2010-07-31
భారతీయం: భారతీయం: ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు
భారతీయం: ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు
ఆంధ్రామృతం: (ఆంధ్ర) ప్రథానోపాధ్యాయులు డా.మెఱుగుమిల్లి కి CMRపురస్కారం.
మా గోదావరి: మా సీతారంపురం కధలూ,కబుర్లు-చిరంజీవి మా బస్ మేట్
అమ్మ ఒడి: జనం పరంగా చంద్రబాబు సువర్ణముఖి! [ఒకే అంశం – విభిన్న కోణాలు -06]
సాహితి: సొరకాయ పాల పిండి మిరియం చెప్పకుండా నన్నెవరూ ఆపలేరు - ఇంక్విలాబ్ జిందాబాద్ !!!!!
Stamps of Andhra: భద్రాచలం - ప్రత్యేక తపాల ముద్ర
శ్రీ-పదములు: ఫొటో జవాబు
అందం కోసం,ఎక్కువ కాలం బ్రతకటం కోసం మైకెల్ జాక్ సన్ ఈ ఆక్సిజన్ చేంబర్ లో నిదురించేవాడు.దీనిని కేలిఫార్నియా మెడికల్ సెంటర్ కు ఇచ్చేసాడు.
సరైన జవాబిచ్చిన వారు:
swapna@kalalaprapancham
welcome2dreamzworldmaster@gmail.com
jokabhiramayanam.blogspot.com
satyaonline@gmail.com
Observer
lndurvasula@gmail.com
sharmavj@gmail.com
121.246.231.226
vijayabhanukote.wordpress.com
rajsamvizzi@gmail.com

సురుచి: పట్టించుకోవడం
వెన్నెల: PG కబుర్లు …..
ఆనందమాయేటి మనసు కథ!!!: మా ఊరిలో రాములవారి కళ్యాణం!
వెన్నెల రాజ్యం: శివలింగం- పురుగు- తెలుగుదేశం
శిరా కదంబం: గిలిగింతల ' అల్లు '
ఆనందమాయేటి మనసు కథ!!!: ఎదలో గానం.. పెదవే మౌనం..
చావా కిరణ్: ప్రేమ జ్ఞాపిక – గీతాంజలి 52
శరత్ 'కాలమ్': కామెంటల్-3
తెలుగిల్లు: (లో)పాలు
ప్రైవేటు డెయిరీ ఏజంట్ల మాటేమోగానీ, హైదరాబాదు నగరంలో విజయ డెయిరీ ప్రతినిధులు మాత్రం వినియోగదారులతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధర వసూలు చేయటం, కోరిన ఎస్ఎన్ఎఫ్ పాలు లేవనటం, 200 మిల్లీ లీటర్ల ప్యాకింగ్ అడిగితే ఊరు పేరూ లేని డెయిరీవి ఇవ్వటం, అదేమని అడిగితే తిట్లకు దిగటం మామూలయింది. రాంనగర్ చౌరాస్తా ఏజంటు విజయడెయిరీతోపాటు అన్ని రకాల పాలూ విక్రయిస్తాడు. వాస్తవానికి ఇలా అన్ని రకాలూ అమ్మటం నిబంధనలకు విరుద్ధం. సరే చూసీచూడనట్లు పోదామనుకుంటే విజయ పాలకు బదులు వేరు రకం అంటగడుతుంటాడు. ప్రత్యేకించి 200 మిల్లీలీటర్ల విజయ డెయిరీ ప్యాకెట్లను దాచిపెట్టి సుగుణ పాలు అమ్మటం కద్దు. ఎవరయినా విజయపాలు కావాలని అడిగినా, లేవంటాడు. చూసి అడిగితే వాటిని దుకాణాల వాళ్లకోసం తెప్పించానని తప్పుకోజూస్తాడు. విజయపాల ప్యాకెట్లు పగిలిపోతున్నందున తెప్పించటం లేదంటాడు. దీనికితోడు రూ. 4.50కు బదులు రూ. 5 వసూలు చేస్తాడు. అడిగితే చిల్లర లేదంటాడు. గట్టిగా అడిగితే చిల్లర తెచ్చుకుని తీసుకుపొమ్మంటాడు. అదే ఇతర డెయిరీల 200 మిల్లీలీటర్ల పాలకు మాత్రం రూ. 5.50 తీసుకుని చిల్లర ఇస్తాడు. ఇదంతా విజయ డెయిరీ యాజమాన్యం అనుసరిస్తోన్న దివాలాకోరు విధానాల ఫలితంగానే జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, అక్రమార్కుల నుంచి సొంత లబ్ధి పొంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందునే వినియోగదారుల మన్నన పుష్యలంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఇలా ఏడుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవటమంటే ఇదేనన్న జ్ఞానం విజయ డెయిరీ సిబ్బందికి ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. ఎవరన్నా ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా, చర్య తీసుకోకపోగా ఫలానావాడు మీ మీద ఆరోపణలు చేస్తున్నాడని ఏజంట్లకే ఉప్పందిస్తారు. దీంతో ఆ ఏజంటు ఆ వినియోగదారుడిని ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తాడు. చిల్లరలేదంటాడు ఒకసారి, స్టాకు లేదంటాడు మరోరోజు, అవసరమయి అడిగితే రోజూకన్నా ఎక్కువ పాలు ఇవ్వనంటూ పేచీలకు దిగుతాడు. ఇదీ విజయ డెయిరీ (లో)పాల కథ.

శాస్త్ర విజ్ఞానము: సుబ్బారావు సెలవు పెట్టాడు
హరివిల్లు: వెండి పూజాసామాగ్రి

నా చిన్ని ప్రపంచం: మా చిన్ని ప్రపంచానికి స్వాగతం...
నా అందమైన ప్రపంచం: నాలో సుపరిచితుడు
రాతలు-కోతలు: మహమ్మద్ రఫీ- శ్రద్ధాంజలి.
ఈవేళ సాయంత్రం
ఆరున్నరకు, త్యాగరాయ గాన సభ మినీ హాలులో మహమ్మద్ రఫీకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము.
రఫి పాటలలోని వంపులను, సొంపులను, ఇంపులను, కెంపులను నేను వివరిస్తూంటే, రాధాకృష్ణ గారు గానం చేస్తారు.
అందరికీ ఇదే ఆహ్వానం.
టీవీ కార్యక్రమాల శ్రద్ధాంజలుల్లా అవగాహన రాహిత్యాలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, పైపై మాటలు వండవు. రఫీ పాటలను మనసుతో విని, మనసులోలోతుల స్పందనలను మాటలలఒ వ్యక్త పరచే వ్యాఖ్యలతో వుంటుందీ కార్యక్రమం.

తప్పకుండారండి. మీ అభిప్రాయాలను, సూచనలనూ నిర్మొహమాటంగా తెలపండి.
సవ్వడి..: గోవింద హరి గోవింద... గోవిందా సిరి గోవింద
చావా కిరణ్: 6/14 గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్)
- 5/14 గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్)
- 4/14 గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్)
- 3/14 గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్)
కథా మంజరి: ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?
రాచకొండ విశ్వనాథ శాస్త్రి: రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి
saahitee సాహితి ಸಾಹಿತಿ સાહિતિ ஸாஹிதி ਸਾਹਿਤਿ সাহিতি സാഹിതി साहिति: అనుసృజన (హిందీ కవిత)
స్వప్న రాగలీన: అమ్మలూ ఐమిస్యూరా!
శంకరాభరణం: సమస్యా పూరణం -52
పుస్తకం: Persepolis
Persepolis – Marjare Satrapi రాసిన,గీసిన – గ్రాఫిక్ నవల. నవల కాదు – ఆత్మకథ. గ్రాఫిక్ నవల చదవడం ఇదే తొలి అనుభవం నాకు. అలాగే, ఇరానియన్ జీవితం గురించి తెలుసుకోవడం కూడా. ఈ తొలి అనుభవం మంచి అనుభవమే కావడం చేత, ఈ పుస్తకాన్ని గురించి తప్పక రాయాలి అనుకూంటూ ఉన్నా – ఇప్పటికి రాస్తున్నా.
కథ: ఇది రచయిత్రి నిజ జీవితం కథ. ఇరాన్ దేశంలో కమ్యూనిస్టు, సోషలిస్టు ఉద్యమాలు నడుస్తున్న కాలంలో, ఒక ఆధునిక కుటుంబంలో పుట్టిన సత్రపి చిన్నప్పటి నుండీ ఇరాన్ లో జరుగుతున్న మార్పులని దగ్గరగా చూశారు. ఓ వైపు ఆధునికతా… ఓ వైపు చాంధసవాదం – వీటి మధ్య ఇరాన్లో కాస్త చదువుకున్న, అభ్యుదయవాద కుటుంబాలు పడే అవస్థలు ఈ నవల చదువుతూ ఉంటే, కళ్ళకి కట్టినట్లు అర్థమయ్యాయి. ఇరాన్ లో అమ్మాయిలు-అబ్బాయిలకి ఉండే ఆంక్షలను వాటిని చూశాక అవాక్కయ్యాను. నా దృష్టిలో ఇరాన్ తక్కిన ఇస్లాం చాంధసవాద దేశాలకంటే ఓ మెట్టుపైనే ఉండేది మరి!
సరే, కథలోకొద్దాం. చారిత్రకంగా ఇరాన్ కు ఈ డెబ్భై-ఎనభైల కాలం ఎంతో ముఖ్యమైనది. 1979 లో జరిగిన ఇరానియన్ విప్లవం తరువాత, రాచరికం అంతరించింది కానీ, అంతకు మించి, మతతత్వ రాజ్యం మొదలైంది. సత్రపి వంటి కుటుంబాలు దీని వల్ల బాగా అవస్థ పడ్డాయని చెప్పాలి. ఈ సమయంలో సత్రపి ని దీని ప్రభావం నుండి దూరంగా ఉంచేందుకు ఆస్ట్రియా పంపారు ఆమె తల్లిదండ్రులు. ఆమె అక్కడే నాలుగేళ్ళు – చదువు, స్నేహాలూ… వారి సంప్రదాయం ప్రకారం ’చెడు’ సావాసాలు…అక్కడక్కడా వర్ణవివక్ష…ఫ్లూ వల్ల ప్రాణం మీదకి రావడం – ఇంత అయ్యాక, మళ్ళీ ఇరాన్ చేరుకుంటుంది. మధ్యలో ఇరాన్-ఇరాక్ యుద్ధం. వెనక్కొచ్చాక, కొన్నాళ్ళు ఇక్కడుండి, పెళ్ళి-విడాకులు – ఆ తర్వాత మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోతుంది. ఈసారి శాశ్వతంగా. నవల కథ ఇక్కడిదాకే. తరువాత, ఆమె యూరోప్ లో స్థిరపడ్డం, రచయిత కావడం – అది దీనికి కొనసాగింపు.
ఈ నవల చదువుతూ ఉంటే – ఇరాన్ జీవితమే కాదు – సత్రపి ఆలోచనా విధానం ఎలా రూపు మారుతూ వచ్చిందో కూడా అర్థమౌతుంది. అలాగే, ఏళ్ళు గడిచినా మారని కొన్ని behavioral traits కూడా గమనించవచ్చు. ఇలా ఆలోచిస్తే – ఈ పుస్తకం ఓ చరిత్ర పుస్తకంగా ఒక వైపు (సామాన్యుల చరిత్ర), ఒక వ్యక్తి గురించి అనలైజ్ చేసే పుస్తకంగా ఒకవైపు – రెండు రకాలుగా చూడొచ్చు. సత్రపి – నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది – ఇలాంటి ఓ మనిషి – కట్టుబాట్లే పడని మనిషి – ఇరాన్ వంటి దేశంలో… ఊహించలేకపోతున్నాను. మొన్నామధ్య “విష్ మేకర్” చదివినప్పూడూ, ఇప్పుడూ ఒకే విషయం కామన్ గా తోచింది – అదే, ఛాందసవాదం లో ఉన్న ఈ దేశాల్లో, కాస్త డబ్బున్న కుటుంబాల్లో పిల్లలు ఎదిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది. ఏదైతే అక్కడి వ్యవస్థ సిద్ధాంతాల ప్రకారం చేయరాదో – అదే పొందే అవకాశం చేతిలో ఉన్నప్పుడు – అదే చేయాలి – అన్న ఆలోచనావిధానం బాగా ఉన్నట్లు అనిపించింది. సత్రపి విషయంలో ఆమె దేశం వదిలి వెళ్ళినా కూడా – ఇదే ప్రవర్తన కొనసాగిందనుకోండి, అది వేరే విషయం. అఫ్కోర్సు, విష్మేకర్ లో పాకిస్తాన్ సామాజిక పరిస్థితుల గురించి చెప్పింది కొంత భాగమే. ఇందులో సత్రపి జీవితం-ఇరాన్ సమాజం, రెంటికీ సమాన ప్రాధాన్యం ఉంది – రెండో భాగంలోకి చేరి ముందుకెళ్ళే కొద్దీ, సత్రపి వ్యక్తిగత జీవితం కథని డామినేట్ చేసినా కూడా. కొన్ని కథనాలు వింటూ ఉంటే – నాకు చాలా ఆశ్చర్యం కలిగింది – మనుషులన్నాక ఇలా ఎలా చేయగలరు? అని. నేను చూసిన ప్రపంచం చాలా చిన్నదనుకోండీ – కానీ, అలా అనుకోకుండా ఉండలేకపోయాను. ఇంకొన్ని చోట్ల – ఒక దేశం దేశం ఇంత ఛాందసంగా రూపొందడం ఏమిటీ? అని భయమేసింది.
ఇక కథనం – వాక్యాలు తక్కువా, బొమ్మలెక్కువా – విషయం మొత్తాన్నీ, ఈ పద్ధతిలో చాలా చక్కగా చెప్పారు. ఎక్కడా వర్ణనలు లేవు. చెప్పదలుచుకున్న సత్యాలు తప్ప. గ్రాఫిక్ నవల – అన్న ఆలోచన నాకు నచ్చింది. ఇదివరలో కార్టూన్ కథలు చదవడమే కానీ (పిల్లల పుస్తకాల్లో) – ఒక అడల్ట్ నవల, బొమ్మలతో చదవడం ఇదే ప్రథమం. మంచి పుస్తకం. మీగ్గానీ దొరికితే తప్పక చదవండి. అన్నట్లు ఈ పుస్తకాన్ని సినిమాగా కూడా తీశారు.
శంకరాభరణం: గళ్ళ నుడి కట్టు - 26
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: PhD పని ఒత్తిడి: కొన్నాళ్ళ పాటు 'అపుడప్పుడు' మాత్రమే....
తురుపుముక్క: కవితాభిషేకం! - 26
అంతర్వాహిని: My Heart is Beating! (Don't know when it Stops)
2010-07-30
అక్షరం: "ఊరి చివరి" సూఫీ పాట!
Padmarpita....: ప్రేమ-పెళ్ళి
(చంద్రమౌళి) అంతర్మధనం: నీ సిగ్గు బుగ్గలో ఎర్రదనం..
తెలుగిల్లు: అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర
కీర్తిశేషులు నార్ల వెంకటేశ్వరరావు అంటారూ – అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. ప్రజాస్వామ్య మహాసౌథానికి నాలుగో స్తంభమని భావించే పత్రికారంగం నిజాయితీగా వ్యవహరిస్తే … అదే సిరాచుక్క లక్ష అక్రమాలకు తెర.
దీనికి ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో నేను ఈనాడులో రాసిన ప్రత్యేక కథనం నిలువుటద్దం …. ఆ వార్తా కథనంతోపాటు ఆనాడు చోటుచేసుకున్న సంఘటల్నీ ఈ రోజు మీతో పంచుకోనీయండి!
పాపయ్య, పెద్ద పాపాలభైరవుడు. ఒంగోలు పురపాలక సంఘంలో కమిషనరుగా పనిచేసిన ఈయన ఆచరణలో క’మీ’షనరు. అంటే చీటికీ మాటికీ కమీషన్లు కొడుతుంటాడనేగా. ”ముడుపులు ముట్టను – పర్సంటేజీలు పట్టను” … పాపయ్య కమిషనరుగా ఒంగోలులో బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నేను రాసిన వార్తకు శీర్షిక. ప్రజా సేవలో నిమగ్నమయి తాను వైవాహిక జీవన మాధుర్యాన్ని కూడా అనుభవించలేకపోతున్నానని తొలిరోజే ఆయన నాతో నేరుగానే చెప్పటం విశేషం. నా కథనంలో ఇది కూడా ఓ ముఖ్యమయిన అంశమే అయినందున దీన్ని ప్రస్తావించాల్సి వచ్చినందుకు క్షమించండి.
ఈ పాపి అందరిమాదిరిగానే వారంరోజులు అదరగొట్టాడు. ఇతర అధికారుల్నీ, సిబ్బందినీ పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత చూడండి పాపయ్య పాపాలకు అంతేలేకుండా సాగటం మొదలయింది. దానికి అనుగుణంగానే నేనూ నిత్యం వెంటబడి కలం కదిలించాను. ముడుపులు మూటగట్టుకోవటంతోపాటు, కార్యాలయంలోనే రోజుకొకరితో పడకేసేవాడు పాపి. ఓ రోజు పాపి సహా నలుగురు అధికారులు కార్యాలయం తలుపులు బిగించుకుని మరీ బండబూతులు తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. సమగ్ర మరుగుదొడ్ల నిర్మాణ పథకం గుత్తేదారు నుంచి ముట్టిన ముడుపులన్నింటినీ (16 శాతం) కమీషనరు మూటగట్టుకుని తీసుకోవటమే దీనికి కారణం. నాలుగు గోడల మధ్య సాగిన ఈ వ్యవహారం కూడా యధాతథంగా మరునాడే రంగులు పూసుకుని ప్రకాశం మినీ మొదటి పేజీలో పాఠకులకు దర్శనమిచ్చింది. దీంతో కలకలం చెలరేగింది. నాలుగు గోడల మధ్యసాగిన వ్యవహారం ఈనాడు విలేకరి కావెసురా( వెంకట సుబ్బారావు కావూరి)కి ఎలా తెలిసింది???? ఇదీ చర్చ. ఆ నలుగురూ మళ్లీ తలుపులు బిగించుకుని, కావూరికి నువ్వు చెప్పావంటే, నువ్వు చెప్పావంటూ మళ్లీ చెంపలు వాయించుకున్నారు గుట్టుగా. అదీ మళ్లీ మరునాడే పత్రికకు ఎక్కింది. మున్సిపాలిటీతో సంబంధమున్న అందరికీ మతి పోయింది. ఇచ్చినవాడు చెప్పడు, తిన్నవాడు చెప్పడు, అడిగినవాడు చెప్పడు, కొట్టినవాడు చెప్పడు, కొట్టించుకున్నవాడు చెప్పడు…. మరి విలేకరికి పూసగుచ్చినట్లు ఎలా తెలుస్తోంది? సమాధానం దొరక్క చివరకు ఒక నిర్ధారణకు వచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన మైక్రో కెమెరాలను కావూరి ఎక్కడో బిగించాడు. వాటి ఆధారంగానే రహస్యాలు రాబడుతున్నాడని ఒకరికొకరు చెప్పుకున్నారు. విలేకరులు అదే నమ్మారు. నాతోనూ అదే చెప్పారు. నేను నవ్వి ఊరుకున్నాను. వాస్తవానికి నా దగ్గర ఏ కెమెరాలూ లేవు. ఉన్నదల్లా కమీషనరు అటెండరుతో స్నేహం, కారు డ్రైవరుతో అనుబంధం. అంతే. ఎంత రహస్యమయినా అటెండర్లను బయటకు పంపరు. డ్రైవరుకు తెలియకుండా కారులో ఏదీ జరగదు. అదీ అసలు రహస్యం. అటెండరు మిత్రులు, డ్రైవరు సాబ్లు ఎప్పటికప్పుడు అయినదానినీ, కానిదానినీ నాకు పూసగుచ్చేవాళ్లు. విలేకరి మిత్రులూ చూసుకోండి మరి. సరే నా వార్తల ఆధారంగా పాపిమీద ఏసీబీ దాడి చేసింది. ప్రభుత్వం సస్పెండు చేసింది. అయితే పాపి మేనమామ అధికారపార్టీలో పలుకుబడి కలవాడవటంతో (ఆర్టీసీ ఛైర్మను పదవి వెలగబెట్టేవాడు) కొద్ది రోజుల్లోనే విముక్త్తుడయ్యాడు. పాపి మామూలోడు కాదుగదా! నాలుగు రోజులకే మళ్లీ ప్రారంభించాడు పాపపు పనులన్నింటినీ. నా కలమూ కదులుతూనే ఉంది. ఓ రోజు పాపి నాకు ఫోను చేసి ఎంత కావాలో కోరుకోమన్నాడు. వద్దని సూటిగా చెప్పాను. పోనీ పత్రికకు ప్రకటనలు ఇస్తానని ఎరవేశాడు. ఆ పని నాది కాదని నిర్ధ్వందంగా తేల్చి చెప్పాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టి ఊచలు లెక్కపెట్టిస్తానంటూ స్వరం పెంచాడు. నీకు చేతనయింది చేసుకోమన్నాను. గూండాల్ని పెట్టి కాళ్లూ, చేతులు తీయిస్తానంటూ ఫోను పెట్టేశాడు. ఓ అరగంట తర్వాత సాక్ష్యం కోసం కొందరు కౌన్సిలర్లను వెంటబెట్టుకుని వెళ్లి పాపిని కలిసి నీకు చేతనయింది చేసుకో, నా ప్రాణం ఉన్నంతవరకూ, నాచేతిలో కలం ఉంచినంతవరకూ దేన్నీ దాయకుండా పౌరులకు చెబుతూనే ఉంటానని నేరుగా చెప్పి వచ్చేసాను. పాపి మొదటిసారిగా వణకటం చూశాను. మనసు తీరా నవ్వుకున్నాను. ఓ అక్రమార్కుడిని అంతలా భయపెడున్నందుకు తెగ గర్వపడిపోయాను. మరో ఆరు నెలలు గడిచింది. పాపి వ్యవహారాలు రోజూ వార్తలయి పౌరులకు చేరుతుండటంతో పాలక పెద్దలకు కూడా విసుగు పుట్టింది. పాపిని పంపేసి ఆ స్థానంలో ఆంజనేయుల్ని (అసలు పేరుకాదు) తెచ్చుకున్నారు. అయితే పాపిని ఊరక పంపదలచుకోలేదు. ఒంగోలు రంగారాయుడు చెరువులో కోటి రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేయదలచిన బోట్క్లబ్ పనుల్ని పార్టీ విధేయుడొకరికి అక్రమంగా కట్టబెట్టేందుకుగాను చీకటి పనుల్ని పాపి చేతుల మీదుగా పూర్తి చేయించుకున్నారు. దీనికిగాను పాపికి ఏక మొత్తంగా ఓ లకారందాకా ఇచ్చారు. మందు, బిర్యానీ సరేసరి. అర్ధరాత్రి వేళ కార్యాలయంలోనే తలుపులేసుకుని పాపి ఈ వ్వవహారాన్నంతా చక్కబెట్టాడు. బోటుక్లబ్బు టెండర్ల ప్రచురణ కోసం ఎప్పుడూ కనపడని ఓ స్థానిక పత్రికను ఎంచుకున్నారు. పత్రికను డీటీపీ చేయించి కంప్యూటరులోనే రెండు, మూడు ప్రతుల్ని తీయించారు. రెండో పత్రికగా ఒంగోలులో అంతగా కొనుగోలుదారులు లేనిదానిని ఎంచుకున్నారు. ప్రకటన ప్రచురితమయిన రోజున అక్కడికి వచ్చే 50 ప్రతుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా పనులన్నీ ఒకేరాత్రి పూర్తి చేశారు. కొత్త కమిషనరుతో సంతకం చేయించి ఊపిరిపీల్చుకున్నారు. ఈ వ్యవహారమంతా రెండో రోజున ‘అర్ధరాత్రి టెండర్లలో ఆంతర్యం’ శీర్షికతో పాఠకులకు చేరింది. అంతే గుత్తేదార్లు, ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. కొందరు గుత్తేదార్లు వార్త ప్రతుల్ని ఏసీబీ మొదలు ముఖ్యమంత్రిదాకా గుట్టుగా పంపారు.
పాలకులు పట్టించుకోలేదుగానీ, మున్సిపల్ విభాగం రాష్ట్ర అధికారులు కన్నేశారు. వివరాలన్నింటినీ సేకరించారు. ఇద్దరు కమిషనర్లు, ఎంఈ, డిఈ, ఏఈ ఇలా ఐదుగురిపై ఒకేసారి వేటేస్తూ డిసెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పౌరులంతా నూతన సంవత్సర వేడులు జరుపుకుంటున్న వేళ పాపి అండ్కోకు ఈ ఉత్తర్వులు చేరాయి. కాలం మార్పుతో (క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా) బతుకులు మారబోవన్న ఇంకిత జ్ఞానం ఉన్నవాడిగా నూతన సంవత్సర వేడుకలకు సాధారణంగా దూరంగా ఉండే నాకు ఆ రోజు వార్త సాధించిన స్పందనతో నిజమయిన పండుగ జరుపుకున్నాను. ఆనాటి నుంచీ నా బీటుకు సంబంధించిన అధికారులు, నాయకులు కంటారా ఏ రోజూ నిద్రపోలేదంటే నిజ్జంగా నిజం. మద్యం గురించి నాకు ఈనాటికీ ప్రాథమిక విషయాలు కూడా తెలియవుగానీ, తాము సాధారణంగా సేవించేదానికి రెట్టింపు తాగినా కిక్కురాక, నిద్రపట్టక అల్లాడిపోతున్నామని కొందరు నాతోకూడా అప్పుడప్పుడూ వాపోయేవారు. కాస్త చూసీచూడనట్లు పొమ్మని అభ్యర్థించేవారు. అయినా నా కలానికి ఎన్నడూ పదును పోగొట్టి చూసీచూడనట్లు పోలేదు. అదే నాకు సంతృప్తి. దాంతోనే నా జన్మ ధన్యమయిందని నమ్ముతాను. ‘పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యమ్ము’ అని అందుకేగదా పెద్దలన్నది.

నాన్న: కేసీఆర్ గెలుపా లేక మిగతా పార్టీల ఓటమా?
ఊహల పల్లకీలో ఊరేగించనా....: మనసున్న ప్రేమ Part 5
Tears Of Yohanth..: నువ్వు కాదని అంటే
"కృష్ణశ్రీ": రామాయణం లో పిడకల వేట
సాహితీ ఝరి-నా హృదయ మంజరి: తాజ్ మహల్
"తువ్వాయి": మా తాతయ్య చెప్పిన 'కొరివి దెయ్యాల' కథ!
బ్లాగాడిస్తా!: ఆషాఢస్య ప్రథమ దివసే..
నవతరంగం: ఈ రోజు మీకొక కోత్త దర్శక మిత్రుడిని పరిచయం చేస్తున్నాను.
మతమేదైనా కానివ్వండి.
కులమేదైన కానివ్వండి .
జాతి ఏదైనా కానివ్వండి.
స్త్రీ ,పురుషా లింగమేదైన కానివ్వండి( మా గురించి చెప్పవా అని 3 జెండర్ గోడవ చెయ్యొద్దు ప్లీజ్)
మనిషి కి చివరాఖరికి మిగిలేదేమిటి?
మనిషి అంతిమ గమ్యం ఏంటి?
మనిషి తన జీవిత కాలం మొత్తం కోరుకునేదేమిటి?
చాలా మంది చట్టం పరిధిలో …స్వార్ధంతో …, కోపం తో , దురాశతో,
హత్యలు , మానభంగాలు,దోపిడీలు,వగైర వగైరా నేరాలు.. ఘోరాలు చేసుకుంటూ బతుకుతున్న వారిని చూసి కావచ్చు ..
లేదా.. ఎన్నో పవిత్రగ్రంధాలు
వ్యక్తిత్వ వికాస పుస్తకాలు
ఎన్నో ఉన్నత చదువుల డిగ్రీలు
మరెనంతో మంది బాబాలు ,గురువుల సాన్నిహిత్యం,
ఇంకా మరెన్నో…క్రియలు …
ఇదంతా మనిషి ఎందుకోసం చేస్తాడు?
అసలు ఇవన్ని మనిషికెందుకు?
అనే ఆలోచన వచ్చి కావచ్చు…,
మిత్రులు ” అక్బర్ చక్రవర్తి “కి THE DESTINATION అని ఒక చిన్న లఘు చిత్రాన్ని నిర్మించారు .
ఆ చిన్న చిత్రాన్ని మీరు చూడండి.
shukriya alot .
PHANI BABU -musings: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పళ్ళూ, కూరలూ
ఈ మధ్యన రిలయన్సులూ, స్పెన్సర్లూ, మోర్లూ వచ్చిన తరువాత, చాలా మంది కూరలకోసం వాటిల్లోకే వెళ్తున్నారు. అన్నీ నీట్ గా పెట్టి, వాడేం చెప్తే ఆ ధరకే కొనుక్కోవడం. దానితో బయట అమ్మేవాళ్ళదగ్గర కూరలు తీసికోవడం బాగా తగ్గింది. మా చిన్నతనంలో, శనివారాల్లో ఒకచోటా, ఆదివారాల్లో ఇంకో చోటా సంతలుండేవి. చుట్టుపక్కల పొలాల్లోంచీ, తోటల్లోంచీ కూరలూ, పళ్ళూ వగైరాలు తెచ్చి అమ్మేవారు.ఆ సంతకెళ్ళడం ఓ అద్భుతమైన జ్ఞాపకం. అక్కడ కూరలూ పళ్ళే కాకుండా మిగిలిన సరుకులు కూడా దొరికేవి.ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది,తూకాలూ అవీ అంత సరీగ్గాఉండేవి కావేమో అని.
ఇప్పటికీ చూస్తూంటాము, రోడ్డు పక్కన బండిలో అమ్మేవాళ్ళు, చవగ్గా ఎందుకిస్తారూ? కాటాలో ఏదో గోల్ మాల్ ఉందన్నమాట.వీధిలోకి అమ్మడానికి వచ్చే కరివేపాకు, ఓ గిద్దెడు బియ్యం ఇస్తే ఇచ్చేవాడు. ఇప్పటి ధరలనుబట్టి, బియ్యం ఇచ్చుకోడం కంటే, హాయిగా డబ్బులిచ్చే కొనుక్కోడం హాయి. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు ( క్రిందటేడాది), ప్రతీరోజూ ఒకతను సైకిలుకి బుట్ట తగిలించుకుని కూరలు తెచ్చేవాడు. ఏదో దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, ఇంటి దగ్గరే దొరుకుతున్నాయికదా అని, అతనిదగ్గరే కొనడం మొదలెట్టాను.బేరం ఆడేవాళ్ళకి తక్కువచేసిచ్చేవాడు. ఓ నాలుగురోజులు చూసి, మానేశాను.రాజమండ్రీ మెయిన్ రోడ్డులో ఒక బండివాడుండేవాడు. అతనిదగ్గర కొద్దిగా ధర ఎక్కువైనా, కూరలు ఫ్రెష్ గా ఉంటాయి కదా అని, అక్కడే తీసికునేవాడిని. మా కజిన్ తో ఒకసారి వెళ్ళినప్పుడు, తీసికోరా అంటే, ‘ వద్దూ, వీడిదగ్గర ఖరీదెక్కువా ‘అని తీసికునేవాడు కాదు.I think one has to pay the price for the quality. అయినా ఉన్నది లింగూ లిటుకూ అంటూ ఇద్దరమే కదా. పోతే పోనీయ్ అని ఖరీదెక్కువైనా అక్కడే తీసికునేవాడిని.
కొంతమందంటారు ఫలానా పెద్ద మార్కెట్ లో చాలా చవకండీ, అన్నీ హోల్ సేల్ ధరలకే ఇస్తారూ అని.ఏదో పనిమీద ఆవైపుకి వెళ్తే కొనుక్కోవాలికానీ, చవగ్గా ఇస్తారు కదా అని అంతదూరం వెళ్ళడంలో అర్ధం లేదు.రానూ పోనూ అయే ఖర్చు కూడా చేరిస్తే, దగ్గరలో ఉన్న బండి వాళ్ళ దగ్గర కొనుక్కోవడమే హాయి! వచ్చిన గొడవల్లా, తూకాలదగ్గరే. ఆతూకంరాళ్ళు ఏ గుప్తులకాలానివో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు, ఏవో నట్లూ, బోల్టులూ వేసి, తూస్తూంటారు. మాల్స్ లోకి వెళ్తే
ఈ తూకం మాత్రం డిపెండబుల్ గా ఉంటుంది.
మా ఫ్రెండోడుండేవాడు, మార్కెట్ మూసే సమయానికి వెళ్ళేవాడు, కొట్టు మూసేస్తూ, రోజులో అమ్మగా మిగిలిన కూరలన్నీ, హోల్ సేల్ గా తోచిన ధరకిచ్చేస్తారని!ఆ కొట్లవాళకేమైనా కూలింగ్ ఛాంబర్సూ అవీ ఉంటాయా ఏమైనా? ఇంక ఆకు కూరల విషయానికొస్తే,ఆ కట్టల్లో ఏవేవో కలిపేసి కట్టి అమ్ముతారు. కొంపకొచ్చి చూస్తే, అందులో సగం అవతల పడేసేవే! ఈ మాల్స్ లో కొనడం అదీ మంచి stylish గానే ఉంటుంది.కానీ అక్కడ బిల్లింగు చేసేటప్పటికి ప్రాణం మీదకొస్తుంది. అదే బయట అమ్మే కొట్లవాళ్ళదగ్గర అయితే यूं गया यूं आया ! చారులోకి ఏ కొత్తిమిరో కావాలంటే, ఈ చిన్న దుకాణాలే హాయి! పైగా ఈ మాల్స్ లోకి వెళ్ళామంటే, తీసికోవాల్సిన కూరలతో పాటు, ఇంకా అవసరం ఉన్నవీ, లేనివీ తీసికోవాలనిపిస్తుంది.అదేదో పిల్లలకిష్టం, ఇంకోటేదో ఇంటావిడకిష్టం అనుకుంటూ! పైగా అక్కడుండేవన్నీ తళతళా మెరుస్తూంటాయి లైట్లలో!కూరలకోసం వెళ్ళడమూ, ఓ యాపిల్ బావుందని, ఇంకో పైనాపిల్ బాగుందనీ,లేకపోతే ఇంకో ఫలానాది బావుందనీ అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం.పోనీ తెచ్చాము కదా అని ఇంట్లో వాళ్ళేమైనా తింటారా అంటే,వాటిని ఓ బుట్టలో పెట్టి పూజచేయడమే.చివరకి ఆ పళ్ళకి ముసమలొచ్చేసి, మిగలముగ్గిపోతాయి. పైగా కొంతమందికి పదునులూ, అంతలా ముగ్గితే టేస్టుండదూ అని! కూరలనండి, పళ్ళనండి, మార్కెట్ నుంచి తెచ్చినవి పూర్తిగా ఏ ఇంట్లోనూ సొమ్ము చేయరు. ఏదో అది కొనేద్దామూ, ఇదికొనేద్దామూ అని యావే కానీ ఇంకెమీ కాదు.
అన్నిటిలోకీ తక్కువ shelf life ఉన్నది అరటి పండు.బావున్నాయికదా అని ఓ అరడజను తెచ్చామనుకోండి, రెండో రోజుకల్లా రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. ఎవరైనా వచ్చినా చేతిలో కూడా పెట్టలేము.అన్నిటిలోకీ, దేవాలయాల దగ్గర అమ్మే అరటిపళ్ళు చూస్తే నవ్వొస్తుంది- ఓ రుచీ పచీ ఉండవు, అందుకే కాబోలు దేముడరిటిపళ్ళంటారు! అలాగే గుళ్ళల్లో ఇచ్చే పళ్ళన్నీ ప్రత్యేకం దేముడికోసమే పండించారా అనేట్లుంటాయి.కొంతమంది శ్రావణమాసం వాయినాల్లో ఇస్తూంటారు- ఓ పండూ, శనగలూ, ఓ వక్కపొడి పొట్లం.అన్నిటిలోకీ funny character ఆ వక్కపొడి పొట్లం, దానికి ఓ ఉల్లిపొరకాయితం తోపాటు ఓ వక్క పలుకోటుంటుంది. ఎందుకూ ఉపయోగించదు. నిన్న వ్రాసిన పెట్టుబడి బట్టల కోవలోకే వస్తాయి ఈ వాయినాల్లో ఇచ్చే, దేముడుగుళ్ళల్లో ఇచ్చే పళ్ళూ, ఈ వక్కపొడి పొట్లాలూనూ. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదంటే లేదూ!!

ఇల్లాలి ముచ్చట్లు: రావిశాస్త్రి - కథల్లో కవిత్వమే రాస్త్రి
GPVPRASAD: earn online
భవదీయుడు: భిన్నత్వంలో ఏకత్వానికి ఓ ఉదాహరణ
దిరిసెన పుష్పాలు: అది ఒప్పా( ఉప్పా)తప్పా ???
శిరా కదంబం: జరీ అంచు తెల్లచీర
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events: విభాగము: గుంటూరు జిల్లా (Portal: Guntur Dist)
స్వప్న రాగలీన: మొన్న మా ఆవిడని మిస్సయ్యా!
2010-07-31
డీజీపీ పోయి అతగాడి కాళ్ళమీద పడితే, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, అలాంటి దొంగ సన్నాసి దగ్గరికి ఈయనెందుకెళ్ళాడని. అప్పుడేగా ఈ డీజీపీ అన్నది – నా నమ్మకం నా యిష్టం అని! ఈ డీజీపీ బాపతు జనం చేతి;లో అధికారాలున్నన్నాళ్ళూ ఈ బాబాల్లాంటి వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. ప్రచారం కోసం పేపర్లలో ప్రకటనిలిచ్చుకుంటూ కూడా ఉంటారు.
మీరీ బాపతు బాబాలు, వాళ్ళ సత్రకాయలైనవారి వాగుళ్ళకు తగ్గేవాళ్ళు కాదని నా ఉద్దేశం. కానీండి.
మిత్రునికి ధన్యవాదాలు. విలేకరి ధర్మాల్లో ముఖ్యమయిన అంశాన్ని గుర్తు చేసినందుకు నెనరులు.
కొత్త విలేకరులకు ఉపయోగ పడుతుందేమోనని రహస్యం వెల్లడించాను. ఆనాటి సిబ్బందిలో కొందరు బయటకు వెళ్లి పోయారు. మరికొందరు ఇంటికెళ్లిపోయారు. ఇంకొందరు అసలే వెళ్లిపోయారు. ఒక్కరే ఉంటే ఇలా రాసినా ప్రమాదమే. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నందున సమస్య లేదని భావిస్తున్నాను. దీనికితేడు ఆనాటి అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిసింది. అయినా మేరు చేసిన హెచ్చరిక నిరంతరం గుర్తుంచుకోవాల్సిన ధర్మం.
naaku kottavi emi vachina pampinchandi





