2012-02-02
ప్రజ్ఞ: "కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"
నేటి రాజకీయం: టి.ఆర్.ఎస్ సీన్ రివర్స్
రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లో విజయవంతమైన అనుభవం టి.ఆర్.ఎస్ కు చాలానే ఉంది. అయితే అంత అనుభవం ఉన్నా కూడా, టి.ఆర్.ఎస్ ఈ సారిఉప ఎన్నికలకు భయపడుతుంది. తెలంగాణ ప్రాంతం అంతటా తనకు మాత్రమే మద్దతు ఉందని మొన్నటివరకు అనుకున్న టి.ఆర్.ఎస్ ఇప్పుడు ఆలోచనలో పడింది. తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం తెరాస కు నల్లేరుపై నడక మాత్రం కాదు. తెలంగాణ సాధన కోసమే అంటూ టి.డి.పి నుంచి బయటకు వచ్చిన నాగం జనార్ధనరెడ్డి పై పోటీ పెట్టే అవకాశం టి.ఆర్.ఎస్ కు లేదు. అలా అని నాగం తెరాసలో చేరనూ లేదు. అలాగే పరకాల నియోజకవర్గం కూడా డైలమాలోనే ఉంది. పరకాలలో కొండా సురేఖను తప్ప తెలంగాణలో మరెక్కడా పోటీ చేయబోమని జగన్, కేసీఆర్ కు పరోక్షంగా స్నేహ హస్తం ఇచ్చారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ స్థానంలో కూడా తెరాస పెద్దగా ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. మహబూబ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు చనిపోవడంతో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తెరాస ఎవరిని నుంచోబెట్టినా కూడా సానుభూతి పవనాలు రాజేశ్వరరావు భార్యకే ఉంటాయి గనుక ఆ స్థానం ఆశలు వదులుకున్నట్టే. రాజేశ్వరరావు భార్య మొదట టి.ఆర్.ఎస్ లో చేరతారని అనుకున్నా, కాంగ్రెస్ పెద్దలు జోక్యంతో ఆమె అధికార పార్టీలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామి గౌడ్ ను తెరాస తమ అభ్యర్ధిగా నిలపనుందని సమాచారం. అయితే ఆయనకు విజయావకాశాలు మాత్రం తక్కువే. కామారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే గంపా గోవర్ధన రెడ్డికి, ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం టి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్ధిగా నిలబడటం వలన అతను గెలిచే అవకాశాలు ఉండవు. ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన టి.రాజయ్యపై కూడా నియోజకవర్గం లో వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత శ్రీహరికి మంచి క్యాడర్ ఉంది. కడియం శ్రీహరి గనుక ఉపఎన్నికల్లో పోటీ చేస్తే టి.రాజయ్య ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయవిశ్లేషకుల మాట. ఇలా నియోజకవర్గం వారీగా సమస్యలతో పాటు బి.జె.పి రూపంలో టి.ఆర్.ఎస్ కు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి తోనే సాధ్యం అంటూ చేస్తున్న తెలంగాణ పోరు యాత్రకు మంచి స్పందన వస్తుంది. బిజేపే తన బలాన్ని అంచనా వేసుకోవడానికి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీజెపీ చీల్చేది టి.ఆర్.ఎస్ ఓట్లనే. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా నెమ్మదిగా తమ పార్టీ పునర్వైభం కోసం ప్రయత్నిస్తుంది. పోలవరం టెండర్లు, అర్ధాంతరంగా సకలజనుల సమ్మె ముగించడం వంటి విషయాలతో టి.ఆర్.ఎస్ పట్ల తెలంగాణ ఓటర్లకు ఏర్పడిన సందేహాలను ఆ పార్టీ తీర్చలేదు. ఈ విషయాలన్నీ ఎన్నికల్లో తెరాసకు ఎదురుదెబ్బ తగిలేలా చేస్తాయని విశ్లేషకుల అంచనా.
2012-02-01
కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: రాళ్ళూ, రప్పలూ, సిమెంట్ బొమ్మల కోసం హింస అవసరమా?
టైమ్ స్టాంప్ మార్చ్ 10 అని ఎందుకు వేశానంటే మార్చ్ 10వ తేదీకి ట్యాంక్ బండ్ విగ్రహాలు కూల్చి ఏడాది అవుతుంది కాబట్టి.
విగ్రహాలు కూల్చినంతమాత్రాన తెలంగాణా రాదు. అలాగే విగ్రహాలు కూల్చినవాళ్ళ మీద పడి ఏడవడం కూడా నిజాయితీపరుల లక్షణమని నేను అనుకోను. విగ్రహాలు కూల్చేవాళ్ళు మూర్ఖులైతే విగ్రహాలు కూల్చడం వల్ల తమ సంస్కృతి ద్వంసం అయిపోయిందని గగ్గోలు పెట్టేవాళ్ళు మహామూర్ఖులు.
నేను ట్యాంక్ బండ్ విగ్రహాల కూల్చివేతని సమర్థించినా ఆ కూల్చివేత వల్ల తెలంగాణావాదులకి పెద్ద లాభం రాలేదనే నమ్ముతాను, సమైక్యవాదులకి కూడా పెద్ద నష్టం రాలేదని నమ్ముతాను. విగ్రహాలు కూల్చడం వల్ల పోయేవి సిమెంట్, రాళ్ళూ, రంగులూ తప్ప సంస్కృతో, సజీవరూపాలో పోవని నేను ఇప్పటికీ నమ్ముతాను.
ఈ లింక్లు చదవండి, విషయం అర్థమవుతుంది:
http://venuvu.blogspot.in/2011/03/blog-post.html
http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html
చిహ్నాల ద్వంసం వల్ల ఆ చిహ్నాన్ని ఉపయోగించుకున్న సంస్కృతి పోదు అని అంటారు. నిజమే. చిహ్నాల ద్వంసం వల్ల ఏ సంస్కృతీ పోదు. మంగళ సూత్రం అనేది వైవాహిక సంబంధంలో పురుషాధిక్యతకి చిహ్నం. కానీ పెళ్ళైన స్త్రీలు మంగళ సూత్రాలు తీసేసినంతమాత్రాన పురుషాధిక్యత పోదు. అలాగని ఆడవాళ్ళు మంగళసూత్రాలు తీసెయ్యాలనే స్త్రీవాదుల వాదనలో తప్పుందని అనగలమా? చిహ్నాలని త్యజించడం ఒక్కటే సాంస్కృతిక మార్పుకి దారి తీస్తుందని ఎవరూ అనలేదు. అలాగని చిహ్నాలని త్యజించడం కూడా తప్పు అని అనలేము కదా. స్త్రీవాదులమని చెప్పుకునేవాళ్ళు మంగళ సూత్రాలు తీసెయ్యకుండా "తీసేసినంతమాత్రాన స్త్రీ-పురుష సంబంధాలలో మార్పులు రావు" అని చెప్పుకుంటూ తిరిగితే మార్పు ఎన్నటికీ రాదు. మంగళ సూత్రాలని తీసెయ్యడం కేవలం మార్పులోని ఆరంభానికి సూచన కావాలి.అలాగే విగ్రహాల ద్వంసం కూడా ఉద్యమంలో ఒక భాగంగా జరిగిందనుకోవచ్చు కానీ అదే ఉద్యమమని ఎవరూ అనలేదు కదా. కనుక ఇక్కడ విగ్రహాల ద్వంసం వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతీయతత్వాన్ని సూచించే సంస్కృతి పోదు అనే వాదన ఎందుకు?
కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: రైతుల ఆత్మహత్యలు
ఈ డాక్యుమెంటరీ రూపొందించినది తెలంగాణాకి చెందిన వివేక్ అనే వ్యక్తి. ఈ వీడియోలోని దృశ్యాలు మహారాష్ట్రలో షూటింగ్ చెయ్యబడినవి.
నేటి రాజకీయం: రోశయ్య చూచారా..? కేంద్రాన్ని తూర్పారబట్టారా!!
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్య కేంద్రాన్ని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ హోదాలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రోశయ్య ప్రసంగంతో అక్కడి కాంగ్రెస్ వర్గాలు బిక్కచచ్చిపోయాయి.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారంనాడు గవర్నర్ హోదాలో తొలి ప్రసంగం చేశారు రోశయ్య. ముళ్లైపెరియార్ డ్యామ్ వివాదంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని అన్నారు.
రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయడమే కాక పథకాల రూపకల్పనలో విపక్ష పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జయలలిత పాలనను, పథకాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రసంగం ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.
సహజంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్నే ఆయా రాష్ట్రాల గవర్నర్లు చదువుతారు. అయితే, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రసంగ పాఠాలకు గవర్నర్లు మార్పులు చేస్తుంటారు. ఐతే రోశయ్య మాత్రం అలాంటి మార్పేమే చేయకుండా ఉన్నదిఉన్నట్లుగా చదివేశారు. ఇది కాంగ్రెస్ వర్గాలకు అసహనాన్ని కలిగిస్తోంది.
2012-01-04
గుండె చప్పుడు...: నాకొక స్వప్నం ఉంది!
2011-12-12
గుండె చప్పుడు...: మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం
2011-11-08
ప్రజ్ఞ: శభాష్ ఆంధ్రజ్యోతి!
2011-11-04
చదువరి: సీబీఐ ని విచారించిన జగన్ !
2011-10-21
చదువరి: గెలిచినవాడు నీచ మానవుడు
2011-10-12
2011-09-26
జాబిల్లి » రాజకీయం: తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి
2011-08-17
చదువరి: మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..
2011-08-16
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అన్నా హజారే x అవినీతి నాయకులు
జాబిల్లి » రాజకీయం: అన్నా హజారేకు మద్దతుగా నడక
2011-08-05
చదువరి: సమస్యలు బాబోయ్ సమస్యలు
2011-08-02
మతాలు - రాజకీయాలు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ
డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-
ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.
భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.
హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.
హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.
భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.
హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.
ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.
మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.
రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.
ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.
ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం: 370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.
ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.
ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.
ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం: హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.
ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.
ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.
భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.
2011-06-14
చదువరి: మరింత దిగజారిన లౌకికవాదం
2011-06-08
పాలవెల్లి: కమ్యునిస్టులకు ఎవరంటే ద్వేషం
2011-05-29
చదువరి: మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం
2011-05-22
చదువరి: "అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"
2011-05-21
చదువరి: హైకమాండుకు కమానుకట్టలు విరిగినై
2011-05-19
చదువరి: సానుభూతి గెలిచింది
2011-04-14
చదువరి: ఉండవల్లి అస్త్రం
2011-03-28
చదువరి: వయ్యెస్సార్ రౌడీ మూక
2011-03-15
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: తెగించిన తెలిబాన్లు
2011-03-07
పాలవెల్లి: 'నేను తప్పు చేసాను'
2011-02-17
చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!
చదువరి: శాసనసభ వద్ద రౌడీలు
2011-01-19
చదువరి: అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి
2011-01-05
యువ గోదావరి » రాజకీయాలు: దిగ్విజయ్ కి నిజ నిర్దారణ పరీక్షలు చేస్తే…!!!
2010-12-31
చదువరి: 2010 లో మన నాయకులు
2010-12-30
మతాలు - రాజకీయాలు: అతితెలివి క్రైస్తవ నన్
పోలండులో ఇస్కాన్ (ఇంటర్నషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కానషస్నెస్) అనుయాయుల సంఖ్య బాగా పెరగడం గమనించిన ఒక నన్ ఇస్కాన్ పై వార్సా కోర్టులో కేసు వేసింది. ’ఇస్కాన్ అనుయాయులు 16,000 మంది గోపికలను పెళ్ళాడిన కృష్ణుడు అనే ఒక అనైతిక పాత్రను కొలుస్తున్నారు’ అనేది ఆ కేసులోని విషయం.
కేసు విచారణకువచ్చినపుడు ఇస్కాన్ లాయరు జడ్జిని, ’ఈమె నన్ గా మారే సందర్భంలో తాను చేసిన ప్రమాణాన్ని ఓ సారి చదవమని ఈ నన్ ను అడగండి’ అని అడిగాడు. జడ్జి ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని ఆమెను అడిగాడు. ఆమె చదవలేదు.
ఇస్కాన్ లాయరు ’పోనీ నన్ను చదవమంటారా’ అని జడ్జిని అడగ్గా, జడ్జి సరేన్నాడు. ఆ ప్రమాణంలో తాను (ఆ నన్) ఏసుక్రీస్తును పెళ్ళి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. అది చదివాక, ఇస్కాన్ లాయరు అడిగాడు: “యువరానర్! కష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడని అంటున్నారు. కానీ, కనీసం ఒక మిలియను మంది నన్ లు తాము క్రీస్తును పెళ్ళాడామని నిర్ధారిస్తున్నారు గదా, మరి.. క్రీస్తు, కృష్ణుడు – వీళ్ళిద్దరి లోనూ నీతి బాహ్యుడెవరు ?
జడ్జి కేసును కొట్టేసాడు.
———
ఇస్కాన్ వారి సైటు నుండి.
========================
2010-12-24
యువ గోదావరి » రాజకీయాలు: చెత్త రాజకీయాలు….
2010-12-04
నా ఆలోచనలు: మా యాకోబు రాజకీయ కష్టాలు
నా ఆలోచనలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహానుబావులు: నా మొదటి బ్లాగ్
2010-11-25
చదువరి: ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!
2010-09-10
చదువరి: పోయినోళ్ళందరూ మంచోళ్ళే..
2010-07-21
చదువరి: నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!
2010-07-18
చదువరి: బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!
2010-07-06
చదువరి: మాకూ ఉపశమనం కావాలి!
2010-06-10
చదువరి: మందు x మందులు
2010-05-25
చదువరి: ఒక్కడే మహానుభావుడు..
2009-12-14
ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!
(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)
విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక వైపు మాత్రమే..
1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో.. జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో..
టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు.. ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్గా మారిపోతుంది..” — మీరు మరీ generalize చేస్తున్నట్టు అనిపించట్లేదా?!! ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్ కాలేజీ, వుమెన్సకాలేజీ, హైకోర్టు, రాజ్భవన్, అసెంబ్లీ, దిల్కుశ్ గెస్టహౌస్, పురానాపూల్, నయాపూల్, మక్కామసీదు, హుస్సేన్సాగర్,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు, హైటెక్ సిటీ, ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి.. అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”.. మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..
ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!
ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!! (ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)
నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!
2009-11-01
చదువరి: సాయంకాలమైంది!
2009-10-23
చదువరి: ఆ.. ట ఆగిందా!
2009-10-13
చదువరి: హైకమాండు, హై.కమాండు
2009-04-20
తెలుగు 'వాడి'ని: ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?
2009-04-17
తెలుగు 'వాడి'ని: 165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్
Its very good posting…. chaalaa bagundi.. aa lawyer ki naa kritagnatalu cheppalani undi!!!
Thank you for suggesting the book Sriram gaaru. I think it will take considerable amount of time for me to go through and understand the book. meanwhile shall try to put a post on this subject.
nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.
సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!


