2008-08-28
2008-08-28 05:05 AM
నాగన్న
ఏనుగు బయల్దేరింది… ఎవ్వర్నీ పల్లెత్తు మాట అనకపోవడం అన్నది ఎంత అరాజకీయమో! అయినా మొరిగే వారు లేనంత భాగ్యులం కాదు, అటువంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి మన దగ్గర.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు యెన్టీవోడికి చివరిసారి ఓటు వేశాను. ఆ తరువాత పవర్ పాయింటు, ఫాక్షను రెండూ వచ్చాయి. ఒక నిజాయితీ పరుడు వస్తాడు అనే ఆశ దాదాపు చచ్చింది (జేపీని మరచినప్పుడల్లా). అయితే అమాంతం ఉన్నఫళంగా మనందరిలో మార్పు వచ్చి లోక్ సత్తాకు ఓటు వేసి గెలిపించడానికి మనదేమీ [...]
2008-08-28 04:53 AM
A. Surya Prakash (noreply@blogger.com)
కత్తి కన్నా కలం మిన్న
కలంపై జులుం చేయడమంటే
కొరివితో తల గోక్కోవడమే!
తమకు చేతకాని పని చేయబోయి
బొక్కబోర్లా పడి
అభాసు పాలయ్యారు
ఎవరిగోతివారే తవ్వుకున్నారు
తాము తవ్విన గోతిలో తామే పడతారు
తమను విమర్శించడానికి
ప్రతిపక్షాలకు తామే
ఆయుధాలు అందిస్తున్నారు కదా
తమ చరిత్రను తామే
చీకటి సిరాతో రచిస్తునారు కదా
అత్యవసరపరిస్ధితిని మళ్ళీ తలపిస్తున్నారుకదా
రాజకీయ చెట్టు కుక్కమూతి పిందెలు
వేయడమంటే ఇదే!
భేష్ భేష్
2008-08-28 03:52 AM
A. Surya Prakash (noreply@blogger.com)
అర్ధాంతరంగా తండ్రి బాల్చీ తన్నేయడం వల్ల
మేఘాలలో సంచరిస్తున్న చిరంజీవి కలల రెక్కలు విరిగి
నేలకు కూలిపోయి
చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు
ఎర్రటేపుల అరణ్యంలో చిక్కుకొని
దారి తప్పిన బాట సారి చిరంజీవి!
బాస్ చేత తలవాచేట్లు చీవాట్లు తిను
అప్పటికి కోపం దిగమింగి
ఫైల్లదొంతరల వెనుక తలదాచుకొని
ఇంటికి వెళ్ళాక పెళ్ళాం మీద కక్కేస్తాడు !
పెళ్ళికి ముందు కొత్త సబ్బుబిళ్ళలా ఉండి
క్రమక్రమంగా అరిగి కరిగి
గుండెనీరయిన
2008-08-28 03:23 AM
శరత్ (sarath.films@yahoo.com)
ఈ రోజే ఆ టపా ఇచ్చారు. మీరు చదివి వుండకపోతే ఇక్కడ చదవండి:
http://naasaahityam.blogspot.com/2008/08/blog-post_27.html
2008-08-28 03:14 AM
Gnana Prasuna (tatavartig@gmail.com)
ప్రార్ధన
జయదేవ జగన్నాథా!సర్వలోకైకవన్దిత
జయవేంకట శైలేశ !కరుణాకర !పాహినః:
త్వాం నమామో వయం విష్ణో !వేంకటాచల నాయకః
అస్మాకం వాంచితం దత్వా!పాహి !పాహి !జగద్గురో
కృపానిధే !నమస్తుభ్యం !వరదాయనమొనమ్:
వెంకటాధీశ ! విశ్వేశ !శతక్రుత్వా నమోనమః
మార్కండేయ పురాణం తీర్ధ ఖండం
2008-08-28 01:19 AM
చదువరి (noreply@blogger.com)
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.
'తాను భిన్నమైన
2008-08-28 12:59 AM
innaiah (noreply@blogger.com)
visitors are fascinated with daily visit of bird punctually!
తమిళనాడులో చాలాకాలంగా యాత్రికులు సందర్శనం చేసే స్థలం ఒకటి వుంది. తిరుపుర కుండ్రం అనే ఈ స్థలం దగ్గర యాత్రికులు ఆగుతారు. మధ్యాహ్నం సరిగా 12 గంటలకు రెండు గద్దలు వచ్చివాలతాయి. అక్కడ పురోహితుడు యిచ్చే ప్రసాదం స్వీకరించడానికి పక్షిరూపంలో సాక్షాత్తు గరుడపక్షులు వస్తాయని కథ ప్రచారంలో వుంది. విష్ణు వాహనంగా గరుడపక్షి వుండడం పురాణకథనం
2008-08-28 12:48 AM
కత్తి మహేష్ కుమార్ (noreply@blogger.com)
ఉద్యోగరీత్యా విధించుకున్న ఆరు సంవత్సరాల self exile నుంచీ మరో assignment రీత్యా హైదరాబాద్ వస్తున్నాను. So, I will be back in Hyderabad.
మొన్న హైదరాబాదొచ్చినప్పుడు ట్రాఫిక్కును చూసి భయపడ్డాను. ఆ భయాన్ని అధిగమించాలి
సిటీబస్సులో వెళ్తూ పక్కనున్న బిల్డింగులనుబట్టి దారి కనుక్కునే అవకాశం కోల్పోయినందుకు ఖంగారుపడ్డా...ఎన్ని కొత్తకొత్త హార్మ్యాలో !!! అవన్నీ ఇప్పుడు కనుక్కుని ఖంగారు తగ్గించుకోవాలి.
2008-08-28 12:42 AM
swatee sripada (noreply@blogger.com)
Sannapureddy
$Swatee Sripada
By the time Chenna Reddy returned home, his body became synonymous with fire and smoke. He went to the backyard, washed his face with cold water, had a tumbler of water offered by his daughter and settled in a chair under the fan, to feel the relief of outside heat.
“Shall I bring you food?” Shravani inquired. Water in his stomach had moved and evaporated in the
2008-08-27
2008-08-27 11:45 PM
చిలమకూరు విజయమోహన్ (noreply@blogger.com)
పూతన సంహారం
వ్రేపల్లెలో కోలాహలంగా వుంది.
నాయకుడు నందయ్యగారికి లేకలేక ఇన్నాళ్ళకి కలిగింది సంతానం అదీ మగ బిడ్డ అందులోనూ ఎంత చక్కనివాడు, ఎంత నల్లని వాడు, ఎంత చల్లని వాడు ఈ నల్ల చందమామ నవ్వులు వెన్నెలకన్న వెయ్యింతల తెలుపట .
ఆటలూ పాటలూ విందులూ వినోదాలు దానాలు ధర్మాలూ . పూతన మారువేషం దాల్చి మందిలో కలిసింది. అజాపజా చూస్తోంది. ఆమె సమీపించినప్పుడు ఆవులూ దూడలూ ,కుక్కలూ ,పక్షులూ చెదరి దూరంగా పోతున్నాయి.
2008-08-27 09:02 PM
DSG (noreply@blogger.com)
ఆగస్టు 24, 2008 – ఎవ్వరూ నమ్మని కొన్ని విచిత్రాలు జరిగాయి
- హైదరాబాదు లో హుస్సేన్ సాగర్ లోని చెత్తా చెదారం తీసేసి త్రాగు నీటి కొలను గా మార్చారు.
- లాస్ ఏంజెలస్ లో స్టీవన్ స్పీల్బర్గ్ తన తదుపరి చిత్రం నందమూరి తారక రత్న తో తీస్తున్నట్టు ప్రకటించాడు.
- బెంగళూరులో ఉంటున్న నేను ఇకపై రోజూ ఇంట్లో వంట చేసుకుని తినాలని నిర్ణయించుకున్నాను.
“ఇకనుండి రోజూ ఇంట్లోనే వంట చేద్దాం” అనుకునే ప్రతి బ్రహ్మచారి
2008-08-27 07:38 PM
చక్రవర్తి (noreply@blogger.com)
ఈ పుట వ్రాసేముందుగా, ఒక విషయం. నేను ప్రస్తుతం, అంటే ఈ పుట ప్రచురించే సమయానికి అమెరికాలో ఉన్నాను. ఖఛితంగా చెప్పాలంటే, అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని ఔస్టిన్ అనే నగరంలో ఉన్నాను. ఇక్కడ అన్ని విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ కొన్నిపద్దతులు మెచ్చుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇదిగో ఈ ప్రక్కన కనబడుతోందే అదే మా కార్యాలయం. నేను దీనిలోని తొమ్మిదవ అంతస్తులో కూర్చుంటాను. ఇంతకీ ఈ పుట
2008-08-27 06:33 PM
Prabhakar rao (noreply@blogger.com)
ఫొను నంబరు ఇచ్చినతని పేరు కూడా తెలియదు ఐన ఫొను చేసాను అతనెమి చెపుతాడొ విందామని.మొదట నా అంతట నేను పరిచయం చెసుకున్నాను. అతని పెరు చెప్పాడు రామారావు అని. కొద్దిసెపు అవి ఇవి అయిన తరువాత అసలు విషయానికి వ్చ్చాడు.రామారావు నేను వెళ్ళిన ఆఫిసు లొ ఒక చిన్న గుమాస్త.సగటు జీతగాడు.దిగువ మధ్య తరగతికి చెందిన గౄహస్తు. నా మాటలు అతని పైన పని చెసాయనిపించింది. మీరు చెప్పింది నిజమెనండి...నీతి గా బ్రతుకుదామంటే సమాజం
2008-08-27 05:35 PM
భూమిక హెల్ప్ లైన్ (noreply@blogger.com)
<!--[if gte mso 9]> Normal 0 MicrosoftInternetExplorer4 <![endif]--><!--[if !mso]> st1\:*{behavior:url(#ieooui) } <![endif]--> <!-- /* Font Definitions */ @font-face {font-family:SimSun; panose-1:2 1 6 0 3 1 1 1 1 1; mso-font-alt:宋体; mso-font-charset:134; mso-generic-font-family:auto; mso-font-pitch:variable; mso-font-signature:3 135135232 16 0
2008-08-27 05:29 PM
విహారి (noreply@blogger.com)
పార్టీ పేరు బానే వుంది కానీ 'ప్రజ' బాగా అతుకున్నేట్టు చూడు. మిగతా పార్టీల్లో అది లేకనే నీ అవసరం వచ్చింది
:::::::::::::::
:::::::::::::::
టి.డి.పి. లో నుండి వలసలకు గుర్తుగా పసుపు రంగు పెట్టడం బాగానే వుంది బావా.
:::::::::::::::
2008-08-27 05:25 PM
భాస్కర్ రామరాజు (noreply@blogger.com)
నల్లమల అడవులు పల్నాడునుంచే మొదలౌతాయి. కనీసం మేము అట్టా అనుకుంటాం. కృష్ణానది ఒడ్డెమ్మట్ట ఉంటుంది నల్లమల. పులిచింతల డాము కాడ్నుచి, నెమ్మదిగా ఒడ్డేమ్మటి చూస్కుంటా నాగార్జున సాగర్ దాక ఎళితే అడవి దుప్పులు దుప్పులకాడ్నించి దట్టమైన సెట్లదాకా ఉంటుంది. దాస్పల్లి (దాచేపల్లి), పొందుగల, సత్రశాల , అలా పైకి ఎళ్ళేకొద్ది చెట్ల సైజుకూడా పెరుగుతుంటది. నాగార్జునసాగర్ కాడ్నుంచి ఇంక థిక్ ఫారెస్టు. రాజీవ్ టైగర్
2008-08-27 05:18 PM
funcounter - ఫన్ కౌంటర్ (noreply@blogger.com)
విత్తు ముందా చెట్టు ముందా..గుడ్డు ముందా పక్షి ముందా...పతకం ముందా పధకం ముందా...అన్నది నాకు తెలియటంలేదు...పక్షి గూడు స్టడియంలో...దేశ దేశాలు పతకాలూ..పతాకాలూ మోసుకుని బై బై చెప్తుంటే మనవాళ్ళు..అందరూ కలసి ముచ్చటగా మూడు పతకాలని మోసుకుని వచ్చారు...చిన్న దేశాలనుంచీ చైనా దేశం దాకా అందరూ పతకం కోసం పోరాడారు...మన వాళ్ళు ఒకా పతకం సాధిస్తే 100 పతకాలు సాధించినట్టు...మనదగ్గర చాలా భాషలు భాషాలూ కదా...
ఒక మెడలు
2008-08-27 04:50 PM
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (noreply@blogger.com)
వాళ్ళిద్దఱూ చూడ చక్కనైన అన్యోన్య జంట. పరస్పర ప్రేమ మెండు. పెళ్ళయి అయిదేళ్ళయింది. ఇద్దఱూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ అయిదేళ్ళల్లో ఒక పెద్ద యిల్లూ, కారూ కూడా సమకూర్చుకున్నారు. కానీ ఇంతవఱకూ వాళ్ళిద్దఱి మధ్య 'ఏమీ లేదు'. అందుచేత పిల్లా, పీచూ కూడా ఎవరూ లేరు. అనుకోకుండా వారిదొక DINK family (Double Income-No Kids) గా పరిణమించింది. "అదేంటమ్మా ?" అని అడిగితే, "ఆయనకి చేతకావట్లేదు. నేనేం చెయ్యను ?" అని
2008-08-27 04:32 PM
ప్రసాదం
…
ద్వాపర యుగంలో గోవుల్నీ, గోపికలనూ, గోకులాన్ని ఆనంద సాగరంలో ముంచెత్తిన మురళీగానం గురించి వినివుంటారు మీరు కానీ నేను మీ అందరి కంటే ఒకింత అదృష్టవంతున్ని కాబోలు. ఏమంటే నిన్నటి జన్మాష్టమి వేళ …
కలియుగంలో శిశువులనీ, పశువులనీ, పండితులనీ, పామరులనీ, సంగీత సాగరంలో ముంచెత్తిన బాల మురళీ గానాన్ని ముగ్గురు గాన గోపికల సాక్షిగా అస్వాదించిన నా అపురూప అనుభూతుల సమాహారం ఈ అక్షరహారం. అసలు కథ చెప్పే ముందు ఈ అపురూపమైన చిత్రాన్ని చూడండి. బహుశా [...]
2008-08-27 04:32 PM
sujata (noreply@blogger.com)
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ..డోలా..
మీన కూర్మ వరాహా మృగపతి అవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ..డోలా..
వామనరామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగ సామజవరద మురహరణ ..డోలా..
దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా
శీరపాణే గోఅస మాణే శ్రీవేంకటగిరి కూటనిలయ ..డోలా..
కీర్తనను వినండి [Please open the link in a new Tab to stay in this page ]
2008-08-27 04:31 PM
Chivukula Krishnamohan
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
అసలు ఈ పాటని నేను పూర్తిగా వినడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలై పొంగెరా – మలైపొంగెరా అని వినగానే వేటూరి మరో రుబ్బురోలు పాట అని వదిలేసాను. అలాంటిది మాస్టారు ఈ పాటని వివరించినటపా చూసేసరికి సంభ్రమం కలిగింది. పాట వింటూ వింటూ జగణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంతలోనే నెత్తిమీద బాంబు పేలింది. పాటని వివరించమంటూ కొత్తపాళీగారి ఆజ్ఞ. అందరూ పాటని పూర్తిగా పరిశోధించినతరువాత వ్రాయడంలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే [...]
2008-08-27 04:25 PM
Vamsi M Maganti (noreply@blogger.com)
వేసవి వర్ణనము
చెలరేగకేయుక్క నీ తలబట్టి చలినొక్క
తలపకుమాచిఱ్ఱ నిను దరుము విసరుకఱ్ఱ
అనుసరించకెనల్లి నిన్నట్టెమ్రింగు బల్లి
ననుదాకకే ఈగ నిను బనసజిగటలాగ
పగబూనకే చీమ నిన్ను బట్టి నేలపామ
పొగరెందుకే దోమ నిను బొగజంపును జుమ
ఎగరకుమాధూళి యి ల్లిదిగోవర్షాళి
యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్క పీక
మూలం: హరికథేతిహాసమంజరి
రచయిత:బీ.బాలాజీదాసు
ప్రచురించింది: 1922లో
2008-08-27 04:11 PM
durgeswara (noreply@blogger.com)
లలితా సహస్రనామము మహిమలు మీరు వినివుంటారు. కానీ నాకు
అనుభవపూర్వకంగా నిరూపణలు వున్నాయి. దీనిని ఎవరికిబడితే
వారికి,శ్రద్దాభక్తి లేనివారికి చెప్పరాదు.
ఒక నవరాత్రులలో నాకు జరిగిన విషయాన్ని చెబుతాను వినండి.
లలితా సహస్రనామ మహిమలు ఇంత గొప్పవయి భక్తులకోరికలు నెరవేరుస్తున్నప్పుడు,
మరింతమందికి ఇవి అందించాలిగాని ,తెలిసీ మనవరకే వుపయోగించుకుంటే స్వార్ధం
కదా అనే అతితెలివి ఆలోచనవచ్చినది. కనుక లలితా
2008-08-27 04:11 PM
sujata (noreply@blogger.com)
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయ కు ను నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం
చరణకిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్కదనములకెల్ల
నిగుడు
2008-08-27 04:01 PM
sujata (noreply@blogger.com)
నల్లని మేని నగవు జూపుల వాడు
తెల్లని కన్నుల దేవుడు
1) బిరుసైన దనుజుల పీచమణచినట్టి
తిరుపుగైదువుతోడి దేవుడు
చరిబడ్డ జగమెల్ల జక్కజాయకు దెచ్చి
తెరవు చూపినట్టి దేవుడు
2) నీట గలిసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు
తీట వాపినట్టి దేవుడు
3) గురుతు వెట్టగ రాని గుణముల నెలకొన్న
తిరు వేంకటాద్రి పై దేవుడు
తిరముగ ధ్రువునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి
2008-08-27 03:37 PM
netizen నెటిజన్ (noreply@blogger.com)
లలిత చనిపోయిందని పొద్దులో చదవగానే బాధవేసింది. తను అనారోగ్యంతో ఉన్నదని ఊహించుకోగలిగాను కాని మరణానికి అంత చేరువలొ ఉన్నదని అనుకోలేదు.
"రౌద్రి" కన్నా నేను తన ఆంగ్ల బ్లాగుకే దగ్గిరయ్యాను. అదే అఖరుసారి అని తెలియనప్పుడు, నేను తన బ్లాగ్ లో వ్యాఖ్యానించినప్పుడు, ఎంతో సాదరంగా, స్వాగతించింది లలిత. శ్ర్రీపాద వారి కొత్త అవకాయ, వెన్నపూస రుచుల గురించి ప్రస్తావించింది. తనకు తెలియకపోవచ్చు కాని తన
2008-08-27 03:36 PM
prakshalana (gnrao9tv@gmail.com)
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)1969 ఏప్రిల్ 1 న ఆవిర్బవించింది.అంతకు పూర్వం డిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్(డి ఎస్ పి ఇ)గా పిలవబడేది. అవినీతి నిరోధన, ఆర్దిక నేరాలకు అడ్డుకట్ట, అదిక ప్రాధాన్యత కల్గిన కేసుల పరిశోధన సి.బి.ఐ విదులు. సి.బి.ఐ డైరెక్టర్ గా ప్రస్తుతం అశ్వని కుమార్ బాద్యతలు నిర్వహిస్తున్నారు.సి బి ఐ పరిదిలో 17 జోన్లు ఉండగా, 11 విభాగాలు పనిచేస్తున్నాయి. సౌత్ జోన్ పరిదిలో
2008-08-27 03:19 PM
swatee sripada (noreply@blogger.com)
SannapuReddy Venkata RamiReddy
Swatee Sripada
Out side it is raining. The rhythmic sound of drops of rain on the leaves of neem is heard endlessly. At times the slow jingle seems as if it is playing a tune with its fingertips.
At other times, as if the rude scratch of a thousand fingers it sounds sarr …sarr. In between these two pitches the melodious song of the rain and the Silent darkness.
2008-08-27 02:55 PM
Satyavati (noreply@blogger.com)
హమ్మో! ఎన్ని నీళ్ళో
ఆకాశం లోంచి అంచెలంచెలుగా జారి
భూమిలో కి ఇంకుతున్నాయి
సాగర్ కాదది ఆనంద సాగరం
ఇరవై గేట్లు గుండెలు తెరుచుకుని
పాలనురుగుల్లాంటి ప్రేమ పానీయాన్ని ఒంపుతున్నాయ్
మెగా డాం ముందు
మరుగుజ్జుల్లా,మంత్ర ముగ్దల్లా
నువ్వూ,నేనూ
అదేంటో మరి అదేం చిత్రమో మరి
నువ్వూ నేనూ పాపికొండలు చూసి
పరవశించాలని వెళితే
గోదారమ్మ తన చుట్టూ
ఎత్తైన పచ్చదనాన్ని పరిచి
ముత్యాల ధారల్లాంటి వర్షంలో
వరదగోదారి
2008-08-27 02:20 PM
durgeswara (noreply@blogger.com)
శివలింగ గోపురంపై 14 రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. శివలింగంపై 216 అడుగుల వరకు కూడా ఖాళీగానే ఉంది. చివరిదైన 14వ నిర్మాణంపై దాదాపుగా 88 టన్నుల బరువు కలిగిన రాతి గుండును నిలిపారు. దీని బరువు మొత్తం నిర్మాణంపై పడుతుంది. ఇది చోళుల శిల్పకళలకు నిదర్శనం. అన్నిటికంటే పైభాగాన 12 అడుగుల కుంభాన్ని ఏర్పాటు చేశారు.
లోపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా శిల్ప, వాస్తు కళలతోనే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ
2008-08-27 01:06 PM
durgeswara (noreply@blogger.com)
లక్ష్మీ నివాసం ఎక్కడంటే...
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు... ఇవన్నీ లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మీ నివాసముంటుంది
లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. అసలు లక్ష్మీ ఎటువంటి ఇంటిలో నివాసముంటుంది.. ఏఏ పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుందో తెలుసుకుందాం....
ప్రాతఃకాల సంధ్యలో,
2008-08-27 12:26 PM
శ్రీనివాస బాబు (noreply@blogger.com)
ముందుగా Pen Drive ని ప్లగ్ ఇన్ చెయ్యాలి, ’My Computer' ఓపెన్ చేసి, Pen Drive పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ’Properties' లోని ’Hardware' టాబ్ లో USB Drive ని సెలెక్ట్ చేసుకొని, క్రిందవున్న ’Properties' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో ’Policies' టాబ్ లో ’Optimize for Performance' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ’OK' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు
2008-08-27 12:22 PM
సుజాత (noreply@blogger.com)
ఇవాళ పొద్దున్న GHMC(Greater Hyderabad Municipal Corporation) ఆఫీసుకి వెళ్ళాను నా వోటర్ గుర్తింపు కార్డు విషయమై!ఇంతకు ముందు అది processingలో ఉండగా మేము బెంగుళూరు వెళ్ళిపోవడం జరిగింది. నా కార్డు ఒక్కటే పెండింగ్ అనుకుంటే మా వారి కార్డులో తండ్రి పేరు స్థానంలో అసలు ఆయన తండ్రి పేరు కాక వేరివరినో తండ్రిగా నిర్ణయించేసారు.
నా కార్డు జారీ, మా వారి కార్డులో మార్పు --ఈ రెండు విషయాలూ తేల్చాలని బయలుదేరాం!
2008-08-27 12:21 PM
swatee sripada (noreply@blogger.com)
SannapuReddy $swatee
The jeep left the village and stepped on mud road. Extorting dust curtains it dashed towards the town. MLA Pratapa Reddy was sitting by the side of the driver. Behind him in the middle and last seats his gunmen were there. Remaining were his followers.
“Will he stop it?” turning head to a side Pratapa Reddy asked the man who was beside the gun man.
“Why do you doubt at all?
2008-08-27 12:02 PM
kiran
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అన్నాడు మహాకవి గుఱజాడ. ఈ మహాసత్యం గుర్తుచేసుకుని ఆచరిద్దాం. కాశ్మీరులో జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెబుదాం. అక్కడి మన సోదరులకి సరైన గౌరవం ఇద్దాం.
ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? [...]
2008-08-27 11:55 AM
కల (noreply@blogger.com)
అవునండి నాకు చిన్నప్పుడో కల ఉండేది, ఎలాగైనా అయ్యేయస్సో, ఐపియస్సో అయి అలా ఠీవిగా నడుచుకొంటూ వచ్చి మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొన్నప్పుడు ఆయన కళ్ళలో కనిపించే మెరుపును చూడాలని మాత్రం కాదండి. ఆయినా ఆశీర్వాదం వంగి తీసుకొనేటప్పుడు కళ్ళలో మెరుపు ఎలా కనిపిస్తుందండీ నా ఖర్మ కాకపొతే. కల్పనా చావ్లా లానో, సునితా విలియమ్స్ లానో అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ పిల్లి నడకలో, బుల్లి నడకలో చెయ్యాలని కూడా కాదు. నా
2008-08-27 10:53 AM
బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ (noreply@blogger.com)
పాత కాలంలో కాబట్టి "ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు" అన్నారు. ఇల్లు కట్టటం చాలా కష్టం. పెళ్ళి చేయడం ఇంకా కష్టం అని అర్ధం. కాబట్టే పెళ్ళి చేయడం ఇల్లు కట్టటం తర్వాత వరుసలో వచ్చింది. అదే ఆ సామెత చెప్పిన మహానుభావుడు గనక ఇప్పుడు ఉండుంటే, వీటికన్న హోం లోన్ కి EMI కట్టటం చాలా కష్టం అని అర్ధం అయ్యి "EMI కట్టి చూడు" అనే వాడు. మనిషికి కావల్సిన రోటి, కపడా, మకాన్ ల లో చివరిదానిని సంపాదించడం ఎంత కష్టమో
2008-08-27 10:24 AM
సురేష్ బాబు (sureshkadiri@gmail.com)
మన హిందూమతం పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకువచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు.స్త్రీలు,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలాఅని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం.
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు
"చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః"అన్నాడు.
దీని అర్థం"మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే
2008-08-27 10:22 AM
మేఘన గుండ్ల (noreply@blogger.com)
పొద్దున మా అవ్వ(అమ్మమ్మ)కు ఫోన్ చేశా. అరే పెద్దొడా.. ఆ సినిమా అయనున్నాడే అదేరా సిరంజీవి పార్టీ పెట్టిండటగా నీకు తెలుసారా. ఆ తెలుసే అయితేంటీ అన్నా?. ఏం లేదురా గప్పుడెప్పుడో ఎన్ టోడు (ఎన్ టీఆర్)తెలుగు దేశం పెట్టి మన ఊరుకొచ్చిండు. మాతో సక్కగా మాటాడిండు అందుకే మేమంతా ఆయనకే ఓటేసాం. మగానుబావుడు రెండు రూపాయిలకే బియ్యం, ఇస్కూలు పిల్లలకు అన్నం, ఉంటానికి ఇల్లూ ఇచ్చిండు. ఆ తర్వాత శానా మంది సినిమావొళ్లు
2008-08-27 10:07 AM
madhujanjur
!! ఢిల్లీ లొ కూడ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండీ !! ఫార్ట్(ర్టీ) 2 !!
మరుసట్రోజు పని ఎక్కువైంది. ఏం చెయ్యాలి ? ఈ ఇనెప్లేషన్ ప్రభావం నాకు ఈ రోజు తెలిసొచ్చింది. తక్కువ మందిమి పానెల్ లొ ఉన్నాము. ఎక్కువ కాండిడేట్స్ వచ్చేశారు. ఊహు ! అలాగ రప్పించారు మరి !!
లంచ్ సరిగా తినకుండా పని చేసాము. మరి సాఫ్టువేరా ఉద్యోగమా మజాకా…
సాయంత్రం రానే వచింది. మూన్నెళ్లకో హిట్టు సినిమా ల్లాగా !!
తొందరగా రూము కి వెళ్లి కార్యక్రమం ప్రారంబిద్దాము అనుకొనేలోపు, బాసు గాడు పరిగెత్తుకు వచ్చేసాడు… తనూ రుచి మరిగిన పిల్లి కదా మరీ.
ఇక మొదలైంది తిప్పలు ! ఏది తీసుకొవాలి !! ఎంత తీసుకొవాలి అని !!!
అనేక తర్జనభర్జనలనంతరం (మీకు కావాలనుకొంటే గ్రూప్ డిస్కషన్స్ అని మార్చుకోండి) అన్నీ కొనేసుకొన్నాకా … రూము కి పరుగెత్తేము… స్కూల్ వదిలిన వెంటనే ఇంటికి పరుగెత్తే పిల్లొళ్ల లాగా !!!
ఇక్కడ మొదలైంది బాసు గాడి బాసిజం $$
నేనూ నా ప్రెండ్ కూర్చున్నాక అరగంట తరువాత వచ్చాడు. ఆత్రం మరియూ బి.పి ఎక్కువై నా ప్రెండ్ ఆ లోపల వాడిని బండబూతులు తిట్టెశాడు., బయట్నించి విన్నాడనుకొంటా.. మొహం అదోలా పెట్టుకొన్నాడు.
ఆ మొహం చూస్తే నాకొకటి గుర్తు వచ్చింది !
{
చిత్తూరులో చదువుకొనేటప్పుడు బస్ స్టాండ్ కి వెళ్లాలంటే నా ప్రెండ్ మొహం అలాగే అయ్యేది. ఎందుకంటే బస్ స్టాండ్ కి వెళ్లే దారికిరువైపులా యూరినల్స్ చెసేవాళ్లు . ఆడవాళ్లు వెళుతున్నా ఎవరూ పట్టించుకొనేవారు కాదు. అందుకే నా ప్రెండ్ కి ఆ ప్రాంత మంటే అసహ్యం.(ఈ విషయాన్ని నేను చాలా బస్ స్టాండ్ ల దగ్గర గమనించాను )
}
ఇక సమరం మొదలు పెడదాము అనుకొనేలోపు, బట్ట తల వెధవ టి.వి రిమోటు తీసుకొని బెంగళూరు పేలుళ్ల సోది మొదలెట్టేడు. అది వింటే ఇంపర్మేషన్ విన్నట్టు లేదు …శాంతి స్వరూప్ వార్తలు చదువుతున్నట్తుగా ఉంది.
ఆక్కడేదో మాకు ఎమీ తెలియనట్టు అంత తనకే తెలుసనట్టు..బోడి గుండు వెదవ…
నస భరించలేక నా ప్రెండ్ తనని కొట్టేస్తాడెమోనని భయపడి కేప్ ఓపెన్ చేసాను..
‘నరుకుతారా వెదవ ‘ అని అన్నట్టు వినిపించి బాసు గాడి వైపు చూసాను సందేహంతొ ??
డౌటు లేదు వాడే నన్ను కొరికేసెలా చూశాడు సారీ చూస్తున్నాడు. వాడి కక్ష ఇంకా తీరలేదు మరి..
అంతే ఇక నేనూ వాడికి విలను అయిపొయాను.
మధు నాకు వద్దయ్యా, ఎంటో కొద్దిసెపట్నించి తలనొప్పి ఎక్కువుగా ఉంది. అమృతాంజనం ఉంటే ఇవ్వు అని అడిగాడు. నా దగ్గర ఎందుకు అమృతాంజనం ఉంటుందో అర్థం కాక వాడి వైపు నిస్సహాయంగా చూసాను.
అంతే ! నన్ను పూర్తిగా అర్థం చేసుకొన్నవాడిలా….
ఓహొ, నీ దగ్గర లేదా, సరే అలా బయటికి వెళదాము రా. వెళ్ళి తీసుకొని వస్తాము అని చెప్పాడు… కాదు కాదు హుంకరించాడు.
(మీకు కావలనుకొంటే బుసలు కొట్టాడు, గాండ్రించాడు, గట్టిగా అరిచాడు లాంటివి ఏదన్న అనేసుకోండి)
నా పరిస్థితి ఎంటో నాకే అర్థం కాలేదు.
రంభ, మేనక నాట్య మందిరాలనుంచి నన్ను బయటికి ఈడ్చుకొని వెలుతునట్టు ఓ పీలింగ్ !!
ప్రెండ్ వైపు చూసాను ఎమీ చెయ్యలెక, తన పరిస్థితి అలాగే ఉంది పాపం..
ఎదుటి వారికి తెలియకుండా ఏడవడమంటే ఇదేనేమో !! ఎమీ చెయ్యలెక గుడ్ల నీరు కక్కుకొంటూ బయటికి మాత్రం సన్నని చిరునవ్వుతొ వెళ్ళాను…
ఇలాంటి స్థితి ఎవరికీ రాకుండా చూడు దేవుడా అని మొక్కుకుంటూ బయల్దేరేను వాడి వెంట గంగమ్మ దగ్గరికి వెలుతున్న ‘ మేక ‘ వలే ….
ఇక రోడ్ల మీద పడ్డాము లేని తలనొప్పికి కావాలనుకొనే అమృతాంజనం కోసం
నా అదృష్టం బాగునట్టుంది,,కొంచెం దూరము గా మెడికల్ షాపు కనపడింది…నలభయ్యెళ్ళ బ్రహ్మచారికి ‘ తెల్ల కోక ‘ కనపడ్డట్టు.
వెల్లి బాము తీసుకొన్నాము…వాడు చిల్లర తీసుకొనే లోపు ఆత్రముగా గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటె నా ఆశలన్నీ నాగర్ఝున సాగర్ లో కలిపేసె మాట ఒకటి చెప్పేడు.
( మేకలకి, బ్రహ్మచారులకి ,శాంతి స్వరూప్ అభిమానులకి క్షమాపణలు తెలుపుకొంటూ చివరి బాగం వచ్చే వారం లో )
2008-08-27 09:10 AM
vbsowmya
మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ ఈ పేజీలో చూడొచ్చు.
మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది - ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్లైన్ చేసేసింది :)) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం - ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా!
లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.
రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

2008-08-27 08:26 AM
మేఘన గుండ్ల (noreply@blogger.com)
ప్రజా రాజ్యం.. భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి నాయకుల నోట వెలువడుతున్న ఓ రాజకీయ నాటక ప్రక్రియే ఇది. ప్రజల చేతికే పాలనన్న ప్రజారాజ్యం నిజంగానే సిద్దిస్తుందా..? అనేది మహా సంకల్పం.. మహా యుద్దం అంటూ చిరంజీవి ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావం అనంతరం ప్రజలకు మరో సారి వచ్చిన ఆలోచన. మరో సారి ఎందుకన్నానంటే చిరు అంటున్నా ఈ ప్రజారాజ్యం ప్రజలకు చేరువవటం సుసాద్యమా..? అన్న ప్రశ్న సంవత్సరాల
2008-08-27 08:03 AM
జ్యోతి (noreply@blogger.com)
దశరథుడు శ్రీరాముని అరణ్యానికి వెళ్ళమంటే సీత కూడా వెంట వెళ్ళినది కదా! లక్ష్మణుని వెంట ఊర్మిళ ఎందుకు వెళ్ళలేదు?
వెళ్ళవలసినవాడు శ్రీరాముడు.సేవార్ధమై వెళ్ళినవాడు లక్ష్మణుడు. సీతకు రాముని అనుజ్ఞ చాలుకాని లక్ష్మణునికి అరణ్యానికి వెళ్ళడానికి ఆజ్ఞయే కష్టమైనది. కాక సేవించడానికి వెళ్ళే లక్ష్మణుని వెంట ఊర్మిళ వెళ్ళడం అప్రస్తుతం.
భారతంలో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు అపహరించాడు. దుశ్శాసనుడు భారతంలొ
2008-08-27 07:48 AM
trivikram
ప్రముఖ కవయిత్రి లలితా ముఖర్జీ నిన్న (26 ఆగస్టు) మధ్యాహ్నం 3:10 కి క్యాన్సర్ తో మరణించారు. ఆమెకు పొద్దు నివాళి.
2008-08-27 07:29 AM
కొంపెల్ల శర్మ (noreply@blogger.com)
విశ్వానికే అమ్మ - మదర్ తెరెస్సా
( 1910 - 1997 )
మానవసేవయే ఈ అమ్మ లక్ష్యం
నిస్సార్ధ్వ సేవలో జీవితాంతం నిమగ్నం, బీద, అనాధ, అనారోగ్య ప్రజానీకానికి ఒక అనిర్వచనీయమైన హౄదయ స్పందన, భారతావని మనస్సులను గెలుచుకోవడం, అంతేకాదు విశ్వంభర పర్యంతం ఆ మహావ్యక్తిని స్మరించని గళం లేదు అనే చెప్పాలి. ఆమె తొలిసారిగా 1929లో భారతదేశంలో అడుగిడారు. మనసు ద్రవించింది, హౄదయం స్పందించింది. వివిధ భారతీయ ప్రాంతాల్లో రహదారుల్లో