2008-08-28

చదువరి: ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

2008-08-28 01:19 AM చదువరి (noreply@blogger.com)
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది. 'తాను భిన్నమైన

2008-08-26

జాబిల్లి » రాజకీయం: చిరంజీవి ది `ప్రజారాజ్యం`

2008-08-26 01:01 PM జాబిల్లి
ఎన్నొ రొజుల నిరీక్ష్నణ,ఆత్రుత ల మధ్య చిరంజీవి తన పార్టీ  పేరు  ` ప్రజారాజ్యం` అని  పెట్టారు.జెండా ఎజెండా త్వరలొ ……చదువుతూనే ఉండండి తెలుగు బ్లాగ్స్…

2008-08-20

దిల్ సే ... » రాజకీయాలు: నెహ్రూవంశం ఏం సాధించింది?

2008-08-20 08:21 AM శ్రవణ్
వీళ్ళు లేకపోతే మనదేశం అల్లకల్లోలమయ్యేదా? ఏమో! 1947తో పోలిస్తే చాలా చాలా బావుంది కదా. పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బావుంది కదా. కానీ, అవలోకనం తప్పుకాదుగా!

2008-08-17

చదువరి: అన్నయ్యల పోటీ

2008-08-17 07:38 PM చదువరి (noreply@blogger.com)
రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ

చదువరి: చిరంజీవి చెప్పిందేమీ లేదు, అంతా బహిరంగ సభలోనే నట!

2008-08-17 10:55 AM చదువరి (noreply@blogger.com)
చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో! తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల

2008-08-13

దిల్ సే ... » రాజకీయాలు: మతం — నామతం

2008-08-13 08:49 AM శ్రవణ్
మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? ఇది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ.

చదువరి: శతకోటికొక్కడు !

2008-08-13 03:00 AM చదువరి (noreply@blogger.com)
2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా! భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు "అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి." అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా

2008-08-11

చదువరి: అమరనాథ దేవాలయ స్థల వివాదం

2008-08-11 02:06 PM చదువరి (noreply@blogger.com)
సమర్థంగా వివాదాలను సృష్టించడంలోను, అత్యంత అసమర్థంగా వాటితో వ్యవహరించడంలోను కాంగ్రెసు మేటి. సరికొత్తగా అమరనాథ్ దేవాలయానికి స్థలం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ తీసేసుకుని లేని గొడవొకదాన్ని సృష్టించారు. ఒక సున్నితమైన విషయాన్ని ఎంతలా కెలకొచ్చో అంతలానూ కెలికారు. ఎంత అసమర్థంగా వ్యవహరించారంటే.. ముందు దేవాలయ బోర్డుకు వందెకరాల అటవీస్థలాన్ని ఇచ్చారు. ఎందుకూ..? అమరనాథ యాత్ర చేసుకునే యాత్రికుల తాత్కాలిక వసతి

2008-08-06

దిల్ సే ... » రాజకీయాలు: నట్టులు వెతకండి…

2008-08-06 11:43 AM శ్రవణ్
మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కపాల (పుర్రె) నట్టులు కొన్ని వదులయి పడిపొయ్యాయి. దీని కారణంగా ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి నట్టులు వెతికి ఇవ్వగలరు.

2008-08-04

దిల్ సే ... » రాజకీయాలు: మరో ప్రస్థానం

2008-08-04 02:55 PM శ్రవణ్
మరో ఎలక్షన్, మరో ఎలక్షన్, మరో ఎలక్షన్ వచ్చింది! పదండి తొక్కుక్కు! పదండి తోసుకు! పోదాం, పోదాం, పైపైకి!

2008-07-29

గుండె చప్పుడు...: రాష్ట్రంలో రెండు సెజ్ ల కథ

2008-07-29 03:47 AM Konatham Dileep
మూడు నెలల క్రితం కొంతమంది మిత్రులం (ఉప్పలపాటి ప్రశాంతి, రాకేష్) ఒకసారి సమావేశమయ్యాం. ప్రత్యేక ఆర్థిక మండలాల విధానం మరీ దుర్మార్గంగా ఉందని, వీటిని వ్యతిరేకించడానికి మనవంతుగా ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాం.  మన పెద్దలు తమ జీవితాలు ధారవోసి సంపాదించుకున్న స్వతంత్రం, సెజ్ ల ఏర్పాటువల్ల కోల్పోతున్నామని మా బృందం ప్రగాడ విశ్వాసం. ఆ సమావేశం తరువాత కాలంలో రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఎస్.ఈ.జెడ్ లపై మేం సమాచార సేకరణ మొదలుపెట్టాం. ఇందులో మొదటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన [...]

2008-07-27

జాబిల్లి » రాజకీయం: రాహుల్ పర్యటనలొ జరిగిన ఒక అనుభవం

2008-07-27 04:12 AM జాబిల్లి
ఇది మాఫ్రెండ్ ఒకడు కాలేజి బంక్ కొట్టి మరీ వెళ్తె జరిగిన అనుభవాన్ని నాకు పంపాడు , “              నేను ఈరోజు రవీంద్ర భారతి లో అణు ఒప్పందం పై చర్చ కు వెళ్ళా, మా ప్రశ్నలకు రాహుల్ గాంధి సమాధానాలు ఇచ్హారు అన్ని ప్రశ్నలకూ ఒకటె సమాధానం. నేను అనుకోకుండా ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళా నన్ను ప్రశ్న అడగనివ్వలేదు, ఈ ఒప్పందం కేవలం నయకుల ప్రయొజనాల కోసం అని నా అభిప్రాయం.  గాంధీల గొప్పతనాన్ని పొగడడమే వారి ధ్యేయం, వాళ్ళు తప్ప [...]

2008-07-21

గుండె చప్పుడు...: అణు ఒప్పందం ఒక ధృతరాష్ట్ర కౌగిలి

2008-07-21 03:45 AM Konatham Dileep
[వీక్షణం ఆగస్ట్ సంచికలో ప్రచురితం] అర్థ సత్యాలను ఎంత అలవోకగా మీడియా సాయంతో ప్రచారం చేయవచ్చో అమెరికా-భారత్ అణు ఒప్పందం మరో సారి రుజువు చేసింది. మన నేతలు వాషింగ్టన్ దొరలకు జీ హుజూర్ అని ఎలా సలాం కొడుతున్నారో మన్మోహన్ సింగు గారి తాజా నిర్వాకం తేటతెల్లం చేసింది. ఈ ఒప్పందం పుణ్యమా అని దేశ రాజధానిలో జరుగుతున్న ఎంపీల బేరసారాలు దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. అడ్డ దారిలో అయినా సరే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని మన్మోహన్ ప్రయత్నిస్తున్న [...]

2008-07-07

దిల్ సే ... » రాజకీయాలు: ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

2008-07-07 10:22 AM శ్రవణ్
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు రాజిగ! ఒరె రాజిగా! రాజిగ! ఒరె రాజిగా! ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

2008-07-04

చదువరి: వీళ్ళు మనకోసమే పోరాడుతున్నారా?

2008-07-04 08:46 PM చదువరి (noreply@blogger.com)
అంతమంది పోలీసులు హతులైతే హక్కుల నేతలెవరూ మాట్టాడరే, అని నేను రాసాను. దానికి స్పందనగా  దిలీప్ గారు తన బ్లాగులో రాస్తూ నక్సల్ ఉద్యమ ప్రస్థానంలో జరిగిన చాలా విషయాల గురించి చెప్పారు. ఆయన రచనాశైలికి తగినట్టుగానే వ్యాసం ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. ఆ జాబులో ఆయన లేవనెత్తిన అంశాలపై నా ఆలోచనలను కూడా రాద్దామని అనిపించింది. అయితే ఒక సామాజిక, సైద్ధాంతిక మరియూ రాజకీయ అవగాహన ఎర్పరచుకున్న తరువాతే అభిప్రాయాలు

గుండె చప్పుడు...: ఎక్కడ మొదలు పెట్టాలి మనం?

2008-07-04 09:25 AM Konatham Dileep
సీలేరు సంఘటన మరొకసారి మానవహక్కుల సంఘాల పాత్రపై చర్చను లేవనెత్తింది. మనలో చాలామందికి మానవహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయితేనో, అరెస్టు అయితేనో మాత్రమే మాట్లాడుతారు పోలీసులు చనిపోతే మాట్లాడరు అనే అభిప్రాయం ఉంది. ఇదే విషయంపై ఆవేదన చెందుతూ చదువరి ఒక పోస్టు చేశాడు. దానికి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్న కత్తి మహేశ్ కుమార్ పోస్టును ఇక్కడ చూడండి ముప్పై ముగ్గురు యువకులు అంత దారుణంగా చనిపోతే హక్కుల సంఘాలు ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్న అడిగే [...]

2008-07-02

చదువరి: వాళ్ళు మనకోసం ప్రాణాలర్పించారు

2008-07-02 06:40 PM చదువరి (noreply@blogger.com)
అది యుద్ధం. గెరిల్లా యుద్ధం. 65 మంది పోలీసులు, ఇతర సిబ్బందీ నదిలో, నడిమజ్జన ఉండగా మావోయిస్టులు రాకెట్లూ తుపాకులతో దాడి చేస్తే పాపం చెల్లాచెదురయ్యారు. 29 మంది మాత్రం బ్రతికి బయట పడ్డారిప్పటికి. మిగిలినవారి జాడ ఇంకా తెలియరాలేదు. పోలీసుల అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన జరిగిందని ఒక వంక చెబుతున్నారు. ఆ పడవ నడిపే అతను మావోయిస్టులతో కుమ్మక్కయ్యాడని మరో వాదన కూడా వినవస్తోంది. ఒక పోలీసు శవం నదిలో దొరికింది.

2008-06-29

గుండె చప్పుడు...: తెలంగాణా సాయుధ పోరాటం - ప్రశ్న-జవాబు

2008-06-29 11:46 AM Konatham Dileep
గొప్పలు చెప్పుకునే తత్వం భారతీయులకు సహజంగానే తక్కువ. చేసిన పనులను గురించి రాసుకోవడం కూడా తక్కువే. ఇలా సమకాలీన చరిత్రను కావలసినంతగా డాక్యుమెంట్ చేయకపోవడం మనవాళ్లు చేసిన పెద్ద పొరపాటు. మన పూర్వీకులకు చెందిన అనేక గొప్ప విషయాలు మన తరానికి అందలేదు. మన చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు పాశ్చాత్య పర్యాటకులు, చరిత్రకారులు చెబితే తెలుసుకోవలసి వస్తుంది. చరిత్ర రచన చాలా సంక్లిష్టమైనది. విజేతలే చరిత్ర రాయడం వలన పరాజితుల గాధలు ఎప్పటికీ వెలుగు చూడకుండా ఉండే [...]

2008-06-28

చదువరి: దేశం తలపట్టుకుంది

2008-06-28 03:03 AM చదువరి (noreply@blogger.com)
నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. 'చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం' అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు. ప్రధాని తన ఇంట్లో, తన గదిలోనే తలపట్టుకుని కూచ్చుని ఉన్నాడు. ఆఫీసుకు పోలేదు. యావైందని

2008-06-27

తెలు-గోడు » రాజకీయాలు: మందమతి కృష్ణ

2008-06-27 04:44 PM అబ్రకదబ్ర
'ఆంధ్రజ్యోతి సంపాదకుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద అరెస్టు చేయటం ఎలా కుదురుతుంది' అని ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ పై 'ఆయన ఐఏఎస్ ఎలా పాసయ్యాడు? తప్పకుండా ఎవడో కమ్మోడు ఆయన పేపరు దిద్ది ఉంటాడు' అని హద్దులు మీరి వ్యాఖ్యానించటం ద్వారా తన తెలివితక్కువ తనాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు మంద కృష్ణ. ఐఏఎస్ పరీక్షా విధానంపై అతని అవగాహనా రాహిత్యానికిదో ఉదాహరణ. పైగా, 'మేము మాత్రం కులాల ప్రస్తావన తేవచ్చు. ఇతరులు తేకూడదు' అని నిర్లజ్జగా వ్యాఖ్యానించటం అతని విచక్షణా లేమికో మచ్చుతునక.

2008-06-26

చదువరి: కండకావరం

2008-06-26 06:18 PM చదువరి (noreply@blogger.com)
నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు? శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే! మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే

గుండె చప్పుడు...: కలమూ కులమూ జులుమూ

2008-06-26 05:51 AM Konatham Dileep
మొన్న జరిగిన సంఘటనలో విషాదం ఏమిటంటే మంద కృష్ణ కోపం ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ మీద అయితే దానికి బలి అయ్యింది మాత్రం కె.శ్రీనివాస్ కావటం. దళితుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ఆయనను ఈ కేసులో ఇరికించడం ద్వారా మంద కృష్ణ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అయ్యింది. మీడియాలో అగ్రవర్ణాల ఆధిపత్యం నిజమే అయినా అగ్ర వర్ణాల్లోనూ దళిత పక్షపాతులు ఉంటారనే చిన్న సత్యాన్ని మంద కృష్ణ వంటి వారు విస్మరించడమే బాధాకరం. [...]

2008-06-24

తెలు-గోడు » రాజకీయాలు: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం

2008-06-24 10:33 PM అబ్రకదబ్ర
'అర్ధరాత్రి స్వతంత్రమొచ్చింది, ఇంకా తెల్లవారలేదు' - మేడిపండులాంటి మన స్వతంత్రం గురించి ఏనాడో శ్రీశ్రీ వెలిబుచ్చిన ఆవేదనిది. రాష్ట్రంలో పత్రికలపై వరుసగా జరుగుతున్న దాడులు చూస్తుంటే అసలు మనకి స్వతంత్రమే రాలేదా అనిపిస్తుంది. స్వేచ్చలన్నింటిలోకీ తలమానికమైనది పత్రికా స్వేచ్చ. అది లేనిదే ఏ సమాజమూ ముందడుగేయదు. దుర్వినియోగమైనా సరే ఆ స్వేచ్చ ఉండటమే సమాజానికి మంచిది. పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో నిత్య అసమ్మతివాది స్థాయి నుండి పత్రికల ఊతంతో పైపైకెదిగిన ముఖ్యమంత్రికి ఆ సంగతి తెలియదనుకోవాలా?

జాబిల్లి » రాజకీయం: మీకు ఏ “తెలంగాణ” ?

2008-06-24 04:03 AM జాబిల్లి
ప్రస్థుతం రాస్ట్రంలొ జరుగుతున్న పరిణామాల ద్రుస్ట్యా  “తెలంగాణ” పేర్లకు తీవ్రకొరత ఏర్పడనుందని తెలియవచ్చినది కావున మీకు ఏ “తెలంగాణ” ? కావాలొ ఇప్పుడే ఎన్నుకునేఅవకాశం  కలిగిస్తున్నాం! త్వరపడండి  ఆలొ చించిన పదవి భంగం తప్పదు!   మీ కు ఏదైనా పేరునచ్చకపొయినా మీరు కొత్త పేరును ప్రతిపాదించవచ్చు ! రెండు తీసుకున్నవారికి ఒకటి అదనం………………. జై తెలంగాణ  ( లభిస్తుంది) తల్లి తెలంగాణ (విజయ శాంతి తీసుకున్నారు) నవతెలంగాణ (దేవేందర్ గౌడ్ తీసుకున్నారు అని టాక్) యువతెలంగాణ( లభిస్తుంది) చిరుతెలంగాణ(చిరంజీవికుమారుడు తెసుకున్నారని సమాచారం) మాతెలంగాణ( లభిస్తుంది) భలేతెలంగాణ( లభిస్తుంది) ఏతెలంగాణ( [...]

2008-06-23

చదువరి: తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది

2008-06-23 03:07 PM చదువరి (noreply@blogger.com)
దేవేందర్ గౌడ్ రాజీనామా చేసాడు. తెలుగుదేశానికి దెబ్బ తగిలినట్టే! (దీన్ని పార్టీ చీలిక అనొచ్చా అనేది ఇంకో నాలుగైదు రోజుల్లో తెలియవచ్చు) అయితే, అంతకంటే పెద్ద దెబ్బ తెరాసకు తగలొచ్చు. ఇక గౌడ్ ఏంచేస్తాడు? ఏదైనా పార్టీలో చేరొచ్చు. లేదా తానే ఒక పార్టీని పెట్టొచ్చు. ఏ విధంగా చూసినా గౌడ్ తెరాసతో చేరే ప్రసక్తి లేదు. కేసీయారు నియంతృత్వం సంగతి తెలిసీ గౌడ్ ఆయనతో చేతులు కలపడు. ఇప్పటికే కేసీయారు కాస్త

2008-06-09

తెలు-గోడు » రాజకీయాలు: మళ్లీ ‘విదేశీ హస్తం’

2008-06-09 08:40 PM అబ్రకదబ్ర
'భారత దేశాన్ని ఆర్ధికంగా బలహీనపరచేందుకు కొన్ని దేశాలు చేస్తున్న కుట్ర ఫలితమే చమురు ధరల పెరుగుదల'. కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోలియం ఆధారిత ఇంధనం ధరలపై వివరణిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఇది. అగ్ర రాజ్యంగా ఎదుగుతున్న భారత్ ను దెబ్బతీయటానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందట. నాలుగేళ్ల క్రితం నలభై డార్లకు దగ్గర్లో ఉన్న పీపా ముడి చమురు ధర ఇప్పుడు నూట నలభై దగ్గరకు రావటానికి ఇదే ప్రధాన కారణమట!

గుండె చప్పుడు...: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారితో ఓ సాయంత్రం

2008-06-09 06:04 AM Konatham Dileep
బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం మనం చాలాసార్లే చదువుతుంటాం. కానీ అటువంటి అరుదైన వ్యక్తులను కలిసే భాగ్యం మాత్రం ఎప్పుడో కానీ కలగదు. హేతువాదం గురించీ, తెలుగు బ్లాగుల గురించీ, కంకణబద్ధ రామాయణం గురించీ, హిందుస్తానీ సంగీతం గురించీ, అణు ఇంధనం గురించీ అనర్ఘళంగా మాట్లాడగల వారిని మనం రోజూ కలుసుకోం కదా? అటువంటి అదృష్టం మొన్న నాకు కలిగింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కొడవంటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ఈమధ్యే ప్రజాసాహితి వారు వేసిన [...]

2008-06-06

తెలు-గోడు » రాజకీయాలు: ఒబామా-హిల్లరీ జోడీ కుదిరేనా?

2008-06-06 11:27 PM అబ్రకదబ్ర
రెండు రోజుల క్రితం జరిగిన చివరి ప్రైమరీతో ఎట్టకేలకు డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్ధిత్వం బరాక్ ఒబామాకు దాదాపు ఖాయమయింది. ఊహించని రీతిలో హిల్లరీ క్లింటన్ చక్రం తిప్పితే తప్ప ఆయనే డెమొక్రాట్ల అధికారిక అభ్యర్ధిగా ఎంపిక కావచ్చు. హిల్లరీ అధికారికంగా ఓటమిని ఇంకా అంగీకరించకపోవటంతో ఆ అవకాశాన్ని కొట్టిపారేయలేం. శనివారం ఆమె ఓటమినంగీకరిస్తూ ప్రసంగిస్తారని వార్త.

2008-06-05

గుండె చప్పుడు...: మన బాధ్యతను మరో సారి గుర్తు చేసుకుందాం

2008-06-05 10:50 AM Konatham Dileep
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) వారి రెండు వీడియోలు మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఇంటర్నెట్ స్పీడు బాగున్న వాళ్లే ఇవి చూడ్డానికి ప్రయత్నించాలని నేను వేరేగా చెప్పఖ్కరలేదు కదా? మొదటి వీడియో: రెండో వీడియో ఇక్కడ చూడండి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకిప్పుడు నేను కొత్తగా గుర్తుచేయాల్సిన పనిలేదు. వీడియోలు చూసినా చూడకపోయినా అచ్చ తెలుగులో ఉప్పలపాటి ప్రశాంతి నిర్వహిస్తున్న బత్తీ బంద్ బ్లాగు చూడటం మాత్రం మరువకండి. [...]

2008-06-03

గుండె చప్పుడు...: ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లారా?

2008-06-03 10:50 AM Konatham Dileep
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లారా మీరెప్పుడైనా? ఇప్పటిదాకా వెళ్లకపోతే వెంటనే బయల్దేరండి.  విజయ్ రాం అనే కళాకారుడు నడుపుతున్నాడీ షాపుని. షాపు ముందరే మీకు నర్సరీల్లో ఉన్నట్టు కొన్ని మొక్కలు కనపడుతాయి. షాపులోకి అడుగుపెట్టిన కొద్ది క్షణాల్లోనే మీకు ఇది అలాంటి ఇలాంటి షాపు కాదని అర్థమవుతుంది. ఒక మూలకు రాగి బిందెలో మంచినీళ్లు ఉంటాయి. పక్కనే గోడకు వేలాడదీసిన కొన్ని తైలవర్ణ చిత్రాలు. వాటన్నిటిలో ఉండేది ఒకటే సందేశం. [...]

2008-06-02

గుండె చప్పుడు...: మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధానికి అనూహ్య ముగింపు (?)

2008-06-02 05:35 PM Konatham Dileep
నిన్న ఉదయాన్నే మా అన్న ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన వార్త విని నేను షాక్ అయ్యాను. “ఒక బ్యాడ్ న్యూస్, గులాబ్ సింగ్ చనిపోయాడు” నాకో క్షణం పట్టింది తేరుకోవడానికి. “ఎలా”? అనడిగాను. “మొన్న కర్ణాటక వెళ్తుండగా వీళ్ల కారును డీసీఎం ఢీ కొట్టిందట. డ్రైవర్ స్పాట్ డెడ్ అట, గులాబ్ సింగ్ నిన్న రాత్రి కింగ్ కోఠిలో ఉన్న కామినేని వోక్ హార్డ్ ఆస్పత్రిలో చనిపోయాడు, అతని భార్య ఇంకా కోమాలోనే ఉంది” చెప్పాడు మా అన్న. ఆ వార్త [...]

తెలు-గోడు » రాజకీయాలు: మోగనుందా ముందస్తు ఎన్నికల నగారా?

2008-06-02 12:49 AM అబ్రకదబ్ర
రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర భవిష్యత్తును విశేషంగా ప్రభావితం చేయగలిగే సంఘటనలు రెండు జరిగాయి. కొన్నాళ్లుగా ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న చిరంజీవి పార్టీ ప్రారంభం ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా జరగనుందనే స్పష్టమైన సంకేతం వాటిలో మొదటిది కాగా, ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి చావు తప్పి కన్ను లొట్టపోవటం రెండవది. మొదటి విషయం చిరంజీవి అభిమానులకూ, రెండవది రాష్ట్ర సమైక్యవాదులకూ అమితానందం కలిగించేవి.

2008-05-30

తెలు-గోడు » రాజకీయాలు: ఈసీ కోపం ఎవరికి చేటు?

2008-05-30 09:32 PM అబ్రకదబ్ర
రెండు వారాలుగా, ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ పార్టీల నాయకులు యధేచ్చగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లూ, వారందరిపైనా ఎలక్షన్ కమిషన్ కన్నెర్ర చేసినట్లూ వార్తలు రాని రోజు లేదు. సహజంగానే నిర్వాచన్ సదన్ కోపానికి ఎక్కువగా గురయింది అధికార పక్షం వాళ్లే. రోజూ కన్నెర్ర చేసీ చేసీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కళ్లెలా వాచిపోయాయో తెలీదుగానీ ఉప ఎన్నికల వేడిలో నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసిపారేస్తున్న అధికార పక్షీయులు మాత్రం ఆయన గోల అసలు పట్టించుకోనట్లే ఉన్నారు. ఎవడిగోల వాడిదే అంటే ఇదే కాబోలు.

2008-05-27

తెలు-గోడు » రాజకీయాలు: గెలిచి ఓడెనా, ఓడి గెలిచెనా?

2008-05-27 06:47 PM అబ్రకదబ్ర
మనదేశంలో ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్ధారించే పద్ధతి చాలా అర్ధరహితంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక పార్లమెంటు స్థానంలో పది లక్షల ఓట్లున్నాయనుకుందాం. అక్కడ నలుగురు పోటీ చేశారనుకుందాం. పోలయిన ఓట్లు ఆరు లక్షల చిల్లర - వాటిలో చెల్లినవి ఆరు లక్షలు ఉంటే, గెలిచిన వాడికి రెండున్నర లక్షలు, రెండో స్థానంలో ఉన్నవాడికి లక్షన్నర, మిగతా ఇద్దరికీ కలిపి రెండు లక్షలు వచ్చాయనుకుందాం. అంటే, గెలిచిన వాడు తన సమీప ప్రత్యర్ధిపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచాడన్న మాట. ఆహా, ఎంత పెద్ద మెజారిటీయో అనుకుంటాం మనం. అయితే, ఇందులో ఓ తిరకాసుంది.

2008-05-24

చదువరి: నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..

2008-05-24 07:10 PM చదువరి (noreply@blogger.com)
కాంగ్రెసూ, తెలుగుదేశం, భాజపా, తెరాస, అదీ, ఇదీ - అన్నీ పాలించడంలో విఫలమయ్యాయి. సభను రాజకీయాలమయం చేసారు: ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోవడం, ఎత్తులూ పైయెత్తులు వేసుకోవడం తప్ప, సభలో అర్థవంతమైన చర్చ జరపరు. రాజకీయాలను నేరమయం చేసారు: తుపాకులతో పోలింగు కేంద్రాలకెళ్ళి బెదిరించేవాడొకడు, దొంగ బిల్లులు పుట్టించి డబ్బులు కొట్టెయ్యబోయేదొకడు, వాణ్ణి రక్షించేందుకు జీవోలే పుట్టించేసే ప్రభుత్వాధినేతలు, క్షమాపణ

2008-05-23

తెలు-గోడు » రాజకీయాలు: నలభై మార్కుల నారాయణులు

2008-05-23 09:17 PM అబ్రకదబ్ర
మన దేశంలో రిజర్వేషన్లగురించి ప్రశ్నించడమో పాపం. రిజర్వేషన్లు ఎందుకని ఒక గొంతు అడిగితే సామాజిక, ఆర్ధిక కారణాల చిట్టా విప్పుతూ వంద గొంతులు వినిపిస్తాయి. దాదాపు అరవయ్యేళ్లుగా అమల్లో ఉన్నా వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్లతో ఒరిగినదెంత? ఆ తాయిలం చూపించి వాళ్లని ఎప్పటికీ వెనుకనే ఉంచటమే తప్ప నిజంగా ఆ వర్గాలని ఉద్ధరించాలనే సంకల్పం ఏ ప్రభుత్వానికుంది? అసలు, కులాల పేరుతో వెనకబాటుతనాన్ని కొలవటమేమిటి? నాలుగు ఓట్లు రాలతాయంటే అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఎంతో కొంత రిజర్వేషన్ ముష్టి విదిలించే ప్రభుత్వాల కాలమిది. కోటాల వల్ల ఒరిగిందేమీ లేకపోగా అవి అనుభవించే కులాల మధ్య ఎవరికెంత అనే విషయంలో గొడవలు మొదలై ఉద్యమాలదాకా వెళ్లాయి. ఇప్పటికే ఉన్న గోల చాలనట్లు మతాల పేరిట కూడా రిజర్వేషన్లిచ్చే ఆచారమొకటి కొత్తగా తలెత్తుతుంది.

2008-05-20

తెలు-గోడు » రాజకీయాలు: ఫ్యాక్ష-నిజం

2008-05-20 08:39 PM అబ్రకదబ్ర
కర్నూలు జిల్లాలో కొన్నేళ్ల నిద్రావస్థ తర్వాత మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం గతవారం స్థానిక కప్పట్రాళ్ల గ్రామ తెదెపా నేత పాలెగారు వెంకటప్పనాయుడుతో సహా తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీనిపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు ఎప్పటిమాదిరిగానే వైఎస్ పై, ఆయన ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఇది ఫ్యాక్షన్ ప్రభుత్వమని, ఈ ముఖ్యమంత్రి హయాంలో తమ పార్టీ కార్యకర్తలెవరి ప్రాణాలకూ భరోసా లేదనీ, .. ఇలా మనం ఎన్నో సార్లు వినున్న వాక్యాలే మళ్లీ వల్లె వేశారు. అయితే, హతుల నేపధ్యం తెలిసినవాళ్లకు చంద్రబాబు మాటలు గురివింద చందంగా అనిపిస్తే అది వాళ్ల తప్పుకాదు.

2008-05-19

తెలు-గోడు » రాజకీయాలు: రాజకీయ చిత్రం

2008-05-19 09:12 PM అబ్రకదబ్ర
చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖాయమైన నేపధ్యంలో తెలుగుదేశానికి మరింత సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. ఎన్టీయార్ వారసులందరూ తెదెపా వెనుకే ఉన్నారన్న సంకేతాలు జనంలోకి పంపే లక్ష్యంతో బాలకృష్ణ తదితర కధానాయకులని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలీదు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చినా, రాకపోయినా ఆయనే పార్టీకి మద్దతిస్తాడో ఎవరికి తెలియదు? ఇప్పుడు ఆయన తెదెపాలో ప్రధాన పాత్ర పోషించినంతమాత్రాన ఆ పార్టీ అదృష్టం రాత్రికి రాత్రి మారిపోతుందనేది అనుమానమే.

గుండె చప్పుడు...: మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం - 3

2008-05-19 11:23 AM Konatham Dileep
మొదటి భాగం రెండో భాగం గత వారం ఒక బస్సు నిండా రైతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధితో ఓ బృందం రాయ్ పూర్ బయలుదేరింది. వెనుక గులాబ్ సింగ్ తన కారులో బయలుదేరాడు. నేను ముందే మా బంధువులకు ఫోన్ చేసి అక్కడ ఏమేం పరిశీలించాలో చెప్పాను. వారు బయలుదేరాక రెండు రోజులకు అక్కడి నుండి వచ్చిన వార్త నన్ను ఒక క్షణం ఆశ్చర్యపరచింది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో గులాబ్ సింగ్ కారును [...]

2008-05-14

దిల్ సే ... » రాజకీయాలు: నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

2008-05-14 11:58 AM శ్రవణ్
కొంతమంది యువకులు... పుట్టుకతో వృద్ధులు...

2008-05-05

జాబిల్లి » రాజకీయం: మన్మొహనా…స్పంధించవేమిరా!!

2008-05-05 05:25 AM జాబిల్లి
మన మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి! మనం మంచి ఆహారం కొరకు ఆరాటపడుతున్నాం!అందువల్ల ధరలు విపరీతముగాపెరిగాయి…బుష్. కాని మన  మధ్యతరగతి వారి సంపాదన పెరిగింది ఇది నిజం కాని మధ్యతరగతి వాడికి అవసరమైన అన్ని ధరలు విపరీతముగా పెరిగాయిగా!కాని బుష్ చెప్పిన దానిలొ నాకు తప్పులేదని అనిపిస్తుంది!ఆయన అన్నది నిజం కాని మనబాధలు గుర్తించకపొవటం భాధాకరం,కాని ఆయన మనల్లె ఎందుకు పరిగణ లొకితీసుకొవలసి వచ్చింది? మన మార్కెట్ ఎక్కువ కాబట్టేగా! దీనిని మన నాయకులు మనల్లి ఎదోఅన్నారని(తిండి పొతులమని)ఒకటే ఖండన,అవును ఖండించవలసిన విషయమే!! మనళ్ళి [...]

2008-05-03

జాబిల్లి » రాజకీయం: గుంటూరు మిర్చి యార్డ్ లొ అగ్నిప్రమాదం !!

2008-05-03 10:13 AM జాబిల్లి
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకినిప్పు అడిగాడట!,పాపం మార్కెట్ మొత్తం తగలబడి వాళ్ళు ఎడుస్తుంటే ఇక టి.వి వాళ్ళకి ఓకటే పండగ!పొద్దుటినుంచి ఒకటే దొబ్బుడు!ఏమైనా ఆసియాలొ నే అతిపెద్ద మార్కెట్ యార్డ్ లొ కనీస సౌకర్యాలు లేకపొవడం విడ్డూరం! దీనిపై ప్రభుత్వం ఏవిదమైనచర్యలు చేపడుతుందొ వేచిచూడవలసిందే!

2008-04-27

తెలుగు 'వాడి'ని: 'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా !? - ఈనాడుఆంధ్ర పోల్

2008-04-27 03:18 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
ఈరోజు యాధృశ్చికంగా ఈనాడుఆంధ్ర.కాం (courtesy : కొత్తపాళీ గారి తెలుగు భీభత్సం టపా) అనే వెబ్ సైట్ కి వెళ్లగా అక్కడ కనబడిన ఈ చిరు vs యన్.టి.ఆర్ అనే పోల్ కనబడటంతో దాని ఫలితం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించటంతో మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా .... పైన ఆశ్చర్యం అని ఎందుకు అన్నాను అంటే మనం చూసే/చదివే అన్ని(కుడి-ఎడంగా) ప్రముఖ పత్రికలలో మరియు/లేదా వెబ్ సైట్స్ లో ఇంత పెద్ద తేడాతో చిరు కి వ్యతిరేకంగా

2008-04-25

చదువరి: ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

2008-04-25 03:42 AM చదువరి (noreply@blogger.com)
ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది. మొదటిది: తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి

2008-04-16

దిల్ సే ... » రాజకీయాలు: చిరంజీవి రాజకీయాల్లోకి రావాలా?

2008-04-16 01:55 PM శ్రవణ్
ప్రత్యేకించి చిరంజీవి, సినిమావాళ్ళు అని కాదు గాని, రావాలండీ బాబూ! ఎక్కడెక్కడ ఈజీమనీ ఉందో, అక్కడక్కడ ఉన్నవాళ్ళంతా రాజకీయాల్లోకి తొందరగా రావాలి. అంటే వీళ్ళంతా సులభంగా సంపాదించేశారని కాదు గానీ. ఏదో ఒక మతలబు చెయ్యకుండా సంపాదించరు కదా ‘ఈజీమనీ’ ని. రాజకీయాల తర్వాత అంతటి రాజకీయాలుండేది మన సినిమాల్లోనే అంటారు కదా! నాకు తెలిసినంతలో ఈ విషయాలు పేపరువాళ్ళదాకా వచ్చి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోతాయి. ఇప్పుడు మన రాజు గారూ, ఇంకా రాజులా ఫీలయ్యే పాత [...]

2008-04-08

దిల్ సే ... » రాజకీయాలు: పొలిటికల్ సెటైర్

2008-04-08 04:44 PM శ్రవణ్
రెండే ఎకరాలు . . . . అంటుంటారు నోరు జాగర్త . . . . వళ్ళు జాగర్త నేను ఏతప్పూ చెయ్యలేదు . . . . . . మా టైంలో స్కాములు అస్సలు లేవు. <–ఈ పక్కన ఆయను తెగతి(oటు)న్నాడు–>

దిల్ సే ... » రాజకీయాలు: పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

2008-04-08 07:35 AM శ్రవణ్
కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది. గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది. పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు. అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు. కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు. సందట్లో సడేమియా: ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు. [...]

2008-04-04

చదువరి: అవిశ్వాస బీచి వాలీబాలు

2008-04-04 07:05 AM చదువరి (noreply@blogger.com)
హైదరాబాదుకు సముద్రాన్ని తీసుకొస్తానని రాజకీయులు వాగ్దానాలు చెయ్యడం గతంలో జోకు. అది నిజమయ్యే రోజు దగ్గర పడుతుందేమోనని మిత్రుడొకడన్నాడు. అదేంటని అడిగితే.. "అవును, బీచి వాలీబాలు ఆడుతున్నారుగా.. బీచి వచ్చేసినట్టే మరి! ఇహ సముద్రాన్ని లాక్కురావటమెంతసేపు?" అని అన్నాడు. అసలు బీచే లేని హై.లో కూడా కాస్త ఇసక పోసి బీచి వాలీబాలు (బీవా) ఆడేసెయ్యొచ్చని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. తీరా అసలు సంగతి ఇది.. జనాలని

2008-04-02

చదువరి: ఏప్రిల్ 1 వచ్చింది.. పోయింది!

2008-04-02 02:10 AM చదువరి (noreply@blogger.com)
ఎమ్మెల్యేల ఆర్జనలపై విచారణ అన్నారు. ఇప్పటి వాళ్ళే కాదు.., 1978 నుండి ఎన్నికైన వారందరిపైనా అని అన్నారు. ఏప్రిల్ 1 న తేల్చేస్తామని అన్నారు. ఏప్రిల్ 1 వచ్చింది.., పోయింది కూడా! కానీ ఏం జరగలేదు. ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎత్తలేదట. స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు.. అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ - రెండూ సరిసమానమైనవేనట, అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట, ఇప్పుడు ప్రజా

2008-03-26

జాబిల్లి » రాజకీయం: సాక్షి

2008-03-26 09:58 AM జాబిల్లి
http://sakshi.com  ఈ’సాక్షి’ లొ సరుకు లేదు..!
వ్యాఖ్యలు
2008-08-25
2008-08-25 04:03 AM Konatham Dileep - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

మనోహర్ గారూ,

ఆపరేషన్ పోలో సందర్భంగా చనిపోయిన ముస్లిముల సంఖ్య గురించి చాలా వివాదం ఉంది. ఈ సంఖ్య 50,000 వరకూ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. పోలీస్ ఆక్షన్ అనంతరం భారత సైన్యం ముస్లిములపై జరిపిన అత్యాచారాల సంగతి తెలుసుకున్న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ హింసపై ఒక విచారణ కమీషన్ వేశాడు.

ఆ రిపోర్టు మొత్తం ఎప్పటికీ వెలుగు చూడకపోయినా ఇటీవల అందులోంచి కొన్ని భాగాలను ఫ్రంట్ లైన్ పత్రిక ప్రచురించింది. అవి ఇక్కడ చదవచ్చు:

http://www.hinduonnet.com/fline/fl1805/18051140.htm

2008-08-23
2008-08-23 06:08 AM మనోహర్. - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

తెలాంగాణ పోరాటం గురించి తెలియచేస్తున్నందుకు చాల సంతోషం,కానిభారత సైనికులు ముస్లిములను ఊచకోత కోషారని వ్రాశారు.నిజమా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా?ఏమైనా పేపర్ క్లిప్పింగ్స్ ఉంటే చెప్పండి.నాకు చాలా అవసరం
-మనోహర్,
-manoharmane1969@yahoo.com

2008-08-16
2008-08-16 06:40 PM తాడేపల్లి - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

అయ్యా ! Suresh Parapally గారూ!

తమకెందుకొచ్చిన కంఠశోష ? మీకేమో తెలుగులో రాయడం రాదు. ఇంగ్లీషులో తెలుగు రాసుకునే స్థితిలో ఉంటిరాయె. ఆ రాసినదాంట్లో కూడా శుద్ధంగా Telangana అని తిన్ననైన స్పెల్లింగు రాయడం చేతకాలేదు. మీరు కూడా తెలంగాణ గుఱించి మాట్లాడేవారే ! మా ఖర్మ !

ఒక లగడపాటిని అనడం దేనికి ? మేమందరమూ లగడపాటులమే !

2008-08-14
2008-08-14 12:59 PM suresh parapally - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

lagadapati antha telengha dabbu dochu kunthu dailogs vyathirekangha matladuthunu telenga lo telenga ratstra droham telengana vidrohi telengana pourudu chance untha telenganakosam lagadapatini drohigha gurthinchala

2008-08-08
2008-08-08 09:32 PM sbmurali2007 - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

Very true.
The nuclear deal and allowing international chains into food are the two most dangerous things about to happen.
We are allowing others to dictate terms to us in the most important areas of life, namely food and defense.
The nuclear deal will open up all our nuclear plants and research reactors to the international community, which is a blow to our self-determination and independence.
Letting food/agriculture be dominated by international players is about the most foolish thing in view of the country’s future, I feel.
A very well written article.
regards
Sharada

2008-08-01
2008-08-01 01:54 PM పొద్దు » Blog Archive » జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

[...] అణు ఒప్పందం ఒక ధృతరాష్ట్ర కౌగిలి అంటూ గుండెచప్పుడులో కొణతం దిలీప్ చెబుతున్నారు. [...]

2008-07-30
2008-07-30 03:24 AM Dil - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

శ్రీకాంత్ గారూ,

పోలేపల్లి విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో పోస్టులో స్పష్టంగానే వివరించాను. ఇక్కడి ప్రజలు మొదటి రోజు నుండీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిన్నమొన్నటి దాకా ఏ రాజకీయ పార్టీ వీళ్ల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ అంశం పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేసరికి నాగబాబు మొదలుకొని చంద్రబాబు వరకూ పోలేపల్లి గురించి మాట్లాడుతున్నారు.

నమ్మలేని ఇంకో విషయం ఏమిటంటే చాలా మంది బాధిత రైతులకు బ్యాంకుల్లో పంట రుణాలు ఉండటం వల్ల భూమికి నష్ట పరిహారంగా వచ్చిన సొమ్ములోంచి ఆ బ్యాంకు రుణాన్ని మినహాయించుకుని ఇచ్చారు. తత్ఫలితంగా ఎకరానికి మూడు, నాలుగు వేలే దక్కిన దురదృష్టవంతులూ ఉన్నారు.

ఇప్పుడు మీరు జడ్చర్ల బస్ స్టాండ్ వైపు వెళ్తే ఇద్దరో ముగ్గురో పోలేపల్లి బాధితులు బిచ్చమెత్తుకుంటూ కనపడతారు. జరుగుతున్న “అభివృద్ధి” ఎవరిదో, దానికి ఎవరు మూల్యం చెల్లిస్తున్నారో ఆ దృశ్యం చూస్తే అర్థం అవుతుంది మనలాంటి వాళ్లకు.

2008-07-30 02:25 AM రవి వైజాసత్య - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

దేశస్వాతంత్ర్యము, వ్యక్తిగత స్వాతంత్ర్యము ఒకటి కాదు..దేశానికి స్వాత్రంత్ర్యం రాగానే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం వస్తుందనుకోవటం భ్రమ. ప్రతితరంలో ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిందే.

2008-07-29
2008-07-29 04:41 PM P.Srinivas - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

chala manchi vishayalu vhepparu madam

2008-07-29 01:11 PM srikanth - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

ఈ వ్యవహారం గురించి నాకు తెలియదు గాని నాకు తెలిసిన ఇంకో కేసు లో భూ సేకరణ సమయంలో భూమిని ప్రజలు సంతోషం గా ప్రభుత్వానికి అమ్ముకొని రెండేళ్ళ తరవాత రెట్లు పెరిగాక అల్లరి మొదలు పెట్టారు ప్రభుత్వ విధానాల గురించి
అదే గొడవ ప్రభుత్వం భూమి అడిగినప్పుడు ఎవ్వరూ చెయ్యలేదు, ఎందుకంటే మంచి రేటు వచ్చింది కాబట్టి . రెట్లు పదిపోయి ఉంటే అదే గొడవ చేసేవారా అని నా అనుమానం

పోలేపల్లి విషయంలో అలాంటిది ఏమయినా ఉందేమో చూసారా ?
16,000 ఎకరానికి నమ్మశక్యంగా లేదు , ఆ రోజు ఎ ప్రతిపక్షం ఆయినా పత్రిక అయినా దీని గురించి పట్టించుకుందా ?

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish