2010-03-12
శ్రీ-పదములు: గుండె సమస్యలు-జ్యోతిష శాస్త్రం-వేదాంతం శ్రీపతిశర్మ
ఆరోగ్యం, జ్యోతిషం ఎలా ముడిపడి ఉన్నాయి అనేది కొంత సంభ్రమతో కూడినది.శరీరం ఏ పదార్థాలతో తయారయినది కొద్దిగా ఆలోచిస్తే ఒక రాజమార్గం కనిపిస్తుంది.తల్లి గర్భంలోని నవమాసాలు సౌరమండలం లోని నవగ్రహాలకు అన్వయమైనది.పిండోత్పత్తి,శిశువు ఆరోగ్యం,శారీరిక అభివృధ్ధి,గ్రహాల స్పందన,ఇత్యాదులతో ముడి పడి యున్నవి.చిత్రం ఏమిటంటే ఒక స్థిరత్వం కావాలంటే తిరగటం అనేది తప్పటం లేదు! (భూమి కదలకుండా నిలబడితే ఒక ప్రక్కకు ఒరిగిపోగలదు. బొంగరం లా తిరగాల్సిందే!) ఈ భూమి మీద అందుకేనేమో ‘తిప్పలు ‘ తప్పటం లేదు.గర్భంలో శిశువు తిరగటం కూడా ఒక స్పందనకు సంబంధించిందే! ఇది శబ్దానికి ముడి పడి ఉంది. శిశు జననం లో శీర్షోదయం ఈ స్పందనతో జరుగుతున్న అభివృధ్ధిలోని మరో మెట్టు మాత్రమే! జననం అయిన తరువాత నాకు ఇంత వయసు వచ్చింది,ఇక ఎదగటం వద్దు అనలేము కదా! మన అస్తిత్వం మనలోని అంత:స్పందన మాత్రమే! జాగ్రత్తగా ఆలోచిస్తే చివరకు మిగిలేది మన పేరు లోని ఒక వైబ్రేషన్ మాత్రమే!
ఒకరి జాతకంలో లగ్నం నుండి నాల్గవ స్థానాన్ని తల్లి విషయంలో,’తొలి చదువు ‘విషయంలో ,ఇల్లు విషయంలో, గుండె విషయంలో ప్రముఖంగా జ్యొతిష శాస్త్రవేత్త అధ్యయనం చేస్తాడు. ఈ అంశాలకు పరస్పర సంబంధం ఏమిటి?
తల్లి గర్భం తొలి ఇల్లు.తల్లి ఒడి మలి ఇల్లు.తొలి పాఠాలు అక్కడే నేర్చుకుంటాం.అమ్మా…అన్నం…గుండె శరీరానికి తిండి పెడుతుంది-రక్తాన్ని పంచుతుంది!ఈ గుండెకు ఒక వైబ్రేషన్…ప్రణవ నాదం లోని సంచలనమే అమ్మగా మనకు కనిపిస్తుంది.ప్రతి బిడ్డా అమ్మా అన్నప్పుడు, ఆ ధ్వని ద్వారా ఎదుగుతున్నప్పుడు ఈ ప్రణవాన్నే పలుకుతున్నాడు.తొంభయి ఏండ్లు దాటిన ముసలి అవ్వ కూడా కొడుకు చూడటానికి వస్తే అన్నం తిన్నావా అంటుందే కానీ నాకేమి తెచ్చావు అని ఏ రోజూ అడగదు!భ్రమరం తన గుడ్లను భ్రమరనాదంతో పొదుగుతుంది.ఈ సృష్టి యావత్తూ ఆ భ్రమరాంబిక పొదుగుతున్నదే!పాంచరాత్ర ఆగమంలోని లక్ష్మీ తంత్రం పరబ్రహ్మము చేయు సృష్టిని లక్ష్మి శబ్దం ద్వారా వ్యాపింపచేస్తుందని వివరిస్తుంది.సంతానోత్పత్తి,సృష్టి క్రమం శబ్దబ్రహ్మమునకు లోబడియున్నది.
అల్ట్రా ‘సౌండ్ ‘ స్కానింగ్ ఈ ప్రక్రియనే చూపిస్తున్నది.
మారియా మాంటెసరీ గారి పుస్తకం ‘ద అబ్సార్బెంట్ మైండ్ ‘ ఈ దిశగా కొన్ని విషయాలను చెబుతుంది…
మన విషయానికి వద్దాం.
జాతకంలోని గ్రహాలు రెండూ చేస్తున్నాయి- మన శరీరాన్ని నిర్మిస్తూ దానిని నిర్మూలిస్తున్నాయి కూడా. వాతము,పితము, కఫము గురించి మనకు ఆయుర్వేదం చెబుతున్నది. చంద్రుడు,బుధుడు, శుక్రుడు, శని వాతనికి సంబంధించిన వారు.రవి కుజులు పిత్తానికి సంబంధించిన వారు. గురువు కఫానికి సంబంధించిన వాడు.లగ్నాత్ నాల్గవ స్థానం, కర్కాటక రాశి,గుండె,ఊపిరితిత్తులు,రక్తం-వీటిని శాసిస్తాయి.గుండె విషయంలో సమస్య అనేది ఈ క్రింద సూచిస్తున్న పరిస్థితులలో కనిపించవచ్చు.
1. దుష్ట స్థానాలలో రవి శనులు కలసినప్పుడు2. నాల్గవ స్థానంలో కుజ కేతువులు కలసినప్పుడు3. చంద్రుడు దుష్ట గ్రహ సంయోగంతో అపక్లోమ స్థానంలో ఉన్నప్పుడు4. నాలుగులో ఆరవ స్థానాధిపతి రవితో కలసి దుష్ట గ్రహంతో నున్నప్పుడు5. నాలుగులో గురువు,శని,కుజుడు ఉన్నప్పుడు6. రాహువు నుండి చంద్రుడు సప్తమంలో ఉండి శని కేంద్రంలో ఉన్నప్పుడు7. చంద్రుడు వృశ్చికంలో ఉండి రవి గురువులు బలహీనమైన కుజునితో వీక్షింపబడ్డప్పుడు, (ఇలాంటప్పుడు ఆరవ స్థానాధిపతి లగ్నానికి అశుభగ్రహమయి ఉండాలి)8. చంద్రుడు నాలుగులో దుష్టగ్రహంతో పీడింపబడి మూడు దుష్ట గ్రహాలు ఒక రాశిలోనున్నప్పుడు9. బుధుడు లగ్నంలో నుండి రవి శనులు ఆరులో నుండి దుష్ట గ్రహంతో వీక్షింపబడ్డా, సంయోగంతో నున్నా
ఇవి ప్రధానమైన విషయాలు..ముందుగా చూడవలసినవి.జాతకం,నవాంశ, ద్వాదశాంశ,యోగాలు పరీక్షించకుండా నిర్ణయానికి రాకూడదు.
కాకపోతే హృద్రోగంతో బాధపడే వారి జాతకాలలో ఎక్కువగా ఒక గ్రహస్థితి కనిపిస్తుంది…నాల్గవ స్థానంతో కుజ రాహువులు రవితోనూ, నాల్గవ స్థానంతోనూ సంబంధించి యుండటం.అలాగే రవి దుష్టగ్రహ సంయోగంతో నుండి ఆరు,ఎనిమిది,నాలుగు లేదా అయిదవ స్థానాలతో లేదా ఆ స్థానాధిపతులతో సంబంధించి ఉండటం కూడా కనిపిస్తుంది.
ఆరోగ్య జ్యోతిషం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్థానాధిపతుల కంటే ఆయా స్థానాలు ఎక్కువ ప్రాధాన్యత కలవి. కానీ ఒక సంయోగమో లేక ఒక దృష్టియో ఉన్నది కాబట్టి వ్యాధిని నిర్ణయించకూడదు.ఆ విషయం ఆరవ స్థానానికి,ఎనిమిదవ స్థానానికి,వాటి అధిపతులకు సంబంధించి యుండాలి.
అయితే గుండె పోటుకు సంబంధించిన దశ సామాన్యంగా ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం. జాతకాన్ని చక్కగా పరిశీలించి ఒక గ్రహస్థితిని చూసి గుండెకు సంబంధించిన సమస్య ఉన్నది అని అనిపించినప్పుడు ఈ క్రింది దశలను గమనించాలి:
రవి నుండి, లేదా చతుర్థాధిపతి నుండి రెండు,పన్నెండు లోని గ్రహాల మహర్దశ లేదా భుక్తి,అలాగే ఆరు, ఎనిమిదుల అధిపతుల మహర్దశ లేదా భుక్తి నడుస్తున్నప్పుడు గుండె విషయంలో తగు జాగ్రత్తలు, వైద్య సలహాలు తీసుకోవలసిన అవసరం ఉన్నది.
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే. జ్యోతిషపరమైన పరిష్కారాలు కూడా సూచించగలను)
ఓం శాంతి: శాంతి: శాంతి:
~~~***~~~

తెలంగాణ: (శీర్షిక లేదు)
know to be best: నాకు పెళ్లయ్యేలా చూడుస్వామీ!
దార్ల: అంటరాని వసంతం రచయితతో మరో రోజు!
పరిమళం: మరో జన్మ ఉంటే .....(మరో చిన్న టపా)
కబుర్లు కాకరకాయలు: వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు
AAKASA RAMANNA: కోదండ రాం రాజీనామా చెయ్యాలి!
పానశాల: ఎవరూ రారెందుకో
వెన్నెల్లో...: ప్రవాసం.కా(ల)మ్

టపాకాయ: అన్నదాత కాదు, ఆస్థుల దాతా సుఖీభవ అనాలి!
అనుపల్లవి: గౌరి మనోహరి-కొన్ని మంచిపాటలు
మీ కోసం: ఐ.పి.ఎల్ 2010.....మోదటి సినిమా హాల్ టికెట్టును 11 లక్షలకు అమ్మేరు!!
పైత్యం: ఒక హక్కు- కొన్ని కుట్రలు
నిన్న ఒక స్నేహితుడితో బ్లాగులు – పోరాటాలు -కుట్రలు – కవితలు అన్న విషయం పై చర్చ జరిగింది. ఆ విషయాలు…
హక్కుల కోసం పోరాడాలి అంటే మనం బాధితులు కానవసరం లేదు. పీడితులు కానవసరం అంతకన్నా లేదు. కాంట్రవర్శిలు చెయ్యగలిగితే చాలు. వివాదాలు సృష్టించ గలిగితే చాలు. నందిని పంది, పంది ని నంది అనగలిగితే చాలు. ఎడ్డెం అంటే తెడ్డెం అనగలిగితే చాలు. ఎందుకు అంటే వివాదాలు సృష్టించక పొతే మనకు సాటి, మేటి బ్లాగరు, మేధావి అన్న పేరు రాదు. మనము ఒక సామాన్య బ్లాగరు గా మిగిలిపోతాం. ఇది “Struggle for existence in the blog world” అన్న మాట.
మన బ్లాగుల్లో తెలివైన వాళ్ళు ఉన్నప్పటికీ చెవిలో పువ్వు పెట్టు కున్న వాళ్ళు కొందరున్నారు. ఈ కొందరిని మనం టార్గెట్ చెయ్యాలి. 2008-2009 లెక్కల ప్రకారం మొత్తం బ్లాగరులు 99,999 అందులో తెలుగు బ్లాగరులు 11,11,111. మళ్ళి ఇందులో చెవిలో పూలు పెట్టు కున్న వాళ్ళు 22,22,222. మనం ఈ చెవి లో పూలు పెట్టు కున్న వాళ్ళని టార్గెట్ చెయ్యాలి. మిగిలిన వాళ్ళు తెలివైన వాళ్ళు. మీకు కుడికలు తీసివేతలు తెలుసు అంటే మనం మనం gtalk లో
వొద్దు లెండి yahoo లో మాట్లాడుకుందాం.
బ్లాగు రాజ్యం లో బ్లాగోద్యమానికి ఉన్న ప్రాదాన్యత చాలా ఎక్కువ. కొంత మంది ఒక తరగతి ప్రజలను మరో 50 సంవత్సరాల వరకు బ్లాగులోకం లో అడుగు పెట్టకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే వీళ్ళు emotional rhetoric గా మాట్లాడుతారు. వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం వీళ్ళకు ఒకటే చెప్పాలి You mean nothing to me. ఇదే వ్యాక్యను మనం ముందుకు వెనక్కు మార్చి చెప్పేయాలి. ఈ సందర్భంగా నా స్నేహితుడు చెప్పిన కవిత
నేను రాసిన కామెంటు
నన్నే మూర్ఖుడు అంది
అప్పుడు గుర్తొచ్చింది
నిన్న ఒక బ్లాగరు అన్న మాట
“నువ్వెంత తెలివైన వాడివి” అని

టపాకాయ: డబ్బు మూటలు రాబట్టి, పందేరం చేసే ఉన్నతోద్యోగి ఎవరికైనా ఆప్తుడే మరి!
nagaphan: 15th January, 2010 to 15th February, 2010
నీ ధ్యాసలో.......: నన్ను ఏమి చేయమంటారు.........
నీ ధ్యాసలో.......: మెల్బోర్న్లో ప్రేమ....యాదగిరిగుట్టలో పెళ్లి....
చందమామ చరిత్ర: నాన్నా! చందమామ తీసుకురానా!!
(చందమామ అనుకోగానే గుర్తొచ్చేవి బొమ్మలే అంటున్నారు మేధాగారు. చందమామలో కథల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవని తన అభిప్రాయం. యువరాణి ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే చందమామలోనే చూడాలంటున్నారు. కథలు కూడా ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులట. “గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని..” అంటున్నారు.
తరాలుగా చందమామను చదువుతూ వచ్చిన వారి మనోభావాలకు చందమామ జ్ఞాపకాలు ఓ ప్రతీక. ‘మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..’ అంటూ గ్రైఫ్ వాటర్ ప్రకటనను గుర్తు చేయడం ద్వారా చందమామను ఇంటిల్లిపాదీ ఎలా తమ హృదయాలకు హత్తుకునేవారో తేల్చి చెప్పారు. చక్కటి చందమామ జ్ఞాపకాలు పంపిన మేధాగారికి కృతజ్ఞతాభినవందనలు. నాలోనేను పేరిట చక్కటి బ్లాగును కూడా తను నిర్వహిస్తున్నారు.
“ఇప్పటికీ బస్టాండ్లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..” బిడ్డకు చందమామను కొనిపెట్టే తండ్రి… చందమామను పిల్లలకు కొని ఇవ్వగలిగిన తెలుగు కుటుంబాలు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పని చేస్తున్నాయనుకుంటాను. ఏమయినా మీ జన్మ ధన్యమైనది. మీ నాన్నగారికి చందమామ తరపున మనఃపూర్వక వందనాలు.
మేధాగారి చందమామ జ్ఞాపకాల పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.)
చందమామ – 1970/80/90 ల తరానికి పరిచయం అక్కర్లేని పత్రిక.. పిల్లల పత్రికల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్న పత్రిక. కేవలం పిల్లల పత్రిక అంటే, చంపిలు నా మీద దండెత్తే ప్రమాదం కూడా ఉంది..
చందమామతో పరిచయం ఎలా జరిగిందో గుర్తు లేదు కానీ, నేను చదివిన మొదటి పుస్తకం మాత్రం చందమామే!.. అదేదో గ్రైఫ్వాటర్ ప్రకటనలోలా, మా బామ్మ చదివింది చందమామ, మా అమ్మ చదివింది చందమామ, నేను చదివాను చందమామ..!
అప్పట్లో చందమామ వస్తుంది అంటే చకోర పక్షుల్లా ఎదురు చూసే వాళ్ళం.. మేము ఉన్న ఊర్లో ఈ పుస్తకాలు దొరికేవి కాదు, అందుకని ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకు వచ్చేవారు నాన్నగారు.. ఈ రోజు వెళ్ళి తీసుకు వస్తాను అంటే, నాన్నగారు వచ్చేసరికల్లా, చదువంతా పూర్తి చేసుకుని, ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.. అది రాగానే, నా కంటే నాకు అని గొడవలు, పోట్లాటలు..
చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. బొమ్మలు అంటే ముఖచిత్రం గురించి కూడా చెప్పాలి.. ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..
కధల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏ వ్యక్తిత్వ వికాసానికి తీసిపోని విజ్ఞాన గనులు. విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, క్రొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు..
నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..
ఇక విక్రమార్కుడి కధలు అసలు సిసలు విశ్లేషణా సామర్థ్యం ఉన్న కధలు.. మరీ చిన్నప్పుడు ముగింపు చదివితే తప్ప ఇలా పరిష్కరిస్తారు అని తెలిసేది కాదు.. తరువాత తరువాత కాస్త కాస్త విశ్లేషణ చేయడం, అప్పుడప్పుడు నేను అనుకున్నట్లు లేకపోతే అమ్మతో ఎందుకు ఇలా ఉంది, ఇలా కూడా ఉండచ్చు కదా అని వాదనలు.
ఇక సీరియల్స్.. యండమూరిలు, యధ్ధనపూడిలు, డాన్ బ్రౌన్లు సరిపోరు అనిపిస్తుంది.. ఆ సీరియల్ కోసం మళ్ళీ నెల ఆగాలంటే అమ్మో అనిపించేది.. ముగింపు వచ్చిన సంచిక ప్రక్కన పెట్టుకుని మళ్ళీ అన్ని భాగాలు చదివితే తప్ప తృప్తిగా ఉండేది కాదు.
వీటన్నింటితో పాటు, ప్రముఖుల జీవిత చరిత్రలు చిట్టి-పొట్టి కధల రూపంలో వస్తుండేవి.. ఇక్కడ కూడా మళ్ళీ బొమ్మలదే ప్రముఖ పాత్ర..
మొదట్లో సంపాదకీయం చదివేదాన్ని కాదు కానీ, కొంచెం పెద్దయిన తరువాత అది కూడా చదవడం మొదలుపెట్టాను.. తక్కువ పదాలలో, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఎలా చెప్పాలో తెలుస్తుంది!
ఇవన్నీ ఒకెత్తు, పురాణాల గురించిన కధలు ఇంకో ఎత్తు. ఇప్పుడంటే డేటాబేస్ బాగా దెబ్బతింది కానీ అప్పట్లో, పురాణాలలో ఏ కధ గురించి అడిగినా కూడా తడుముకోకుండా చెప్పగలిగి ఉండేదాన్ని.. మా తమ్ముడైతే ఒకడుగు ముందుకేసి, మా పిన్నిలని, మామయ్యలని ఎక్కడెక్కడి ప్రశ్నలో అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.
ఇంకా ప్రకటనలు, మీకు తెలుసా అంటూ క్విజ్లు, బొమ్మకి వ్యాఖ్యలు.. అదో నోస్టాల్జియా..
కొసమెరుపేంటంటే, ఇప్పటికీ బస్టాండ్లో బస్ కోసం నించున్నప్పుడు నాన్నగారు ‘చందమామ తీసుకురానా!’ అంటుంటారు..
–మేధా
http://nalonenu.blogspot.com
మేధాగారి చందమామ జ్ఞాపకాలను చందమామ వెబ్సైట్లో కూడా కింది లింకులో చూడగలరు
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2433
మీ చందమామ జ్ఞాపకాలను కూడా రాసి కింది లింకుకు పంపగలరు.
abhiprayam@chandamama.com
My feelings: Saradaaki-19
నీ జ్ఞాపకాలే నా ప్రాణం....వాటితోనే నా ప్రయాణం: వర్షంలో నువ్వు నేను.......
అంతర్వాహిని: ఇదే ఆఖరి రోజు
రంగా ఓ రోజు బార్ లోకి వెళ్ళి బేరర్తో
“మీ దగ్గర మాంఛి కిక్కిచ్చే మందు ఏదుంటే అది ఓ పెగ్గు కొట్టు” అన్నాడు.
ఒక పెగ్గు పోసి ఇవ్వగానే గట గటా తాగేసి రెండో పెగ్ ఇవ్వమన్నాడు. ఇచ్చారు. మళ్ళీ ఒక్క గుక్కలో దాన్ని తాగేసి మూడో పెగ్ ఇమ్మన్నాడు. ఇలా వరుసగా ఐదారు పెగ్గులు లాగించేశాడు.
ఇక అలాగే ఇస్తే అక్కడే పడిపోతాడని ఆ బేరర్ ఇంక చాలన్నాడు.
అతనికి మళ్ళీ డౌటొచ్చి…
“ఇంతకీ ఏమైంది సార్! పెగ్గు మీద పెగ్గేసేస్తున్నారు….భార్యతో ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? “ అడిగాడు బేరర్.
“అవునయ్యా… నా భార్య నాతో గొడవపడి నెల రోజుల దాకా మాట్లాడనంది.”
“అవును… ఐతే ఏంటిప్పుడు.. దానికి తెగ బాధపడిపోవాలా?”
“బాధ పడక ఏంచేయమంటావ్ రా బాబూ.. ఇదే ఆఖరి రోజు!!!”

ప్రమోట్ తెలుగు: ఉగాది పచ్చడి

AAKASA RAMANNA: గవర్నరుని చూసి నేర్చుకోండి..
అక్షర మోహనం: బలపం..
హాస్యాంజలి: ఎవరు గొప్ప
అక్షరం: కొన్ని నిమిషాలు
ఇప్పుడింక
అన్ని చావుల్నీ
రెండు నిమిషాలతోనే కొలుస్తున్నా
రెండు వందల మరణాలు రెండు నిమిషాల మౌనాలు
*
రెండు వందల తల్లుల పేగులు
పెనవేసుకుంటున్న మానవహారాల రాస్తాలు
ఎవరికెవరు క్షమాపణ చెప్పాలి?
ఈ రెండువందల ఖూన్లకి మాఫీ ఏది?
*
ఎప్పటికప్పుడు చావు కొత్త అద్దం తొడుక్కుంటోంది
చొక్కా మార్చినంత తేలిగ్గా
మాటల్ని విడిచేస్తోంది సర్కార్.
ఎవరి మాట ఎక్కడ కొలువు కుదురుతుందో
ఎక్కడ కొలువు తీరుతుందో
ఏ కొలువు మమ్మల్ని నిలువున్నా ముంచేస్తుందో
తెలియనే తెలియదు
అ..యి…నా…
రెండు నిమిషాల్లోకి
నీ/నా చావులన్నీ మడత పెట్టేస్తున్నా.
*
ఎవరి కంటి నెత్తురు
ఎవరి ఇంటి వెల్తురు
రోజూ వచ్చి పలకరించే చావు
ఎవరి అంపకాల రాయబారం?
అమ్మా,
ఈ నేల చీలిపోక తప్పదింక.
వొళ్ళు కూడా చిమిడిపోయిన అన్నం వాసనేస్తుంది.
దీని నెర్రెల నిండా ఆకలి గుహలు మొలుస్తున్నాయి.
ఎప్పటికప్పుడు చావు కొత్త అర్ధంతొడుక్కుంటోంది
*
కొన్ని నిమిషాలు నన్ను వెలివేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను శిలువేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను నీలోకి వొంపి
నీ శరీరపు వేడిని తాకి వస్తాయి.
బతుకు వొక వాంచ చావులానే.
చావు వొక గడ్డిపోచ బతుకులానే.
రెండీటి మధ్య
బహుశా రెండు క్షణాల దూరం
ఆ దూరాన్ని చెరిపి
నువ్వు జ్ఞాపకంలోకి జారిపోయావు చెప్పా పెట్టకుండా.
*
రెండు నిమిషాలు నీ జ్ఞాపకం.
ఆ తరవాత నువ్వు ప్రవహించే రాస్తా.
ఎప్పుడూ పేగులో సలిపే గాయం.
ఇప్పుడింక
ప్రతి చావునీ
రెండు నిమిషాలతోనే…
కొలుస్తున్నా.
(ఆస్టిన్ – టెక్సస్ లో తెలంగాణా సదస్సు తరవాత)
*
Filed under: Uncategorized

ఆంధ్రామృతం: మేలిమి బంగారంమన సంస్కృతి 92.
పుస్తకం: కవిత్వానువాదం పై ప్రశ్నోత్తరాలు
తెలుగు కవిత్వాన్ని అసామీస్ భాషలోకి అనువదిస్తున్న గరికపాటి పవన్ కుమార్-సంగీత దంపతులతో జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది. ఈ ప్రయత్నంలో సహకరించిన పవన్-సంగీత గార్లకు, వీరి కృషి గురించి తెలియజేసిన తమ్మినేని యదుకులభూషణ్ గారికి ధన్యవాదాలు. ప్రశ్నలు కూర్చడంలో తోడ్పడిన స్వాతి, మోహన లకు ప్రత్యేక ధన్యవాదాలు – సౌమ్య,పూర్ణిమ
ఇక చదవండి:
మీ ఇద్దరి గురించి ఓ చిన్న పరిచయం…
గరికపాటి సంగీత:
జోర్హాతు, అస్సాంలో జననం. ఫిలాసఫీలో ఉన్నతవిద్య.సంగీతం తన ప్రాణం. హిందుస్తానీ సంగీతంలో పదేళ్ళకు పైగా కృషి, సంగీతంలో పట్టభద్రురాలు.
రెండు బిహూ పాటల కాసెట్లు వెలువడ్డాయి. అస్సామీ బిహూ నృత్యం వచ్చు. తెలుగు చదవడం, రాయడం పిల్లలకోసమని నేర్చుకుంది.
గరికపాటి పవన్ కుమార్:
ఖమ్మంలో బాల్యం.విజయవాడ సిద్ధార్థా ఇంజనీరింగ్ కాలేజిలో విద్యాభ్యాసం (తమ్మినేని యదుకుల భూషణ్ తో సాహచర్యం). రాంచీలో M. Tech. చెన్నయ్ లో మరో P.G., ఉద్యోగ రీత్యా అస్సాంలో నివాసం. తర్వాత బొంబాయి, లండన్ నగరాల్లో పని . గత రెండేళ్ళుగా అమెరికాలో అతి చలి ప్రాంతం మిల్వాకీలో ప్రవాసం. “ఆ సాయంత్రం” – కవితా సంకలనం- 2006 లో వెలువడింది.
మీకు ఇలా తెలుగు కవిత్వాన్ని అస్సామీ లోకి అనువదించాలన్న ఆలోచన ఎలా కలిగింది?
ప్రశ్నలోకి పోయేముందు ఒక చిన్న వివరణ, అస్సామీని ప్రాంతీయులు “అహోమియా” అని అంటారు. మన భాషలో “స”గా పలికితే అస్సామీలో “హ” గా ఉచ్చరిస్తారు, (ఉదాహరణకి “అనసూయ” ని “అనహూయ” అను పలుకుతారు. )
పెళ్ళైన దగ్గరనుండి మా ఇద్దరికీ ఏ పనైనా కలిసి చేయడమే అలవాటు. ఒక్కోసారి ఈ అలవాటు ఎన్నో సమస్యలను సృష్టించినా నవ్వుతూ అధిగమించేవాళ్ళం. ఉదాహరణకి నేను క్షవరానికి వెళ్ళినా తను షాపు బైట నిరీక్షించేది. మా గురించి మేమున్న చోట చాలా మందికి తెలుసు, ఆ మంగలి కూడా మా ఆవిడను లోపలికొచ్చి కూర్చోండని చెప్పేవాడు. సిగ్గుపడి నవ్వుకునే వాళ్ళం. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ప్రతి పనిని కలిసి చేసేవాళ్ళం, అలాగే కవిత్వం చదవడం కూడా. నేను బిగ్గరగా చదువుతూ అర్థాన్ని అస్సామీలో వివరించేవాణ్ణి (ఆ క్రమంలో నా అస్సామీ, తన తెలుగు బాగా మెరుగైనాయి.) మా ఇద్దరికి ఒకరి భావాలు ఒకరికి పూర్తిగా అర్థం కావాలి అనే విషయంలో పట్టుదల ఎక్కువ. ఈ రకమైన చర్చలు మా మధ్య తరచూ చోటు చేసుకునేవి. అప్పట్లో ఈ చర్చలకు మా హృదయానికి హత్తుకున్న భూషణ్ చెల్లెలి గీతాలు కేంద్రంగా ఉండేవి. అలా మొదలైన సంభాషణే అనువాదాలకు నాంది అని చెప్పుకోవచ్చు.
మీరు కలిసి అనువదించిన మొదటి కవిత ఏది?
నీ చేయి నా చేతిలో
మీరిద్దరు కలిసి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదేనా (అనువాదమైనా, మరేదైనా)
తొలి ప్రాజెక్ట్, మంచి ప్రశ్న. కానీ దేనిని ప్రాజెక్ట్ అనుకోవాలి? మా ఇద్దరి పెళ్ళే ఒక పెద్ద ప్రాజెక్టు. అదే మేము చేసిన తొలి ప్రాజెక్టు. తర్వాత జీవితంలో అన్నీ కలిసే చేసే వాళ్ళం. సాహిత్యంలో అయితే “నిశ్శబ్దంలో నీ నవ్వులు” -కవితా సంకలనం) అస్సామీ అనువాదం మొదటిదని చెప్పుకోవచ్చు, తర్వాత స్పానిష్ నించి నెరుడా ని తెలుగులోకి చేస్తున్నాము, ఇంకా కొన్ని అసంపూర్తి ప్రాజెక్టులున్నాయి.
ఈ అనువాదాల కథ – వ్యక్తిగతంగానూ, జంటగానూ – మీ జీవితాలను ఎంతవరకూ ప్రభావితం చేస్తోందంటారు? మీ గురించి ఒక స్నేహితుడికి చెబుతూ ఉంటే అనిపించింది – మీ ఇద్దరి మధ్య ఈ అనువాదం చేసేటప్పటి సందర్భాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అని. మీరేమంటారు?
చాలా ప్రభావితం చేసిందనే చెప్పాలి. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకూ మాకిద్దరికీ భార్యాభర్తల మధ్య “పవర్ స్ట్రగుల్” అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే తనేమి చెప్పినా నేను సరేనంటాను. నాకేం కావాలో తను ముందుగానే ఆలోచించి అదే “ప్రపోజ్” చేస్తుంది. కానీ అనువాదాలు మొదలు పెట్టాక మా ఇద్దరి మధ్యా మొదటి సారిగా వాదప్రతివాదాలు జరిగాయి. తర్వాత కొంతసేపటికి ఇద్దరం సరదాగా నవ్వుకునేవాళ్ళం, అప్పటిదాకా బిక్కు బిక్కు మంటూ చూసే మా పాపాయి మాతో కలిసి నవ్వేది.
కొన్ని పదాలకు అటువంటి ప్రయోగం అస్సామీలో ఉండేదే కాదు, ఉదాహరణకి భూషణ్ “నిదురపో చిన్నీ…” కవితలోని కింది రెండు పాదాలను అనువదించేటప్పుడు “ఎదురైతే” అనే పదానికి అస్సామీలో ఆ విధమైన వాడకమే లేదు. దానికి బదులు కలిశారు (లోక్ పాయిసు) అనే అర్థం వచ్చే పదమే ఉంది.
“వింత వింత మేళాల సంతాపం ఎదురైతే
వేడుక వెలుగుల సంతోషంగా మారిపొమ్మని చెప్పు చిన్నీ…”
అస్సామీలో అటువంటి వాడకమే లేదు కాబట్టి, తను మొదటగా అర్థం చేసుకునేది కలిశారని, అది ఒక రకంగా అర్థాన్ని స్ఫురించినా మూలంతో దూరాన్ని పెంచుతోంది. ఆ పదం అర్థం అవడానికి నాటకీయంగా ఒక సన్నివేశాన్ని వివరించాలి. మనం బయటికి వెళుతూ ఉంటే ఎవరైనా మనకు ఎదురుగా కనపడితే వాడు నాకు ఎదురయ్యాడని చెపుతాము అని. అలా తర్జన భర్జన ల తర్వాత కొంత దగ్గరగా మేము చేసిన అనువాదం “హణ్ముఖోత్ దేఖీలే” (అంటే ఎదురగా కనపడితే అని) ఇది భావార్ధానికి సరిపోతుంది. దీనికి తనకొక వీర తాడు వెయ్యాల్సిందే ఎందుకంటే ఇటువంటి ప్రయోగం లేదు. తను ప్రతిపాదించే పదం మాకు సరైనదని అనిపించాలి, ఎబ్బెట్టుగా కాకుండా అస్సామీ నుడికారంలో ఇమడాలి. ఇలా “Man hunt” లా పదాల వేట జరిగేది. కొన్ని పదాలకు అర్థాలు నేను వివరించలేక తను అర్థం చేసుకోలేక అనువాదాలు రోజుల తరబడి ఆగేవి.
కలిసి పని చేస్తున్నప్పుడు – ఒకరు అన్న అనువాదం ఒకరికి నచ్చకపోడం వంటివి జరగడం సాధారణంగా కనిపించేదే కదా. మీకలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏం చేసేవారు?
నచ్చడం నచ్చకపోవడం అనేది చర్చకు వచ్చేది కాదు, సరైన అనువాదమా కాదా అన్న వాదమే జరిగేది. ఎవరికైనా సరైనది కాదు అనిపిస్తే ఆపేయడమే, ఆలోచన కొనసాగించడమే. దేనికీ తొందరలేదు. మాకెప్పుడూ ఈ అనువాదాలు ‘కడుపు నిండిన బేరమే’.
మీరు ఇంకా ఏదన్నా అనువదిస్తున్నారా, కవిత్వం కాక? అలాగే,అస్సామీ నుండి తెలుగుకి కూడా అనువదిస్తున్నారా?
ప్రస్తుతానికి లేదు. కానీ అస్సామీలో కొంత మంది ప్రముఖ కవులను (నీలమణి ఫుకాన్, నవకాంత బారువా, దేవకాంత్ బారువా మొ.) తెలుగులోకి అనువదించాలన్న కోరిక ఉంది, రాబోయే రోజుల్లో చేస్తామనుకుంటున్నాము.
అసలు ఇది అనువదించాలి అని మీరు ఎలా నిర్ణయిస్తారు?
హృదయానికి హత్తుకున్న కవితైతే చాలు. అనువదించగలమా లేదా అన్న ఆలోచన మాకు రాదు. ఈ కవితను మేమింతగా ఆస్వాదించామంటే అస్సామీ లో ఉంటే వారెంత ఆనందిస్తారో అన్న ఆలోచనే మా అనువాదాన్ని పేపరు మీద పెట్టే ప్రయత్నానికి ఊపిరి.
మీ అనువాదాలకి అస్సామీ వారి స్పందన ఎలా ఉంది? ఈ అనువాదాలు అక్కడ ఏవన్నా పత్రికల్లో అచ్చయ్యాయా? వీటిని సంకలనంగా తెచ్చే ఆలోచన ఏదన్నా ఉందా?
తెలుగులో నుంచి చేస్తున్న కవితల అనువాదాలు కవి మిత్రులతో పంచుకోవడమే ప్రస్తుతం మేం చేస్తున్న పని. వారి స్పందన బాగుంది. ఇటువంటి పొరుగు భాషా అనువాదాలు ఎక్కువగా రావు కాబట్టి పాఠకులకు కూడా కొంత అలవాటు కావాలి. భూషణ్ చేసిన ‘నీ చేయి నా చేతిలో’ నుంచి ప్రభావితమై అవే కవితలను అస్సామీ లో ‘మోర్ హాత్ తొమార్ హతోత్” గా ప్రచురిస్తున్నాము ఈ సంవత్సరంలో. మేము చేసిన తెలుగు ప్రముఖుల అనువాదాలు కొన్ని సంకలనంగా తీసుకు రావాలని అనుకుంటున్నాము.
ఇలా తెలుగు-అస్సామీ గానీ, అస్సామీ -తెలుగు గానీ మునుపు అనువాదాలేవన్నా జరిగాయా? మీకు తెలిసినంతలో, ఇలా ఎవరన్నా చేసి ఉంటే…. చెప్పగలరు..
నాకు తెలిసీ అస్సామీ కథలు చాలానే తెలుగులోకి అనువదించబడ్డాయి. కానీ కవిత్వం గురించి నాకు తెలియదు.
అస్సామీ సాహిత్యం గురించి కొంచెం చెప్పగలరా? ఎలాంటి సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది? అస్సామీ కవిత్వం ఎలా ఉంటుంది -వంటివి? ఈ ఇంటర్వ్యూ చదివే వాళ్ళలో అస్సామీ సాహిత్యం గురించి అవగాహన ఉండేవారు ఎక్కువమంది ఉండకపోవచ్చు. అందుకని ఈ ప్రశ్న.
అస్సామీ సాహిత్యానికి కూడా తెలుగు సాహిత్యానికున్నంత చరిత్ర ఉంది. 13 వ శతాబ్ధం నుంచే అస్సామీలో కావ్యాలు వచ్చాయి. మన పోతన (1450-1510) కు సమకాలీనుడైన శ్రీమంత శంకరదేవ (1449-1568) అస్సామీలో భాగవత, రామాయణాలను అనువదించాడు. అస్సామీ కవిత్వం మీద శంకరదేవ రచనలు, బిహూ పాటలు, బ్రహ్మపుత్రా నది తో కూడిన అందమైన ప్రకృతి విశేషమైన ప్రభావాన్ని చూపాయి.
ఇక అనువాదాల గురించి: అనువాదాల ప్రధాన లక్ష్యం ఏమిటంటారు? ఒక అనువాదం అత్యుత్తమంగా ఏం చేయగలదు చదువరులకీ?
మూలాన్ని చదవలేని వారికి లక్ష్య భాషలో అదే మూలాన్ని చదివించగలగడం అనువాద లక్ష్యం. “ఒకే విషయాన్ని” రెండు భాషలలో రాయడానికి ఇంతకన్నా పెద్ద కారణం కనిపించదు – అన్న వాల్తేర్ బెంజమిన్ మాటలను అక్షర సత్యంగా భావిస్తాము.
అనువాదాలు ఎప్పుడూ:
1. మూలవిధేయంగా ఉండాలి: మూలాన్ని అర్థం చేసుకోకుండా వాటి అనువాదాలను చదివి అనువాదాలనకు ఉద్యమించడం అంత శ్రేయస్కరం కాదు. అలా ఉద్యమించిన అనువాదాలను చదివినప్పుడల్లా పోతన భాగవతం లోని పద్యం గుర్తుకు వస్తుంది. “కానని వానినూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి…” అని. ఒక చూడలేని వానిని ఆసరాగా తీసుకొని ఇంకొక చూడలేని వాడు విశిష్ట వస్తువులను ఏ రకంగా చూడలేడో…మూలాన్ని అర్థం చేసుకోలేనివాడిని ఆసరాగా చేసుకొని మనం మూలాన్ని దర్శించడనికి ప్రయత్నించలేము అని సారాంశం.
2. భావావేశం ఉండి తీరాలి: పాండిత్య ప్రదర్శన అనువాదం కాదు. అనువాదాన్ని జరిపే యంత్రం హృదయం గానీ బుద్ధి కాకూడదు, అందుకనే కవి పొందిన అనుభూతిని అనువాదకుడు పొంది ఆ స్థితిని సాధించిన పిమ్మట అనువాదాన్ని పూర్తయినట్టుగా ప్రకటించాలి, అంతవరకూ అర్థం చేసుకునేందుకు పడే శ్రమే అనువాదం అని నెల తక్కువ బిడ్డలను కన కూడదు. ఈ భావావేశం సాధించడానికి వివిధ అనువాదకులు వివిధ రకాలైన పద్దతులను పాటించారు. జాన్ ఫెలిస్టనర్ (John Felstiner) చిలీ కవి నెరుడా “The heights of Macchu picchu” ని అనువదించడానికి మచ్చూ పిచ్చూ ని దర్శించాడు.
3. రూప శ్రద్ధ: రూప శ్రద్ధ లేని అనువాదాలకు వ్యాఖ్యానాలకు పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతీ కవీ ఆధునికుడైనా, ప్రాచీనుడైనా తనదంటూ ఒక శైలి సాధిస్తాడు. చ్చందో బందో బస్తులను చట్ ఫట్ మని త్రెంచుకున్నా- శ్రీ. శ్రీ. “నేనొక దుర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం” అని తనదైన శైలి ని విడువలేదు, ఆ శైలే లేకపోతే శ్రీ శ్రీ కవిత్వమే లేదు. అందుకే శైలి ని పట్టుకోవడం చాలా అవసరం. నెరూడా ని అభిమానంగా అనువదించే అలస్టైర్ రీడ్ (Alastair Reid) నెరుడా కవితలలోని Tone ని పట్టుకోవడం కోసం నెరుడా తన సొంత గోంతుకతో చదివే కవితలను రోజుల తరబడి వినేవాడు.
తెలుగు ను అనువదించడంలో మీరు ఎదుర్కున్న ప్రధాన సమస్యలేమిటి?
తెలుగునే కాదు ఏ భాషనైనా అనువదించడంలో కలిగే ప్రధాన సమస్య “నుడికారం” తెలుగు అస్సామీ విషయంలో మాకున్న ప్రధాన బలం :మేము చెరొక భాషలో మా బాల్యాన్ని సంపూర్ణంగా అనుభవించాము.
ప్రాస వంటి అంశాలను అనువదించడంలో మీ అనుభవం ఎలా ఉంది? గతంలో – వివిధ భారతీయ భాషల్లోని నాన్సెన్స్ పొయెట్రీ ని ఆంగ్లంలోకి అనువదించారు. అప్పట్నుంచే ఈ సందేహం – అసలు నాన్సెన్స్ లో ప్రధానంగా కనబడేదే ఆ ప్రాస – దాన్ని ఎలా అంత తెలివిగా అనువదించారు అని. మీ అనుభవం, అభిప్రాయం చెప్పండి.
ప్రాస, రూప శ్రద్ధ లో ఒక భాగం. రూప శ్రద్ధ గురించి ముందుగా చర్చించాము. కవితకు భావం ప్రాణం అయితే రూపం శరీరం. అనువాదంలో రెంటికీ చాలా ప్రాముఖ్యం ఉంది. సింహగంభీరంగా మాట్లాడే అమ్మాయిని ఊహించుకుంటే నేనేం చెపుతున్నానో అర్థం అవుతుంది. అయితే ప్రాస, యతి, ఛందస్సు, గణాలు మొదలైనవన్ని యధాతధంగా దిగబడలేవు కాబట్టి, వీలైనంతవరకు మూలాన్నించి గ్రహించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు ఒక కవిత గురుబాహుళ్యం అవడం వలన గంభీరమైన పోకడ అనిపించవచ్చు, అది అనువాదంలో కూడా గంభీరమైన పోకడతో ఉండాలి.
నాట్యం నేర్చుకోవాలంటే చేతి ముద్రలు, కాళ్ళ అడుగులు నేర్చుకున్న తర్వాత నాట్యాన్ని అభ్యసిస్తాము. సంగీతం స్వరాల సాధనతో మొదలెడతాము. కానీ లలిత కళలో పరమోత్కృష్టమైన కవిత్వాన్ని రాయడనికి మాత్రం పట్టుమని పది కవితా రూపాలనైనా ఆకళింపు చేసుకోరు, అదేమంటే ఛందోబందోబస్తులను ఛట్ ఫట్ మని త్రెంచుతున్నాం అంటారు, అంతేగానీ ఆ ఛందో బందో బస్తులను తెంచడానికి ముందు శ్రీ శ్రీ లో ఎంత ఛందోసంపత్తి ఉందో గుర్తించరు.
సరే కవితారూపం అనువాదాలలో ఎంత ముఖ్యమో తెలియాలని ఈ ఉపోద్ఘాతం, ఇకపోతే మేము అనువాదాలు చేసినప్పుడు కవితా రూపాన్ని సంగ్రంగా అర్థం చేసుకొని అస్సామీ భాషకు అనువుగా మలచే వాళ్ళం. తెలుగులో ప్రాస అస్సామీ లో అంత్య ప్రాసగ మారేది, యతి వంటి ప్రత్యేకతలు పట్టుకు రావడానికి ప్రయత్నించాము.
ఒక్కో ప్రాంతంలోనూ కొన్ని ప్రత్యేక సంప్రదాయాల వంటివి ఉంటాయి కదా. ఆ భాషా సాహిత్యంలో అవి కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఆ సంప్రదాయాలతో పరిచయం లేని వారికి – అనువాదం చేస్తున్నప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రత్యేక సంప్రదాయాలని అనువాదకులు వివిధ రకాలుగా అనువదించారు
1. లక్ష్య భాషా సంప్రదాయాలలో సమానమైన సంప్రదాయాన్ని వాడడం
2. మూల భాషా సంప్రదాయాలను/పదాలను ఉన్నవి ఉన్నట్టుగా ఉటంకించి వాటి గురించి పాద సూచికలను ఇవ్వడం.
ఈ విషయం అనువాదకుడి తీసుకున్న స్వేచ్చ పై ఆధారపడి ఉన్నా, మేము రెండవ విధానానికే మొగ్గు చూపుతాము. కానీ ఎన్నో సంప్రదాయాలు తెలుగు వారిలో అస్సామీయులలో కలుస్తాయి కాబట్టి అంత సమస్య లేదు, ఉదాహరణకి, భూషణ్ చెల్లెలి గీతాలులో “కొంగా కొంగా పూలెయ్” అనే ఆటని అస్సామీ లో చిన్న పిల్లలు “బొగోలీయే బొగా ఫుట్ దీజా” అని ఆడుకుంటారు, అవే పదాలను ఉన్నదున్నట్టుగా వాడేశాము.
మన సంస్కృతులు చాలా వరకు కలవడం వలన ఈ ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోలేదు.
ఇలాగే అనువాదాల్లో ఆసక్తి ఉన్న, కొత్తవారు మిమ్మల్ని సలహా కోసం సంప్రదిస్తే మీరు ఏం చెప్తారు?
అనువాదాలు అభ్యాసం చెయ్యడమే, మంచిగా వచ్చాయా లేదా అనేందుకు “ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః”. కానీ గోథే (Goethe), వాల్తేర్ బెంజమిన్(Walter Benjamin), జాక్స్ డెర్రిడా(Jacques Derrida) వంటి ప్రముఖుల అభిప్రాయాలు అలస్టయిర్ రీడ్, జాన్ ఫెలిస్టనర్ వంటి అనువాదకుల అనుభవాలు చదవవచ్చు. తెలుగులో హాయిగా భూషణ్ రాసిన నేటి కాలపు కవిత్వం తీరుతెన్నులు లోని వ్యాసాలు “అనువాదం లో మెలకువలు” మొదలైనవి ప్రపంచ ప్రముఖుల ప్రమాణాలతో సరితూగుతాయి. అంతేకాక అనువాదాలు చేసేటప్పుడు జరిగే తప్పుల చిట్టా కోసం అదే పుస్తకంలోని “Hibiscus on the lake”(వేల్చేరు నారాయణ రావు అనువాదాల మీద విమర్శ) అన్న వ్యాసం బాగా పనికొస్తుంది.
ప్రత్యేకంగా కవితానువాదం కతానువాదం కంటే క్లిష్టమైన ప్రక్రియ అనిపిస్తుంది నాకు (నాకేమీ అనుభవం లేదు అనుకోండి… అలా అనిపించింది..అంతే!). మీరేమంటారు?
అవును, కవిత్వానువాదం కష్టమైన ప్రక్రియే.
అలాగే, హైకు వంటి కవిత్వాన్ని – అనువాదం చేసేటప్పుడు – ఒక రకంగా ఆలోచిస్తే, పదాలు తక్కువుంటాయి కనుక, తడుముకోనక్కర్లేదేమో పై కేస్ లో లాగా.. అనిపిస్తుంది. కానీ, నాబోటి వారికీ రెండు మూడు సార్లు చదివితే కానీ అర్థం కావు హైకులు…అలాంటప్పుడు….అనువాదం చేసేటప్పుడు ఎలా ఉంటుందో? అనిపిస్తుంది. మీరు అనువాదం చేసిన కవితల్లో… ఈ తరహా కవితలు ఉన్నాయా?
(నవ్వుతూ) పదాల సంఖ్య అనువాద క్లిష్టతకు కొలబద్ద కాదు. కవితను నువ్వు సంపూర్ణంగా అనుభవించావా పదాలు వాటంతటవే వచ్చి పడతాయి, ఎంత పెద్ద కవితైనా…
సుకుమార్ రాయ్ తరహా Nonsense Verse ను అనువదించడం మహా కష్టం అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక చదువరిగా అలంటి కవిత్వం చదువుతూ అనువాదం గురించి తలచుకున్నప్పుడు నాకు కలిగే భావన. అనువాదకులుగా మీ అభిప్రాయం ఏమిటి ?
ఏ కవితైనా(అది కవితైతే)అనుభవిస్తే అనువాదం చెయ్యడం తేలిక. ఇంకొక ముఖ్యమైన విషయం అనువాదాలెప్పుడూ మన మాతృభాషలోనే సాధ్యం. మన మాతృభాషలోనుంచి వేరే భాషలోకి అనువాదం చెయ్యడమంటే నీరు మెరకనెరగడమే. “Nonsense Verse” నేను చదవలేదు.
చివరగా: మీ అభిమాన రచయితలు/కవులు ఎవరు?
పవన్ కు:
ప్రాచీనుల్లో: పోతన, శ్రీనాధుడు, ధూర్జటి
ఆధునిక పద్యకవుల్లో: జాషువా (ముఖ్యంగా ఫిరదౌసి కావ్యం)
ఆధునికుల్లో: శ్రీశ్రీ (ముఖ్యంగా నడక), ఇస్మాయిల్ , భూషణ్
ప్రపంచ సాహిత్యంలో: నెరుడా
సంగీతకు:
అస్సామీ:నవకాంత బారువా,దేవకాంత బారువా
తెలుగులో: భూషణ్
ప్రపంచ సాహిత్యంలో: మొంటాలే, పాల్ సెలాన్
శాస్త్ర విజ్ఞానము: రేడియో ఖగోళ విజ్ఞానం అంటే ఏమిటి?
జీవని: తనికెళ్ల భరణి గారితో ముచ్చట్లు
అమ్మ ఒడి: మనం జీవించడం, దేశాన్ని ఉద్దరించడమా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 28]
నా చిన్ని ప్రపంచం: ఆ రోజుల్లో....
నవతరంగం: అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’
భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్ ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand Prize) ని అందుకుంది ఈ చిత్రం.
కొంతకాలం క్రితం ఒకసారి ‘హిందూ’ పత్రికలో ఈ చిత్రం గురించి తెలుసుకున్న తర్వాత, ‘నీచా నగర్‘ విసిడి తెప్పించి చూశాను. అప్పటినుంచీ ఈ సినిమా గురించి ‘నవతరంగం’లో రాయాలనుకున్నా, నాకంటే దీన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా రాస్తే బాగుంటుందని ఎదురుచూశాను. కాని ఎవరూ ఆ పని చేయకపోవటంతో, మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన ఈ చిత్రం గురించి, ఆ దర్శకుడిని గురించి రేఖామాత్రంగానైనా సినిమాకళను అభిమానించేవారు తెలుసుకోవలసిన అవసరం ఉందని, నేను సేకరించిన కొద్దిపాటి వివరాలతో ఈ నాలుగు ముక్కలు -
‘నీచా నగర్’ స్థూలంగా రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ రాసిన ‘Lower Depths’ అనే నాటకంపై ఆధారపడినది. ‘నీచా నగర్’ అనే టైటిలు Downtown అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకం. ఉన్నవారు, లేనివారి మధ్య తారతమ్యాలు, ఉన్నవారు, లేనివారిపై ఏ విధంగా ఆధిపత్యం చలాయిస్తారనేదే దీని కథాంశం. హిందీలో ఈ కథను రాసింది హయతుల్లా అన్సారీ.
ఒక చిన్న కొండపైన ఒక విలాసవంతమైన బంగళాలో ఉండే ధనం, దర్పం గల పెద్దమనిషి, తన ప్రాంతంలో ఉండే వ్యర్థజలాలను కింద పేదప్రజలు నివసించే బస్తీకి ఒక కాలువద్వారా మళ్ళిస్తాడు. దానివల్ల, ఆ బస్తీలో రకరకాల జబ్బులు ప్రబలి, ఆ ప్రజలు రోగాలపాలవుతారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన వాళ్ళను తన డబ్బుతో, పలుకుబడితో నోళ్ళు మూయించాలని చూస్తాడు. వాళ్ళకో ఆస్పత్రి ఏర్పాటుచేసి వాళ్ళను నోరెత్తనీయకుండా చేయాలని చూస్తాడుగాని, తాను మురికి నీళ్ళను ఆ బస్తీకి మళ్లించటం తప్పని ఒప్పుకోడు. అతడి ధనమదానికి లొంగని ప్రజలు చావనైనా చస్తాం గాని, ఆ ఆస్పత్రి సేవలు వినియోగించుకునేది లేదని భీష్మించుకుంటారు. చివరికి తన కన్నకూతురు కూడా, తాను చేస్తున్నది తప్పని, ఆ బస్తీ ప్రజలనే సమర్థిస్తుంది. తాను ‘కొనేసిన’ అనుయాయులూ దూరమవుతారు. చివరకు అతను దిక్కులేని చావు చస్తాడు.
ఇందులో కథానాయికగా చేతన్ ఆనంద్ భార్య ఉమా ఆనందే నటించింది. తొంభై ఏళ్ళు పైబడిన పండు వయసులో ఇప్పటికీ ఎంతో చలాకీగా కనిపించే, జోహ్రా సెహగల్ ను ఆమె యుక్త వయసులో ఇందులో చూడవచ్చు. మరో ప్రధానపాత్రలో కామినీ కౌశల్ నటించింది. ఈ సినిమాకి సంగీతం అందిం
చింది కూడా పండిట్ రవిశంకరే. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వపు ఆంక్షలవల్ల ఈ సినిమా మన దేశంలో విడుదలకు నోచుకోలేదు.
2008 లో చేతన్ ఆనంద్ కుమారుడు, కేతన్ ఆనంద్ తన తల్లి ఉమా ఆనంద్ తో కలిసి “Chetan Anand: The Poetics of Film” అనే పుస్తకాన్ని, అదే టైటిలుతో ఒక డాక్యుమెంటరీని విడుదల చేశాడు.
చేతన్ ఆనంద్, ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ సోదరుడు (అన్న). చేతన్ ఆనంద్, దేవానంద్, విజయానంద్ ఆనంద్ త్రయంగా హిందీ చిత్రసీమలో ప్రసిద్ధులు. ఆనాటి బలరాజ్ సహానీ, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ వంటి హిందీ చిత్రసీమ ఉద్దండులలాగానే, చేతన్ ఆనంద్ కూడా కమ్యూనిస్టు భావజాలం చేత, ఆనాటి రష్యన్ సాహిత్యం చేత ప్రభావితుడైనవాడు.
‘నీచా నగర్’ చేతన్ ఆనంద్ మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత 1950 లో తమ్ముడు దేవానంద్ తో కలిసి ‘నవకేతన్ ఫిల్మ్స్’ అనే బ్యానర్ ప్రారంభించి మరికొన్ని చిత్రాలు నిర్మించాడు. రష్యన్ రచయిత నికోలాయ్ గోగోల్ నాటకం Inspector General ఆధారంగా తీసిన ‘అఫ్సర్’ అనే చిత్రం ఈ వరుసలో మొదటిది. తర్వాత, ‘ఆంధియా’ (1952), ‘టాక్సీ డ్రైవర్’ (1954) ‘ఫంతూష్’ (1956) చిత్రాలు ఈ బ్యానర్ మీద వచ్చాయి. వీటిలో ‘టాక్సీ డ్రైవర్’ బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఆ తర్వాత, ‘హిమాలయ ఫిల్మ్స్’ పేరిట తన స్వంత బ్యానర్ ప్రారంభించి, ‘హకీకత్’, ‘హీర్ రాంజా’, ‘హస్తే జఖ్మ్’, ‘కుద్రత్’, ‘హిందూస్తాన్ కి కసం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో, 1964 లో తీసిన ‘హకీకత్’ అనే చిత్రం 1962 లో జరిగిన ఇండియా, చైనా యుద్ధం నేపధ్యంగా నిర్మించింది. దీనిని కాశ్మీర్ లోనూ, టిబెట్ లోనూ actual locations లో చిత్రించాడు. దీనిని అప్పటి ప్రధాని నెహ్రూకు అంకితమిచ్చాడు. తన చిత్రాలు ఎక్కువగా స్టూడియోలో కాకుండా, లొకేషన్స్ లోనే తీయటానికి ప్రాదాన్యమిచ్చేవాడు. పదిహేనుకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన చేతన్ ఆనంద్ 1988 లో దూరదర్శన్ కోసం ‘పరమవీర చక్ర’ అనే సీరియల్ ను కూడా రూపొందించారు. అనేక చిత్రాలకు దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా పనిచేసిన చేతన్ ఆనంద్ ను, కథనం, కెమెరా విషయాల్లో ఒక వినూత్నమైన ప్రయోగశీలిగా సినీ విమర్శకులు పేర్కొంటారు.
Shiva Speaks: మీ బ్లాగర్ బ్లాగుకి స్వంత డొమైన్ కి మార్చడం ఇలా.........
2010-03-11
Nutakki Raghavendra Rao: మనిషీ విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?
మనిషీ విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?
రచన: నూతక్కి
12-03-2010గంటలు రోజులు నెలలు
సంవత్సరాలు
యుగాలు కల్పాలు
స్రుష్టింపబడుతున్నాయ్
అనుక్షణం
విరామమెరుగక
స్వయంప్రదక్షిణ
సూర్య ప్రదక్షిణ
ధరిత్రి చేసే నిష్కామ
కార్యమది
నక్షత్ర రాసుల
అసంఖ్యాక
నక్షత్ర కూటముల
మహాకూటమి
పాలపుంత తో
విశ్వ విహారం
స్థిరమని భ్రమిస్తూ
నిరంతర భ్రమణంలో
ధరిత్రి వాహనం పై
శుల్కం చెల్లించని
విశ్వ పర్యాటకులం.
మనం జన్మించిన క్షణాన
మన ధరిత్రివున్నస్థలి నుండి
కోట్లకోట్ల యోజనాల సుదీర్ఘ పయనం
చేసిన మానవ జీవులం……
విమాన వాహన పయనంలో
యేభూఖండపు
వుపరితలాన
జన్మిస్తే
ఆదేశమె నీ జన్మభూమి
అమ్మదేశమో నాన్నదేశమో
నీదేశం కాబోదు.
మరి యీలెక్కన మనిషీ
విశ్వంలో నీ జన్మస్థలి యేదీ ?

స్వప్న రాగలీన: మనో రుగ్మతల లక్షణాలు
వసుంధర అక్షరజాలం: కథావసంతం కథల పోటీ

పాలవెల్లి: తంగెడు పూలు
నా రాతలు: నా తొలి చూపుల్లో అమెరికా
Padmarpita....: నన్ను నేను!!
దీప్తి ధార: తెలంగాణా కోసం
స్వప్న రాగలీన: నా ఆత్మహత్యా ప్రయత్నాలకు అసలు కారణం!
శ్వేత పత్రం: బజాజ్ వారి కొత్త నానో బైక్
•▬• దీపావళి •▬•: Password Recovery అనే ఓ కథ ..!!
కవితల కలకలం: నీకే ఈ నా సమస్తం!!
MAATA VARUSAKU బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని: కాలం తో పాటు మారే పిలుపులు
PHANI BABU -musings: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- बॅगुनाह्(1957)
1957 లో ఒక హిందీ సినిమా వచ్చింది. ‘బేగునాహ్’ అని. ఆ సినిమా ఇంగ్లీషు లో వచ్చిన ‘నాక్ ఆన్ ద వుడ్’ అనే సినిమా కి అనుకరణ అని కోర్టులో వ్యాజ్యం వేశారు. దానితో ఆ సినిమాని ‘బ్యాన్’ చేశారు.ఆ సినిమా మొత్తం రెండు వారాలు మాత్రమే ప్రదర్శించబడింది. అప్పటి నైతిక విలువలు అలాగ ఉండేవి. మరి ఇప్పుడో, సాధారణంగా వచ్చేసినిమాలన్నీ, ఏదో ఒకదానికి అనుకరణే.పాటల దగ్గరనుండి కాపీలే.
ఇప్పటివరకూ,భారతీయ చలనచిత్ర చరిత్రలో బ్యాన్ అయిన సినిమా ఇదేట.కానీ, అందులో ఉన్న ఒక పాట (శంకర్ జైకిషన్ సంగీతం) చాలా బాగుంటుంది. ఆ పాట సంగీత దర్శకుడు జైకిషన్ మీద చిత్రీకరించారు.
Listen to that song by Mukhesh here.

వరూధిని: వేకువ వెలుగులు
గుప్పెడు మనస్సు: నా స్నేహితురాలు - 1
పానశాల: వ్యాఖ్యలు నావి కావు, కానీ అది నేనే
ఆనందిని: మన జేబులో ఉన్న నోటు అసలుదా?
nagaphan: My preparation
విశాల ప్రపంచం...: ఉన్నట్టా? లేనట్టా???
2010-03-12
i dont want to ask u abt d above one but i wanna ask u only one thing that is should youth or young ones enter politics or not i herad onr thing that these political leaders will downthrode n use us ? is my thought correct or not i wanna a good ans n d other one is, is there no one who was elected as a poletition without having a background ? wilu pls send me d ans to my mail thanking u very much bye
నేను రాసిన కామెంటు
నన్నే మూర్ఖుడు అంది
అప్పుడు గుర్తొచ్చింది
నిన్న ఒక బ్లాగరు అన్న మాట
“నువ్వెంత తెలివైన వాడివి” అని
>> Simply superb !
పదో అబద్ధం ఎత్తుకోవడం లోనే మీ అబద్ధపు పోకడలు కనపడుతున్నాయి.
మాది అభివృద్ధి సమస్య కాదని ఎప్పుడూ ఎవ్వరు అనలేదు. మాకు అభివృద్ధి, ఆత్మా గురవం సహా చాలా సమస్యలు ఉన్నయి. అభివృద్ధి సమస్య కాదు, ఆత్మ గౌరవమే సమస్య అని ఎవరు ఎక్కడ అన్నరో ఆధారాలు చూపించండి. మీరు చూపించ లేరు. పై పెచ్చు నన్నే ‘ఎవరూ అనలేదు’ అని నిరూపించమని కూడా అన గలరు!
మీ పీఠిక అబద్ధంతో మొదలయ్యింది. ఇంక మీరు ఇతరుల అబద్ధాల గురించి చెప్పే స్థాయి ఎక్కడిది? సహజంగా మీ వివరణలో కూడా అబద్ధాలు ఉంటయని సులభంగ ఊహించొచ్చు.
“తెలంగాణలో ఆంధ్రా హోటళ్లున్నాయి కానీ ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లేవీ, సమ్మక్క సారక్క జాతర ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా చెయ్యరెందుకు…”
ఈ మాటలు ఎక్కడ ఎవరు అనంగ విన్నవ్ అబ్రకదబ్రా? ఆ ఆధారాలు ఇస్తే కొంచం బాగుంటది. దీన్ని బట్టి ఆత్మ గౌరవం అంటె ఏంటిదో కూడ మీకు తెలిసినట్టు లేదు. సమ్మక్క సారక్క జాతర చేస్తున్నందుకు తెలంగాణల గర్వ పడుతరు. అంతే కాని ఇంకెక్కడా చేస్త లేరని బాధ పడరు. ఇదిగో, ఇట్ల కుటిలమైన ఆలోచనలు చేస్తుంటారే, అట్లాంటి వాళ్ళ గురించే బాధ పడుతరు, తెలంగాణా వాళ్ళు.
ఒకప్పుడు అంజయ్యను రాజీవ్ అవమానించినడని తెలుగు వారి ఆత్మ గౌరవ సమస్య లేవ నెత్తినడు ఎన్టీయార్. ఇప్పడు ఆంధ్రోల్లు చేసేది ఏంటి? తెలంగాణా వస్తే నక్సలిజం పెరుగుత దంట(రాయపాటి). ఆంధ్రోల్లు వీసాలు తీసు కోవాల్సి వస్తదట (వై ఎస్సార్). ISI కాచుకొని కూర్చుందట (లగడపాటి). వేర్పాటు వాదులట (అబ్రకదబ్ర). ఏం? మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్రోల్లు వేర్పాటు వాదులు కాదా? మరి వేర్పాటు వాది ఐన పొట్టి శ్రీరాములుని పుస్తకాలల్ల ఆకాశాని కెట్టుతుంట రే? అప్పుడు లేని వేర్పాటు వాదం, దేశ సమైఖ్యత ఇప్పుడు ఎందుకు గుర్తు కొస్తున్నయి? నిజంగా మీరు నిష్పాక్ష పాతి ఐతే పొట్టి శ్రీరాములు కూడ వేర్పాటు వాదే అని ఒప్పు కొండి. మీకు ఆంధ్రోల్ల నుండి ఎన్ని చీవాట్లు వస్తయో చూడండి.
మాటి మాటికి తెలుగు వోటర్లు, ఎన్నికల్ల తీర్పు అని చెప్పుడు అన్నిటి కన్నా పెద్ద అబద్ధం. 2009 లో సమైఖ్యాంధ్ర అని చెప్పి పోటీ చేసినవి రెండే పార్టీలు. సీపీయం, ఎం ఐ ఎం. ఈ రెండు పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినయి? మిగతా పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినయి? అంతెందుకు? ప్రత్యేక తెలంగాణాకి సపోర్టు చేసినా గూడ, ఆంద్రాల కాంగ్రేసును, టీడీపీని ఎందుకు గెలిపించిన్రు, అక్కడి వాళ్ళు? దీనికి చెప్పండి సమాధానం, మీదగ్గర వుంటే. దీన్ని బట్టి తెలియడం లేదా, ఎన్నికల డొల్ల తనం?
“పదేళ్లుగా పదే పదే చదువుతున్నా ఆత్మగౌరవ మంత్రం ఆశించినన్ని చింతకాయలు రాల్చలేదన్న గ్రహింపుతో వేర్పాటువాదులు ఈ మధ్యనే ట్యూను మార్చారు…”
ఒహో! ఆత్మగౌరవం నినాదం చివరాఖరికి ఒచ్చింది కాదన్న మాట! పదేళ్ళ నుండీ ఉందన్న మాట!. మరి మొదట్లో “చివరాఖరికి ప్రయోగించిన అబద్ధపుటాస్త్రమే ఈ ఆత్మగౌరవ నినాదం” అన్నా రేమిటి అబ్రకదబ్రా? చిన్నప్పుడు పట్టాభిరాం ‘అబ్రకదబ్ర, అబ్రకదబ్ర’ అని మ్యాజిక్ చేయడం
చూసే వాణ్ని. ఇది కూడా అలాంటిదేనా? మీరు పైన రాసింది అబద్ధమా, కింద రాసింది అబద్ధమా, జర వివరించండి.
పచ్చి నిజాలను అబద్దాలుగా, అబద్ధాలను నిజాలుగా చేయడానికి గత కొన్ని రోజులుగా మీరు పడ్డ కుస్తీ చూస్తుంటే నిజంగా జాలేస్తుంది.
మహిశ్రి,
మీ జవాబు – మొగం మీద తట్టెడు ఉంచినట్టుగా ముక్కుసూటి జవాబు. ఈళ్ళకు ఇట్లజెప్తే ధిమాఖ్లకు ఎక్కదు. కొద్దిగ మన స్టైల్ల చెప్పలె. నేర్పుత నేర్సుకుంటవా?
>> “తెలుగు వారి ఆత్మ గౌరవంతొ నెగ్గిన ntr ఆ తరువత వచ్చిన ఎన్నికలలొ ఎందుకు ఓడిపొయాడు??”
As I said, it’s never about NTR. That’s why.
ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్న వారందరూ స్వార్ధపరులని నేననలేదే. ఆ వంకతో విద్వేషాలు రెచ్చగొడుతున్నవారినే అంటున్నా. వాళ్ల మాయలో కొందరన్నా పడుతున్నారు – మీలాంటోళ్లు. వాళ్ల కోసమే ఈ ప్రయత్నమంతా.
Интересные посты - читаются на одном дыхании. Пишите больше. От души респектую
Если очень хорошо подумать и взвесить все за и против, то тема может быть очень интересной для всех.
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.
మీ స్పందనకు ధన్యవాదాలు.
блог знакомый в аську ссылку кинул
Интересненько, а кто может объяснить девушке как добавить этот блог в избранное?



![Chandamama Collection Edition art1[6]_400-519](http://blaagu.com/chandamamalu/files/2010/03/Chandamama-Collection-Edition-art16_400-519.jpg)
