ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2012-02-02

ప్రజ్ఞ: "కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"

2012-02-02 07:16 AM tejaswi (noreply@blogger.com)
‘పీసీసీ నాయకత్వం కాపుకు’, ‘మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు’, ‘కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు’. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా

నేటి రాజకీయం: టి.ఆర్.ఎస్ సీన్ రివర్స్

2012-02-02 06:18 AM admin

రాజీనామాలు  చేయడం, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లో విజయవంతమైన అనుభవం టి.ఆర్.ఎస్ కు  చాలానే ఉంది. అయితే అంత అనుభవం ఉన్నా కూడా, టి.ఆర్.ఎస్ ఈ సారిఉప  ఎన్నికలకు భయపడుతుంది. తెలంగాణ ప్రాంతం  అంతటా తనకు మాత్రమే మద్దతు ఉందని మొన్నటివరకు అనుకున్న టి.ఆర్.ఎస్ ఇప్పుడు  ఆలోచనలో పడింది. తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి.  అయితే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తెరాస కు నల్లేరుపై నడక మాత్రం కాదు. తెలంగాణ సాధన కోసమే అంటూ టి.డి.పి నుంచి బయటకు వచ్చిన నాగం జనార్ధనరెడ్డి పై పోటీ పెట్టే అవకాశం టి.ఆర్.ఎస్ కు లేదు. అలా అని నాగం తెరాసలో చేరనూ లేదు. అలాగే పరకాల నియోజకవర్గం కూడా డైలమాలోనే ఉంది. పరకాలలో  కొండా సురేఖను తప్ప తెలంగాణలో మరెక్కడా పోటీ చేయబోమని జగన్, కేసీఆర్ కు పరోక్షంగా స్నేహ హస్తం ఇచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ స్థానంలో కూడా తెరాస పెద్దగా ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. మహబూబ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తెరాస ఎవరిని నుంచోబెట్టినా కూడా సానుభూతి పవనాలు రాజేశ్వరరావు భార్యకే ఉంటాయి గనుక ఆ స్థానం ఆశలు వదులుకున్నట్టే. రాజేశ్వరరావు భార్య మొదట టి.ఆర్.ఎస్ లో చేరతారని అనుకున్నా, కాంగ్రెస్ పెద్దలు జోక్యంతో ఆమె అధికార పార్టీలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్ ను తెరాస తమ అభ్యర్ధిగా నిలపనుందని సమాచారం. అయితే ఆయనకు విజయావకాశాలు మాత్రం తక్కువే. కామారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే గంపా గోవర్ధన రెడ్డికి,  ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం టి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్ధిగా నిలబడటం వలన అతను గెలిచే అవకాశాలు ఉండవు. ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన టి.రాజయ్యపై కూడా నియోజకవర్గం లో వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత శ్రీహరికి మంచి క్యాడర్ ఉంది.  కడియం శ్రీహరి గనుక ఉపఎన్నికల్లో పోటీ చేస్తే టి.రాజయ్య ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయవిశ్లేషకుల మాట. ఇలా నియోజకవర్గం వారీగా సమస్యలతో పాటు బి.జె.పి రూపంలో టి.ఆర్.ఎస్ కు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి తోనే సాధ్యం అంటూ చేస్తున్న తెలంగాణ పోరు యాత్రకు మంచి స్పందన వస్తుంది. బిజేపే తన బలాన్ని అంచనా వేసుకోవడానికి ఈ ఉప  ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీజెపీ చీల్చేది టి.ఆర్.ఎస్ ఓట్లనే. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా నెమ్మదిగా తమ పార్టీ పునర్వైభం కోసం ప్రయత్నిస్తుంది. పోలవరం టెండర్లు, అర్ధాంతరంగా సకలజనుల సమ్మె ముగించడం వంటి విషయాలతో టి.ఆర్.ఎస్ పట్ల తెలంగాణ ఓటర్లకు ఏర్పడిన సందేహాలను ఆ పార్టీ తీర్చలేదు. ఈ విషయాలన్నీ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బ  తగిలేలా చేస్తాయని విశ్లేషకుల అంచనా.

2012-02-01

కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: రాళ్ళూ, రప్పలూ, సిమెంట్ బొమ్మల కోసం హింస అవసరమా?

2012-02-01 12:45 PM

టైమ్ స్టాంప్ మార్చ్ 10 అని ఎందుకు వేశానంటే మార్చ్ 10వ తేదీకి ట్యాంక్ బండ్ విగ్రహాలు కూల్చి ఏడాది అవుతుంది కాబట్టి.

విగ్రహాలు కూల్చినంతమాత్రాన తెలంగాణా రాదు. అలాగే విగ్రహాలు కూల్చినవాళ్ళ మీద పడి ఏడవడం కూడా నిజాయితీపరుల లక్షణమని నేను అనుకోను. విగ్రహాలు కూల్చేవాళ్ళు మూర్ఖులైతే విగ్రహాలు కూల్చడం వల్ల తమ సంస్కృతి ద్వంసం అయిపోయిందని గగ్గోలు పెట్టేవాళ్ళు మహామూర్ఖులు.

నేను ట్యాంక్ బండ్ విగ్రహాల కూల్చివేతని సమర్థించినా ఆ కూల్చివేత వల్ల తెలంగాణావాదులకి పెద్ద లాభం రాలేదనే నమ్ముతాను, సమైక్యవాదులకి కూడా పెద్ద నష్టం రాలేదని నమ్ముతాను. విగ్రహాలు కూల్చడం వల్ల పోయేవి సిమెంట్, రాళ్ళూ, రంగులూ తప్ప సంస్కృతో, సజీవరూపాలో పోవని నేను ఇప్పటికీ నమ్ముతాను.

ఈ లింక్‌లు చదవండి, విషయం అర్థమవుతుంది:

http://venuvu.blogspot.in/2011/03/blog-post.html

http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html

చిహ్నాల ద్వంసం వల్ల ఆ చిహ్నాన్ని ఉపయోగించుకున్న సంస్కృతి పోదు అని అంటారు. నిజమే. చిహ్నాల ద్వంసం వల్ల ఏ సంస్కృతీ పోదు. మంగళ సూత్రం అనేది వైవాహిక సంబంధంలో పురుషాధిక్యతకి చిహ్నం. కానీ పెళ్ళైన స్త్రీలు మంగళ సూత్రాలు తీసేసినంతమాత్రాన పురుషాధిక్యత పోదు. అలాగని ఆడవాళ్ళు మంగళసూత్రాలు తీసెయ్యాలనే స్త్రీవాదుల వాదనలో తప్పుందని అనగలమా? చిహ్నాలని త్యజించడం ఒక్కటే సాంస్కృతిక మార్పుకి దారి తీస్తుందని ఎవరూ అనలేదు. అలాగని చిహ్నాలని త్యజించడం కూడా తప్పు అని అనలేము కదా. స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళు మంగళ సూత్రాలు తీసెయ్యకుండా "తీసేసినంతమాత్రాన స్త్రీ-పురుష సంబంధాలలో మార్పులు రావు" అని చెప్పుకుంటూ తిరిగితే మార్పు ఎన్నటికీ రాదు. మంగళ సూత్రాలని తీసెయ్యడం కేవలం మార్పులోని ఆరంభానికి సూచన కావాలి.

అలాగే విగ్రహాల ద్వంసం కూడా ఉద్యమంలో ఒక భాగంగా జరిగిందనుకోవచ్చు కానీ అదే ఉద్యమమని ఎవరూ అనలేదు కదా. కనుక ఇక్కడ విగ్రహాల ద్వంసం వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతీయతత్వాన్ని సూచించే సంస్కృతి పోదు అనే వాదన ఎందుకు?

Permalink | Leave a comment  »

కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: రైతుల ఆత్మహత్యలు

2012-02-01 12:45 PM

ఈ డాక్యుమెంటరీ రూపొందించినది తెలంగాణాకి చెందిన వివేక్ అనే వ్యక్తి. ఈ వీడియోలోని దృశ్యాలు మహారాష్ట్రలో షూటింగ్ చెయ్యబడినవి.

Permalink | Leave a comment  »

నేటి రాజకీయం: రోశయ్య చూచారా..? కేంద్రాన్ని తూర్పారబట్టారా!!

2012-02-01 06:19 AM admin

ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్య కేంద్రాన్ని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ హోదాలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రోశయ్య ప్రసంగంతో అక్కడి కాంగ్రెస్ వర్గాలు బిక్కచచ్చిపోయాయి.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారంనాడు గవర్నర్ హోదాలో తొలి ప్రసంగం చేశారు రోశయ్య. ముళ్లైపెరియార్ డ్యామ్ వివాదంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని అన్నారు.

రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయడమే కాక పథకాల రూపకల్పనలో విపక్ష పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జయలలిత పాలనను, పథకాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రసంగం ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.

సహజంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్నే ఆయా రాష్ట్రాల గవర్నర్లు చదువుతారు. అయితే, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రసంగ పాఠాలకు గవర్నర్లు మార్పులు చేస్తుంటారు. ఐతే రోశయ్య మాత్రం అలాంటి మార్పేమే చేయకుండా ఉన్నదిఉన్నట్లుగా చదివేశారు. ఇది కాంగ్రెస్ వర్గాలకు అసహనాన్ని కలిగిస్తోంది.

2012-01-04

గుండె చప్పుడు...: నాకొక స్వప్నం ఉంది!

2012-01-04 05:55 AM Konatham Dileep
అక్టోబర్ 15, 2011 అగ్రరాజ్యపు అధికారపీఠం కాపిటల్ హిల్ ప్రాంగణం నుండి ఖంగున మోగుతున్న మాభూమి సంధ్యక్క గొంతు అటు యూనియన్ స్టేషన్ నుండి ఇటు కాన్స్టిట్యూషన్ అవెన్యూ వరకూ ప్రతిధ్వనిస్తున్నది. “జై తెలంగాణ” నినాదాలతో వాషింగ్టన్ డిసీ వీధులు మార్మోగిపోతుంటే … ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది. ఎక్కడ తెలంగాణ? ఎక్కడ వాషింగ్టన్? అక్కడ సకల జనులూ నభూతో అన్నట్టుగా సమ్మెకట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తున్న వేళ, మేము సైతం అంటూ అమెరికాలో ఉంటున్న [...]

2011-12-12

గుండె చప్పుడు...: మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం

2011-12-12 05:21 AM Konatham Dileep
చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు: (నవంబర్ 1955 గోలకొండ పత్రిక నుండి) — — — — — — — — —

2011-11-08

ప్రజ్ఞ: శభాష్ ఆంధ్రజ్యోతి!

2011-11-08 06:21 PM tejaswi (noreply@blogger.com)
జనార్దనరెడ్డి గనుల అక్రమాలకేసుకు సంబంధించి జగన్మోహనరెడ్డిని సీబిఐ విచారించిన వ్యవహారంలో వాస్తవాలను బయటపెడుతూ ఆంధ్రజ్యోతి నిర్వర్తించిన పాత్ర ప్రశంశనీయం. సీబీఐ కార్యాలయంనుంచి బయటకొచ్చి, యువనేత చెప్పినదానికి విరుద్ధంగా లోపల జరిగిన అసలు తతంగాన్ని బయటపెట్టడమేకాకుండా, ఈ మొత్తం ఉదంతంలో కీలకసాక్షి అయిన కొండారెడ్డి ఇంటర్వ్యూను కూడా ఇచ్చి...గొర్రెలమందలాగా, మూసకార్యక్రమాలతో నడుస్తున్న తెలుగుమీడియాసంస్థలకు

2011-11-04

చదువరి: సీబీఐ ని విచారించిన జగన్ !

2011-11-04 01:55 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు. ’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ,

2011-10-21

చదువరి: గెలిచినవాడు నీచ మానవుడు

2011-10-21 02:36 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది. తమకు వోట్లు వెయ్యనంత మాత్రాన ప్రజలను

2011-09-26

జాబిల్లి » రాజకీయం: తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

2011-09-26 09:22 AM కట్టా విజయ్
నాకు జనాలు  తెలంగాణ ఎందుకు కావాలనుకు కావాలొ వివరిస్తారా ! సొది చెప్పకుండా  అంటే  … 1.మనం వెనక బడ్డాం  కాబట్టి 2.మాతెలంగాణ మాకు కావాలి 3. మీము మీతొ కలిసి ఊండం 4.మావనరులు మాకే ఇలాంటి సొల్లు కాకుండా , శాస్త్రీయంగా ఎవరైనా వివరిస్తారేమొనని చుస్తున్నా. తెలంగాణా వాళ్ళే చెప్పాలని ఏంలేదు … ఆంద్రాలొను తెలంగాణా కు మద్దతుతెలిపే వారెవరైనా చెప్పొచ్చు. నాకు నిజంగా తెలంగాణా ఎందుకు కావాలొ తెలియడంలేదు … ఒక తెలంగాణా వాడినై [...]

2011-08-17

చదువరి: మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

2011-08-17 06:38 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
అడ్డెడ్డె... అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా? అవినీతి పట్ల ప్రజల్లో ఉన్న క్రోధానికి అన్నా హజారే ప్రతీక. అలాంటి వ్యక్తిని ’నిలువెల్లా

2011-08-16

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అన్నా హజారే x అవినీతి నాయకులు

2011-08-16 10:57 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
అవినీతి పై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజారే ను జైలులో పెట్టి భారత దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత నీచమైన స్థాయికి దిగాజారిపోయారో ప్రజలందరికీ నిస్సిగ్గుగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా.   అక్రమ సంపాదన, అధికార దాహంతో ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్న ప్రస్తుత రాజకీయనాయకులు అవినీతి, అక్రమ సంపాదనలను అడ్డుకోడానికి సహకరించే ఏ బిల్లు నైనా ఆమోదింప చేస్తారని

జాబిల్లి » రాజకీయం: అన్నా హజారేకు మద్దతుగా నడక

2011-08-16 08:48 AM కట్టా విజయ్
నమస్కారం, స్నేహితులకు రేపు ఉదయం అన్నా హజారేకు మద్దతుగా ఒక నడక కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటున్నాం.. ఒక అరగంటసేపు . 1.కూకట్పల్లి JNTU నుంచి … మలేషియన్ టౌన్షిప్ వరకు లేదా 2. IIIT నుంచి WIPRO సర్కిలె వరకు .. timings : 8:30 or 9:00 to 30 minutes మీ అభిప్రాయం తెలపండి! మీ అభిప్రాయం తెలపండి! Filed under: రాజకీయం, సమావేశం

2011-08-05

చదువరి: సమస్యలు బాబోయ్ సమస్యలు

2011-08-05 07:36 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి: మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి:  మంత్రులు, అధికారులూ నా మాట

2011-08-02

మతాలు - రాజకీయాలు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ

2011-08-02 01:09 PM చదువరి

డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-

ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.

భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.

హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు  భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.

హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.

భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.

హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.

ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.

మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.

రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.

ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.

ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం:  370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.

ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.

ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.

ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం:
హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.

ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.

ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.

భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.


2011-06-14

చదువరి: మరింత దిగజారిన లౌకికవాదం

2011-06-14 04:37 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
హిందూ వ్యతిరేక భావాలను పదేపదే నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది లౌకికవాదం.  బాబా రామ్ దేవ్ ఆరెస్సెస్ ఏజంటుఅన్నా హజారే ఆరెస్సెస్ ఏజంటు ఇద్దరు పౌరులు తమతమ దారుల్లో చేస్తున్న ప్రజా పోరాటాల గురించి కాంగ్రెసు పార్టీ స్పందన ఇది. దోపిడీకి గురైన ప్రజలధనాన్ని వెనక్కి రప్పించడం కోసం, సదరు దోపిడీ దొంగలను పట్టుకుని చట్టానికి కట్టేసే వ్యవస్థ కోసమూ కృషి చేస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెసు పార్టీకి కంటగింపుగా మారింది.

2011-06-08

పాలవెల్లి: కమ్యునిస్టులకు ఎవరంటే ద్వేషం

2011-06-08 12:20 AM Amar (noreply@blogger.com)
బాబాలంటే ద్వేషం లేదు. దేవుడు అంటే విశ్వాసం లేకపోవచ్చు అంతేకాని దేవుడన్నా..దేవుణ్ని విశ్వసించే వారన్నా వారికి ద్వేషం ఏమాత్రమూ లేదు. వారు ద్వేషించేదల్లా దేవుడి పేరుతో దగాలు, దేవుడి పేరుతో సమాజాన్ని చైతన్యరహితం చేయడం, మొన్న ముఖ్యమంత్రిలా 'అంతా నుదుటి రాత' అంటూ నిష్క్రియాతత్వాన్ని ప్రోత్సహించడం, 'మా దేవుడు తప్ప..ఏ దేవుడు కాదు గొప్ప' అన్న వాగ్వాదాలతో సమాజాన్ని భ్రష్టు పట్టించడం, అదే దేవుడి

2011-05-29

చదువరి: మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

2011-05-29 10:28 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు. మఖ్యమైన విశేషమేంటంటే - మామూలుగా చంద్రబాబు ప్రసంగం బోరు కొడుతుంది, వినబుద్ధి కాదు. సాధారణంగా నాయకుల ప్రసంగాల్లో ఫిల్లరు పదాలు ఉంటూంటై. కానీ చంద్రబాబు ప్రసంగంలో ఫిల్లర్లుగా ’పదాలు’ కాకుండా ఏకంగా ’వాక్యాలే’ ఉంటై. ముఖ్యమైన విషయాలు కూడా ఈ ఫిల్లరు వాక్యాల మధ్య నలిగిపోతూంటాయి (

2011-05-22

చదువరి: "అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

2011-05-22 06:17 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.) "చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు. ఘొల్లురవి: ఈయన స్వరం కొంచెం వీకు. గొంతుపెంచి ప్రత్యర్థుల్తో వాగ్యుద్ధం చేస్తాడుగానీ, అవతలి గొంతుల హోరులో  కొంచెం వెనకబడుతూంటాడు. ముందు తెలుగు రాజ్యాన్ని తిట్టి ఆ తరవాత పాయింటు కొస్తూంటాడు. ఆయనిలా అన్నాడు: "చూడండీ.. రెండువేల

2011-05-21

చదువరి: హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

2011-05-21 03:31 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు

2011-05-19

చదువరి: సానుభూతి గెలిచింది

2011-05-19 06:36 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి: ఎక్కువ ప్రజాభిమానం కొనుక్కోవడం చేత: అందరూ వోట్లను కొనజూసినవారే. కానీ జగను పద్ధతి వేరు.. తనవాళ్లనే కాదు, తనకు ఖచ్చితంగా వోటెయ్యరు అని అనుకున్నవాళ్ళకు కూడా డబ్బులిచ్చాడంట, మనసు మారితే వేస్తారేమోనని. తండ్రి చాటున రాష్ట్రాన్ని దోపిడీ

2011-04-14

చదువరి: ఉండవల్లి అస్త్రం

2011-04-14 06:48 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
ఉండవల్లి అరుణ్ కుమార్ జగనుపైకి ఒక పదునైన ఎన్నికల అస్త్రాన్ని విసిరాడు. పేరుబెట్టి పిలిచి, నిలదీసి ఉండవల్లికి అవకాశమిచ్చాడు జగను. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు. అసలు జరిగిందేంటంటే.., సాక్షి టీవీ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఉండవల్లిని ఊసరవెల్లి అంటూ ఒక అరగంట పాటు నానావిధాలుగా తిట్టారంట. ఏదో ఒక విషయం గురించి చెప్పడం, ఏమయ్యా ఉండవల్లీ దీనికి సమాధానం ఏంటి అని అడగడం - ఇలా

2011-03-28

చదువరి: వయ్యెస్సార్ రౌడీ మూక

2011-03-28 04:42 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట.  అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట)  తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట. కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు" ...............

2011-03-15

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: తెగించిన తెలిబాన్లు

2011-03-15 11:12 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాల కూల్చివేత తో తెలంగాణా తెలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్ లను మించిపోయారని రుజువు చేసారు. ఆ తాలిబాన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసినప్పటికంటే ఈ తెలిబాన్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం సాక్షి గా చేసిన ధ్వంస రచన సమస్త తెలుగు జాతిని నివ్వెర పరచింది, ఎంతో ఆవేదనకు గురి చేసింది. తెలంగాణా వుద్యమం తో కూల్చివేయబడ్డ కవులు, కళాకారులు, జాతి నిర్మాణ

2011-03-07

పాలవెల్లి: 'నేను తప్పు చేసాను'

2011-03-07 10:28 PM Amar (noreply@blogger.com)
'నేను తప్పు చేసాను' నిండు సభలో పెద్దాయన నిసిగ్గు ప్రకటన బలే బలే.. శభాష్ శభాష్ బల్లలు చరిచి స్వపక్షం, స్వకూటమి అభినందన  ----------------------------------------------------- ఆహా ఇదిగదా అసలు భారతం  అవినీతి రాజ్యం..కాంగ్రెస్స్ కరప్సన్ భోజ్యం దేశానికి పట్టిన దరిద్రమేంటి ..? అత్యున్నత న్యాస్థానం అచేతన ప్రశ్న.

2011-02-17

చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

2011-02-17 01:43 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
గవర్నరు గారూ, ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే

చదువరి: శాసనసభ వద్ద రౌడీలు

2011-02-17 06:32 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ  మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది. ఇన్నాళ్ళూ రౌడీయిజం రోడ్లమీదే

2011-01-19

చదువరి: అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

2011-01-19 07:52 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
అసలు సంగతి కెళ్ళేముందు.. మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం. 1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)  2. చుక్కలనంటుతున్న ధరలను ఏనాటికి కిందకి లాక్కొస్తారు అని

2011-01-05

యువ గోదావరి » రాజకీయాలు: దిగ్విజయ్ కి నిజ నిర్దారణ పరీక్షలు చేస్తే…!!!

2011-01-05 11:25 AM SanSh
దిగ్విజయ్ కి నిజ నిర్దారణ పరీక్షలు చేస్తే…!!! చెయ్యనివ్వండి. నిజాలు తెలుస్తాయి అంటారా? తెలియనిస్తారా….ఎమో మరి ? గుడ్ ఐడియా అన్నారు అందరూ… కానీ ఎం లాభం అలా చేస్తే అసలు నిజం తెలిసి పోతుంది, కేసు వీగిపోతుంది. ఇది కాంగ్రెస్ పాలసికే విరుద్ధం. ఏ విషయన్నైనా తెగే వరకు లాగటం, పనికొస్తుంది-ఓట్లొస్తాయంటేనే నిజ నిర్దారణ చెయ్యడం ఇదే దాని కుహనా పాలసి. అది పాక్/భారత్ విభజన అయినా, తెలంగణా అయినా, రామ మందిరమైనా, భోపాల్, భొఫోర్స్ ఎదైనా…. [...]

2010-12-31

చదువరి: 2010 లో మన నాయకులు

2010-12-31 12:18 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
2010 లో మన నాయకులు మన్మోహన్ సింగ్  ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి తాను నీతిమంతుడైతే  చాలదు, తన ప్రభుత్వం నీతిగా నడిచేలా చూడాలి. లేకపోతే ఆ ప్రధానమంత్రి విఫలమైనట్టే! లక్షల కోట్ల ఆదాయానికి గండి కొట్టిన  అవినీతి జరిగితే చూడకుండా, చూసీ పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి అవినీతిపరుడి కంటే ఎక్కువ.. అసమర్ధుడు!  బలహీనుడు కూడా మేడమ్మ ఆంధ్ర ప్రదేశులో చిచ్చుబెట్టి తాను చోద్యం చూస్తోంది, సోనియా గాంధీ.

2010-12-30

మతాలు - రాజకీయాలు: అతితెలివి క్రైస్తవ నన్

2010-12-30 05:48 PM చదువరి

పోలండులో  ఇస్కాన్ (ఇంటర్నషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కానషస్‍నెస్) అనుయాయుల సంఖ్య బాగా పెరగడం గమనించిన ఒక నన్  ఇస్కాన్ పై వార్సా కోర్టులో కేసు వేసింది. ’ఇస్కాన్ అనుయాయులు 16,000 మంది గోపికలను పెళ్ళాడిన కృష్ణుడు అనే ఒక అనైతిక పాత్రను కొలుస్తున్నారు’ అనేది ఆ కేసులోని విషయం.

కేసు విచారణకువచ్చినపుడు ఇస్కాన్ లాయరు జడ్జిని, ’ఈమె నన్ గా మారే సందర్భంలో తాను చేసిన ప్రమాణాన్ని ఓ సారి చదవమని ఈ నన్ ను అడగండి’ అని అడిగాడు.  జడ్జి ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని ఆమెను అడిగాడు. ఆమె చదవలేదు.

ఇస్కాన్ లాయరు ’పోనీ నన్ను చదవమంటారా’ అని జడ్జిని అడగ్గా, జడ్జి సరేన్నాడు. ఆ ప్రమాణంలో తాను (ఆ నన్) ఏసుక్రీస్తును పెళ్ళి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది.  అది చదివాక, ఇస్కాన్ లాయరు అడిగాడు: “యువరానర్! కష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడని అంటున్నారు. కానీ, కనీసం ఒక మిలియను మంది నన్ లు తాము క్రీస్తును పెళ్ళాడామని నిర్ధారిస్తున్నారు గదా, మరి.. క్రీస్తు, కృష్ణుడు – వీళ్ళిద్దరి లోనూ నీతి బాహ్యుడెవరు ?

జడ్జి కేసును కొట్టేసాడు.

———

ఇస్కాన్ వారి సైటు నుండి.

========================

అక్రమ పద్ధతుల్లో మతమార్పిడి ద్వారా తమ మతాన్ని వ్యాపింజేసుకునేవాళ్ళకు, తమ స్థానంలోనే ఇతర మతాలు వ్యాప్తిచెందడం కంటకంగానే ఉంటుంది. అందుచేతే, ఇలాటి అడ్డదార్లు తొక్కుతున్నారు.
రగ్గులు, డబ్బులు, ప్రలోభాలు, స్వలాభాలు, సంకుచితత్వమే మతమనుకునే ఈ మత వ్యాపారులకు, మతాల్లోని తాత్వికతను అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడుంటుంది!?

2010-12-24

యువ గోదావరి » రాజకీయాలు: చెత్త రాజకీయాలు….

2010-12-24 10:51 AM SanSh
http://ulikipitta.wordpress.com/ లో … పాపం హైటెక్కు బాబు..!! అనే పోస్ట్ ఒకటి, ఇంకొన్ని బ్లాగుల్లో జరుగుతున్న చర్చలు చిరాకు తెప్పిస్తున్నాయి. ప్రతీ ఒక్కరు ఎవరి దీక్షకి ఎంత మంది వచ్చారు? ఎవరికి ఎంత మంది సంఘీభావం ప్రకటించారని,…బాబు గొప్పని.., కాదు జగన్ వర్గం అని అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు….ఈ బ్లాగు బాబు లకి రైతుల కష్టాలు తెలిస్తే…..దీక్ష చేస్తున్న ఇద్దరికి సపోర్ట్ ఇస్తారు. పోయిన వారం లో ఇంత మంది రైతులు చనిపోయారే…..వారికి ఎవరిస్తారు “ఓదార్పు” ఒకరు [...]

2010-12-04

నా ఆలోచనలు: మా యాకోబు రాజకీయ కష్టాలు

2010-12-04 11:50 PM రాధాకృష్ణ (noreply@blogger.com)
రాజకీయాలు అంటే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడానికి మంచి మార్గం అని అందరం అనుకుంటాం.  రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పవర్ చేతిలో ఉంటుంది, బ్యాంకు రుణాలు సులభంగా తెచ్చుకోగలరు. సామాన్యుడు బర్త్/డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా నానా తంటాలు పడతాడు. కానీ నాయకులకు మాత్రం చాలా వీజీ గా ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా ఫోన్ మీదనే అంత రెడీ అవుతుంది. దాన్నే మనం అదికార దుర్వినియోగం అంటాం. దుర్వినియోగం కూడా ఒక మోతాదు

నా ఆలోచనలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహానుబావులు: నా మొదటి బ్లాగ్

2010-12-04 02:04 AM రాధాకృష్ణ (noreply@blogger.com)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పెద్ద టాపిక్...రాజకీయాల పై నాకున్న సహజమైన ఆసక్తి రీత్యా నేను కాలేజీ రోజుల్లో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండే వాణ్ణి. చిన్నతనం నుంచి ఈనాడు పేపర్ ని డైలీ ఫాలో అవ్వడం, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను (వారి గురించి తర్వాత ప్రత్యేకంగా చెప్తాను) చాలా దగ్గరనుంచి చూడటం, ఉమ్మడి కుటుంబ నేపద్యంలో పెదనాన్న, నాన్న, పెద్దమ్మ గ్రామ స్థాయి పదవులు చేయడం

2010-11-25

చదువరి: ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!

2010-11-25 07:13 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
ఆంధ్రప్రదేశుకు ముఖ్యమంత్రిని  మార్చారు.  తమలోంచి ఒకణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన జనానికి ప్రణబ్బు ముఖర్జీ చెప్పేదాకా తెలీదు, కుర్చీ ఎక్కబోయేది ఎవరో!  ఛానెళ్ళ పుణ్యమా అని, వాళ్లకంటే మనకే కొంత ముందు తెలిసింది.  ’ఏంటి ఎవరు  ముఖ్యమంత్రి కాబోతున్నారు ’అని అడిగితే కాంగీయుడు ప్రతీవాడూ చెప్పిన సమాధానం ఒకటే - అధిష్ఠానం మాటే మామాట ! అమ్మ మాట  బంగారు మూట అనమాట! ఇక్కడి నాయకుణ్ణి విమర్శించమంటే అడ్దమైన

2010-09-10

చదువరి: పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

2010-09-10 11:24 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
పోయినోళ్ళందరూ... మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!!  -ఆత్రేయ చెప్పాడంట. రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు!  రింగురోడ్డు వ్యవహారంలో  స్వజనుల కోసం, స్వలాభం కోసం  రాశేరె ప్రభుత్వం మెలికెలు తిరిగిందనీ, రింగురోడ్డును మెలికెలు తిప్పిందనీ ఇప్పుడు తేలిపోయింది.  అది రింగురోడ్డు కాదు, రాంగురోడ్డని తేలిపోయింది. అయినా సరే.., చచ్చిపోయాడు కాబట్టి, మంచోడే! స్టాంపులు వెయ్యొచ్చు! ముఖ్యమంత్రిగా

2010-07-21

చదువరి: నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

2010-07-21 01:05 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది - ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.   జూలై  16 , 20 ల మధ్య చంద్రబాబు తన

2010-07-18

చదువరి: బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

2010-07-18 01:30 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు. కానీ, ఈ ఆందోళనపై ప్రభుత్వమూ, మిగతా పార్టీల ధోరణి మాత్రం ఆందోళన

2010-07-06

చదువరి: మాకూ ఉపశమనం కావాలి!

2010-07-06 03:34 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట, కాస్త రిలీఫు కావాలంట. అవును మరి, బీసీసీఐ, ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు, తీరికా దొరకడం లేదు పాపం. అందుగ్గాను, కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట.  మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు, పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ, ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని

2010-06-10

చదువరి: మందు x మందులు

2010-06-10 09:40 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి! డబ్బులకోసం జనాల జేబులను కొల్లగొడుతోంది ప్రభుత్వమంటూ ఈ వేలంపాటలమీద విమర్శలొచ్చాయి.

2010-05-25

చదువరి: ఒక్కడే మహానుభావుడు..

2010-05-25 03:52 AM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ. ఆ స్కెచ్చిని సిగ్గులేకుండా అనుకరించే ఇంకో స్కెచ్చి ఇది. అయితే తాము ఎవరి గురించి రాస్తున్నారో బాపురమణలు హెడ్డింగు పెట్టి మరీ చెప్పేసారు. నేను మాత్రం ఎవరి గురించి రాస్తున్నానో చెప్పడం

2009-12-14

ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!

2009-12-14 06:35 PM Phanikumar

(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)

విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక  వైపు మాత్రమే..

1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో..  జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో.. :) టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు..  ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది..” — మీరు మరీ generalize  చేస్తున్నట్టు అనిపించట్లేదా?!!  ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters  టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు,  హైటెక్ సిటీ,  ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ  హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి..  అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”..  మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..

ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!

ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!!
(ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)

నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!


2009-11-01

చదువరి: సాయంకాలమైంది!

2009-11-01 07:39 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు. పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ

2009-10-23

చదువరి: ఆ.. ట ఆగిందా!

2009-10-23 11:30 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత  ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది. మా జగను కుర్రాడు-రోశయ్యేమో ముసలాడు, యువతను ప్రోత్సహించాల్సిన తరుణమిది, జగన్ను కుర్చీ ఎక్కించాల్సిన సమయమిదే అంటూ ఊదరగొట్టేసిందే జగను బ్యాచ్చీ! టీవీ

2009-10-13

చదువరి: హైకమాండు, హై.కమాండు

2009-10-13 11:30 PM తుమ్మల శిరీష్ కుమార్ (noreply@blogger.com)
జగను హై. చేరాడు. ఇక ఢిల్లీలో  హైకమాండు - హైదరాబాదులో  హై.కమాండు. మంత్రులు, ఎమ్మెల్యేల  తీర్థయాత్రాస్థలం ఇక కళకళలాడబోతోంది.  ముఖ్యమంత్రి జగనుకు చేసే ఫోన్లు ఇలా ఉండొచ్చు - 'జగనూ, ఆ రఘువీరారెడ్డి ఉంటే రేపో ఎల్లుండో ఓసారి సచివాలయానికి పంపించవా, కాస్త పనుంది.' పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు ! * * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * * పాపం ముఖ్యమంత్రి! ఆఫీసులో ఉంటే ఈ

2009-04-20

తెలుగు 'వాడి'ని: ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?

2009-04-20 02:50 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
నమస్తే ఆంధ్ర.కాం అనే  సైట్ లో ప్రచురించిన ఈ వార్తను చదవండి. పూర్తి వివరాలకు : ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే ! ఆ పై వార్తలోని ముఖ్యాంశాలు :

2009-04-17

తెలుగు 'వాడి'ని: 165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్

2009-04-17 06:33 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం  ............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు .. మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో  లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి ..
వ్యాఖ్యలు
2011-09-26
2011-09-26 01:45 PM Pratap - మతాలు - రాజకీయాలు కి వ్యాఖ్యలు

Its very good posting…. chaalaa bagundi.. aa lawyer ki naa kritagnatalu cheppalani undi!!!

2011-08-11
2011-08-11 10:04 AM JANARDHAN (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
నాకు మాత్రం... అవినీతి అధికమైన.. ఆ ఉచ్చుకు బలయిన భారతంలా.. అడుగు ముందుకేయాలన్నా అవకాశం లేని అసహాయలా కనిపిస్తోంది.
2011-08-05
2011-08-05 08:05 AM ..nagarjuna.. - మతాలు - రాజకీయాలు కి వ్యాఖ్యలు

Thank you for suggesting the book Sriram gaaru. I think it will take considerable amount of time for me to go through and understand the book. meanwhile shall try to put a post on this subject.

2011-03-23
2011-03-23 01:46 PM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
బాబూ మేడిపండు (ఈ మేడిపండు కి పొట్టలో కాక మెదడులో పురుగులు వున్నాయి) మీ కామెంట్స్ చదివాకా నాకు తెలుగులో ఒక సామెత గుర్తుకు వచ్చింది... “అసలు కోసం కాక కొసరు కోసం ఏడ్చాడంట” అలా వుంది. నేను వ్రాసిన దాన్లో అసలు విషయాన్ని వదిలేసి మీ విషయ పరిజ్ఞానం తెలియచేయడం కోసం ఏదో కామెంట్ గీకారు. పోనీ దానిలో ఐనా నిజం వుందా అంటే అదీ లేదు. <br /><br />మహా భారతం లో చిన్న సంఘటనను నాయకుడంటే ఎలా వుండాలో అనే దానిని గురించి
2010-11-01
2010-11-01 01:37 PM satya - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.

2010-10-17
2010-10-17 07:51 PM మల్లికార్జున శర్మ - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్‌ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglish