2012-02-04
a2z డ్రీమ్స్: ‘రామ్ చరణ్’ రచ్చ సినిమాతో కలక్షన్స్ రచ్చ లేపుతాడా?
1) మగధీర సినిమా ద్వారా నీ తండ్రి నీకు ఇచ్చిన స్టామినా ఇది అని రాజమౌళి ‘రామ్ చరణ్’ కు చూపించాడు.
2) దూకుడు, ‘బిజినెస్ మేన్’ సినిమా ల ద్వారా తెలుగు సినిమాల ప్రస్తుతం ఓపినింగ్స్ స్టామినా ఇది అని మహేష్ బాబు ఇంకో గోల్ సెట్ చేసాడు.
3) ఆరెంజ్ సినిమా ద్వారా తన సినిమాకు ప్రేక్షకులకు అర్ధం కాని కాన్సెప్ట్ , దానికి తోడు ఓవర్ బడ్జెట్ అనవసరం అని తెలుసుకున్నాడు.
ఈ పరిస్తితులలో వస్తున్న సినిమా ‘రచ్చ’.
my observation:
మగధిర సినిమా ద్వారా పోకిరీ రికార్డులని ఎలా చిత్తు చేసాడో రచ్చ సినిమా ద్వారా భారీ ఓపినింగ్స్ సాధించి ‘బిజినెస్ మేన్’ రచ్చ లేపాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ps: లీక్ అయిన title song రచ్చ లేపుతుంది.
Prabhava ప్రభవ: సూర్యుడు సున్నా
వసంతం: నయాగరా జలపాతంలో దూకటమా !!? Brink of Death on the Brink of Niagara’s Horseshoe Falls
ప్రేమలో మనం: హలో... అవాక్కయ్యారా...!!!
TeluguMovieViews.com: బాలకృష్ణ వైపు చూస్తున్న రాజశేఖర్
హీరో రాజశేఖర్ తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోయినా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తుంటారు.ఇంతకు ముందు జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లాండ్ బ్యాక్ మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ దంపతులు తరువాత జగన్ పంచన చేరారు.
తరువాత జగన్ తనవద్దకు గాగుల్స్ పెట్టుకుని రావద్దని అన్నారని తనకు ఫేమ్ రావడం జగన్ కు ఇష్టం లేదని రాజశేఖర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.ఆ సమయంలో టి.డి.పి కి దగ్గరవడానికి ప్రయత్నించినా ఈ దంపతులు పెట్టిన షరతులకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.
టి.డి.పి లో ఇప్పుడు బాలయ్య హవా కనిపిస్తుండటంతో బాలయ్యకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.చిరంజీవి, బాలయ్యల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.చిరు తనను తోక్కేసాడని చెప్పే రాజశేఖర్ కి బాలయ్య మాటలు బాగా నచ్చినట్లు కనిపిస్తున్నాయి.హైదరాబాద్ లో క్యాన్సర్ అవేర్నస్ వాక్ లో బాలయ్యతో కలిపి నడిచారు రాజశేఖర్.
వీళ్ళతో కలిపి చాలా మంది నటులు పాల్గొన్నా రాజశేఖర్ ఎంట్రీ మాత్రం బాలయ్యని ఇంప్రెస్స్ చెయ్యడానికే అంటున్నారు.త్వరలో ఈ విషయం అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.
మీ కోసం: బెల్జియం లో జరిగిన LED లైట్ల పండుగ...ఫోటోలు
తెలుగు పాటలు: బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం... ఫలహరాలే తింటే ఫరమానందం...
మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే: అర క్షణం ఆగలేక వెచ్చని నా చేతులను' చల్లగా 'కాల్చెశావు.
నాలో మాట: మంచి ఆలోచన
కడలి: నీ ఎడబాటులో...
శాస్త్ర విజ్ఞానము: గోవాకి వైస్రాయ్ (వాస్కో ద గామా 12)
అవీ..ఇవీ...అన్నీ...: జలుబుకు గృహవైద్యం
అవీ..ఇవీ...అన్నీ...: ఎవరినైతే తిట్టమన్నారో.. వారితో కలిసిపోయారు : డా|| రాజశేఖర్.
ప్రజాశక్తి: మాఫియా చోరీ
విశాలాంధ్ర మహాసభ: నొప్పించకండి!
తెలుగు లో కంప్యూటర్స్: *50gb free Online Storage ని అందించే వెబ్సైట్స్
“ప్రవాసరాజ్యం”: కలిసి ఉద్యమించం- కోదండరాం
“ప్రవాసరాజ్యం”: సిపిఎం కార్యదర్శిగా ఐదోసారి రాఘవులే !
తెలుగ్గోడు: చిరు కలవడంవల్లే బయటకు వచ్చాం!: రాజశేఖర్ జీవిత
తెలుగ్గోడు: 2జీ కేసులో చిదంబరానికి ఊరట
ఎం. ఎస్. నాయుడు: మాటల సమాధి
లిఖిత: ఏమని అందాం దీనిని?
వరూధిని: బుజ్జి పండు తెలుగు చదువు - 12 - భామా విజయం - 7
'''నేస్తమ్...: నాన్న...!
vasantham: ఏదో మీ దయ..వల్ల..
తెలుగు న్యూస్&వ్యూస్: మళ్లీ మొదలైన రీఎంబర్స్మెంట్ రగడ
తెలుగు న్యూస్&వ్యూస్: హీరోయిన్ జెనీలియా సెకండ్ మ్యారేజ్!
అంతర్వాహిని: దండక మహారాజు కథ
దండక మహారాజు పిత్రా రాజ్యమను దక్షిణ దేశ రాజ్యానికి అధిపతి. ఆయన కులీనుడు (మంచి కులమున పుట్టిన వాడు). కానీ కాముకుడు. శుక్రాచార్యులను తన గురువుగా చేసుకొన్నాడు.
ఒక రోజున మహారాజు గుర్రమెక్కి అరణ్యానికి వెళ్ళాడు. అదే సమయంలో శుక్రాచార్యుని కుమార్తెయైన విరజ అడవిలోని ప్రకృతి శోభను తిలకించడానికి ఒంటరిగా వచ్చింది. ఆమెకింకా పెళ్ళి కాలేదు. మంచి అందగత్తె. బాల్యం నుండి అప్పుడే యవ్వనం లోకి అడుగిడుతున్న వయసు ఆమెది. అటూ ఇటూ తిరుగుతూ పూలు కోసుకొంటున్నది. రాజు దృష్టి ఆమె మీద పడింది. ఆమె అందానికి వశుడయ్యాడు. అతని మనస్సు అతని ఆధీనం లో లేదు. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, స్నేహపూరిత స్వరంతో
“భామినీ, ఎవరు నీవు? ఎవరి కుమార్తెవు? ఎవ్వని భార్యవు? ఈ నిర్జనారణ్యంలో ఇలా ఒంటరిగా తిరుగుతున్నావేం? కనీసం నీకు పాదరక్షలు కూడా లేవు. “
అది విని ఆమె సిగ్గుతో “రాజా! నేను శుక్రాచార్యుని పుత్రికను. నాకు ఇంకా వివాహం కాలేదు.” అన్నది
“దేవీ! నేను ఈ దేశమునకు రాజును. నీ సౌందర్యం నన్ను వివశుణ్ణి చేయుచున్నది. నేను నీకు దాసుడిని. కావున నాయందు దయయుంచుము.”
“ఓ రాజా! మీరిలా మాట్లాడటం భావ్యంగా లేదు. మాట్లాడటం సరి కదా, మనస్సులో ఈ ఆలోచన పుట్టడం కూడా తప్పే. నీవు రాజువు కాబట్టి అందరికీ తండ్రి లాంటి వాడివి. ఆ విధంగా నేను నీ కూతురితో సమానం. మా తండ్రి నీకు గురువు. ఆ విధంగా నీకు నేను సోదరితో సమానం. పైగా నేను బ్రాహ్మణ కన్యను. నీవు క్షత్రియుడవు. కాబట్టి నీ కోరిక అంగీకరించడం సాధ్యం కాదు. పుత్రిక, సోదరి ఎడల చెడు ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఆ ఆలోచనలు నీ మనస్సు నుండి పారద్రోలి మా తండ్రి గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించండి.”
“కానీ నా మనస్సు నా ఆధీనమునందు లేదే. ఈ సంబంధం అనుచితమైనదని నాకు తెలుసు. కానీ నా మనస్సు నీయందు చిక్కుబడిపోయింది. నీయందు అమితమైన అనురాగం ఏర్పడిపోయింది. ప్రేమ గుడ్డిది కదా.దానికి నియమమనేది ఉండదు.”
“రాజా ప్రేమ అనే శబ్దానికి కళంకము తేవద్దు. నీ పని అధర్మము, అనుచితము. తెలిసి తెలిసి విషం కోరుకుంటున్నావు. ఈ విషయం గురించి మా తండ్రి గారికి తెలిస్తే మిమ్మల్ని సర్వ నాశనం చేయగలడు. నీ చావును నీవే కొనితెచ్చుకుంటున్నావు. నేను ఇంకనూ రజస్వల కాలేదు. ఏ విధంగా చూసినా ఇది సాధ్యం కాని పని. నీ మంచికోరే చెబుతున్నాను. దయచేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి.”
కానీ ఆ రాజు కళ్ళను కామపు పొరలు కమ్మివేసినవి. “నేను చనిపోయినా పరవాలేదు. కానీ నీతో ఒక్కసారి సుఖిస్తే చాలు. ఈ రాజ్యము, ధనం నీతో పోలిస్తే నాకు తృణప్రాయము.”
ఆమెకు కోపం వచ్చి. “ఓరీ నీచుడా! పో అవతలికి!! ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తావా?” అని చెప్పి వడివడిగా అవతలికి పోసాగింది.
ఆ రాజుకు వివేకం పూర్తిగా నశించింది. ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుని వచ్చి, ఆమె ఏడుస్తున్నా బలవంతంగా అనుభవించాడు.
అనంతరం భయపడి గుర్రమెక్కి పారిపోయాడు.ఆమె తలవంచుకుని ఏడుస్తూ, కేకలు వేస్తూ తండ్రి ఆశ్రమాన్ని చేరుకుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొన్నాడు. ఆ రాజు మీద మిక్కిలి కోపం వచ్చింది.
ఆ క్రోధావేశమున కన్నుల నిప్పులు రాలుచుండగా,
“ఏ క్రూరకర్ముడు, నీచుడు, నికృష్టుడూ, కాముకుడూ అయిన రాజు ఇట్టి దుష్కార్యమొనర్చినాడో వాని రాజ్యము నశించు గాక! వాని రాజ్యమందు పశు పక్ష్యాదులు సైతం నివసించుకుండు గాక! ఏడు దినములు ఏకధాటిగా వర్షము కురియు గాక! అచ్చట వృక్షములు కూడా మొలచకుండుగాక.” అని శపించాడు.
తరువాత కూతురి వంక తిరిగి “నీవు ఇచటనే తపమాచరించి విశుద్ధవు గమ్ము!” అని చెప్పి ఇతర మునులతో సహా వేరొక ప్రాంతమునకు వెళ్ళిపోయాడు.
ఆయన శాపమునకు తగినట్లే దండకుని రాజ్యములో ఏడు దినములు, ఏడు రాత్రులు కుండపోత వర్షం కురిసింది. అతని రాజ్యం, మంత్రులూ, సైన్యం, కోశం, సర్వం నశించింది. ఆ రాజ్యం వనమైపోయింది. చాలా కాలందాకా అక్కడ పక్షులు కూడా నివసించలేదు. ఆ వనమే దండకారణ్యము.
చాలా కాలం తర్వాత శ్రీరాముని దర్శనా లాలసతో కొంతమంది మునులు వచ్చి అక్కడ కుటీరాలు నిర్మించుకున్నారు. చెట్లు కూడా మొలిచాయి. శ్రీరామచంద్రుడు అవతారము ధరించి సీతా సమేతంగా అక్కడికి వచ్చినపుడు ఆ ప్రదేశానికి శాప విముక్తి కలిగింది.
ఇదీ కామానికి లోబడి సర్వనాశమైన దండకుని కథ!!
తెలుగువాహిని: మొన్న అనుష్క, ఇప్పుడు థమన్, ప్రభాస్ రెబల్ నుంచి తప్పుకుంటున్న స్టార్స్.
శరత్ 'కాలమ్': ఈ అర్ధరాత్రి నేను ఎందుకు లేచి వున్నానంటే...
వసంతం: కాన్సర్ని దూరం పెట్టేందుకు మార్గాలు – keep away “Cancer” some Tips
సం"గతులు" (జాన్హైడ్ కనుమూరి): నాయెడల దేవునికి అద్భుతమైన ప్రణాళిక కలిగి నన్ను ఆదుకున్నాడు.
బాగు www. baagu.net: ‘ పోగాక్కు ఋణం, ప్రాణం పణం’
‘ పోగాక్కు ఋణం, ప్రాణం పణం’

పొగాకు గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి?
పొగాకు ( tobacco ) మహమ్మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మరణాలకు కారణ మవుతూంది. ప్రత్యక్షంగా పొగాకు పీల్చే వారే కాకుండా పరోక్షంగా ఆ పొగాకును, వారి చుట్టూ ఉండి ఆ పొగను పీల్చే వారు కూడా అనేక శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడుతూన్నారు. అందుకే చాలా పాశ్చాత్య దేశాలల్లో బహిరంగ ప్రదేశాలల్లో పొగ తాగటం నిషేధించారు.
దీర్ఘ కాలం పొగ పీల్చటం వల్ల ఊపిరి తిత్తులు ముఖ్యంగా పాడవుతాయి. ఆస్త్మా, ఊపిరితిత్తుల కాన్సర్, ఉబ్బసం, మొదలయిన వ్యాధులు మనిషిని బాధ పెట్టడమే కాక , మృత్యువు కు కూడా కారణం అవుతున్నాయి. రక్తనాళాల్లో దీర్ఘ కాలం పొగ తాగటం వల్ల వచ్చే మార్పులు, రక్త పీడనమూ ( B.P. ), హార్ట్ అట్టాక్ , గుండె జబ్బు, పక్ష వాతమూ మొదలయిన జబ్బులకు హేతువు అవుతున్నాయి. అన్న వాహిక ( oesophagus ), మూత్రాశాయాలల్లో వచ్చే కొన్ని రకాల కాన్సర్ కూడా దీర్ఘ కాలం పొగ పీల్చడం వల్ల నేనని పరిశోధనల వల్ల తెలిసింది.అసంఖ్యాక మయిన జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాక,
ఆర్ధికంగా కూడా ప్రతి కుటుంబానికీ ఎంతో నష్టం కలిగిస్తూ , పురోగతి ని కుంటు పరుస్తూన్న
ఈ పోగాక్కు ‘ ఋణ పడి ‘ తమ ప్రాణాలనీ, తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాలనూ ‘ పణం’ గా పెడుతున్నారు మానవులు .
అందువల్లనే ప్రతి ఒక్కరూ ఈ పొగాకు కలిగించే నష్టాల గురించి తెలుసుకోవాలి.
పొగాకు చరిత్ర గురించి మొదటి భాగం వచ్చే టపా లో చదవండి.
నా నేస్తమా !: నీలి నింగిలో నిండుజాబిలీ నేల దిగిరావే... నన్నేల మరిచావే
రచన - The Creation: ooVoo - ఉచిత ఆడియో & వీడియో చాట్ టూల్!!
TeluguMovieViews.com: ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వెనుకున్నది ఎవరు?
టాలీవుడ్ లో సినిమా మీద సినిమాలు నిర్మిస్తూ భారీ చిత్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ వెనుక వున్నది ఒక యువనేత అని టాలీవుడ్ లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీస్ లో పైకి కనిపించేది వెంకట్, అచ్చిరెడ్డి అయినా వీరికి భారీగా ఫైనాన్స్ చేసే ఆ యువ నేత వెనుక ఉండి కధ అంతా నడిపిస్తున్నాడు అంటున్నారు.
ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అంటే ‘రాజారెడ్డి మూవీ మేకర్స్’ అని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.ఈ సరికే మీకు అర్ధం అయి వుంటుంది కదా ఎవరనేది.
నా అంతర్వాహిని: నేను "మూడోకన్ను" తెరిస్తే....! ఆలస్యం ఎందుకు కుసుమ సోయగాల పై ఓ లుక్కు వేయండి!
చందమామ: (శీర్షిక లేదు)
మనందరి కోసము: ఎందుకు తీసేస్తున్నావు?
సుమశ్రీ: రాష్ట్ర ఉత్తమాధ్యాపకుడు
చందమామ: (శీర్షిక లేదు)
సరసభారతి ఉయ్యూరు: సరస్వతీ పుత్రుని శివ తాండవం -1 ఆచార్య శ్రీ
సరస్వతీ పుత్రుని శివ తాండవం -1
సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘శివ తాండవం ”అనే అద్భుత కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ”పెనుగొండ లక్ష్మి ‘అనే కావ్యాన్ని రాశారు .వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ”పాఠ్య గ్రంధం ”గా వుంది .అదొక ఆశ్చర్య కర మైన సంఘటన.”ఒక కవి తాను రాసిన పుస్తకం పై తానే పరీక్ష లో జాబు రాయటం” ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం ఆచార్యుల వారికే దక్కింది .వీరి సంస్క్రుతాన్ద్రాన్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు వీరికి ”సరస్వతీ పుత్ర ‘బిరుదు ను ప్రదానం చేశారు .’భావ కవి చక్ర వర్తి ”బిరుదునూ పొందారు .100 కు పైగా గ్రంధాలు రాశారు .15 భాష లలో అనర్గళం గా మాట్లాడ గలిగిన దిట్ట పుట్ట పర్తి వారు .ఆయా భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28 న అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ”పెయ్యేడు ” లో జన్మించారు .
14 ఏళ్ళ వయసు లోనే కవితా లతాంగితో సయ్యాటలాడారు .బాల్యం లోనే ”ప్రహ్లాద చరిత్ర ”ను హరికధ గా చెప్పి న బాల కిశోరం .చిల్లర మల్లర గా తిరిగి ఇల్లు వదిలి వెళ్లి పోయి ,లక్ష్మీ ప్రసన్నం చేసు కోని ,మళ్ళీ గృహ ప్రవేశం చేయటం ఒక అలవాటైంది .జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు చేరారు .అక్కడ స్వామి ”శివానందుల ”వారి అనుగ్రహం పొందారు .అదొక మధురాతి మధురమైన క్షణం .ఆచార్యుల వారి జీవితమే మారి పోయింది .అమోఘ పాండితీ ప్రకర్ష ఏర్పడింది .పండితుల మెప్పు లబించింది .నిజం గానే సరస్వతీ పుత్రులని పించు కొన్నారు .తిరుపతి సంస్కృత కళాశాల లో ప్రవేశం కోసం వెళ్ళారు .ఆదరణ కంటే ,నిరాదరణకు గురైనారు .ఆవేశం కట్టక్లు తెంచు కొంది .ఆశువు గా కవితా గంగాలహరి జాలు వారింది. అందులో ,ఆత్మాభిమానం అంతర్వాహిని గా ప్రవహించింది .ఇది విన్న ప్రిన్సిపాల్ కు ”మైండ్ బ్లాక్” అయి ఆయన పాండితీ గరిమకు పులకించి ప్రవేశార్హత కల్పించాడు .అయితె తాను అనుకొన్న తరగతి లో ప్రవేశం ఇవ్వలేదు .మళ్ళీ ఆశువు లంకిన్చుకొన్నారు .అంతే- కోరిన తరగతి లో చేర్చుకొన్నారు .అదీ ఆచార్యుల వారి పట్టుదల ,ప్రావీణ్యం ,ప్రతిభ ,సామర్ధ్యం .రామ రాజ భూషణుడి వసు చరిత్ర ప్రభావం తో ”ఇందుమతీ పరిణయం ”రాశారు .కాని సంతృప్తి చెంద లేదు .అమిత ధారణా దురంధరులు పిన్న నాటి నుంచే .ప్రఖ్యాత ఆంగ్ల కవుల కవిత్వం అంతా ,నాలుక పై నర్తించేదట .వ్యాకరణ ,అలంకార శాస్త్రాలను మదించి ,సారం పిండేశారు .అంతా స్వయం కృషే .రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు వీరికి స్వయానా మేన మామే. .ఆ వైపు నుంచి కవిత్వం ,పాండిత్యం రస వాహిని గా చేరింది .ప్రాకృత భాష నేర్చారు .మాగధి ,శౌర సేని ,పైశాచీ భాషల పీచ మడచారు .
పెండ్లి -పెటాకులు
19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రోజుల తర్వాత భార్యబాల్చీ తన్నేసింది .”పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ”అని అంత విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు ,వ్యాకరణం పూర్తి చేసిన విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది .వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్టమైన మృష్టాన్న భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్తర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ .సర్వజ్ఞుడు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు .ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధులవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.
ఇంతగా సాహితీ వ్యాసంగం లో మునిగి తేలుతున్నా వారికి ఆనందోప లబ్ది కాలేదు .అష్టాక్షరీ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి మహా సిద్ధి సాధించారు .తులసీ రామాయణం kantho paathame .అష్టాక్షరి ఆయన శ్వాస .త్రిమతాలు కరతలామలకాలు .తాంత్రిక విద్యలో అసాధా రణులు అయారు . .షిర్డీ సాయి బాబా వారిని అనుక్షణం ఆవేశించి వుండే వారట .సాయి నామం తో నిరంతర పునీతు లయ వారు .ఇంత చేస్తున్నా ,మనసు లో ఏదో వెలితి వారిని అశాంతికి గురి చేస్తోంది ”.జిల్లెల్ల మూడి అమ్మ”ను దర్శిన్చిఆమె లోని ”అమ్మ తనం ”బిడ్డ లాగా అనుభ వించారు .కంచి పెద్ద స్వామి ”చంద్ర శేఖర సరస్వతి ”సన్ని దానం ఈ సరస్వతీ పుత్రుడైన పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికి అనుకంప గా వుండేది . శ్రీ మద్రామాయణం ప్రవచనం గా నాలుగు సంవత్స రాలు .గంగా ఝరీ సదృశ్యం గా చెప్పి ,లోతులను తరచి భక్తులను ఆనంద రాసామ్రుతం లో ఓల లాడించి ,తరింప జేసే వారు .
పుట్ట పర్తి వారు ”లోకం తెలియని మేధావి ”.బాల హృదయులు .”వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడు ;;అని అందుకే అన్నారు సి.నా.రే .ఎట్ట కేలకు 1972 లో ప్రభుత్వం ”పద్మశ్రీ ”నిచ్చి గోరవించింది .జ్ఞాన peetha స్థానానికి వారు అన్ని విధాలా అర్హులే .అది వారికి దక్క నివ్వలేదు . .అందుకే వికల మనస్కు లయారు .నాట్యం కూడా చేసి విద్యార్ధులకు నేర్పించే నాట్య విశారదులు కూడా .సకల శాస్త్రాలు వారికి వాచో విదేయాలు .సంస్కృత సాహిత్యం లో భవ భూతి ,,మురారి ,అశ్వ ఘోషుడు వారి అభిమాన కవులు .ప్రాకృత కవుల్లో పుష్ప దంతుడు ,వాక్పతి అభిమానులు .ఆంగ్ల కవి జాన్ మిల్టన్ ఆరాధ్యుడు .”షెల్లీ ”అంటే ”ఆనంద వల్లే” . రవీంద్రుడు అంటే రవి ప్రకాశం తో విరసిన అరవిన్డమే అవుతుంది వారి హృదయం .తులసీ ,సూరదాస్ లను ”తులసీ దళం ”అంత పవిత్రం గాభావిస్తారు .”జన ప్రియ రామాయణం ”ను మాత్రా ఛందస్సు లో రాసి ,భక్త జనాలకు చేరువ చేశారు .హిమాలయ సదృశ బహు భాషా చతురాననుడు ,సరస్వతి పుత్రుడు పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు 01 — 09 -1990 న బ్రహ్మైక్యం చెందారు .
నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం కల్గించింది వారి ”శివ తాండవం ”అనే కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు ఆ కృతి పట్టాభి షేకమైంది .దీన్ని వారు ”ప్రొద్దుటూరు ”అగస్త్యేశ్వర ఆలయం ” లో శివునికి ,రోజూ ,108 ప్రదక్షిణాలు చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ”పుట్టు వైష్ణవుడు -బట్టకట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన కృతి చెప్పటం ”.–
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు: శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం -10 ధ్వజ దత్తుడి కధ -2
శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం -10
– పుష్కర ముని ,ధ్వజ దత్తుడి పై కరుణ చూపాడు . .మంత్రజలాన్ని శిరసు పై జల్లాడు .శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు . .వెంటనే ధజ దత్తుని అశాంతి అంతా త్రుటి లో మాయ మై పోయింది .అక్కడే కూర్చుని ,హనుమ ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని శ్రద్ధ తో జపించాడు .ఎదుట దేదీప్య మాన మైన వెలుగు ప్రకాశించింది .వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్ష మైనాడు .వెంటనే వారిద్దరి పాదముల పై పడి స్తోత్రం చేశాడు
”వేద వేద్య మహా భాగ పురాణ పురుషోత్తమ -తవ సందర్శనైవ దురితం మే నివర్తితం
తవ సందర్శనా దేవ ,యోగినామపి దుర్లభం -బహుజన్మార్జితాత్ పుణ్యాత్ లబ్ధవా నస్మి సాంప్రతం .
అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం -గతాన్యహాని సర్వాణి దుర్దినా నితి మే మథిహ్
యస్త్వం సాక్షాత్క్రుతో దేవో బ్రహ్మా దైరపి దుర్లభం -దేవత్వం ప్రాణి తస్య నమ్ర శిరసా యాచే వరం సాం వ్రతం .
భావస్తే పద పంకజే ,భవతు మే భక్థిహ్ పరా శాశ్వతీ –త్వద్భావ స్తవ భక్త జాల విషయే భూయాత్త దేవాశ్రాయే
స్వాన్తే కాంక్షిత మేవ దేవ హనుమన్నత్వాం పదం ప్రార్ధయే ”
అంటూ మనసు దీరా స్తుతించాడు .హనుమ ధ్వజదత్తుని ఆప్యాయం గా లేవ దీసి సువర్చలా దేవిని చూసి ”సూర్య నందినీ !ఇతడు నా ప్రియ భక్తుడు .గురువు గారి అనుగ్రహం తో నేడు మన దర్శనాన్ని పొంద గలిగాడు .ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురు దూషణ వల్లనే వచ్చాయి .ఇప్పుడు ఇతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను .పూర్వ జనం లో ఇతని పేరు ధర్మ సారుడు .అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడు గా వుండే వాడు .ఎంతో మందికి వేద విద్య నేర్పాడు .ఒక సారి శిష్యులను వెంట తీసుకొని అడవికి పుష్పాలు ఫలాలు దర్భలు తీసుకు రావ టానికి వెళ్ళాడు .కొంత దూరం వెళ్ళ గానే అక్కడ ”భరతుడు ”అనే రాజు ,నిశ్చల చిత్తం తో జితెన్ద్రియుడై ,”హనుమ సప్తాక్షరి ”మంత్రాన్ని బిగ్గరగా ,అతి వేగం గా జపిస్తుండడం గమనించాడు .రాజు దగరకు వెళ్లి ”మంత్రాన్ని అంత అ గట్టి గా జపిస్తావేం ?”అని కోప పడ్డాడు .రాజుకు బాహ్య స్మ్రుతి లేదు .తదేక ధ్యానం లో వున్నాడు .ఇలాంటి మూడ్హుడు కి ఏమి చెప్పినా నిష్ఫలం అనుకొంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు .
కొంత దూరం లో శిష్యులతో వస్తున్న ”మృకండ మహర్షి ”దర్శనమిచ్చాడు .ఋషిని ప్రసన్నం చేస్సుకొని ,ఆయన అనుగ్రహం తో హస్తన్యాస కరన్యాసాలు తో ”సప్తాక్షరి ”ని ఉపదేశం గా పొంది ,జపించాడు .యెంత కాల మైనా మంత్ర సిద్ధి కలుగ లేదు .మంత్రం మీద ,గురువు మీద కోపం వచ్చి దూషించాడు .మంత్రోపాసన మానేశాడు .గురుదూషణ,మంత్ర త్యాగం చేసిన ఈ ధ్వజ దత్తుడే ఆ నాటి ధర్మ సారుడు .ఈ జన్మ లో గురువు అనుగ్రహం పొంది ,మన దర్శనం తోపాపాలన్నీ పోగొట్టుకొని,కోర్కెలను జయించిన వాడు అయ్యాడు .యితడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవా టానికే తపస్సు చేశాడు .కనుక అనుగ్రహించి ఇతడిని భాగ్య వంతుడిని చేయాలి .ఈ నీ పుత్రు డికి ఐశ్వర్యం ప్రసాదించు ”అని కోరాడు
సువర్చలాదేవి సరే నని అనుగ్రహించింది .మళ్ళీ గురువును దర్శించి ,అనుమతితీసుకొని ఇంటికి వెళ్ళ మని ద్ధ్వజ దత్తుడికి చెప్పి సువర్చ లాంజనేయులు అడ్రుష్యమైనారు . అతడు పుష్కర గురువును దర్శించి ,అనుగ్రహం కోసం పాదాల పై పడ్డాడు .ఆయన ఆప్యాయం గా లేవ నెత్తి ”దత్తా ! జరిగినది అంతా నాకు తెలిసింది .ఇంటికి వెళ్లి సుఖం గా వుండు ”అని దీవించి పంపించాడు
ధ్వజ దత్తుడు గురువుకు మాటి మాటికీ నమస్కారం చేస్తూ వెళ్ళ లేక , వెళ్ళ లేక ఇంటి ముఖం పట్టాడు .ఇంటి దగ్గర కు రాగానే తానుండే ఇల్లు మారి పోయి ,అక్కడ దివ్య సౌధం కనిపించింది .బంగారపు కాంతి తో అది ధగ ధగ లాడు తోంది .మేడ మీద వున్న అతని భార్య ”శీలా దేవి ‘ సంతానం తో సహా ’కిందికి దిగి వచ్చి ,భర్త కు స్వాగతం చెప్పి ,ఆయన పాదాలకు నమస్కరించి ,పాదోదకాన్ని శిరసున చల్లు కొన్నది .బంధుగణం అంతా వచ్చి చేరి ,అపూర్వ స్వా గతం పలికారు .ద్వజ దత్తుడు తమకు ఈ సంపద లభించ టానికి గురువు అనుగ్రహం ,శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయం గా వివ రించాడు .ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమం లో వున్న పుష్కర మునియే గురువు అని నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు .తమ కందరకు రక్ష, హనుమంతుడే నని చెప్పాడు .అంతా చాలా సంతోషించారు .అందరు ”ఆంజనేయ పాహిమాం ,ఆంజనేయ రక్షమాం ”అంటూ ,అక్కడి నుంచి వెళ్లి పోయారు .ధ్వజ దత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కల కాలమ్ జీవించి దాన ధర్మాలు చేస్తూ ,చివరికి శ్రీ హరి లో ఐక్యమయాడు .ధ్వజ దత్తుడి కధ సంమాప్తం .తరువాత ”కపిలుని కధ ”ఇంకోసారి తెలుసు కొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –04 -02 -12
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు
జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో పత్రిల సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్లు వృత్తి నిర్వహించడంలో తమ అసహాయతను వ్యక్తం చేసారు. పులివెందుల పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన దివాకర్ అనే వ్యక్తిని కొనఊపిరితో 108 సేవల ద్వారా చేర్చారనీ, వైద్యం చేస్తుండగానే అతను మరణించాడనీ వారు తెలిపారు. అయితే, జగన్ వర్గ గూండాలు దివాకర్ మృతికి తామే బాధ్యులమని ఆరోపిస్తూ దాడికి దిగారనీ, బూతులు తిడుతూ ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారనీ ఆరోపించారు. ఒ.పి విభాగంలో ఆద్దాలు ధ్వంసం చేశారనీ, సిబ్బందిని బెదిరించి భయ భ్రాంతులకు గురి చేశారనీ ఆరోపించారు.
రోగికి మెరుగైన చికిత్స చేయడానికే తాము ప్రయత్నిస్తామనీ, కాని ప్రాణాలు కాపాడడం పూర్తిగా డాక్టర్ల చేతిలో ఉండదన్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. సుధాకర్ మృతి విషయంలో విచారణ జరిపించుకోవచ్చుననీ, తమ తప్పు ఉన్నట్లు తేలితే తాము వైద్య వృత్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్లు ప్రకటించారు. తమపై దాడులకు పాల్పడినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పులివెందుల లో వైద్య వృత్తి చేయాలంటే భయంగా ఉందనీ, తమను బదిలీ చేసి, విముక్తి చేయాలనీ డాక్టర్లు పత్రికల సమావేశంలో కోరారు.
తండ్రి మరణానికి తట్టుకోలేక మరణించినవారిని ఓదార్చే పేరుతో రాష్ట్రం అంతటా ఎడతెగని పర్యటనలు చేస్తున్న జగన్మోహన రెడ్డి తన అనుచరగణం వల్ల బాధితులైన వారిని కూడా ఓదార్చడానికి మరొక యాత్ర తలపెడితే బాగుంటుంది. ఆ యాత్ర పులివెందుల నుండే ప్రారంభించవలసిన అవసరాన్ని పులివెందుల ఆసుపత్రి డాక్టర్లు ఎత్తి చూపారు. హృదయ విదారకమైన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటున్న జగన్ పుత్ర హృదయం సంగతి రాష్ట్ర ప్రజలకు ఓ భారంగా పరిణమించగా, ఆయన ఇలాకాలోని రౌడీలు పులివెందుల ఉన్నది ప్రజాస్వామ్యం కాదనీ, రౌడీ రాజ్యం మాత్రమేననీ చాటి చెబుతున్నారన్నమాట!
Filed under: సమాజం, సంస్కృతి Tagged: జగన్ గూండాలు, రౌడీ రాజ్యం
నాలో నేనే ...: ఒక మిత్రుడు , నేను
మీ కోసం: 1922 లోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్...?....వీడియో
All Books showing latest- Kinige: ద్రౌపది by Dr. Yarlagadda Lakshmi Prasad
మీ కోసం: బిలియనర్ అనే అనుభూతి కావాలంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండాలి...ఫోటోలు
తెలుగు పాటలు: భారతదేశం భువికి స్వర్గం... ఇక్కడ పుట్టిన శిశువు యన్ ఆర్ ఐ...
లిఖిత: ఇక
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ETV 2 సఖిలో నిన్న(3 ఫిబ్రవరి 2012) ప్రసారమైన నా సఖి.కామ్ ప్రోగ్రామ్ ఇది
My VALUABLE LESSONS: నా బ్లాగ్ అడ్రెస్ మారిందోచ్చ్..!
Lahari.com: ఆమె అతనికి ఏమవుతుంది
కృష్ణవేణీతీరం: నీ కేరింతల నడుమ నడయాడిన నాకు
పని లేక..: కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం
గుండె ఘోష: తెలంగాణ ద్రోహులపై చార్జిషీట్
Na shodhana: (శీర్షిక లేదు)
వెన్నెలదారి...venneladaari: క్రీనీడల మాటున...
పిచిక గూడు: ఎందుకలా?
శ్రీదీపిక » koodali: అయోధ్యకాండ సర్గ 3
" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర: నా స్మృతి పథంలో ..
2012-02-04
కం. ఓడుతు పోతున్నారని
వాడల వాడలను తిట్ల వర్షాలాయే
నేడొకటి గెలవగానే
తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ
very nice because you show real human service. I like it
శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.
మానవ జన్మ ఎత్తినందుకు మానవ సహజమైన ధర్మాలను పాటిస్తూ, మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవాలి ఆత్మ అందరిలో ఉన్నఆత్మ ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిమనస్సును లో ఆత్మపై లగ్నం చేసిన అదే జీవబ్రహ్మైక్య రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం. లేదు అనుభవం కూడా సత్యమైనదే. అది ఆత్మమే అనుభవం
అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.
మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని ఉన్నఆత్మ ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిమనస్సును లో ఆత్మపై లగ్నం చేసిన అదే జీవబ్రహ్మైక్య రహస్యం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.
జగద్గురు అంటే ఆత్మఅతీతమైనది ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిగ్రహించాలి.
మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది?
ఆత్మకు ఆత్మయే గురువని, తన ఆత్మ సూచించే .సన్మార్గాన్ని అనుసరిస్తే ముక్తిని పొందవచ్చన్నాడు
అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా ముక్తిని పొందవచ్చన్నాడు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి.. మన మనస్సుని ఆత్మలోనికి తిప్పితే అప్పుడు మన మనస్సు ఆత్మలో కలిసి పోతుంది.
baga chepparu pateedi rajkeeya konam lo chustunnaru …chala mandi peddalu
ma “manchammai” gurinchi e madhya rayadam ledu meru, idemantha manchiga ledu. malli manchiga rayandi pls.
- o pichhi manchodu.
chaalaa bagundi……..thanks to prajaa kavi
cinema nativityki daggara ga untundi…tanmayi baga chesindi.
sir am Telugu person but unable to type in Telugu using these keyboards other wise want to explain in Telugu,
I understod the life cycle of Earth is fixed but it’s rotation is always fixed, like Human life is just like cycle he ll always rotate in his dreams and the same life, The story explain how to think







