2009-07-03
సహచరుడు: వానా వానా వందనం
Dr. Acharya Phaneendra: ఎర్ర తామర పువ్వు

ఎర్ర తామర పువ్వు
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా. ఆచార్య ఫణీంద్ర
నల్లని గడ్డమున్, సునయనంబుల కుంకుమ కాంతి, చేతిలో
విల్లును గల్గినట్టి ఘన విప్లవ వీరుడు; భారతాంబకున్
తెల్లని వారి ఆగడము తీర్చగ దీక్షను బూనినట్టి ఆ
” అల్లురి రామరా ” జితడె ! అంజలి సేయరె గారవించుచున్ !
నేటికి నూర్వత్సరముల
చాటున పరికింప _ ఆంధ్ర చరిత పుటలలో
మేటి, స్వరాజ్యముకై పో
రాటము సేయంగ రామరాజై పుట్టెన్ !
చదువుతోబాటుగా స్వారాజ్య కాంక్షనే
అమిత శ్రద్ధ గలిగి అభ్యసించె _
బెంగాలు, పంజాబు పెద్దలన్ దర్శించి
స్వాతంత్ర్య సంగ్రామ సంగతి గనె _
పస గల్గు ప్రాయమ్ము పణమొడ్డి, ఆంగ్లేయ
ప్రభుత నణచివేయ ప్రతిన బూనె _
వలచిన దానినిన్, వైవాహికాదులన్
వదలి వనాంతర వాసియయ్యె _
గిరిజనావళి నొక గీతపై నిలబెట్టి,
తాను గూడ చేత ధనువు బట్టి,
సైన్య మొకటి జేసి, సమర శంఖము నూది
ఆంగ్ల ప్రభుత గుండె లదరగొట్టె _
” మిరప సందేశము ” ల జైళ్ళ మీద పంపి,
దాడి వార్తల పుట్టించి ” దడ దడ ” లను;
అటులె దండెత్తి, గొనిపోయి ఆయుధముల,
ప్రక్కలో బల్లెమయె నాంగ్ల పాలకులకు _
” చిప్పలు చేతబట్టి ఇట చేయగ వర్తక మేగుదెంచి, మా
తప్పుల కారణాన మము దాసుల జేసియు నేలుచున్న మీ
గొప్పలు చాలునింక ! మిము గొంతులు కొయ్య ! దురాత్ములార ! ఛీ !
కప్పము, పన్నులంచు మము కట్టుమనం గెటు సిగ్గు లేదొకో !
నేలయు మాదే ! పీల్చెడు
గాలియు మాదే ! శరీర కష్ట ఫలితమౌ
కూలియు మాదే ! ఇంకన
దేలా పన్నులును, కప్ప మీవలె మీకున్ ?
పోరా ! ఈ భరతావనిన్ విడిచి పొమ్మం ” చు గర్జించుచున్
పోరాటంబును వీర సింహమయి పెంపుం జేసె ” నల్లూరి ” ; తా
” మే రీతిన్ పడగొట్టుటా యతని ” నం చింగ్లీషువారల్ మహా
ఘోరాలోచనలందు మున్గి రకటా ! క్రూరాత్ములై, ఉగ్రులై !
అంత నొకనాడు …
ఉదయ సంధ్య వేళ ఉద్యమకారుండు
ఇతరు లెరుగనట్టి యేటి లోన
వక్షమందు గల్గు వస్త్రాదులన్ విప్పి
స్నానమాచరింప సాగిపోయె _
కంట బడని ఆ యేటిని
ఒంటరిగా నతడు స్నాన మొనరింపంగన్ _
తుంటరి యొక డెరిగింపగ
కంటకులై చుట్టుముట్టి కాల్చి తుపాకుల్ _
చిట్టడవిని మసక చీకటిన్ తీసిరి
తెల్ల దొరలు దొంగ దెబ్బ నటుల _
తూట్లు పడెను మేను తూటాలు దూరగా _
రాజు దేహమయ్యె రక్త మయము !
” నలుగురు గూడి ఒక్కనిని, నన్ను నిరాయుధు జేసి, ఒంటిగా
జలముల నున్న వేళ నిటు చంపిన చంపితిరేమొ గాని ! ఈ
వెలువడు రక్త బిందువులు విప్లవ మూర్తుల రూపు దాల్చి, మీ
తలలను ద్రుంచి, మా భరత ధారుణి స్వేచ్ఛను బ్రోవకుండునే ! “
అని శపించి కఠిను లాంగ్ల జాతీయులన్;
చిందు రుధిరమంటు చేతులెత్తి,
భారతాంబ కమిత భక్తితో కడసారి
ప్రణతులిడెను దేశ భక్త వరుడు _
” జన్మించితి నీ ఒడిలో _
జన్మము ధన్యంబు నిట్లు జన్మించుటయే !
మున్ముందు నిటులె తల్లీ !
జన్మింపగ నెంతును ప్రతి జన్మము ” ననుచున్ _
భరత మాత కంట బాష్పాలు రాలగా
కనులు తేలవేసి మునిగె నీట _
ఏటిలోన తేలె ఎర్ర తామర పువ్వు !
విప్లవమున కతడు విత్తనమ్ము !
( 4 జూలై 2009 నాడు విప్లవ వీరుడు ” అల్లూరి సీతారామరాజు ” 112 వ జయంతి సందర్భంగా నివాళిగా … )
___***___

జీవని: jeevani activities
అమ్మ ఒడి: నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] -21[Expose నే ఎందుకు చేయాలి?]
Hyderabad Book Trust: ”నేను మేధావుల మధ్యన సెక్స్ వర్కర్ని”…. నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ … భూమిక సౌజన్యంతో ...
కోణమానిని తెలుగు ప్రపంచం: అరవై లక్షల గుర్రం స్వారీ!
పలక బలపం: ప్లాట్ఫారం నెంబర్ వన్..!! (కవిత)
2009-07-02
దీప్తి ధార: కుక్క కుంటితే
శ్రీమదాంధ్రమహాభారతము-ఆణిముత్యాలు: కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
సాహితీ-యానం: సూఫీ కవిత్వం - - రూమి
ప్రసన్నశారద: ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 1
ప్రసన్నశారద: ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 2
ప్రసన్నశారద: ఈనాటి కవిత్వ సంభావనం మహాకావ్య శిఖరాలదాకా - part 3
"కృష్ణశ్రీ": 'కొవ్వు ' ప్రతినిథులు
ఆనందిని: మన ఎంపిలు మహా....................నుభావులు
ఆనందిని: రైల్వేల్లో మనకు న్యాయం జరిగే అవకాశమే లేదా?
ఆనందిని: ఎంఎంటిఎస్ రెండో దశకైనా మోక్షం లభిస్తుందా?
సినిమావినోదం: అల్లు అర్జున్ తల్లిగా వెటరన్ నటి
తేజస్వి: యజ్ఞం
వర్షాలు కురవడానికి వరుణ యాగం, ప్రపంచ సుఖ శాంతుల కొరకు విశ్వ శాంతి యాగం, ఇంకా అతిరుద్రమహా యజ్ఞం , ఇంకా మరెన్నో…… తి.తి.దే, సాయి బాబా, ఇంకా మరిన్ని ధార్మిక సంస్థలు ఇటువంటి యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. ఇటువంటి యజ్ఞ-యాగది-హోమ కృతువులు మన పూర్వీకుల కాలం నాటి నుంచి మనం ఆచరిస్తున్నదే.
‘అయినా ఓ యాగం చే(సే)సినంత మాత్రాన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయా? మేం నమ్మం’ అని లౌకిక వాదం మనకి వినిపిస్తూ ఉంటుంది.
నిజమే. ఆలోచించాల్సిన ప్రశ్నేగా ఇది! యాగంలో ఏముంటాయి? మంత్రాలు. ‘రక్షించగల శక్తి కలిగిన మాటల్నే మంత్రాలు‘ అంది వేదం. తప్పు చేస్తున్న పిల్లవాణ్ణి ‘కూడదు‘ అన్నట్టుగా తల అడ్దంగా ఆడించగానే వాడు ఆ పనిని మానేస్తున్నాడు. ఎందుచేత అంటే అక్కడ ఆ పిల్లవాణ్ణి మన చేష్ట ఆ పనిని చేయకుండా అపేసిందన్నమాట.ఇక్కడ వాక్కులోని శక్తి ఆ పని నుంచి ఆ పిల్లవాణ్ణి ఆపేసింది.
ఈ విధంగా నేను యజ్ఞం గురుంచి వర్ణించదలుచుకున్నాను. బాబా చిత్రంలో రజనికాంత్ చెప్పినట్టు “తెలిసింది గోరంత, తెలుసుకోవలసినది కొండంత“. మరి నేను యాగం గురుంచి ఇంకా చాలా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. ఎలా అంటారా …. మరి మీకు తెలిసినదంతా దయచేసి నాకు తెలయపరిచండి.

రాజు గారి బ్లాగు: ఎందుకు సార్ పాత గాయాన్ని రేపుతారు ?
వాలు కొబ్బరిచెట్టు: బ్రతకనివ్వండి.....
హరిసేవ: నవగ్రహాల శక్తులు- మన అపోహలు.
నరసింహ: అంతటరాజు శాంతమృదుహాసముఁ జేసెను శాంతఁ గాంచుచున్
హరివిల్లు: యువ తరం
తెలుగు పరిశోధన: 1000 సభ్యులు 1000కి పైగా పోస్ట్స్
స్వర్ణముఖి: సింగీతమ్ శ్రీనివాసరావు
పంచాయితీ: స్వ.లి౦.స౦
DATTA VEDAM: గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-2
భగవాన్ స్మృతులు: ...దించిన పాపపు మూటని, భుజాన పెట్టుకొని వెళ్ళిపోతాడు
క్రీడారంగం: ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఇంత వరకు టాప్:3indian Batsmens,bowlers
ఉద్యోగ అవకాశాలు: పనికొచ్చే పంచతంత్రం
అదంతే!!: గిన్నిరొట్టె కధా కమామిషు!!
Madhuprabhasa: మధుర బ్రాంతి
మనసులొ కురిసిన వెన్నెల: ఓ కవిత్వమా...
జురాన్ సినిమా: హిట్టా? ఫట్టా? : చిరంజీవి మాటల్లోనే హింట్
చిరంజీవి సినిమా అంటే మమూలు గా నే ఆంధ్రా లో బాగా క్రేజ్. సినిమా హిట్టా, ఫట్టా అనే దానికి సంబంధం లేకుండా బాగా ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే సినిమా హిట్టవుతుందా ఫట్టవుతుందా అనేది సినిమా లో పనిచేసిన వాళ్ళకి జనరల్ గా ఒక ఐడియా ఉంటది (అయితే వాళ్ళ అంచనాలు కూడా ఫెయిల్ అవ్వడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది). చిరంజీవి సినిమాలు రిలీజ్ అవడానికి ముందు జరిగే ఆడియో ఫంక్షన్స్ ని బాగా గమనిస్తే, సినిమా హిట్టా ఫట్టా అని గనక చిరంజీవి కి ముందే ఒక ఐడియా ఉంటే చిరంజీవి మాటల్లో ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది..
ఎందుకంటే- ‘జానీ ‘ సినిమా రిలీజ్ కి ముందు చిరంజీవి ఒక పేద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా వచ్చింది అంటే – “బాగా రాలేదు” అని బయటికి చెప్పలేక – “టెక్నికల్ గా బాగా వచ్చింది” అన్నాడు. ఆ సమాధానం తో తృప్తి చెందని విలేఖరి ఎన్ని సార్లు అదే ప్రశ్న ని ఇటు తిప్పి అటు తిప్పి అడిగినా ఒకటే సమాధానం- “టెక్నికల్ గా బాగుంది”. ఆ రోజే అనుకున్నా – జండా పై కపి రాజా అని. ఆ తర్వాత “అందరివాడు” అనే సినిమా ఆడియో రిలీజ్ చేసేటపుడు – సినిమా గురించి మాట్లాడకుండా కావాలనే – “గోవింద రాజు క్యారెక్టర్ ని ఎవరూ అనుకరించకండి, ఇది కేవలం పాత్ర రీత్యా ఆ క్యరెక్టర్ ని తాగుబోతు లాగా చూపించాం” గట్రా గట్రా మాట్లాడాడు. జై చిరంజీవ అప్పుడు కూడా – “మంచి వ్యక్తులతో పని చేసిన అనుభూతినిచ్చింది ఈ సినిమా” అంటాడే కానీ మంచి సినిమా తీసారు మా వాళ్ళు అనడు. స్టాలిన్ సంగతి గుర్తుండే వుంటుంది..”కమర్షియల్ గా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే మంచి సినిమా తీసామన్న తృప్తి మాకందరికీ ఉంది” అన్నాడు. ఇంక చిరుత కి ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి కొంచెం గెస్ చేద్దాం అనుకుంటే, తెలివి గా ఆడియో ఫంక్షన్ లేకుండా చేసారు. కొంత లో కొంత పాజిటివ్ గా మాట్లాడింది జల్సా సినిమా కే.
ఈ నేపథ్యం లో – మొన్న మగధీర ఆడియో ఫంక్షన్ లో ఏం మాట్లాడుతాడో అని జాగ్రత్త గా చూసాను. చాలా రోజుల తర్వాత చిరంజీవి పూర్తి గా పాజిటివ్ గా మాట్లాడాడు. రాజమౌళి ని నంబర్ 1 డైరెక్టర్ అన్నాడు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడాడు. పాటల గురించి ఏమీ మాట్లాడకుండా ఓన్లీ సినిమా బాగా వచ్చింది అన్నట్టు మాట్లాడాడు. మరి నిజంగానే సినిమా అంత బాగా వచ్చిందా? వాళ్ళు అంచనా వేసినట్టు గానే జనాలకి కూడా ఎక్కుతుందా? అనేది తెలియాలంటే – ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!!!
Posted in హాట్ గురూ..!
సముద్రం: మధుర బ్రాంతి
కోణమానిని తెలుగు ప్రపంచం: కోటి ప్రణామములు!
వాగ్విలాసము: భార్యాచతుష్టయము
ఆలోచనా తరంగాలు: జ్యోతిషం సైన్సు కాదు
అరుణమ్: ఈమాట పత్రికలో నా కథ
నవ్వులాట: ఇరవై
సందేశం: ప్రపంచపు అంచులపై జీవితం: ఫొటొలు
lahari.com: సమ్మర్ కేంప్ అయిపోయింది.
రాతలు - కోతలు: తప్పక చూడవలసిన సినిమా, నింగీ-నేలా, నాదే!
రేపు విడుదలవుతున్న నింగీ, నేలా, నాదే- అనే సినిమాను అందరూ, పిల్లలూ, పెద్దలూ, మొత్తం కుటుంబ సభ్యులూ అందరూ కలసి తప్పనిసరిగా చూడవలసిన సినిమా.
ఇది, చైనా సినిమా ఇన్విసిబుల్ వింగ్స్ కు తెలుగు తర్జుమా.
ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోతుంది. అయినా, అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని, తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అవసరంలేదని, ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది. అంగవైకల్యం శరీరానికేననీ, మనోశక్తితో అన్ని వైకల్యాలను అధిగమించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చనీ నిరూపిస్తుంది.
ఈసినిమా చూస్తూంటే ప్రతి చిన్న కష్టానికీ కృంగిపోతూ, న్యూనతాభావానికి గురవుతూ, ఆత్మహత్యలవైపు పరుగిడేవారందరికీ బుద్ధివచ్చి స్ఫూర్తి జాగృతమవుతుంది.
తాము వెనుకబడి వున్నాము కాబట్టి తమకు చేయూతలేనిదే నిలబడలేమని దీనాలాపాలు, ఆక్రందనలు చేసేవారందరికీ, ఆత్మశక్తి, ఇచ్చాశక్తి అనే పదాల అర్ధాలు బోధపడతాయి. మనస్సాక్షి జాగృతమయి సిగ్గిలుతుంది.
మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, అతని ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని నిక్కచ్చిగా చూపుతుందీ సినిమా.
ప్రతి ఒక్కరూ, ఒకతికి రెండుసార్లు చూసి స్ఫూర్తిని పొందవలసిన అద్భుతమయిన సినిమా ఇది.
ఈ సినిమాను చలన చిత్రోత్సవంలో చూశాను. ఇప్పుడిది అనువాదమయి, పాటలు చేర్చుకుని వస్తోంది. చూడండి. ఇతరులకు చూపించండి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు మనకందుతాయి. లేకపోతే, ఎవరూచూడరని. అవే ప్రేమలూ, అవే గెంతులు, పూబంతుల ప్రతీకల కుళ్ళు సినిమాలే మనకు గతి అవుతాయి.

పొగమంచు - డా. సంగుభొట్ల సాయిప్రసాద్ కవితలు: ప్రియమైన తమ్ముడికి
సినిమావినోదం: తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు
24 గంటలు: స్వలింగ సంపర్కం చట్టబద్దమే
Padmarpita: ఆనంద ఊయల!
24 గంటలు: ప్రజల 'రైలు'
రాజు గారి బ్లాగు: యమేజింగ్ హౌసెస్ ఇల్లు
పరిమళం: గోరింట పూసింది...అరచేత !
soumyabhaavalu: వన్ నైట్ @ ద కాల్ సెంటర్
సౌమ్య: పుస్తక భాండాగారాల వేటలో..
పుస్తకం.నెట్ కోసమని జూన్ నెలలో పుస్తకాల షాపులకు బానే తిరిగాము. ఆ తరువాత ఆన్లైన్ లో కూడా జల్లెడ పట్టడం మొదలుపెట్టాము. ఒక విధంగా, ఈ నెలలో చేసిన ఈ ఇంటర్వ్యూలు నాకు పూర్తి కొత్త అనుభవం. అసలు ఇవి ఎందుకు చేయాలనిపించింది? అంటే ఏం చెప్పేది? నాకు కథలు వినడం అంటే ఇష్టం. చదవడం అంటే కూడా ఇష్టమే కానీ, మనుషుల్ని కదిలించి, వారి నోటి నుండి వారి కథలు వినడం – నథింగ్ బీట్స్ ఇట్. 1997 లో మన స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళైనప్పుడు నాకు తెలిసిన అరవైల్లో ఉన్నవారినందరినీ ఇలాగే బగ్ చేసిన విషయం ఇంకా గుర్తుంది. సరే, మనం విన్న కథలే ఇంకా చాలా మందికి కూడా ఆసక్తికరంగా అనిపించవచ్చు అనిపించి – అలా ఈ ఇంటర్వ్యూలు చేయడం, మాటామంతీ కార్యక్రమంలో నేనూ భాగం పంచుకున్నాను.
హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్ళుగా ఉన్న కదంబి, ఏ.ఏ.హుస్సేన్, విశాలాంధ్ర, అబిడ్స్ మార్కెట్ వారితో మాట్లాడటం చాలా మంచి అనుభవం అనే చెప్పాలి. ఎప్పుడూ షాపులకి వెళ్ళడం, పుస్తకాలు తీస్కోడం రావడమే కానీ, వాళ్ళ తరపు కథ వినలేదు. పుస్తకం.నెట్ నాకు ఆ అవకాశం కలిగించిందన్నమాట ఇన్నేళ్ళకి
ఆమధ్య ఆఫీసు లో ఒక సంస్థ పిల్లల పుస్తకాల ప్రదర్శన పెట్టగానే, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు పిల్లల పుస్తకాల ముద్రణ గురించి ఎన్నో సంగతులు తెలిసాయి. అలాగే, యూఎస్ లోని కాంటన్ పబ్లిక్ లైబ్రరీ గురించి రచ్చబండ గుంపులో అనుకుంటా, ఓ వేగు చదివి, దాని ద్వారా వారిని ఈమెయిల్ ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు కొత్త అనుభవం. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళకి భారతీయ భాషల పుస్తకాలను పంపే డీకేఏజన్సీస్ వివరాలు కనుక్కుని వారితో కూడా సంభాషించడం – అక్కడ్నుంచి మళ్ళీ కొత్త సంస్థల గురించి తెలుసుకోడం – కొత్త ప్రపంచం కనిపించింది నాకు. నా చదువు, పని- ఇవి కాకుండా బయటి ప్రపంచంలో ఇంత మందితో ఇలా సంభాషించిన దాఖలాలు లేవు నాకు గత నాలుగైదేళ్ళలో.
పుస్తకం.నెట్ లో నేను పైన చెప్పినవి, మరికొన్నీ – ఇక్కడ చదవొచ్చు, నాలాగా మీకు జ్ఞాపకాల కబుర్లపై ఆసక్తి ఉంటే.

క్రీడారంగం: మూడో వండే టీంస్ InDiA aNd WeSt InDiEs
క్రీడారంగం: సునిల్ గవాస్కర్,కపిల్ దేవ్,బిషన్ సింగ్ బేడి ప్ర్హొఫైల్స్
పుస్తకం: శశిరేఖ - చలం
రాసి పంపిన వారు: నరేష్ నందం, హైదరాబాదు

గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభిమాని ఉన్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యమే. చలంపై మీకెటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. కానీ అతను ఒక ప్రవాహానికి పాదులు తీశాడు. తెలుగు భాషను శాసించాడు. సంఘాన్ని ధిక్కరించాడు. అవసరమైనప్పుడల్లా తన నాయికల గొంతుతో ప్రశ్నించాడు. చలంకు “శశిరేఖ” మొదటి నవలే అయినా అప్పటి సంఘపు నీతి నియమాలను ప్రశ్నించాడు. కానీ అవే పద్ధతులు ఇప్పటికీ కొనసాగటం గమనార్హం. సమాజాన్ని, కట్టుబాట్లను ఒంటరిగా ఎదిరించేందుకు సాహసించిన చలం తన మిగిలిన రచనల్లో ఆ పద్ధతిని కొనసాగించాడు.
చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
“నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి.” (ఆత్మకథలో 74-75వ పుటలు)
అటువంటి చలం 1921లో వ్రాసిన నవల “శశిరేఖ”. నూటయాభైరెండు పేజీల ఈ నవలను సంక్షిప్తీకరిస్తే..
శశిరేఖ- చలం మాటల్లో చెప్పాలంటే ఏమీ తెలియని ముగ్ధ. అప్పుడే మారుతున్న సమాజంలో నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది మొదట్లో. చిన్న వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మతో వాదనకు దిగుతుంది. తనను ఇష్టపడిన రామారావు సీమనుండి వచ్చి తనను వివాహం చేసుకునేవాడు గదా అని ప్రశ్నిస్తుంది. తనకు ఇష్టంలేని వాడితో “కార్యం”కు ఎలా ఒప్పుకోనంటూ నిలదీస్తుంది. థైర్యంగా భర్తతో చెబుతుంది. “నువ్వంటే ఇష్టం లేదు, కార్యం ఇష్టం లేదు, బలవంతం చేయటం న్యాయమా..?” అని. అతను అర్ధం చేసికొనక పోవటంతో కార్యం ముందురోజు రాత్రి తాను ఇష్టపడిన గోవిందపురం లాకుల అధికారి కొడుకు, కృష్ణుడితో ఊరు వదలి వాడపిల్లి వచ్చేస్తుంది.
కృష్ణుడు-శశిరేఖ, ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందాన్ని ఆస్వాదిస్తూ అన్నపానాలను మరచిపోయేవాళ్లు. కృష్ణుడు శశిరేఖ తనతో ఉంటే చాలుననుకుంటాడు. ఆమె కోసం వైద్యవిద్యను మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడే పూసిన మొగ్గల్లే ఉన్న తనని అపురూపంగా చూసుకుంటాడు. ఒకరికి ఒకరు ఎదురు ఉంటే చాలు ఆకలిదప్పులు ఉండవనుకుంటారు. వాడపిల్లిలో ఉన్న కృష్ణుడి మితృడు, డాక్టరు సుందర రావు ఆశ్రయం పొందిన వీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు. మూడేళ్ల తర్వాత తిరిగి సొంతఊరు గోవిందపురం వచ్చేస్తారు, మితృడు సుందర రావుతో సహా!
ఒకనాటి రాత్రి పడవలో షికారుకి వెళ్లినప్పుడు కాలువలో పడిపోతుంది. సుందర రావు దగ్గర వైద్యం చేయించుకుంటుంది. సుందర రావుకి ఆమెపై కోరిక ఉండటం, తనకూ అతనంటే ఇష్టం కలగటం వలన బలవంతంగా అతనితో ఒకరాత్రి గడుపుతుంది. కృష్ణుడిపై ప్రేమ తగ్గిపోయినప్పుడు అతని వద్ద ఉండటం నీతి కాదని సుందర రావుతో ఊరువదలి వచ్చేస్తుంది. తనకోసం ఎదురుచూస్తున్న కృష్ణుడికి తనను మరచిపొమ్మని చీటీ పంపిస్తుంది.
ఈ సంఘటనకు ఉపోధ్ఘాతముగా, చలం అంటాడు.. “ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమె దేహమెక్కడ కందునో అని ఆమెను దేవతగ పూజించు భక్తునితో ఆమెకవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును పిండి, తాగి మూర్ఛనొందించగల ప్రేమనామె వాంచింఛెను. అగ్ని వలె తాపమున దహించు తృష్ణకు, ఉపశమనముగ మహా ప్రళయ, మేఘముల గర్జించు చండవర్షమే కావలెను.”
శశిరేఖతో ఎన్నో అందమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత సుందర రావు బళ్లారిజిల్లాలో ఉద్యోగంలో చేరుతాడు. కాలం గడచిన కొద్దీ, ఆమెను అనుభవించిన కొద్దీ శశిరేఖపై మోహం పోయి ఆమె అతనికి భారంగా కనిపిస్తుంది. అందముగా కనబడేకొద్దీ ఆమెను మాటలతో హింసించాలని చూస్తాడు. చివరికి అతనిపై ప్రేమ మాయమై, అతనిని విడిచి తిరిగి గోవిందపురం వెళ్లటానికి బయల్దేరుతుంది. కానీ సుందర రావుకి ప్రమాదం జరగటం వలన ఆగిపోవలసి వస్తుంది. నెలరోజులపాటు అతనికి సేవలు చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. ఫలితంగా అతను ఆమెతో మళ్లీ ప్రేమగా ఉండాలనుకుంటాడు. సుందర రావుకి వైద్యం చేస్తున్న డాక్టరుని ఎక్కడో చూసిన గుర్తుతో వివరాలు సేకరిస్తుంది. అతనే తనను పెళ్లి చేసుకుంటానన్న రామారావని తెలుసుకుని స్నేహం చేస్తుంది.
రామారావుకి తన గతం గురించి చెప్తుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలో తిరిగే అతను ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. సుందర రావుని వదలి తనతో వచ్చేయమంటాడు. తీసుకెళ్లి వేరే ఇంటిలో ఉంచి పదిహేనురోజుల తర్వాత పెళ్లి అంటాడు. తనతోపాటే ఉంటానంటుంది శశిరేఖ. పెళ్లికి ముందు కలిసి ఉండటం సమాజం హర్షించదంటాడు రామారావు. ఈలోపు సుందరరావు వస్తాడు. పాతవన్నీ గుర్తు చేసి శశిరేఖను చెన్నపట్నం తీసుకునిపోతాడు. ఆమె తనమీద ఆధారపడి ఉన్నదన్న అహంకారంతో మళ్లీ హింసించటం మొదలుపెడతాడు.
సుందర రావుమీద అసహ్యంతో ఇల్లు వదలి వచ్చిన శశిరేఖను బ్రహ్మమత ప్రచారకుడు, నవజివనదాసు ఆదరిస్తాడు. కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్న తర్వాత తనకు తెలిసిన ధర్మారావుతో పెళ్లి చేద్దామనుకుంటాడు. కాని, పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని శశిరేఖ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ప్రేమ లేని చోట తానుండలేనని, పెళ్లి అంటే ప్రేమను వదులుకోవటమే అంటుంది. అడవిలో స్వేచ్చగా తిరిగే చిలుకను పంజరంలో బంధించటమే పెళ్లి అంటుంది.
తన మనసు మార్చేందుకు బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరతాడు నవజీవన దాసు. కలకత్తాలొ జరిగే సమావేశాలకు హాజరైతే ఆమె గతంలో చేసిన తప్పులను తెలిసికొంటుందనీ, ఈశ్వర ప్రేమకు పాత్రురాలవుందనీ తద్వారా.. ధర్మారావుని పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తాడు.
అప్పటికే బ్రహ్మసమాజంలో ఉన్న రామారావు, శశిరేఖను కలకత్తాలో కలుస్తాడు. తనను మోసం చేసిందని నిందిస్తాడు. “నా మనసు నీకే అర్పితం” అంటుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలోని వారిని చూసి ఎంత సంతొషముగా ఉన్నారో అని అనుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేస్తానంటాడు ధర్మారావు. తన మౌనాన్ని అంగీకారంగా భావించిన ధర్మారావు నవజీవనదాసుతో శశిరేఖ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు.
ఈవిషయం రామారావుకి తెలిసి శశిరేఖను నిలదీస్తాడు. తను, “నేను నీ సొంతం” అంటుంది. పెళ్లికి మాత్రం ఒప్పుకోకుండా తనతో ఉండిపోమంటుంది. మగ స్నేహితుల వలే కలిసి ఉందామంటుంది. వివాహమనే బంధం లేకుండా స్త్రీపురుషులు కలిసి ఉండటాన్ని సంఘం హర్షించదంటాడు రామారావు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమంటాడు. చిన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావంటుంది శశిరేఖ. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పమని వెళ్లిపోతాడు రామారావు.
ఆరోజు సాయంత్రం శశిరేఖ రామారావుని శారీరకంగా కూడా కలుస్తుంది. అంతా అయిపోయాక కళ్లుతెరిచిన రామారావు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లి పోతాడు. తన తప్పు తెలుసుకుని తిరిగివచ్చేసరికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. చివరికి అతని చేతిలో కన్నుమూస్తుంది.
———————————————————–
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు ఐదు.
శశిరేఖ, కృష్ణుడు, సుందర రావు, రామారావు, నవజీవన దాసు.
ముందు మాటలో శివశంకర శాస్త్రి అన్నట్లు.. శశిరేఖ ప్రేమైక జీవిని. ప్రేమ లేని చోట తను ఒక్క నిమిషం నిలువలేకపోయింది. రామారావు వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడనుకున్న ఆమే.. పెద్దవాళ్లనెదిరించి కృష్ణుడితో వెళ్లిపోయింది. సుందర రావు ఫిడేలు గానం, తీయని మాటల ప్రభావంతో.. అతనిపై ఆకర్షణ పెంచుకుంది. అందము, సౌందర్యారాధనలొ మునిగిపోయే ఆమె అతని ప్రభావంలో పడిపోయింది. ఆవేశంలో అతను ముద్దుపెట్టి, తర్వాత కోపం ఉందా అంటే లేదని చెప్పింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే ముందు రోజు రాత్రి ఒంటరిగా సుందర రావు ఇంటికి వెళ్లింది. వయసు గారడీ, అతని బలవంతము వలన లొంగిపోయింది. ఉదయం కృష్ణుడి దగ్గరకే వెళ్లమనిన సుందరరావుతో.. “నాకు నీమీద ప్రేమలేకపోతే నా చిటికిన వేలునైనా తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని?” అని ప్రశ్నిస్తుంది. అప్పటి వరకు తననెంతో ప్రేమగా పూజించిన కృష్ణుడిని వదలి వెళ్లుటకు ఇష్టంలేకపోయినా.. అతనంటే ఇప్పుడు ప్రేమ లేదు కనుక ఇంకా అతనితో ఉండటం భావ్యం కాదని భావించింది. సుందరరావుతో ఊరు విడిచి వెళ్లిపోయింది. మోహం తీరిన సుందరరావు కౄరత్వాన్ని చూచిన ఆమెకు అతనిపై ప్రేమ తగ్గిపోయింది. తర్వాతి పరిణామాల వలన చిన్ననాటి మితృడు రామారావుతో కలిసి జీవించాలనుకుంటుంది. అతను పెళ్లికి పట్టుపడితే.. పెళ్లి తర్వాత ఇతను మాత్రం వదిలేయడని ఋజువేంటని ఆలోచిస్తుంది. పెళ్లి అంటే స్వాతంత్ర్యమును కోల్పోవటమేనని, “ఒకవేళ పెళ్లితర్వాత ఇప్పుడున్న ప్రేమ పోతే నన్ను ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తారా?” అని అడుగుతుంది. తప్పనిసరై పెళ్లికి ఒప్పుకున్నా, సుందర రావు బలవంతముతో మళ్లీ అతనితో వెళ్లిపోతుంది. చెన్నపట్నంలో నవజీవనదాసు ఆశ్రయంలో కొన్నాళ్లు సంతోషంగానే గడిపినా, తనకు పూర్వ జీవితమే బాగుందనిపిస్తుంది. కలకత్తాలో రామారావును మళ్లీ కలిసిన తర్వాత అతని ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనిపిస్తుంది. ఓక రాత్రి అతనితో కలిసిన తర్వాత, అతని ప్రేమను తట్టుకోలేక గుండెనొప్పితో కన్నుమూస్తుంది.
కృష్ణుడు అందాన్ని ఆస్వాదించే వాడైతే.. సుందరరావు అనుభవించాలని చూసేవాడు. కృష్ణుడు శశిరేఖ అమాయకత్వాన్ని, అందాన్ని, దోసిలిలో పట్టి ప్రేమగా చూసుకుంటే.. సుందర రావు ఆమె శరీరాన్ని గుప్పెటలో నలిపి వేశాడు. తనను వదిలి వచ్చిన తర్వాత శసి క్షేమం కోరుతూ కృష్ణుడు ఉత్తరం వ్రాస్తే.. సుందర రావు మోహం తీరిన తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటివేసాడు. వీళ్లిద్దరూ భిన్నదృవాళ్లా, నాణేనికి చెరో వైపులా కనిపిస్తారు. శశిరేఖ కృష్ణుడి వద్ద ఉన్నంతకాలం ఆమె కోసం వెంపర్లాడిన సుందరరావు, ఆమె తనతో వచ్చేయగానే ఆమె ఎక్కడికి పోతుందన్న నిర్లక్ష్యము ఏర్పడింది. కొన్నాళ్లకు ఆమె మోయలేని బరువుగా తోచింది. ఫలితంగా ఆమెకు దూరమైనాడు.
రామారావు అప్పటి బ్రహ్మసమాజపు ప్రతినిధి. ఉన్నత విద్యలు చదివినా సంఘం నిర్మించిన చట్రాన్ని, గీసిన గీతను కాదనే సాహసం చేయలేకపోయాడు. చిన్నప్పుడు శశిరేఖకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపించినా, ఒక చెడిపోయిన స్త్రీని బాగుచేశానన్న పేరు కోసమే అతను నడచుకున్నట్లు కనిపిస్తుంది. వెలుతురులో ఎన్నో ఆదర్శాలు పలికే వారు చీకటిలో తప్పులు ఎలా చేస్తారో, నిగ్రహాన్ని ఎలా కోల్పోతారో రామారావు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.
నవజీవనదాసు బ్రహ్మసమాజపు ప్రచారకుడు. తప్పుడుదారిలొ నడచే అమ్మాయిని బాగుచేసి, పాపాలకు పరిహారం చూపి, ఆమెకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశించాడు. ఐతే ధర్మారావుతో ఆమె పెళ్లికి నిరాకరించటం, రామారావుతో సన్నిహితంగా మెలగటం అతనికి కోపం తెప్పిస్తుంది. కాని, ఆమె తన కూతురివంటిదనీ, ఆమె కోరుకున్న జీవితం గడపవచ్చనీ అనే సమయానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రి, కలలో దేవదూతలతో అతను “ఈమె ధన్యురాలు, ప్రేమించినది” అనటం ద్వారా మార్పుని ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది.
రచన - The Creation: TimeLeft - డెస్క్ టాప్ టైమ్ మేనేజ్ మెంట్ యుటిలిటీ
రాజు గారి బ్లాగు: యమేజింగ్ పిక్చర్స్ మీరు తప్పక చూడవల్సినవి
మనసులొ కురిసిన వెన్నెల: వదిలిపొయింది
2009-07-03
కొత్త షాప్ తెరిచి కంప్యూటర్లు, ప్రింటర్లు రిపైర్ చెయ్యడం, ఇన్స్టాలేషన్స్ చెయ్యడం చేస్తూ కూడా సంపాదించగలను.
i saw this movie, please don’t miss it, if you miss it you’ll regret.
As you said those morally bankrupt, lazy people who cry that they were deprived of oppurtunities,
and blackmail and blame the society for their vows should hang themselves to the nearest statue.
2009-07-02
@a2z:
స్నేహితులకు అంతకన్నా పెద్ద సాయాలు చేసేవాళ్లుంటారు. సీతారామ్కి అయాచితంగా వచ్చినదాన్ని స్నేహితుడికివ్వటానికి కారణాలు వివరించటం అనవసరం అనిపించింది.
@ Suman..
I understand … Nee badha naakardamaindi.. ;( ;( ;) ;)
we remember Our loved ones alwayz… however i can’t write a post for each time i remember ;)
I just write that the way i thought on that day… Father”’s day roju post chesinanta maatrana premalo hecchutaaggullo teda undadu… undaledu!
Coming to .. so called DAY to remember… Its the western culture.. as indians also tend to celebrate to this DAY that DAY.. .. ;)
thanks boss..


