపాటి వానలో తడిసిన ఆకు – మాదిరిగా అనిపిస్తుంది.
3
సాయి కవిత్వంలో ఇంకో అందం ఏమిటంటే: అది మన అనుభవ క్షేత్రంలోనే సంచరిస్తుంది. ఈ నలభై పైగా కవితల్లో ప్రతీదీ మన అనుభవమే; వొక వేళ మన అనుభవంలో లేని విషయం ఏదన్నా చెబితే, దాన్ని వెంటనే మన అనుభవంలోకి తీసుకు వచ్చే సరళమయిన మనసూ, నిండయిన భాషా సాయి దగ్గిర వున్నాయి. ఉదాహరణకి: ‘వలయాలు’ లాంటి కవితలు.
చినుకు పోట్లకి
ఛిద్రమయిన సెలయేరులా
నా వలయంలో
నేను తిరుగుతూనే వుంటాను
చీకటి తెలియని
రాత్రి కోసం.
చదవడానికి తేలికగా అనిపించే కవిత ఇది. కానీ, ఇందులో శబ్ద/ అర్థ వలయాలు చుట్టుకుంటూ వెళ్తే, భారతీయ తత్వశాస్త్ర చరిత్ర అంతా కనిపిస్తుంది. చదువరి మనసు/ ఆలోచన రెండూ ఎంత దూరం వెళ్తే అంత దూరం లాక్కు వెళ్ళడం మంచి కవిత్వ లక్షణాల్లో వొకటని నా నమ్మకం. సాయి కవిత్వంలో అలాంటి ఉదాహరణలు చాలా దొరుకుతాయి. వూరికే వొక్క సారి చదివినప్పుడు సాయి మంచి అనుభూతి శకలం పట్టుకున్నాడే అనిపిస్తుంది. కానీ, ఆ శకలాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే, పెద్ద డొంక ఏదో కదులుతుంది. అయితే, ఇది ముళ్ళ డొంక కాదు. జీవితాన్ని కంటి ముందు దృశ్యంలా పరచి అర్థాలు వెతుక్కోమనే పూలూ ముళ్లూ రాళ్లూ కలిసిన దారి. ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియాలంటే మీరు సాయి రాసిన ‘అంతర్యానం’ కవిత రెండు మూడు సార్లు చదవాలి. ఇందులో నాకు బాగా నచ్చిన పంక్తి ఇది:
సందేహ సముద్రంలో
చంద్రుడినై
అలల రాపిడి మధ్య
కాసేపు అస్తిత్వం కోల్పోతా.
ఈ వాక్యం నేను నాలోని భిన్న మానసిక/ భౌతిక స్థితులకు అన్వయించుకుంటూ కనీసం అరడజను సార్లు చదువుకున్నాను. గాయమ్మీద లేపనం రాసే వేళ్ళల్లో వుండే శక్తి ఏదో ఈ వాక్యాల్లో వుంది.
కవిత్వ వాక్యం మీద సాయికి చాలా పట్టింపు. వొక్క అనవసరమయిన పదమూ పడకుండా రాసింది కన్నా చెరిపింది ఎక్కువ అన్న భావం గట్టిగా కలుగుతుంది మొత్తం కవిత్వం చదివాక! ఇలాంటప్పుడు కూడా పునరుక్తి/ recurring images దొరక్కపోలేదు. పుస్తకం, జ్నాపకం, మబ్బు…ఇవి లేకుండా సాయి కవిత్వం రాయలేడా అనిపించింది కొన్ని సార్లు! ప్రతి రచయితకీ కొన్ని hanging words వుంటాయని బుచ్చిబాబు ఎక్కడో రాశాడు; అంటే, రచయిత ఉద్దేశపూర్వకంగానో, నిరుద్దేశపూర్వకంగానో కొన్ని పదాలలో repeat అవుతాడు. సాయి ‘అంతర్యానం’లో కూడా అలాంటి పదాలు దొరుకుతాయి. కానీ, అవి పంటి కింద రాయిలా తగలకుండా చూసుకోవడం సాయికి తెలుసు. అయినా సరే, అలాంటి పునరుక్తి లేని పునర్యానం కోసం ఎదురుచూస్తున్నా.
వాకిలి: ఆట
ఆకాశం చదివేసిన పాత పుస్తకం
చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా
అదే వేషం వేసే ముసలి కథానాయకుడు
కనుమరుగైన తారల స్థానాన్ని
మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి
ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని
క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి.
రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు
ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు.
చుట్టూ మంచు కప్పబడినప్పుడు
చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి
అది కరిగాక అదే చెట్ల మీద
అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి
అవే వానలు, అవే ఎండలు
అలాగే కురిసి, మెరుస్తాయి
రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు
రంగురంగుల సంతకాలు చేస్తాయి.
మళ్ళీ యోగ నిద్ర.
ఎడతెగని ఏమార్పూలేని ఈ ఆటని
ఏమాత్రం విసుగులేకుండా
అనంతకాలం ఆడాలంటే
ఎంత బాలుడై ఉండాలి!
పుస్తకం: Bengal Nights & It Does Not Die: ఒక ప్రేమ కథ – రెండు పుస్తకాలు – 1
2013-05-15
సారంగ: ఆకాశం, చలం, సముద్రం….ఒక్కోసారి ఒక్కోలా…!
వేసవి గాడ్పులు. ముదురాకుపచ్చని జీడిమామిడి చెట్లు గొడుగైన ఆ మధ్యాహ్నాం నా రెండు చిన్నారి చేతుల నడుమ ప్రేమలేఖలు. ఆ వేసవి వేడి, మట్టివాసన ,రాబోయే కాలానికి నిబద్దతతో ఆహారసేకరణలో చీమలు బారులు. చిన్నవి, ఎర్రనివి, నల్లనివి. గండు చీమలు. అలాంటి వొకానొక వేసవి మధ్యాహ్నం ఫ్రేమలేఖలని చదవటం మొదలు పెట్టాను. వొక పేజ్ నుంచి మరో పేజ్లోకి చూపులు కదలనని మొరాయిస్తున్నాయి. కాసపటికి గూస్పింపుల్స్.
అప్పటికే మైదానం, శశిరేఖ , అమీన , హంపీకన్యలు చదివి యీ పమలేఖలకి ముందు అరుణని చదివి వున్నాను. అప్పటికింకా నా చెవుల్లో అరుణ జలపాతపు నవ్వు హారెత్తిస్తోనే వుంది. ఆ చలం యీ చలం వొక్కరేనా… వొక్కరే. వాళ్లు అమ్మాయిలు. యివి లేఖలు.
ఆ సాయంకాలానికి గాలిదుమారం చాలా వేసవి సాయంకాలాల్లానే. కాని ఆ నాటి ఆ దుమారం రాబోయే కాలంలో నా హదయంలో చెలరేగే మనోదుమారానికి నాందని ఆ క్షణం తెలియలేదు.
కరెంట్ పోయింది యింట్లో. హరికేన్ లాంతరు వెలుగులో చదవాలని ఆరాటపడ్డాను. యీ పుస్తకంలో మునిగి అసలే సాయంకాలం మల్లెమొగ్గలు కోయలేదని అలిగిన మా మేనత్తలు నాకు లాంతరు యివ్వకుండా శిక్షించారు. చివరికి గాలి ఆగింది. కరెంట్ వచ్చింది. హరికేన్ దీపాలు ఆర్పిన తరువాత వచ్చే మసివసన కమ్ముకొంటుంటే మరిన్ని లేఖలు చదివాను. ఆ రాత్రి అందరు నిద్రపోయాక కూడా వెదురు బద్దలు రెయిలింగ్తో వున్న వరండాలో కూర్చుని మరి కొన్నింటిని చదువుకొన్నాను. అలా ఆ వేవవిలో చాలాసార్లు ఫ్రేమలేఖలని చదువుతూనే వున్నాను.
తొలిసారి పాపాయి కన్నులు విప్పినంత మదువుగా మనసు విచ్చుకొంటుంది. మెల్లమెల్లగా నా హదయంలో వొక పసికోరిక విప్పారటం మొదలయింది… ఫ్రేమలేఖ రాయాలని. అప్పుడే యెవ్వరు మనసులోకి వచ్చే అవకాశం పెద్దగా ఆ సమయంలో యెవ్వరికి ఇస్తాము. కానీ చివరికి రాసేశాను. యెంత బాగ రాసుకొన్నానో. యెడిట్ తెలియని మనసుతో. యెవ్వరు లేని మనసులో యెవ్వరినైన మనసులో నింపుకొంటే అంత గాఢంగా అంతే మదువుగా అంతే చిలిపిగా అంతే గౌరవంగా నింపుకోవాలి. యిది పరస్పరం. అది సాధ్యం కానప్పుడు చలంగారే దారి కనుగొన్నారు. ప్రపంచానికే ప్రేమలేఖలు రాయాలి.
అలా యెప్పుడు చలంగారివి యే పుస్తకం పట్టుకొన్న వాళ్లని మనం వదల్లేం. వొకసారి చదివినప్పుడు తోచనవి మరోసారి తోస్తాయి. కొన్నిసార్లు మొదట తోచినవి మరెప్పుడో కాదనిపిస్తాయి. నేను చదువుకొన్న తెలుగు సాహిత్యంలో నాతో యిలా దాగుడుమూతలు ఆడిన రచయిత మరొకరు లేరు. ఆకాశము, సముద్రమూ చలం వొక్కసారి కనిపించిన్నట్టు మరోసారి కనిపించరనిపిస్తుండేది.
మెల్లమెల్లగాగా సైన్స్ చదువుతుంటే సముద్రమూ ఆకాశమూ వెనుకనున్న శాస్తం తెలుస్తున్నట్టు లోకాన్ని చూస్తున్న కొద్దీ చలంగారు , చలంగారిని చూసేకొద్ది లోకం యేదో తెలుస్తున్నట్టుండేది.
యింతకీ చలంగారు యెందుకిలా మనలని మనం, ఆయన్ని పలకరించుకొనే వుంటాం. యిప్పటికి యెంతో యిష్టంగా ఫ్రేమగా. యెందుకు మనకి యితను దార్శనీకుడు.
చలంగారి శతజయంతి వుత్సవాలప్పుడు ఢల్లీలో మీటింగ్కి వెళ్లాం. ఆంధ్రా భవన్లో సభ. వి.యస్. రమాదేవిగారు మాటాడుతు తన వృత్తిలో కొన్ని బిల్స్ ముఖ్యంగా స్తీలకి సంబంధించినవి తయ్యారు చేసినప్పుడు చలంగారు యెలా గుర్తొచ్చేవారో ఆ సాహిత్య ప్రభావం యెలా వుండేదో చెప్పారు.
అలానే చలంగారు తమ తరంవారికే కాకుండా యిప్పటి తరం వారిని యెలా ప్రభావితం చేస్తున్నారో చూడండని ఆమె నన్ను సభ ముందుకి చేయిపట్టి లాక్కొచ్చి సభకి పరిచయం చేసి యీ యంగ్లేడీ యిప్పుడు ప్రసంగిస్తారని చెప్పారు. అలానే వరంగల్లో చలంగారి ఫ్రేమలేఖలపై మాట్లాడినప్పుడు ఆ సభలో వున్న కాళోజి గారు మొదటి వాఖ్యం పూర్తికాగానే చప్పట్లు కొట్టారు. సభ అయ్యాక కాళోజిగారితో మాటాడుతుంటే కాళోజిగారు అన్నారు చలంని యెప్పటికప్పుడు కొత్తతరం తమ కాలానికి అనుగుణంగా చూస్తోందన్నారు. ఆ రాత్రి చలంగారి అల్లుడు విశ్వంగారి దగ్గర కూర్చుని చలంగారి కబుర్లు చెప్పించుకొన్నాను. ఆ రోజు నుంచి విశ్వంగారు మంచి స్నేహితులయ్యారు. విశ్వంగారు మా యింటికి వచ్చినప్పుడొకసారి యక్సర్సైజ్ చేసే సైకిల్ని చూసి రోజు చేస్తావా అని అడిగారు. లేదు… అప్పుడప్పుడూ అన్నాను. చలంగారిని యిష్టపడటమంటే స్వేచ్ఛని యిష్టపడటం … డిసిప్లీన్ లేని స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. చలంగారు చాలాచాలా చిన్నచిన్న విషయాలలో కూడా యెంతో బాధ్యతగా వుండేవారని విశ్వంగారు చెప్పారు.
సభలు సమావేశాలు , పుస్తకాలు యిలా చాలా వుత్సాహంగా చలంగారి శతజయంతిని జరుపుకొన్నామంతా.
తిరిగితిరిగి ఆలోచిస్తోంటే అనేకానేక ఆలోచనలు కమ్ముకొనేవి. స్త్రీవాద రచనలు విరివిగా వచ్చినకాలంలో ఆధునిక స్తీలకి సంబంధించిన విషయాలు ఆలోచిస్తోంటే చలంగారు స్పశించని స్తీల విషయం వుందాఅనిపించేది. అసలు స్తీ గురించి పిల్లల గురించి చలంగారు అన్ని కోణాల నుంచి నిక్కచ్చిగా రాయటం వలన సాహిత్యంలో స్తీస్వేచ్ఛకి వో రహదారి యేర్పడింది. అసలు చలంగారు యింతగా రాసుండక పోతే యెక్కడ నుంచి ప్రశ్నించటం మొదలుపెట్టాలి. యెంతగా వివరించాల్సి వచ్చేదో కదా. అంత శక్తి వున్న వారు యెవరు. మార్గం సుగమం అయింది.
కొందరు చలంగారిని మొదటి ఫెమినిస్ట్ అనేవారు. చలంగారిని అలా వో విషయానికి పరిమితం చేయలేమనిపించేది. ఆయన అందించిన తాత్వికత జీవితంలో యెన్నెన్నో పార్స్వాలకు సంబంధించేది. లోతైనది . సౌందర్యంతో మిలమిలలాడే రచనలు. కపటత్వాన్ని అసూయని అనుమానాన్ని ద్వంద నీతిని నిక్కచ్చిగా యెత్తి చూపించి హృదయాలని ప్రక్షాళన చేయ్యాల్సిన అవసారాన్ని నిర్భయంగా నిజాయితీగా చూపించింది.
ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా స్తీపురుష సంబంధాలు అత్యంత హింసాత్మకంగా మారిపోతోన్న వేళ , యిన్సెక్యూరిటీతో వొకరినొకరు పోలీసింగ్ చేసుకొంటున్న సమయమిది.
ప్రస్తుతం జీవితాలు బోల్డంత యెక్స్ట్నాలైజ్ అయిపోయిన సందర్భంలో మన సమాజం, జీవితాలు వున్నాయి. అన్ని విషయాలని మార్కెట్ నియంత్రిస్తున్న యీ సమయంలో యే వస్తువు యే ఫ్రేమకి, యేయే అనుబంధాలని నిదర్శనమో చెపుతు మనలని కండీషనైజ్ చేయటమే కాకుండా యెలాంటి స్త్రవర్బతీవం యేయే వివాహానికి, పిల్లలపెంపకానికి , ఫ్రేమకి, స్నేహాలకి, కుటుంబాలని మిగిలిన మానవసంబంధాలకి ప్రతిబింబమో చెపుతోన్న యీ సందర్భంలో మనకి మన హదయం అంటూ వొకటుందని తెలుసుకొనే నిశ్శబ్ధం మనచుట్టూ వుందా. యిక్కడే మనకి సాహిత్యం మన మనసులపై టార్చ్ని ఫోకస్ చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని అందించిన అరుదైన నిత్యసత్యాన్వేషకులు చలంగారు.
డబ్బు, పోరు, పోటితత్వం సమాజనీతి, ప్రపంచ ధర్మం అయిన యీ సమయంలో సంబంధాల నుంచి సంబంధాల్లోకి కష్టపడుతునో, సునాయాసంగానో నడిచే వో స్పేస్ని సంపాందించుకున్నాక కూడా యెందుకు సంతోషంగా వుండలేకపోతున్నారు. అలానే అనేక అసంతప్తుల నడుమ వొకరితోవొకరు యెందుకు కపట ఫ్రేమలు కొనసాగిస్తున్నారు. వొక ప్రజాస్వామిక స్పేస్ని యెందుకు రచించుకోలేకపోతున్నారు. వొక బంధాన్ని అనుబంధంలో కంటే యిమేజ్ చట్రం లో చూడటం యెందుకు యెక్కువవుతుంది… ఆరోగ్యవంతమైన ప్రేమ ఆనవాలుని యే జీవితపు మలుపు దగ్గర పారేసుకొన్నామో లేదా విసిరేసామో , జారిపోయిందో యెవరికి వారు ఆత్మశోధన చేసుకోవలసిందే.
అసత్యల బంధాల మేడలని ప్రపంచపు మెప్పుపొందాలని నిర్మిస్తారో లేదా సత్యవంతమైన పొదరిల్లుని యెవరి ఆనందం కోసం వారు నిర్మించుకొంటారో… యెవరి చాయిస్ వాళ్లది.
మన పెదవులపై నికార్సైన నవ్వు వెలగాలంటే , మన మన:శరీరాలు మోహపు పువ్వుల పరిమళపువనం కావాలనుకొంటే , మన జీవితాదర్శం శాంతి అయితే చలంగారు తరతరాలకు చిగురించే సాహిత్యపుతోటని యిచ్చారు. సీతకోకచిలుకలమై వనమంత చూసొద్దామా…
జాబిల్లి: విహార వాణి: మున్నార్ (కేరళ)
సారంగ: చిన్నోడి అమ్మ
పుస్తకం: ఆత్మ యజ్ఞము (అను గొల్ల కలాపము) – భాగవతుల రామయ్య
2013-05-13
Home: ఆమె లేదు!
ఆదివారం, 12 వ తేదీ, 2013 వ సంవత్సరం. ఈ రోజుకు గల ప్రాధాన్యత. ఆ(! అదేనండీ! మాతృ దినోత్సవము (Mother’s Day.)
విజయ నామ సంవత్సరములో ఇంగ్లీషు వారు ఏర్పరచిన ఈ మంచి పండుగ విశ్వవిఖ్యాతమైనది. అందుకే ఒక ప్రముఖ రచయిత అనుభవాన్ని చెప్పుకుందాము.
**************
ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ (నవంబర్ 30, 1835 -21 ఏప్రిల్ 1910) అసలు పేరు శామ్యూల్ లా మ్ గోర్న్ క్లెమెన్స్. మార్క్ ట్వైన్ కి తన అమ్మ అంటే ఎంతో ప్రేమ.
“నా అమ్మ నా వలన అనేక ఇబ్బందులు పడింది, ఐతే వాటిని ఆమె సహనంతో ఎదుర్కొంది. నా జీవితాన్ని ఆనందమయం చేసింది.” అన్నాడు. తన జీవితములోని ఒడిదుడుకులనూ, మిట్టపల్లాలనూ – స్వానుభవములనూ గుర్తుచేసుకుంటూ.
**************
మార్క్ ట్వైన్ హాస్యచతురత జనులను ఆకర్షించేది. మార్క్ ట్వైన్ రచయితగా పేరుప్రఖ్యాతులు గడించాడు. ఆతని ప్రతిభకు గుర్తింపు లభించినందు చేత, అనేక సన్మానాలు అతనికి జరుగుతూండేవి. మార్క్ ట్వైన్ కి 70 ఏళ్ళు వచ్చినవి. అతని డెబ్భైవ జన్మదిన సందర్భముగా కొన్ని ఆంగ్ల సాహితీ సంస్థలు "మీకు సన్మానము చేస్తాము."అని ఆహ్వానించినవి. ఘనమైన అభినందన మందారమాలలను అందుకున్నాడు. ఆనవాయితీ ప్రకారం గెస్టు, నిర్వాహక, పుర ప్రముఖులు ముక్తసరిగా మాట్లాడారు. అందరికీ మార్క్ ట్వైన్ ఉపన్యాసాన్ని వినాలని అభిలాష. కనుక "మిస్టర్ మార్క్ ట్వైన్ మీరు మీ అమూల్య వాక్కులను వినిపించండి." అని అడిగారు.
మార్క్ ట్వైన్ ఆనాడు తన అనుభవాలను కొన్నిటిని శ్రోతలతో పంచుకున్నాడు. ప్రేక్షకులు చెవులు రిక్కించి వినసాగారు.
"నా మొదటి పుట్టిన రోజుకూ, ఈ నాటి ఈ జన్మదినోత్సవ వేడుకకూ అసలు ఏ మాత్రమూ పోలిక లేదు. ఆరోజు ఒక చిన్న ఇరుకు గదిలో...అక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు - నేను, నాతల్లి. అప్పటి బర్త్ డే కి ఏ పూలూ, బొకేలూ లేవు. ఏ పళ్ళూ, ఫలహారములూ లేవు. నిశ్శబ్దమే సంగీతం. నా కన్నతల్లి మమతానురాగములే పుష్ప హారములు. నేటి ఈ సంబంరంలో ఆవిష్కృతమౌతున్న అనేక సంతోష చిత్రవర్ణాలను నేను వీక్షిస్తున్నాను. కానీ ఇప్పుడు, ఇక్కడ ఈ హర్షాతిరేక ఉత్సవ చిన్నెలను చూస్తూ మురిసిపోయేటందుకు అమ్మ లేదు."
అది ఉపన్యాసమా? కాదు, ఆర్తికి ప్రతిబింబం! అవి నుడువులా? కావు, మార్క్ ట్వైన్ మనో కుహరములో నుండి ఎగసిన ఆవేదనల వెల్లువ!
సభలోని ఆడియన్సు చెమ్మగిలిన నయనములే మార్క్ ట్వైన్ కి ఓదార్పు పద్యాలకు ఆనవాళ్ళు ఐనవి.
పుస్తకం: వీక్షణం-31
2013-05-11
Home: ఫుట్ నోట్స్-1 ఇప్పటికిప్పుడు ఇదే..
1
ఏమీ తెలియకపోవడం
గుర్తు పట్టకపోవడం
మరచిపోవడమూ
- ఇవి కూడా బాగుంటాయి అప్పుడప్పుడూ.
2
పూల గురించి అంతా తెలుసు అనుకుంటాను
వాటి మెత్తని శరీరాన్ని నిమురుతున్నప్పుడు
నా గరుకుతనం గుర్తొస్తుంది.
3
ముళ్ళ ని ఇట్టే గుర్తుపట్టేస్తాననీ అనుకుంటాను
తీరా అవి గుచ్చుకున్నప్పుడు
నా మెత్తనితనం తెలిసిపోతుంది
4
వొట్టి రాళ్లే కదా అని నడుస్తూ నడుస్తూ
వాటికేసి చూపు వంచి చూడడం మరచిపోతాను.
మరచిపోవడం అనేది ఎంత గరుకుగా వుంటుందో
ఎంత కొచ్చెగా వుంటుందో తెలిసిపోతుంది కాళ్ళకి.
5
ఏమీ తెలియకపోవడంలోనే నేను తెలిసిపోతాను
గుర్తు పట్టకపోవడంలోనే
నన్ను నేనూ నిన్ను నువ్వు గుర్తుపట్టేస్తాం
మరచిపోవడంలోనే
అన్నీటినీ తలచుకుంటాం.
6
ఏ స్థితీ
శాశ్వతం కాదని చెప్పడమే ఇవాల్టి ఫుట్ నోట్!
2013-05-10
Home: నాగరికత - మరికొన్ని కవితలు
నలుగురి భుజాలపై
చూస్తుందీ లోకం.
గోరింట
ఆమె భావిజీవితమని! కరపత్రం రాశాయా చిగురాకులు
ఆ నవవధువు కరమ్ముల.
తాంబూలం
తమ కలయికకు ఎంత అందమైన వన్నె తెస్తాయో
చూడా ఆకు వక్కలు.
కర్తవ్యం
తీరాన్ని చేరే తమ కర్తవ్యాన్ని, ఎవరు మరిచారో చెప్పు!
ఆ పడవా? లేక ఈ అలా?
పుస్తకం: నాట్స్ సంబరాల స్రవంతి – రచనల పోటీలు
పుస్తకం: పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు
2013-05-09
పుస్తకం: కథావార్షిక 2012 – ఆహ్వానం
కౌముది మాసపత్రిక: కౌముది-రచన కథల పోటీ ఫలితాలు
కౌముది మాసపత్రిక: కౌముది - మే 2013 సంచిక విడుదలైంది
పుస్తకం: 1948 హైదరాబాద్ పతనం — పేరుకు సరిపడని పుస్తకం
2013-05-08
Home: కమిలిన కమలం - చిక్కుముడిలో హస్తం
"దండాలు గురూ!"
"వెర్రోహం శిష్యా!"
"చూసారా గురూ?"
"హు..హు..హు....కాల్చేసాము కూడా శిష్యా!"
"వెర్రోహం...."
"అది పెటెంటెడ్ పదమురా అక్కుశిష్యపక్షీ! పరులు పలుకరాదు!"
"క్షమించండి! కర్నాటక అంతర్నాటకానికి అంతరార్థాలు తెలుసుకోలేని నా నిస్సహాయస్థితికి ఆ పదమే దివ్యౌషధం గురూ!"
"వెర్రివాడా కుర్రవాడా!"
"వేడుకొంటున్నాను గురూ! చేతులు జోడించాను గురూ! అనుగ్రహించండి మహాగురు!"
"హు..హు.హూ...కమలం కమిలిందిరా. హస్తము చిక్కుముడిలో చిక్కుకుందిరా! పృష్ట తాడనాత్ దంతభంగః"
"వద్దు గురూ...మీ రహస్య కోడెడ్ సాంకేతిక ఎంబడెడ్ భాషలో చెబితే నాకు హత్యయే శరణ్యం!"
"యూ మీన్ మై హత్య?"
"అనుమానమా గురూ!"
"ఆ....మ్మ్.....మాటతో పోయేదానికి మర్డర్ దాకా ఎందుకు?"
"గురువులు బుద్ధిమంతులు!"
"ఐతే విను శిష్యా! కమలం కమిలిపోవడానికి కారణం భాజపా చివరాఖరి ముఖ్యమంత్రిగా ఓ షట్టరును పెట్టుకోవడం!"
"ఆయన షట్టరు కాదు శెట్టరు గురూజీ!"
"అక్షరంలోని మార్పు ఫలితాల్ని మార్చినదేమిరా?"
"లేదు గురూ!"
"అదేమరి! అసలే మూడు ముక్కల ముఖ్యమంత్రుల్తో వెర్రెక్కివున్న కన్నడిగులకు శెట్టర్ అంటే షట్టర్ అనుకొని భాజపా కొట్టును మూసేసారు."
"ఓహో అలాగొచ్చారా! అద్భుతంగా ఉంది గురూ. మరి హస్తానికి చిక్కుముళ్ళెందుకు? ఎక్కడ?"
"వెర్రోహం! భాజపా అవినీతిని ఎండగట్టి, ప్రజల మద్దతు కూడగట్టి కదరా కర్నాటక కాంగిరేసు గెల్చింది. అదే చావగొట్టుడు ఆంధ్రాలో జరిగితే సదరు కాంగి రేసు...."
"తుస్సుమంటుందంటున్నారా! అమోఘం....దివ్యోపదేశం, దివ్యోపదేశం."
"అదేరా వోటుమాయ! వోటరు బాబు ఎప్పుడు, ఎలా తన్నినా...తన్నులు మాత్రం పృష్టభాగానికే తగులురా!"
"దానితో ఎంత పెద్ద పార్టీకైనా మూతిపళ్ళు రాలునుగా!"
"హస్తానికైనా, కమలానికైనా తన్నులు తప్పవురా! వెళ్ళిరారా కుర్రవాడా...వెర్రివాడా"
"ధన్యోస్మి గురూ! ధూమ్ ధామోస్మి గురూ!"
"హు..హు..హు...వెర్రోహం!"
పుస్తకం: నోబెల్ కవిత్వం – పుస్తకావిష్కరణ ఆహ్వానం
2013-05-07
నవతరంగం: సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు
నవతరంగం: సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు
2013-05-06
Home: నీరు లేని స్వతంత్ర్యం!
2013-05-05
Home: మధ్యాహ్నపు నీడ
1
ఈ మధ్యాహ్నం
తొందరేంలేనట్టు నిదానంగా విస్తరిస్తున్న నీడల్నిచూస్తున్నపుడు
దయాగుణమేదో కవిత్వంలా మెలమెల్లగా కనులు విప్పుతోంది
నిద్రచాలని రాత్రిలోంచి ఈదుకొంటూ వచ్చి
ఇవాళ్టి దృశ్యరాశిలో తొలిభాగమంతా ఆలోచనలలో పొగొట్టుకొన్న నన్ను
ఈ మధ్యాహ్నపు నీడ స్నేహితుడిలా పరిశీలించింది
2
పగలొకటే చాలనీ, రాత్రికి లోకంతో పనేముందనీ
పోరాటం జీవితమనీ, కాస్తంత ప్రేమకీ, శాంతికీ చోటులేదనీ
నిన్నరాత్రి వాదించిన మిత్రులతో
రెండూ సమానమనీ, ఒకదాన్నొకటి నిరంతరం నింపుకొంటాయనీ
ఒకటి కోల్పోతే, రెండవదీ కోల్పోతామనీ
ఒప్పించలేకపోయిన నా అశక్తతకి దయగా నవ్వుకొంటున్నపుడు
పగటి వెలుతురుమహల్లోకి రాత్రి పంపిన అతిథిలా ప్రవేశిస్తున్న
ఈ మధ్యాహ్నపు నీడ
నువ్వూ నాలాంటివాడివే అంటూ మృదువుగా పలకరించింది
3
నల్లని రాత్రిలానో, తెల్లని పగటిలానో
తనకంటూ ఒక రంగునేమీ మిగుల్చుకోని నీడ
గర్వం నుండి ప్రేమకీ, ఉద్వేగాల నుండి స్పష్టతకీ ప్రయాణించే
నా అక్షరాల్లాగే, వాటిలోంచి లీలగా కనిపించే నాలాగే
బహుపలుచని ఉనికిని మిగుల్చుకొంటూ సమీపించింది
4
నను కన్న జీవితం
నేను ఒంటరినయ్యానని భావించేవేళల్లో తోడుంటుందని సృష్టించినట్లు
ఈ మధ్యాహ్నపు నీడ దయలాగా నెమ్మదిగా తాకింది నన్ను
2013-05-04
Home: షంషాద్ బేగం అనే టెంపుల్ బెల్ వాయిస్ మరియు ధూమపానోపాఖ్యానం
"మందిరం లో గంట శబ్దం వంటి గొంతు" అని ఓ.పి. నయ్యర్ అన్నాడు. "షోర్ మచాతీ కోయల్" అని రాజ్ కపూర్ పిలిచేవాడు. "సుభోకా ఆలం" అని నిగార్ సుల్తాన పాడేది. "బేగం! నాకో పాట..." అంటూ సాలూరి వెంట పడేవారట.
ఇంతకూ ఎవరామే?
ఎవరో కాదు మన షంషాద్ బేగమే!
1996 లో అనుకుంటా షంషాద్ బేగం మరణించిందని వార్త గుప్పుమంది. T Series వారు మరో అడుగు ముందుకు వేసి ట్రిబ్యుట్ క్యాసెట్ను విడుదల చేసేసారు కూడా. అప్పుడూ బేగంగారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి "బాబూ! నేను చావలేదు, ఇదిగో ఇంకా బతికే వున్నాను.. కావాలంటే కళ్ళారా చూసుకోండి" అని బోసి నవ్వొకటి నవ్వింది షంషాద్ బేగం.
అక్కడితో ఆగక "ఆహా, నేనెంత లక్కీని! నా చావు వార్త నేన్ కంఫర్మ్ చేస్తున్నాను!" అని కిసుక్కున నవ్వింది.
************
బాలివుడ్ మొదటితరం ప్లేబ్యాక్ సింగర్స్ లో షంషాద్ బేగం వకరు. ప్రత్యేకమైన గొంతు ఆమెది. ఎవరి గొంతును ఆమె అనుకరించదు. ఎవరూ అనుకరించ సాహసించని గొంతు షంషాద్ ది.
***********
షంషాద్ బేగమ్ 19-04-1919 లో అమృత్సర్, పంజాబ్ లో పుట్టింది. సుమారు 6000 పైగా పలు భాషల్లో పాటలు పాడింది. ఆల్ ఇండియా రేడియో పెషావర్ మరియు కరాచి నుండి తన ప్రస్థానం మొదలు పెట్టింది. మెలోడి క్వీన్ మేడం నూర్జహాన్ వంటీ మహామహా గాయకురాళ్ళ మధ్య తన ఉనికి కాపాడుకుంది షంషాద్. ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదుర్ షాహ్ జఫర్ రాసిన ఆఖరి కవిత "న కిసీకా ఆంఖ్ కా నూర్ హూన్"ను షంషాద్ బేగం పాడగా రికార్డ్ అయిన మొదటి పాట.
ఒకానొక దశలొ మేడం నూర్జహాన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ వసూలు చేసిన ఏకైక భారతీయ గాయని షంషాద్ వక్కతే. నర్గిస్ తెర మీద పాడిన మొదటి పాటకు తెర వెనుక గొంతు షంషాద్ దే.
తన 94వ ఏట 23-04-2013 న మరణించింది. కాని ఆమె పాడిన "లేకె పెహ్లా పెహ్లా ప్యార్", "కభీ ఆర్ కభీ పార్", "కహి పె నిఘ హై కహిన్ పె నిషాన" వంటి పాటలు ఎప్పటికీ నిలిచే వుంటాయి.
{audio autostart:yes}Kahin Pe Nigaahen Shamshad Begum in CID.mp3{/audio}
ధూమపానోపాఖ్యానం మరియు ధూమోపాఖ్యానం
ధూమోపాఖ్యానం ఇతరులను కష్టం కలిగించేది కాగా ధూమపానోపాఖ్యానం మనల్ని నష్టం కలిగించేది. కొంతమందికి ఎదుటి వారి జీవితాల్లో పొగ బెట్టడమే పని . వారికి అదోరకమైన పైశాచికానందం. అలాగే పొమ్మనకుండా పొగపెట్టడం కూడా ఈకోవకు చెందినదే.. అదే పనిగా పుకార్లను గాలిపటాల షికార్లుగా ఎగరేస్తుంటారు. వకప్పుడు ఇంట్లో పాము వస్తే దాన్ని బయటకు పంపటానికి పొగ పెట్టేవారు. అలాగే పాము మనస్తత్వం కలిగిన కొంత బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పొగ పెట్టక తప్పదు అంటారు పెద్దలు.
ఇక్కడితో ధూమోపాఖ్యానం సమాప్తం.
మరొకటి: ధూమపానోపాఖ్యానం,
యవ్వనపు తొలినాళ్ళల్లొ కవిత్వంతో పాటు ఇదీ జీవితంలో వక భాగం అయింది. నాగభైరవ కోటేశ్వరరావు గారి వంటి వారికి చుట్టలు కొని ఇచ్చిన భాగ్యం నాది. మో గారి పెట్టె లోంచి 2 సిగిరెట్లు దొంగిలించాను..ఎండ్లూరి సుధాకర్ గారి నుంచి ఎన్ని సార్లో! యూనివర్సిటీ నుండి ఇంటికి వెళ్తూవెళ్తూ తన డెస్క్ తాళాలు కావాలనే మరిచిపోయేవారు.
వారు వెళ్ళక నెమ్మదిగా నేను దొరలాగా వెళ్ళీ దొంగిలించేవాడిని. చూస్తే 4-5 వూదు బత్తీలతో పాటు 10-20 చిల్లరా వదిలేవారు. అప్పట్లో 10 రూపయలంటే ఇప్పుడు 100 రూపాయల కన్నా ఎక్కువే.
ఇప్పటికీ స్మోక్ జోన్ లో రోజూ కొత్త వాళ్ళు పరిచయమవుతుంటారు. అదో రెలీఫ్ అడ్డా. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక అమ్మ నా దగ్గరకొచ్చి లైటర్ అడిగింది. "లేదు!" అన్నందుకు ఒక తియ్యటి తిట్టు తిట్టి వెళ్ళింది.
కిరణ్ నేను కలిసినప్పుడూ మా ధూమపాన రిచువల్ కి ఉక్కిరి బిక్కిరి అయ్యే సోదరుదు రఘూత్తముడు మమ్మల్ని సరదాగా శపిస్తూంటాడు - "ఇందుకే మీ ముఖవర్చస్సు తగ్గిపోతుంది" అంటూ.
ఈమధ్యనే జరిపిన వక సర్వే ప్రకారం MNC ల్లొ పని చేసే మగాళ్ళ కంటే ఆడాళ్ళే ఎక్కువ ధూమపాన ప్రియులని. ఈ లెక్కన పొగత్రాగని మగబాంధవులందరూ వచ్చే జన్మల్లో దున్నపోతులై పుడతారో ఏమో? వేచి చూడాలి!
2013-05-01
కొత్తపల్లి: నవ్వండి!
సేకరణ: జి.సత్య లక్ష్మి, మూడవ తరగతి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా
కొత్తపల్లి: లోలా వాల్టర్స్
యువకెరటాలు నిర్వహణ: సౌమ్య, పుస్తకం డాట్ నెట్
ఈమాట: ఈమాట మే 2013 సంచికకు స్వాగతం!
ఈమాట: Good Bye.
ఈమాట: నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం
ఈమాట: కతికితే అతకదు
ఈమాట: పై గదిలో ప్రేమికుడు
ఈమాట: వదిన
ఈమాట: ఇలైయిల్ తంగియ తూళిగల్
ఈమాట: టోపీలు పెట్టబడును
ఈమాట: చతురదూతిక
ఈమాట: మంత్ర భాషణం
ఈమాట: జాతర
ఈమాట: సిరినివాస వృత్తము
ఈమాట: పుష్పవివేకము
ఈమాట: ఊపిరిపాటకు చూపేదీ?
ఈమాట: లెక్కల పాఠం
ఈమాట: మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు
ఈమాట: మల్లే పూల్ మల్లే పూల్
ఈమాట: ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.
దృశ్యం ఎంత నశ్వరమో స్పురించినపుడు కలిగే సాంద్రమైన దిగులుని మూడవ స్టాంజా అనుభవంలోకి తెస్తుందనుకొన్నాను భాస్కర్ గారూ.
నా కవిత్వాన్ని ఆలోచన చేసే చోటునుండి గాక, అనుభూతి పొందే స్థలం నుండి చదువుకోవాలనుకొంటాను తరచూ. ‘మీ కవిత్వం అర్థం చేసుకొంటున్నాను’ అని ఎవరైనా అంటే విచారం కలుగుతుంది. నా కవిత్వం పనిచేసేది అర్థాలకన్నా లోతైనచోట.. ఎక్కడ భయసుఖదు:ఖాది స్పందనలు తొలిసారి చలిస్తాయో అక్కడ అని నా అభిప్రాయం. అంటే మేధతో కాకుండా, హృదయంతో నా పదాల్ని తాకినపుడు అవి లోతైన దిగులునో, శాంతినో కలిగిస్తాయి అని.
అఫ్సర్ గారూ, నా అభిప్రాయం సరిగానే ఉండనిపించింది మీ స్పందన చదివాక.
అఫ్సర్ గారికీ, భాస్కర్ గారికీ, సుబ్రహ్మణ్యం గారికీ, విజయ్ కుమార్ గారికీ ధన్యవాదాలు.
కొంచం ఆలస్యంగా చదివానండీ,అంతర్ముఖం మీ పద్ధతిలో బాగా రాసారు.మిగతా విషయం గురించి పైన అన్ని కామెంట్లూ కాపీ పేస్ట్.ఇంకా తరచూ రాయాలని కోరుకుంటున్నా.
మధురమైన భావలాలిత్యం, ఆత్మీయతను సున్నితంగా, సుందరంగా ప్రదర్శించిన తీరు బాగున్నాయి.
విజయ్: అనుబంధాల అల్లికలో నీ అక్షరాలు అందంగా వెలుగుతాయి!
చూడు ఈ వాక్యాలు: “స్నేహమో, ప్రేమో, మరి ఏ బంధమో
పోగొట్టుకున్న ప్రతిసారీ
కమ్ముకున్న దిగులు మేఘం …..
‘కాలం మాన్పిన గాయాలు’ వొట్టి భ్రమేనా?”
బంధాల్ని ఇంత తడిగా చెప్పడం రామానుజన్ తరవాత నీకే సాధ్యమా అనిపిస్తుంది చాలా సార్లు!
baagaavundi
thanks for your comment
thank you madam….
This question appears like the egg or chicken question. But in this particular instance, I think it is the poem that arrived first and its Chandassu evolved later. In fact, it is like the vAlmIki story that has been alluded to in the essay by the erudite nArA gAru. First the poems or SlOkAs came and then the rules. In fact, many a time the rules do not always fit the poems, because it is the latter that arrived on the scene first. Most of the early metres were characterized by the number of syllables they contained, e.g., six for gAyatri, eight for anushTubh, eleven for trishTubh, etc. The metres arrived afterward. However, later when the akshara Chandassu based on the gaNa scheme was established by piNgaLa (and perhaps other earlier prosodists whose names we do not know now) and the author(s) of bharataSAstra, the traits of many metres were described before they were used. Metres like SArdUlavikrIDita and mandAkrAnta were perhaps described before they were first used by aSvaghOsha and harasEna. The same is true in our native Chandassu too. Folk songs, proverbs and women’s songs were set to metres like dvipada and taruvOja before actually their characteristics were explained in books on prosody. The same is true in kannaDa too where tripadi and other metres were there before nAgavarma’s ChandOMbudhi (first available book on prosody in kannaDa, a few years before jayakIrti’s ChandOnuSAsana in Sanskrit). In telugu, kavijanASrayamu is the earliest book on Chandassu that is available to us at present.
In fact I would even venture to state that the lullabies and love songs by the woman is the origin for later day prosody!
Regards! - mOhana
సారథి గారూ: ఈ ప్రశ్న మోహనరావు గారిని అడగండి. నా సమాధానం కన్నా ఆయన సమాధానం ఎక్కువ బాగుంటుంది.
– నారా.
ప్రసాద్ గారు, గసగసాలు అంటే నాకు తెలియదు అని చెప్పలేదండి :). శేఖర్ కమ్ముల గారికి తెలియదట అప్పటివరకు. తన వ్యాసంలో రాసిన మాటలని ఉన్నవి ఉన్నట్టుగా అక్కడ రాశాను.
హరీశ్ గారికి
ఈనాడు వ్యాసం చదువుతున్నప్పుడు అపనమ్మకమే కలిగింది నాకు.
నాకు కనబడ్డ ఓ తప్పు:
“స్తీమ ఆర్ద్రీభావే” అనే పాణినీయ సూత్రంలో Steam ఉందని చెబుతోంది ఈ వ్యాసం. “స్తీం” ధాతువుకు తడి యగు (to be or become wet or moist) అని అర్థం నిఘంటువులో ఉంది. దాన్ని తప్పుగా రాసి ఆవిరి అవడం అని అర్థం సృష్టించడం చిత్రమే!
మరో జ్ఞాన గుళిక:
“హైడ్రోజెన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదంలో ఉంది.
‘ఏకతాయ స్వాహా ద్వితాయ స్వాహా త్రితాయ స్వాహా’ ఇందులో ద్వితా అనే పదాన్ని డ్యుటీరియంగానూ, త్రితా అనే పదాన్ని ట్రిటియమ్గా మార్చినట్లు అర్థమవుతుంది.”
కృష్ణ యజుర్వేదంలో ఎక్కడుందో ఈ మాట కానీ అందులోంచి ఐసోటోపుల అర్థాన్ని ఎలా లాగగలుగుతాము? మొత్తం కాంటెక్స్ట్ చూస్తే ఇదే అర్థం వస్తుందా? మరి కార్బన్ ఐసోటోపుల గురించి, యురేనియం ఐసోటోపుల గురించి కూడా కృష్ణయజుర్వేదంలో ఉన్నదా?
శ్రీనివాస్
Narayanarao garu,
Really this is interesting information and thought provoking article.
One of the great doubt lingers in mind, ever since I started learning grammar, for example:
- is chandassu created first and then poetry came into being? or
- is the evolving poetry resulted in formalising chandassu?
Btw, I am also keen to know when probably chandassu in Telugu could have been created? And by whom?
Chala manchi story Neeraja Garu…Looking forward for such nice stories
Incidentally, there is an article published in Eenadu, a telugu daily, which highlights the general notion that every thing of modern life was derived from vedas; I look forward to your opinion thereon.
Hareesh
“రా. రా. గారు - మిగతా చాలామంది ఆర్టిస్టులకి, హీరోలకీ గూడా నాచేత పాడించారని మీకూ తెలుసు. ఈ ‘సూట్’ అవడమనేది చాలా విచిత్రమైన విషయం. అలవాటు మీదే ఎక్కువగా ఆధారపడి వుంటూంది. అంతే. సర్వసాధారణంగా ఒక పురుష గాత్రం, మరో పురుషగాత్రంతో సరిపోతుంది.” - పి.బి. శ్రీనివాస్
నిజమే. నేను గమనించినంత వరకు పి.బీ.ఎస్. గారి స్వరం హీరో హరనాధ్ గారికి బాగా నప్పినట్టు వుండేది. అచ్చు హరనాధే పాడుతున్నారా అన్నట్టుండేది. హల్లో మేడం సత్య భామా అంటూ అల్లరిగా పాడినా, నా మాట నమ్మితి వేలా అంటూ కొంటెగా పాడినా అందంగానే వుండేది. ఆ తర్వాత, హీరో చలంకి పాడిన పాటలు కూడా మనకు బాగా గుర్తుండిపోయే పాటలే వున్నాయి. వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చేవి. చలం పాట అభినయనంలో వీరి గాత్రం చక్కగా అమరి పోయేది.
కన్నులే నవ్వేవి… వెన్నెలలు రువ్వే ఇవి’ (సారీ సాహిత్యం గుర్తుకి రావడం లేదు.) ఈ పాటలో శ్రీనివాస్ గారి గాత్రం - చరణంలో మరి మరి వినాలనిపిస్తుంది.
అలాగే, జగ్గయ్య గారికి కూడా బాగా సూట్ అయ్యేది. ‘నీలి మబ్బుల నీడ ల లోన’ — గుడి గంటలు సినిమాలో ఈ పాట ఎంత జోరుగా వుంటుందనీ! ఇంకా, చిగురాకుల ఊయలలో’ — ఇలా చాలా వున్నాయి. మనమెవ్వరమూ ఎప్పటికి మరచిపోలేని మరో మాణిక్యం లాంటి వారి పాట - ముద్దు ముద్దు నవ్వు, బుగ్గల్లో రువ్వు, జాజి మల్లి పువ్వూ, బజ్జోమ్మా నువ్వూ, బజ్జోమ్మ నువ్వు’ ఈ పాటనింకెవరు పాడినా, ఇంత లాలితనం వొలికే అవకాశం లేదేమో!?
అటు శాస్త్రీయ సంగీతం తో బాటు,ఇటు సినిమా సంగీతం లోనూ తనదైన ఒక ముద్రని కలిగిన ఈ గాయకుని గురించి ఇంత వివరణ తో కూడిన సమాచారాన్ని అందించిన మీ ముగ్గురికి ఇవే నా అభినందనలు.
వారిని ఇలా స్మరించుకుంటూ, ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ, మన తెలుగు గాయకుని ప్రతిభా పాటవాలnu పదిమందితో పంచుకునే ఈ అవకాశాన్ని కలగచేసిన ఈమాట వారికి కూడా నా ప్రత్యేక ప్రశంసలను తెలియ చేస్తున్నాను.
వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తూ.. అంజలి ఘటిస్తూ..
- ఆర్.దమయంతి.
ఈ పాటను చాలా సార్లు విన్నాను. దీని మీద అభిప్రాయాలను ఇప్పుడే చూస్తున్నాను.
పాటను ఈ విధంగా రాసి, సంగీతం సమకూర్చుకుని, పాడించి ఇక్కడ ఉంచడం చాలా శ్రమతో కూడుకున్న పని.
ఈ పాట చిన్నప్పుడు రేడియో లో వచ్చే,” మార్గము చూపుము ఇంటికి మా తండ్రి ఇంటికి” లాంటి పాటను గుర్తుకు తెస్తోంది,బహుశా పాడిన విధానం వల్ల కావచ్చు.
చారలు కట్టిన పాటలివి
జాలికి రాలే పుప్పొడులు
ఏ మరులో ఏ ఇరులో!
నీ కొస చూపుల సైగలకే
ఈ తెరలా మరలా!
ఇన్నాళ్ళూ ఏ దూరానో
ఉన్నావనుకొని ఊరుకొనీ
ఎన్నటిదీ కన్నీరు ప్రియా!
వెన్న సుమా మనసు.
చాలా బాగా వచ్చింది. మొత్తంగా వెంటాడే సంగీతం,పాట.
కలలో కల్లలో - దగ్గర దగ్గరగా వినిపించే పదాలు కాకుండా - వేరే పదం అయితే బాగా వినిపించేదేమో.
నాకు వివిధ దేశాల సంగీతం వినడం ఇష్టం.
ఇలాంటి పాటలు ఆత్మకు ఆహారంలా అనిపిస్తాయి,నెమ్మదిగా వేసవిలో ఏ వేప చెట్టు కిందో కూచుని వింటే-
http://www.youtube.com/watch?v=PMigXnXMhQ4
http://www.youtube.com/watch?feature=endscreen&NR=1&v=Zq5S5sH1Ikk
http://www.youtube.com/watch?v=zvAv3ynh4M8
పాలపర్తి ఇంద్రాణి.
మాన్యులు శ్రీ మోహనరావు గారికి
నమస్కృతులతో,
శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు సంఖ్యాశాస్త్రాన్ని, అక్షరసాంఖ్యాన్ని అభ్యసించి తమను సంప్రతించిన మిత్రులకు పేరును వ్రాయటంలో చిన్న చిన్న మార్పులు చేసుకొంటే మేలవుతుందని సూచనలు చేస్తుండేవారు. జన్మదినాన్ని బట్టి వారి వారి జాతకాలను గుణించి చెబుతుండేవారు. రేసుకోర్సులో వినోదార్థం లెక్కలు వేసి ఈ గుఱ్ఱం ఇప్పుడు గెలుస్తుందని చెబుతుండేవారు కాని, వారు స్వయంగా ఆడిన సందర్భాలు తక్కువ. వీరిది పాశ్చాత్య గణన పద్ధతి. ఆ రీతులను గుఱించిన ఒక వ్యాసంలో కొన్ని వివృతులను వ్రాశారు.
శ్రీనివాస్ గారు 1930 సెప్టెంబరు 22-వ తేదీనాడు (8 సంఖ్య) జన్మించారు. వారు ఆంగ్లంలో వ్రాసికొన్న Sreenivos (వారి పద్ధతి ప్రకారం) 8 సంఖ్య అవుతుంది. దానికి P B చేరిస్తే వచ్చే 9 కలిపినా మళ్ళీ 8 సంఖ్యే వస్తుంది. అది వారి జీవితగతికి నిర్ణాయకమైన అదృష్ట సంఖ్య అన్నమాట.
నేటి మన విశ్వాసావిశ్వాసాలతో నిర్నిమిత్తంగా విశ్వసనీయమని విశ్వసించినందున వారీ విధంగా తమ పేరును వ్రాసికొనేవారు. నేను నా వ్యాసంలో వారి అక్షరసాంఖ్య పరిశోధనలను గూర్చిన వివరాలను వ్రాయలేదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
During the preparation of this article not only did I hear hundreds of PBS songs, but also had the good fortune to read countless articles, short and long. But I am still puzzled by a trivial fact. Why did PBS choose the unusual spelling Srinivos for his name? Any trivia buffs there? Regards! - mOhana
దమయంతి గారు, మోహన గారు.
రేణుకగారి పాటల్ని గుర్తుకుతెచ్చి మమ్మల్ని ఓ నొస్టాల్జియా లోకి తీసుకెళ్ళారు. రేణుకగారి కుమార్తె అనురాధ కర్నాటక, హిందుస్తాని సంగీతాన్ని అభ్యసించి మంచి గాయనిగా పేరుతెచ్చుకున్నారు.
రేణుకగారి ప్రస్తావనతో మరొక మరుగున పడిన సుస్వరం గుర్తుకొస్తున్నది. అది శ్రీమతి సునందా శాస్త్రి (ముక్కామల సునంద) గారిది. చివరకు మిగిలేది సినిమా కోసం వారు పాడిన “చిన్నారీ నీ మనసే” (అశ్వత్థామ బాణీ, మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన) 60లలో విన్నవారే కాదు ఇప్పుడు నెట్ లొ విన్నా ఎన్నటికీ మరిచి పోలేం.
అలాగే కీ. శే. శ్రీరంగం గోపాలరత్నం గారు బికారిరాముడు సినిమా కోసం పాడిన “నిదురమ్మా నిదురమ్మా కదలీ వేగమె రావమ్మ” (బీ. గోపాలం బాణీ. రాసింది పాలగుమ్మి పద్మరాజు గారు.) ఇదే సినిమా లో జానకి, బి. గోపాలం పాడిన “ఈ దినం నా మనం పూల తోరణం” కూడా ఓ మంచి పాట.
కధ బాగుంది.
Sir, I have sent a article on tourism, please find the same
నా ఆలోచనా, అవగాహనల సారాంశములో
అతనెప్పుడూ గెలిచాననే అనుకుంటాడు అతనికి గెలవడం తెలియకపోయినా.
(శరీరక నిర్మాణం, పురుషాధిక్య సమాజం, స్త్రీపై వున్న చూపు అతన్ని అలాంటి ఆలోచనా చట్రంలో బిగించేస్తుంది)
నిజానికి ఆమె అన్ని సమయాలలో విజేత.
ఒప్పుకోవడం కష్టంగా అనిపిస్తుంది అతనికి.
దమయంతి గారు, నాకు కూడ రేణుకగారి పాటలంటే ఇష్టమే. [మీరు ఉదహరించిన ఆ పాట ఒక ఓ పి నయ్యర్ హిందీ పాటకు అనుసరణ అనుకొంటాను, పాట జ్ఞాపకానికి రావడము లేదు, కాని కబ్ ఛాయె ఘటా ఘన్ ఘోర్ అని వస్తుంది అందులో.] అరవైలలో బెంగళూరులో ఉండేటప్పుడు ఆమె పాటలను కన్నడములో వినేవాడిని. ముఖ్యముగా ఆమె జానకి, లతాలతో పాడిన హూవతందు మారిదళు తరచుగా రేడియోలో ప్రసారము చేసేవాళ్లు. ఇది పిబిఎస్ పైన వ్యాసము గనుక, రేణుక, పిబిఎస్ యుగళగీతము నొకదానిని దుడ్డే దొడ్డప్ప అనే చిత్రమునుండి వినవచ్చును.
విధేయుడు - మోహన
శర్మ గారు: అతికే యోగం వుంటే ఎలాగైనా అతుకుతుంది. కతకడంలో ఏముంది? మీ కధ బాగుంది సరదాగా.
బావుంది వ్యాసము సురేశ్ గారు! పూర్వులు వ్రాసిన కొన్ని గ్రంథాలలో సూర్యోదయమును ఉదయము ఆఱు గంటలుగా (by default) తీసికొనవలెను అని అంటారు. తరువాతి కాలములో సూర్యోదయ కాలమును కచ్చితముగా తీసికొనవలెనని అంటారు. కొన్ని సమయాలలో దీని వ్యత్యాసము సుమారు ఒక అరగంట కాలము ఉంటుంది. సామన్యముగా ఇది సందిగ్ధతను కల్పించదు. కాని తేడా అరగంటకన్న తక్కువైతే ఇది సందిగ్ధతను కల్పించవచ్చును. బహుశా 1901లో ఇలాటి సందిగ్ధత వచ్చిందేమో? జాతకములు వ్రాసేటప్పుడు కూడ లగ్న నిర్ణయములో ఈ సూర్యోదయకాలము మనకు కొన్ని సందిగ్ధ లగ్నములకు దారి తీస్తుంది.
మరో విషయము - కాల నిర్ణయము ఏ రేఖాంశము ద్వార నిర్ణయించారో అన్నది కూడ మనము తెలిసికోవాలి. ఇప్పుడు భారతదేశమునకంతటా ఒకే కాలమున్నను, ప్రతి చోటులో సూర్యోదయకాలము వేరు అనే సంగతిని మనము గుర్తులో నుంచుకోవాలి. కామరూపలో సూర్యుడు త్వరగా ఉదయిస్తే కచ్లో ఆలస్యముగా ఉదయిస్తాడు! అందుకే భారతదేశానికి రెండు time zones ఎంతైనా అవసరము, ఇది వేరే విషయము అనుకోండి. అధిక మాస నిర్ణయానికి ఈ శ్లోకమును ఉదహరిస్తారు - ద్వాత్రింశద్భిః గతైః మాసై దినై షోడశభిస్తథా ఘటికానాం చతుష్కేణ పతత్యధికమాసకః (33 నెలలు, 16 దినములు, నాలుగు ఘడియలకు ఒక మారు అధికమాసము వస్తుంది). అధికమాసమును పురుషోత్తమ మాసము, మల మాసము, మలిమ్లుచము అని కూడ పిలుస్తారు. మాసేషు ద్వాదశాదిత్యం తపంతే హి యథాక్రమం నపుంసకేஉధికే మాసి మండలం తపసే రవి (ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్యుడు (12మంది సూర్యులలో ఒకడు) ఉదయిస్తాడు, కాని అధికమాసములో ఇలాటి సూర్యోదయము లేదు, కావున సూర్యమండలమే ఈ పనులను కొన సాగిస్తుంది).
విధేయుడు - మోహన
” జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే.” విధేయుడు - మోహన.
బాగా చెప్పారు మోహన గారు! అప్పటి కాలంతో పోల్చి చూస్తే, ఇప్పుడు చాలా మార్పులే చోటు చేసుకున్నట్టు స్పష్టమౌతుంది. కొత్త కొత్త స్వరాలకి అవకాశమూ, టాలెంట్ కి తగిన సముచిత స్థానమూ దొరుకుతున్నట్టు తోస్తుంది నాకు. రొటీన్ గొంతుతో సంఖ్యాపరంగా ఏ సింగర్ ఎన్నేసి పాటలు పాడారన్న మాట పక్కనుంచితే, అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే వినిపించిన కొన్ని స్వరాల ప్రత్యేకతలు రసజ్ఞుల మనసుల్లో అలాగే ముద్రించుకు పోయి వున్నాయి. ఎన్నేళ్ళైపోయినా, ఏ మాత్రం చెక్కుచెదరక, గాన శిల్పాల వోలే అలా నిలిచే వున్నాయి. అవి అలానే వుండి పోతాయి కూడా. ఆ గాత్రాలకు గానీ, ఆ గాయనీ గాయకులకు కానీ - అంతకు మించిన అవార్డ్స్ ఏం కావాలి. బిరుదులెవరివ్వాలీ? ఆలోచిస్తే - అవసరమే లేదు అనిపిస్తుంది!
తెలుగులో ‘ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా” - ఆ గాయనిని మర్చిపోగలమా? అలాగే, ఎల్.ఆర్.ఈశ్వరి గారి మధురమైన పాట ‘నీ సన్నిధే నా పెన్నిధి’ చాలా మెలోడియస్ గా వుంటుంది, వింటున్నప్పుడు. సుస్వర బాల సరస్వతి గారి ‘ఇంతా తెలిసి వుండీ ఈ గుణ మేలరా’ అలాగే కె.రాణి ‘ ఓ దేవదా’. బాక్ గ్రౌండ్ సాంగ్స్ లో కూడా ప్రత్యేక స్వరాలు - మనని వీడక నీడలా నడిచొచ్చే పాటల్లో ‘భళి భళి దేవా,’ ‘తల్లి గోదారికే ఆటుపోటుంటే తప్పుతుందా మడిసికీ తల రాత’.
హిందీలో గీతా దత్ ‘వక్త్ నే కియా’ అలాగే హేమలత గారి - ‘ భీగా భీగా మౌసం ఆయా’ ఎంత గొప్పగా అనిపిస్తాయంటే — తెలీని మధుర విషాద వీధుల వెంట తిప్పుకు రావూ?
ఏ ఫీల్డ్ చూసినా ఏముంది గర్వ కారణం. సమస్తమూ రాజకీయల పర్వం. రికమండేషన్ల మయం. గ్రూపిజాల పద్మ వ్యూహం. ఐతేనేం? సింగర్స్ - ఎవరికి ఎవరెన్ని పాడారన్నది రికార్డుల్లోకెళ్తే వెళ్ళు గాక, కానీ ఎవరు పాడిన పాట ఎన్ని గుండెలకెక్కిందన్నదే అసలైన వరల్డ్ రికార్డ్ అంటాను.
ఇంతకీ, మీ మంచి మాటలకి ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ
నమస్సులతో
ఆర్.దమయంతి.
1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ - ఆ కథంతా మీరు వినే ఉంటారు.
మురళీధరరావు గారు: నాకు నిజంగా 1901 వివాదం గురించి తెలియదు. అయితే, నా ఊహ ప్రకారం అధికమాస నిర్ణయంలో సందిగ్ధతకు కారణాలు ఈ కింది వాటిలో ఏదైనా కావచ్చు.
1. ఉత్తర భారతంలో పౌర్ణమి నుండి పౌర్ణమి ముందురోజు దాకా ఒక చాంద్రమాసంగా పరిగణిస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్రా, గుజరాతులలో అమావాస్య తరువాత రోజు నుండి అమావాస్య వరకూ ఒక మాసంగా లెక్కిస్తారు. దీని వల్ల అధిక మాసం వేర్వేరు మాసాల్లో వస్తాయి. (అయితే, 1901 వివాదానికి ఇది కారణం కాకపోవచ్చు).
2. అధికమాస నిర్ణయానికి సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస కాలం కచ్చితంగా నిర్ణయించాలి. కొన్ని ఘడియల, విఘడియల తేడా వల్ల అధిక మాసం ఒక మాసం కాకుండా మరో మాసం అవుతుంది. ఒక్కో పంచాంగ కర్త ఈ కాలాలను ఒక్కో రకంగా కొద్దిపాటి తేడాతో లెక్కించవచ్చు (అక్షాంశాల్లో తేడాల వల్ల కూడా ఈ లెక్కల్లో తేడా రావచ్చు). నా ఊహ ప్రకారం 1901లో సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస ఆరంభమో, అంతం చాలా దగ్గరిగా ఉండి ఉండాలి. అప్పుడు కొంతమంది పంచాంగకర్తలు ఆషాఢమాసాన్ని అధికమాసంగా లెక్క కడితే, మరికొంత మంది శ్రావణాన్ని అధికంగా పరిగణించవచ్చు.
భూమినుండి సూర్య, చంద్ర గమనాలను పరికిస్తే ఎలా ఉంటుందో, అధికమాసం ఎలా నిర్ణయిస్తారో ఈ వీడియో ఫైలు చాలా సులభంగా వివరిస్తుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. సూర్యసిద్ధాంతంలో సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు గానే లెక్కలు కట్టారు. అయితే, కాలగమన నిర్ణయానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా, లేక సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా అన్న విషయం సాపేక్షం (relative). సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు భావించడం వల్ల కాల నిర్ణయంలో, ఋతు నిర్ణయంలో ఏమాత్రం తేడా రాదు.
మీకు 1901 వివాదం గురించి మరిన్ని వివరాలు తెలిస్తే వివరించగలరు.
ప్రియమిత్రులు శ్రీ సురేశ్ గారికి
నమస్కృతులతో,
అధికమాస నిర్ణయాన్ని గుఱించి మీరు వ్రాసిన వివరణ చాలా బాగున్నది.
1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ - ఆ కథంతా మీరు వినే ఉంటారు.
నాకు ఎన్నాళ్ళుగానో ఉన్న సందేహం: కాల పరిగణన రీత్యా 1901లో పెద్దలకు అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? రెండు పక్షాల వారికి వారి వారి ఆధారాలేమై ఉంటాయి? అధికమాసం విషయమై చివఱికి ఏది సరైనదని నిర్ణయించి ఉంటారు? నేను ఈ కథను ఆ వివాదంలో పాల్గొన్న మహాకవి శ్రీ దాసు శ్రీరామకవి గారి మనుమరాలు డా. వైదేహి గారి ద్వారా నా చిన్నప్పుడు పూర్తిగా విన్నాను కాని, చివఱికి తీర్పు ఏమని జరిగిందో ఇప్పుడు గుర్తులేదు.
దయచేసి మీ నిర్ణయాన్ని వివరింప ప్రార్థన.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో … సురేశ్ కొలిచాల
‘రసజ్వల’ - అన్న మాట ఈ పత్రికలో, ఏ సంచికలో, ఎవరి రచనలో, ఎన్నో పేజీలో, ఎన్నో పేరాలో, ఏ వాక్యంలో, ఎందుకు ఉన్నదో, ఎవరైనా చెబితే… అప్పటి సంగతి కదా :-)
లైలా
పుట్లహేమలత గారికి అభినందనలు.ప్రతినెల తప్పక చదువుతాను.అన్ని కాలమ్స్ చాల బాగున్నాయి.మీ విహంగ అందర్నీ ఆకర్షించే విదంగానూ,ఆలోచింపజేసే విదంగానూ,అందర్నీ సాహిత్య లోకంలో విహరింప జేస్తూ , వర్ధమాన రచయితలకు ప్రేరణగా నిలుస్తునందుకు విహంగ పత్రికకు ధన్యవాదాలు .
Nice articles Mohana Rao garu. Very informative.
Could you please explain about kaleidoscope patterns?
Thanks & Regards
Indrani Palaparthy.
కతికింది పిల్ల ఇంట్లొ కాదు కద??!!
భావనారాయణ గారు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, నాయకీనాయకులుగా నటించే నటులు కూడ ఈ (దు)స్థితికి ఒక కారణమే. పిబిఎస్ వంటి వారు నటులకు, గాయకులకు మధ్య ఉండే గాత్రముల సాదృశ్యము ఒక భ్రమ (illusion) అని చెప్పినా, నాయకీ నాయకులు కొందరు గాయకులనే తమకు పాడడానికి ఎంపిక చేసికొన్నారు. ఒక 15 సంవత్సరాలు తెలుగులో ఒక గాయకుడిని మాత్రమే నాయకులు గాత్రదానమునకు ఎంపిక చేసికొనడము జరిగినది, ఒక గాయకి మాత్రమే నాయకురాళ్లకు గాత్రదానము చేయడము జరిగినది. మిగిలిన భాషాచిత్రాలలో కూడా ఈ పరిస్థితియే. హీందీలో కొందరు నాయకురాళ్లు తమ ఒప్పందములో కూడ ఫలానా గాయకి పాడాలని వ్రాసికొన్నారు. బహుశా దక్షిణభాషా చిత్రాలలో కూడ ఇది ఉండి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొందరు దెబ్బ తిన్నారు. పిబిఎస్ స్థితి మెరుగే, వారికి కన్నడములో పెద్ద పీట ఉండినది. కాని జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే. విధేయుడు - మోహన
తః తః గారు:
కొడవళ్ళ గారు నాకు తెలియదు.
వారి వ్యాసాలు కూడా చాలా బాగుంటాయి.
మీ కామెంట్ చూసే ఉంటారని అనుకుంటున్నాను.
ఇంద్రాణి.
మాన్యులు శ్రీ మోహనరావు గారికి
నమస్కృతులతో,
“సామజవరగమన”లో “వ - ర - గ” లను రెండు యగణాలుగా మలిచి పద్యాన్ని మీరు రూపొందించిన సంవిధానం చిత్తవిస్తారకంగా అమరింది.
1) “పాదమందు వయారాల”లో 2) “శయ్య యందు ప్రమోదాల”లో ఉన్న శ్లేషాశ్లేషానికి మీకు అభినందనలు!
“విలాసాల వంచేవా మడచి” అన్నప్పుడూ “విలాసాలను పంచేవా మడచి (ఇముడ్చుకొని)” అన్న అర్థాంతరం రమణీయంగా ధ్వనిస్తున్నది!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
లక్ష్మీ రాఘవ గారు చాలా మంచి విషయాలు గుర్తు చేసారు.
విష్ణుభొట్ల లక్ష్మన్నగారూ, జెజ్జాల కృష్ణ మోహన రావు గారూ, పరుచూరి శ్రీనివా స్ గారూ,
‘చెట్టులెక్కగలవా, చిలకా గోరింక’. ఈ రెండు పాటలు చాలామందికి చెంచులక్ష్మి (1958) సినిమాలో ఘంటసాల పాడిన యుగళగీతాలు గానే తెలుసు. కానీ ఇవి మొదట పి. బి. శ్రీనివాస్ గొంతుకలోనే రికార్డు కాబడ్డాయి. కానీ తరువాత కారణాంతరాల వల్ల సినిమా ట్రాకులో ఘంటసాల గొంతు వాడుకోవడం జరిగింది.
Production houses and financial executives are not exactly famous for fair play and fine ethics in their dealings. Creative spark and profit motive work at cross purposes. Investors are not pursuing their trade just to produce memorable pieces of artistic expression. The enterprise involving large investments and a huge potential for quick profits is not brimming with people of moral integrity or with men and women of finely defined ethical timbre. Caring for the fine sentiments of creative artistes such as musician s, lyricists and dialogue writers is not the sole priority of the leaders of this enterprise.
The remark, attributed to R.K. Narayan, points to the tendency of film makers — they made a feature film out of my navel. I plan a fresh novel out of the film — it is not very rare that unscrupulous elements run the roost. They never hesitate to tinker with the fine artistic nuances of a creative work. Their parameters are driven not by creative values, but by the potential for mass appeal. The cruder the better. Those artistes who fail to shed their sensitive creative traits may be branded misfits. These are liable to be ignored, or summarily hounded out altogether. Deceit by production houses as recourse in creative and financial dealings involving artistes is, though rare, is said to be fairly prevalent.
Rarely, creative genius is tolerated as long as its application is commercially viable. Originality attracts animosity and is vulnerable to be termed to have an elitist approach. Once your marketing potential starts to decrease your talent fails to attract recognition. Devulapalli and Saluri stand out as rare examples. But others like Jikki and A.M.Raja, despite having endowed with exceptional brilliance of melodic genius are not that lucky. Being fastidious is tantamount to being petulant.
A combination of substantial genius and immense good luck only may save an artiste from being put to unceremonious interference.
What I read/ heard made me believe that these two songs, both being duets, had been originally recorded with P.G.krishnaveni [Jikki] and Ghantasala and were retained in the feature film. Later the same songs were recorded again, this time by the gramophone company that bought the marketing rights of the audio sales. The reasons cited for getting the two songs recorded again were exigencies of copy right and royalty sharing. Both the two original songs in Chenculakshmi had been rendered by Ghantasala and Jikki. The information giving this miscellany is silent as to the identity of the female voice participating in the second version along with P B Sreenivas.
This version is more plausible as the PB Sreeenivas version has a different female voice from the one we hear in the film. To my untrained ear, its instrument selection in orchestral scheme sounds slightly deviated from that of the version used in the film. (I request the writers to throw some more light on these facets, especially , as to the name/names of the female voice/voices.)
The case with the song “Ooru maarinaa uniki maarunaa” was different. The solo had been first recorded in the voice of P.B Sreenivas with intention of using in the film. But the same song was replaced by a version sung later by Ghantasala. Here you cannot be sure if either of the singers had an inkling of the intention of the production house in advance.
Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana
పద్యం చాలా చాలా బాగుందండి.
పాలపర్తి ఇంద్రాణి.




