2012-05-17
కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: ముసుగు వేసుకుంటే మార్క్సిస్ట్, ముసుగు తీస్తే సామ్రాజ్యవాది
గతంలో రివల్యూషనరీ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ అనే సంస్థ ఉండేది. అది పేరుకి మావోయిస్ట్ సంస్థే కానీ ఆ సంస్థ కార్యక్రమాలు ట్రాట్స్కీయిస్ట్ నాలుగవ ఇంటర్నేషనల్ కార్యక్రమాలలాగ ఉండేవి. "ఇండియా ఇంకా విప్లవానికి పరిపక్వం కాలేదని నమ్ముతూ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసే" CPI(ML) న్యూ డెమోక్రసీ అనే సంస్థకి ఒక వైపు మద్దతు ఇస్తూనే ఇంకో వైపు పార్లమెంటరీ ఎన్నికలని వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటం చేసే CPI(మావోయిస్ట్)కి మద్దతు ఇచ్చేవారు రివల్యూషనరీ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ వారు. సాయుధ పోరాటాన్ని కావాలని ఆపేసి పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన నేపాల్ మావోయిస్ట్లకి కూడా రివల్యూషనరీ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ వారు మద్దతు ఇచ్చారు.
రివల్యూషనరీ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ వారికి ప్రత్యర్థి సంస్థ అయిన మావోయిస్ట్ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ అనే సంస్థ ఉండేది. ఆ సంస్థ పెట్టినవాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందిన నల్ల జాతీయులు & హిస్పానిక్లు. మావోయిస్ట్ ఇంటర్నేషనలిస్ట్ మూవ్మెంట్ వారు మావో జెడాంగ్ ప్రతిపాదించిన three worlds theoryని సమర్థించేవారు. మూడవ ప్రపంచ దేశమైన ఇండియాలో విప్లవానికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయని నమ్మేవాళ్ళు. సాయుధ పోరాటం చేసే సంస్థ అయిన CPI(మావోయిస్ట్)కి వీరు మద్దతు ప్రకటించారు. వీరు CPI, CPM, CPI(ML) న్యూ డెమోక్రసీ లాంటి సూడో మార్క్సిస్ట్ పార్టీలని విమర్శించేవారు. వీరి ప్రకటనలు http://etext.org/Politics/MIM అనే వెబ్సైట్లో కనిపించేవి. నల్ల జాతీయవాదం & స్త్రీవాదం విషయాలలో వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల 2008లో ఆ సంస్థ మూత పడింది. 2009లో వెబ్సైట్ కూడా మూతపడింది.
ఇండియా లాంటి మూడవ ప్రపంచ దేశం విప్లవానికి ఇంకా పరిపక్వం కాలేదని నమ్మితే ఇక ప్రపంచంలో కార్మిక వర్గ విప్లవాలు వచ్చే అవకాశమే ఉండదు. కమ్యూనిజంకి వ్యతిరేకంగా కోవర్ట్గా కుట్రలు జరిపే ట్రాట్క్సీయిస్ట్లు లాంటివాళ్ళు మావో జెడాంగ్ ప్రతిపాదించిన "మూడు ప్రపంచాల సూత్రాన్ని" నమ్మకపోవడానికి కారణం ఇదే.
2012-05-16
కార్మికవర్గ రాజకీయాలు । सर्बाहरा राजनीती: CPI, CPMలు మార్క్సిస్ట్ పార్టీలు ఎలా అవుతాయి? (మొదటి భాగం)
మొన్న ఉదయం నేను విశాఖపట్నంలో ఉన్నాను. GVMC ఆఫీస్ ఎదురుగా CPMవాళ్ళు మీటింగ్ పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా కూలుద్దాం లాంటి విషయాలే వాళ్ళు మాట్లాడారు కానీ ప్రజలలో వర్గ చైతన్యం పెంచేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఏ రాజకీయ నాయకుడు ఎంత అవినీతి చేశాడో తెలుసుకోవాలంటే అన్నా హజారే మీటింగ్కి వెళ్తే సరిపోతుంది, దాని కోసం ప్రత్యేకంగా వామపక్ష పార్టీ మీటింగ్లకి వెళ్ళాల్సిన పని లేదు. మహారాణిపేటలో పెట్టిన మీటింగ్లో CPIవాళ్ళు మురికివాడల ప్రజల హక్కుల గురించి మాట్లాడారు. GVMC ఆఫీస్ ఎదురుగా పెట్టిన మీటింగ్లో అది కూడా మాట్లాడలేదు.
తెలుగు దేశం మీటింగ్కి వెళ్ళినా, బిజెపి మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు అధికార పార్టీ అవినీతిని విమర్శిస్తూ మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ సిద్ధాంతాల గురించి మాట్లాడరు. ఎందుకంటే తెలుగు దేశం గానీ బిజెపి గానీ వామపక్ష పార్టీలు కావు. ఆ పార్టీలకి వర్గ దృక్పథం లేదు. ఒకవేళ వామపక్ష పార్టీలుగా చెప్పుకునే పార్టీలు కూడా అదే తరహాలో మాట్లాడితే వామపక్ష పార్టీలకీ, బూర్జువా పార్టీలకీ మధ్య తేడా ఏమీ కనిపించదు.
GVMC కమిషనర్ నగరంలో ఉన్న మురికివాడలని కూల్చడానికి ప్లాన్ వేశాడు. మురికివాడల నిర్మూలన పేరుతో మురికివాడల ప్రజలకి పునరావాసం కల్పించకుండా వాళ్ళని నగర శివార్లలోకి తరలించడానికి వేసిన పథకంలో భాగంగా GVMC కమిషనర్ మురికివాడల నిర్మూలన కోరే ఒక సంస్థవాళ్ళని తెచ్చి వైజాగ్లో మీటింగ్ పెట్టించాడు. వామపక్ష పార్టీలకి అనుమానం వచ్చి నగరంలో కొన్ని చోట్ల ఆందోళనలు చేశారు. అయితే GVMC ఆఫీస్ ఎదురుగా పెట్టిన మీటింగ్లో మాత్రం అసలు విషయం వదిలేసి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. అయితే TV చానెళ్ళవాళ్ళు కవరేజ్ చేసిన చోట్ల మాత్రం వర్గ చైతన్యం గురించి మాట్లాడారు. మిగితా చోట్ల ఇతర పాలక వర్గ పార్టీలలాగే ప్రత్యర్థి పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇప్పుడు ఉన్నది వ్యక్తివాద సమాజం కానీ ఉమ్మడి శ్రమ (కమ్యూనిస్ట్) సమాజం కాదు. దొంగతనాలు జరిగినా, అవినీతి జరిగినా అవి డబ్బు ఉన్న పెట్టుబడిదారీ సమాజంలో జరుగుతాయి కానీ డబ్బు లేని & సమిష్టి శ్రమ ఉన్న కమ్యూనిస్ట్ సమాజంలో జరగవు. వ్యక్తివాద సమాజంలో ఎవడికి అందినంత వాడు సంపాదించాలనుకుంటాడు కానీ ఇతరుల గురించి ఆలోచించడు. అతను ప్రధాన మంత్రి అయినా, సర్పంచ్ స్థాయి నాయకుడైనా తన వ్యక్తిగత స్వార్థానికే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాడు. కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి చేసినా, కొత్తపేట గ్రామ సర్పంచ్ అవినీతి చేసినా వ్యక్తివాద సమాజంలో అది విచిత్రం కాదు. అర్థిక సంబంధాల గురించి మాట్లాడకుండా, సామాజిక సంబంధాల గురించి మాట్లాడకుండా కేవలం అవినీతికి వ్యతిరేకంగా మైక్ పెట్టి అరిస్తే మనకీ, అన్నా హజారేకీ మధ్య తేడా ఏమి ఉంటుంది?
ఒక బ్యాంక్ మేనేజర్ అవినీతి చేస్తే దాని గురించి జోనల్ ఆఫీస్వాళ్ళకి సులభంగా తెలిసిపోతుంది. కంప్యూటరైజ్డ్ బ్రాంచ్లో అవినీతి జరిగితే ఇంకా సులభంగా తెలిసిపోతుంది. ఈ విషయాలు తెలిసిన బ్యాంక్ మేనేజర్ అవినీతి చెయ్యడు. అతను కేవలం అవినీతి చెయ్యలేదు కనుక అతను నీతివంతుడని అనుకోగలమా? అతను సమాజం గురించి ఆలోచించకుండా కేవలం తన గురించీ, తన కుటుంబం గురించీ ఆలోచిస్తూ వైయుక్తికంగా జీవించే రకం కావచ్చు. సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని తెలిసినా "అవన్నీ నాకెందుకు, నాకు నెలకి నలభై వేలు జీతం వస్తుంది కనుక నేను బతకడానికి అది చాలు" అని కూడా అతను అనుకోగలడు. అలా వైయుక్తికంగా ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించాలి అని ఎవరైనా చెపితే "సమాజం గురించి ఆలోచించకుండా వైయుక్తికంగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా" అని అతను అడగగలడు. వైయుక్తికవాదం అభివృద్ధి నిరోధకమే కానీ ఆ విషయం చెపితే అతను అర్థం చేసుకునే స్థితిలో లేకపోవచ్చు. కేవలం అవినీతిని నిర్మూలించినంతమాత్రాన సమాజం బాగుపడిపోదు. సామాజికంగా అభివృద్ధి నిరోధకమైన భావజాలాలని కూడా ప్రజల మనసుల నుంచి పోగొట్టాలి. కానీ CPI, CPMవాళ్ళు అలా చెయ్యరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మార్క్సిజం గురించి చెపితే అర్థం కాదనీ, సాధారణ రాజకీయ విషయాలు చెపితేనే అర్థమవుతాయనీ ఈ పార్టీల నాయకులు వాదిస్తారు.
"విప్లవకారులు ప్రజలకి మార్గదర్శకులుగా ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించాలి కానీ కేవలం ప్రజలలో ఉన్న రాజకీయ చైతన్యం పైన విప్లవకారులు ఆధారపడకూడదు" అన్న లెనిన్ సూత్రాన్ని ఈ రెండు పార్టీలవాళ్ళూ అంగీకరించరు. అందుకే ఈ రెండు పార్టీలవాళ్ళూ ప్రజలని మోటివేట్ చెయ్యలేకపోతున్నారు.
2012-05-15
నేటి రాజకీయం: ఏ పూలు తేవాలి నీ పూజకు?
వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్ఎస్) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు. ‘ ఏ పూలు తేవాలి నీ పూజకు?’ అని. అప్పుడెప్పుడో తెలంగాణ హిందూత్వ తటాకాల్లో ‘కమలాలు’ వున్నమాట నిజమే. కానీ, కుల,మతాలకు అతీతంగా పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమ ఉధ్ధృతికి అవి ఎండిపోయాయి. కానీ, గత ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘చేయి’జారి చెంబుడు నీళ్ళు కింద పడటం వల్ల, అందులోంచి ‘కమలం’ వికసించింది. సరిగ్గా అంతకు ముందే బీజేపీ రాష్ట్ర నేత కిషన్ రెడ్డి తెలంగాణ అక్కడక్కడా ‘హిందూత్వ’ జలాలను చిమ్ముకుంటూ తిరిగారు. దీంతో ‘మతకొలను’లన్నీ మునకలేసాయని ఆయన నమ్మకం. ఇప్పటి ‘పరకాల’ ఉప ఎన్నికలో, ఇంకొక ‘కమలాన్ని’ పూయించవచ్చునన్నది ఆయన గట్టి ఊహ. పాపం. వరసగా గత రెండు అసెంబ్లీలలోనూ ‘జంట కమలాలే’ ప్రాతినిథ్యం వహించేవి. ‘మూడోది’ గెలిచేసరికి రాష్ట్రం మూడే మారిపోయిందని ‘కమలనాధులు’ జాతీయ స్థాయిలో ఉత్సాహం గావున్నారు.
నిజంగానే ‘పరకాల’లో వోటర్లకు ‘చేతులు’ కాలాయి. ‘చేతి’ గుర్తు మీద గెలిచిన కొండా సురేఖ వైయస్సార్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి, ఉప ఎన్నిక తెచ్చిపెట్టారు. ఆమెకూడా తెలంగాణ కోసమే అంకితమయ్యానంటున్నారు. కానీ, తెలంగాణ కు ‘పేటెంటు హక్కు’న్నట్టు భావించే ‘గులాబీ’ ‘తెలంగాణ నినాదం’ పుట్టకుమందే తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించామన్న ‘కమలమూ’ బరిలోకి వచ్చాసాయి. కాలిన ‘చేతులు’ ఏ పువ్వును పట్టుకుంటాయన్న ఉత్కంఠతో దేశమంతా ఎదురు చూస్తుంటే, ఇంతలో మరో ఆశ్యర్యం సంభవించింది.
ఏకంగా ‘సామెత’నే మార్చుకునే పరిణామం ఇది. ‘పువ్వులు కాలాక చేతులు పట్టుకోవాలి’ అన్న సందేశాన్ని ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రం(కర్ణాటక)లో మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావటానికి, ‘కమలాన్ని’(బిజెపిని’ వదిలేసి ‘చేతుల్ని’(కాంగ్రెస్) పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతే కాదు తనకు అనుయాయులుగా వున్న డెభ్భయి మంది శాసన సభ్యుల చేతా ‘చేతులు’ పట్టిస్తున్నారని కూడా వినవస్తోంది. ఇదే జరిగితే, దక్షిణాది రాష్ట్రాల నీళ్ళల్లో ‘కమలం’ వికసించదన్న విశ్వాసం బలపడుతుంది.
రాజకీయాల్లోకి వచ్చాయి అన్నీ కాలతాయి.. కడకు పువ్వులు కూడా.
న్యూస్ బ్రేకులు:
‘సీమాంధ్ర’ బాబు!
తెలుగుదేశం పార్టీ 2014 లో అధికారంలోకి వస్తే తొలి తీర్మానం తెలంగాణ పైనే!
-ఎర్రబెల్లి దయాకర రావు, కన్వీనర్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం.
ఓహో! అప్పుడు చంద్రబాబు తన పేరును ‘సీమాంధ్ర’ బాబుగా పేరు మార్చుకుంటారా? ఆయన మిగిలిన భాగానే ముఖ్యమంత్రి కాగలరు కదా!
వైయస్ 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. నా తండ్రి 1962 నుంచి రాజకీయాల్లో వున్నారు. వైయస్ నాయకత్వంలో కలిసి పనిచేశాను అంతే. ఆయన నాకు రాజకీయ జీవితం ఇచ్చారంటే నవ్వుతారు. గతం తెలుసుకుని మాట్లాడండి.
-కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
బాగా గుర్తుతెచ్చుకోండి. మీరు వైయస్తో కలిసి పనిచేశారా? లేక ఆయన తండ్రి రాజిరెడ్డి తో కలిసి పని చేశారు. చూడబోతే, తమరు భూమికి ముందు పుట్టినట్టున్నారు!!
ట్విట్టోరియల్
మూడు ముక్కలాట
కులం! మతం! ప్రాంతం! ఈ మూడు మాటలూ నచ్చితే ఒట్లు.( వోట్లు కూడా) నచ్చక పోతే తిట్లు. అధికారాన్ని సుష్టుగా భోంచేసే ఏ రెండు మూడు కులాలకో ఈ మాటలు తిట్లలాగే అని పిస్తాయి. కానీ, ‘పవరే’ ఎరుగుని బడుగులకూ, మైనారిటీలకూ, వెనుకబడిన ప్రాంతీయులకూ ఇవి వొట్లు. ఈ వొట్లే చైతన్యం వల్ల దేశ వ్యాపితంగా వోట్లుగా మారాయి. దాంతో ‘దేశాధినేత’(రాష్ట్రపతి) ఎన్నిక కు ఈ మూడు మాటలూ అవసరమయ్యాయి. (మైనారిటీ) మతమయితే అన్సారీ, (అణగారిన) కులమయితే మీరా కుమారి, ప్రాంతమయితే ప్రణబ్ ముఖర్జీల పేర్లను కాంగ్రెస్ ముందు పెట్టుకు తిరుగుతోంది. ఎందుకంటే ఎస్సీ,బీసీ, మైనారిటీల ఆలంబన గావున్న పార్టీల, ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలంటే ఈ మూడు ముక్కల్నీ ఉఛ్చరించక తప్పదు. ఇష్టంలేని మంత్రోఛ్ఛారణ చెయ్యటం పైనున్న వారికి కష్టంగానే వుంటుంది. కానీ తప్పదు మరి!
‘ట్వీట్ ‘ఫర్ టాట్
పెద్ద బాల ‘శిక్ష’!
సుబ్రహ్మణ్యస్వామి(జాతీయాధ్యక్షుడు, జనతా పార్టీ) : అంబేద్కర్కు వ్యతిరేకంగా వేసినట్టుగా ఆరోపించబడుత్ను కార్టూన్లో, నెహ్రూ కొరడాతో కొడుతున్నది నత్తనే కానీ (దాని మీద కూర్చున్న) బాబాసాహేబ్ను కాదని అనుకుంటున్నాను. కార్టూనిస్టు శంకర్ దళిత వ్యతిరేకా? అసంభవం.
కౌంటర్ ట్వీట్: కానీ ఆ కార్టూన్ని పాఠ్యపుస్తకంలో పెట్టిన వాళ్ళు కేవలం దళిత వ్యతిరేకులు మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యతిరేకులు కూడా. శిక్ష ఏమిటో సెలవిస్తారా?
ఈ- తవిక
ద్విపాత్రాభినయం
హిట్టయితే ‘మెగా’
ఫ్లాపయితే ‘చిరు’
ఇది సినిమా.
గెలిస్తే ‘నాజీ’
ఓడితే ‘మాజీ’
ఇది రాజకీయం
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
మనీ-మీడియా-మాఫియా, ఈ మూడూ రాజకీయానికి మూడు ముఖాలు. కానీ, ఈ మూడింటిని కలిపేశాడు ఒకాయన. ఏమయ్యింది? ముఖం ‘మాడియా’ అయ్యింది.
కొట్టేశాన్( కొటేషన్):
పదండి ‘మందు’కు, పదండి ‘డోసు’కు పోదాం పోదాం (పోలింగ్) క్యూలోకి!
-సతీష్ చందర్
- Satish Chandar, Journalist. Poet. Writer.
There are no posts related to ఏ పూలు తేవాలి నీ పూజకు?.
2012-05-14
నేటి రాజకీయం: మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్లో అక్షర ఫ్యాక్షనిజం!
చదవం. చదవబడతాం.
వినం. వినబడతాం.
చూడం. చూడబడతాం.
కారణం? మీడియా.
మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.
అది వార్త కావచ్చు. వ్యాఖ్య కావచ్చు.
అందుకే పత్రిక చదివాక, మనకొచ్చే అభిప్రాయాలు మనవి కావు. రెడీమేడ్ వస్త్రాలు తయారు చేసినట్టు ముందుగానే అవి తయారు చేయబడతాయి.
పార్టీకో మీడియా సంస్థ. లేదా మీడియా సంస్థకో పార్టీ. ఇంకాస్త లోతుకు వెళ్ళితే- సామాజిక వర్గానికో పార్టీ, పార్టీకో సామాజిక వర్గం.(కులం అని నేరుగా అనవచ్చు. కానీ సభ్యత పేరుమీద ముసుగులో గుద్దులాట) అందుకనే ‘వర్ణం’అంటని మీడియా వుండదు.
నిజం – అన్నది ఒక పత్రికలో కాకుండా, రెండు పత్రికల మధ్య ఇరుక్కుంటోంది. రెండు చానెళ్ళ మధ్య నలిగిపోతోంది.
తెలుగునాట, మీడియా అంతా ఒకలాగా లేదు. ఒక పత్రిక పీక నొక్కితే, అన్ని పత్రికలకూ నొప్పిగాలేదు. ఆ ఒక్క పత్రిక మాత్రమే గిలగిల లాడుతోంది. ఆ పత్రిక మాత్రమే ‘బ్లాక్డే’ అని పెద్ద అక్షరాలతో వేసుకుంటుంది. ‘యమర్జన్సీ’ని తలపిస్తోందని ప్రకటనలు చేస్తుంది. ఈ ఆందోళనను గమనించినప్పుడు- పత్రికా స్వేఛ్చ- అంటే పలు పత్రికల స్వేఛ్చ కాదేమో, ఆ ‘ఒక్క పత్రిక స్వేఛ్చ’ మాత్రమే నేమో అన్న అనుమానం కూడా వేస్తుంది.
ఇప్పుడు ఈ కష్టంలో వున్నది ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్. ఆ ప్రసార సాధనాలను నడిపే కంపెనీల ఖాతాలను సిబిఐ స్తంభింప చేసింది. రెండు వేలకు పైగా పాత్రికేయులూ, వేల సంఖ్యలో ఇతర ఉద్యోగులూ, ఏజెంట్లూ ఆధార పడి వున్నారు. కారణాలు ఏమైనా, యాజమాన్యం తో పాటు వీరందిరికీ కష్ట కాలమే. ఈ ప్రసార సాధనాలు పెట్టటానికి వై.యస్ జగన్మోహన రెడ్డికి- అంత డబ్బెక్కడిదీ – అన్న ఆరాలు తీసి, తీసి, కేసును సిబిఐ ఇక్కడ వరకూ తెచ్చింది. పొందిన లబ్ధికీ- పెట్టిన పెట్టుబడికీ ‘అక్రమ సంబంధం’ (క్విడ్-ప్రో-కో) వుందనే నిర్ధారణకు వచ్చి, ఈ చర్యకు పాల్పడింది. అంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వై.యస్ వివిధ వాణిజ్య సంస్థలు చేసిన సేవలకు, ప్రతిగా(సిబిఐ దృష్టిలో లంచంగా) ఈ పెట్టుబడులు పెట్టారన్నది ఆరోపణ.
సరే, ఈ పెట్టుబడుల వల్ల ‘సాక్షి ‘లబ్ధి పొందింది. మరి ‘సాక్షి’ వల్ల ఎవరు ‘లబ్ధి’ పొందారు. కేవలం వై.యస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడూ నా..!? కాదు. రాష్ట్రంలో వున్న కాంగ్రెస్ పార్టీ. ఈ పత్రిక స్థాపించక ముందు కాస్త పెద్ద గొంతు వున్న పత్రికలు దాదాపు కాంగ్రెస్కు వ్యతిరేకంగానే వున్నాయి. అందుకనే కదా- మొదటి సారిగా వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ‘ఆ రెండు పత్రిలూ’ కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాస్తున్నాయని, అంటూనే వుండేవారు ( అవే ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’.). ఈ రెండు పత్రికలూ ఒకే సామాజిక వర్గం (కమ్మ ) అండతో ఒకే పార్టీని(తెలుగుదేశం) పార్టీ స్వరాన్ని వినిపించేవి. అంటే కాంగ్రెస్ కంటూ ఒక పత్రికలేదన్నది వైయస్ చెప్పకనే చెబుతుండేవారు. ఫలితంగానే ‘సాక్షి’ పుట్టిందని వేరే చెప్పనవసరం లేదు.
ఆయన అకాల మృతి తర్వాత, వై.యస్.జగన్ కాంగ్రెస్లో కొనసాగకుండా, (పోనీ, కొనసాగ లేక) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అప్పుడు అనివార్యంగా ‘సాక్షి’ తెలుగుదేశం పార్టీకే కాకుండా, కాంగ్రెస్ కు కూడా వ్యతిరేకమయ్యింది. అంతే కాదు. అంతవరకూ కాంగ్రెస్ తో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ( ఎస్సీలతో పాటు రెడ్లు) కాంగ్రెస్ను ఖాళీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొచ్చారు. అంటే ‘కమ్మ’ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రత్యర్థి వర్గమైన రెడ్లు ఇప్పుడు జగన్తో వున్నారు.
ఇప్పుడు ఏ వర్గం మీడియా వారికి వుంది.
దాంతో ఎవరి నొప్పి వారే భరించాల్సిన స్థితి కూడా ఏర్పడింది.
వైయస్ వెటకారమాడే ‘ ఆ రెండు పత్రికలకు’ కూడా కష్ట కాలం వచ్చింది.
‘ఈనాడు’ వారి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ నిర్మాణానికి ‘మర్గదర్శి’ పొదుపు నిల్వలను నిబంధనలకు విరుధ్దంగా మళ్ళించారంటూ, విచారణ మొదలు పెట్టినప్పుడు, ఆ నొప్పి, ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’లకే అర్థమయింది.
అలాగే ‘బడుగు నేతలా? బాడుగ నేతలా’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి రాశాక, బడుగువర్గాల కు చెందిన నేతలకీ, ఆ సంస్థకీ మధ్య స్పర్థ ఏర్పడి, ఆ పత్రికకు చెందిన వారిని కొందరిని అరెస్టు చేసినప్పుడు కూడా, ఆ బాధ ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ లకే అర్థమయింది.
అప్పుడూ వారూ ‘బ్లాక్ డే’లు పాటించారు. ‘యమర్జన్సీ రోజుల్ని’ తలపోసుకున్నారు. ‘పత్రికా స్వేఛ్చ’ను దెబ్బతీస్తున్నారన్నారు.
ఒకప్పుడు ఒక పత్రిక మీద దాడి జరిగితే, అన్ని పత్రికలూ (యాజమాన్యాలు) ఒక్కుమ్మడిగా అరిచేవి. కానీ, ఇప్పుడు అలాలేవు. కొద్దో, గొప్పో పాత్రికేయులే తమ తమ యాజమాన్యాలు గీసిన ‘లక్ష్మణ రేఖల్ని’ సైతం దాటి, ఈ దాడులన్నిటికీ స్పందించారు. స్పందిస్తున్నారు కూడా. నిజానికి పత్రికా స్వేఛ్చ అన్నది- పత్రికా రచయితలదే కానీ, యజమానులది కాదు. తెలుగు నాట డెభ్భయ్వవ దశకం నుంచే, ఈ స్వేఛ్చ యజమానులకు వెళ్ళిపోయింది. వారు తమ తమ స్వతంత్ర అభిప్రాయాలతో రచనలు చేసే అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికి తమది కాని, తమ దగ్గర లేని ‘పత్రికా స్వేఛ్చ’ పోయినప్పుడెల్లా ఈ పాత్రికేయులే పోరాడుతున్నారు.
మీడియాలో ఈ రెండు శిబిరాలూ, రెండు ఫ్యాక్షనిస్టు శిబిరాలుగా మారిపోవటం- ఎవరికయినా బాధగానే వుంటుంది. అయితే ఈ శత్రుత్వం ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా సాగుతూనే వుంది.
తొంభయ్యవ దశకం తొలి పాదంలో కాంగ్రెస్ నేత మాగుంట సుబ్బ రామి రెడ్డి నేతృత్వంలో ‘ ఉదయం’ దినపత్రిక నడుస్తోంది. అప్పుడు (1989-94) కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. రాష్ట్రంలో పేద వర్గాల మహిళలు ‘సారా వ్యతిరేక పోరాటం’ చేస్తున్నారు. ఈ పోరాటం పుట్టింది ప్రధానంగా ఆరోగ్య కారణాల వల్ల కాదు- ఆర్థిక కారణాల వల్ల. దీనికి కూడా నేపథ్యం లేక పోలేదు. ఈ ‘సారా వ్యతిరేక ఉద్యమా’నికి ముందు, అక్షరాస్యతా ఉద్యమం నడిచింది. కూలి మహిళలు చదువు నేర్చుకున్నారు. దాంతో తమ కొచ్చే ఆదాయ, వ్యయాల్ని లెక్క చూసుకున్నారు. భర్తలు తాము సంపాదించిందంతా తాగుడికే తగలేస్తుంటే, బిడ్డల కడుపుల్లో గంజి పోయటమే కష్టమవుతుందన్న స్పృహ వచ్చింది. వారు ప్రభుత్వ సారాయి దుకాణాల మీద దాడులు చేశారు. ‘నాటు సారా’ను బంద్ చేయమన్నారు. అయితే ‘ఈనాడు’ ఈ ఉద్యమానికి మద్దతునిస్తూనే, ఈ ఉద్యమ విస్తృతిని పెంచింది. దీని ఐఎంఎప్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) కు కూడా వర్తింప చేసింది. అంటే ‘నాటు సారా’ యే కాదు, ‘బ్రాందీ, విస్కీ’లను కూడా బంద్ చేయించటానికి మధ్యతరగతి మహిళల్ని పురికొల్పింది. అందుకు ‘ఆరోగ్య’ కారణాలను ప్రధానంగా ఎత్తి చూపించింది. అందుకోసం ఆ పత్రిక కంకణం కట్టేసుకుంది. ఇటు సారా, అటు మద్యం – వెరసి ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ అమలు లోకి తెచ్చే వరకూ ఆ ప్రతిక నిద్రపోలేదు, ఆ పత్రిక కోరినట్లుగానే , ‘తెలుగుదేశం’ తిరిగి అధికారంలోకి వచ్చాక ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ మీద ముఖ్యమంత్రి గా ఎన్టీరామారావు తొలి సంతకం చేశారు.
సీన్ కట్ చేస్తే,
కాంగ్రెస్కు వత్తాసు పలికే ‘ఉదయం’ దినపత్రిక కష్టకాలంలో పడింది. కారణం? దాని ఆర్థిక మూలాల మీద వేటు పడింది. మాగుంట సుబ్బి రామి రెడ్డి ఒక ప్రముఖ లిక్కర్ కంపెనీకి దక్షిణ బారత దేశానికి డీలర్ గా వున్నాడు. దాంతో ఆయన వ్యాపారం కుంటుపడింది. ఆ తర్వాత అనుకోకుండా, ఆయన నక్సలైట్ల చేతుల్లో మృత చెందటం, వ్యాపార నష్టాల వలన ఆ పత్రికను కొనసాగించలేకపోవటమూ, ఆ పత్రిక శాశ్వతంగా మూతపడటమూ, ఆ పత్రికలోని సిబ్బంది నిరుద్యోగంలోకి నెట్టబడటమూ తెలిసినవే.
‘సారా వ్యతిరేకోద్యమాన్ని’ , ‘మద్యవ్యతిరేకోద్యమంగా’ మార్చటంలో నాడు ‘ఈనాడు’ చూపిన చొరవ మీద అనేక అనుమానాలు వచ్చాయి. ‘ఈనాడు’ కు పోటీగా నిలిచిన ‘ఉదయం’ దినపత్రికను దెబ్బతీయటానికే ఈ పని చేశారని వారు తమ తమ ప్రయివేటు సంభాషణల్లో చర్చించుకునే వారు.
నాడు ‘ఉదయం’. నేడు ‘సాక్షి’.
కారణాలు వేరయినా ఫలితం ఒక్కటే. వేటు ఆర్థిక మూలాల మీద పడింది.
రెండు మీడియా శిబిరాలు
రెండు కులాలు
రెండు పార్టీలు.
రెండేసి ప్రచారాలు.
ఒకరి జీవిత చరిత్రను మరొకరి మీడియాలో చదువుకోవచ్చు.
‘డెయిలీ జర్నలిజం’ కాస్తా ‘డెయిరీ’ జర్నలిజంగా మారిపోయింది.
లక్షలమంది పాఠకులు అన్నీ చదువుతున్నారు. ఇష్టపడి చదువుతున్నారో, విధిలేకే చదువుతున్నారో, మరో మార్గాంతరం లేకే చదువుతున్నారో ఎవరికి ఎరుక.
ఈ రెండు శిబిరాల పత్రికల్లో అన్ని హంగులూ, అన్ని రంగులూ వుంటాయి. లేని దెల్లా ఒక్క ‘విశ్వసనీయత’ మాత్రమే.
అందుకనే కొద్దో, గొప్పో చదువుతో పాటు, ఇంటర్నెట్ సౌకర్యం వున్నవారు తమ తమ బ్లాగులు తెరచుకుని, తమ తమ అభిప్రాయాలను స్వేఛ్చగా చెప్పుకుంటున్నారు. ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి ‘సోషల్ మీడియా నెట్ వర్క్లలో’ తమకు తెలిసిన వ్యక్తీకరణతో నిజాలను ఆవిష్కరిస్తున్నారు. ఇదే ప్రత్యామ్నాయ పత్రికా రచన. మరో భాషలో చెప్పాలంటే పౌర పత్రికారచన (సిటిజన్ జర్నలిజం). ఈ పత్రికా రచనకే గల్ఫ్ దేశాల్లో రాజ్యాలకు రాజ్యాలే కుప్ప కూలిపోయాయి.
తెలుగు నాట ఈ రెండు శిబిరాలూ ‘అక్షర ఫ్యాక్షనిజాని’కి స్వస్తి చెప్పాలి.
పత్రికా స్వేఛ్చను ప్రజల హక్కుగా, పాత్రికేయుల స్వేఛ్చగా గుర్తించాలి.
అలా చెయ్యని పక్షంలో – చైతన్యవంతులైన విద్యావంతులు మిన్నకుండరు. ఫలితంగా ఖరీదయిన పాఠాలు నేర్చుకోవాల్సి వుంటుంది.
పేజీలకు రంగులు వేసుకోండి కానీ, అక్షరాలకు ‘వర్ణాల’(కులాలను, పార్టీలనూ) అద్దకండి.
పత్రికా స్వేఛ్చ వర్థిల్లాలి!
-సతీష్ చందర్,
journalist,poet,writer.
There are no posts related to మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి..
2012-02-02
ప్రజ్ఞ: "కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"
2012-01-04
గుండె చప్పుడు...: నాకొక స్వప్నం ఉంది!
2011-12-12
గుండె చప్పుడు...: మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం
2011-11-04
చదువరి: సీబీఐ ని విచారించిన జగన్ !
2011-10-21
చదువరి: గెలిచినవాడు నీచ మానవుడు
2011-10-12
2011-09-26
జాబిల్లి » రాజకీయం: తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి
2011-08-18
ప్రజ్ఞ: ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?
2011-08-17
చదువరి: మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..
2011-08-16
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అన్నా హజారే x అవినీతి నాయకులు
జాబిల్లి » రాజకీయం: అన్నా హజారేకు మద్దతుగా నడక
2011-08-05
చదువరి: సమస్యలు బాబోయ్ సమస్యలు
2011-08-02
మతాలు - రాజకీయాలు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ
డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-
ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.
భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.
హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.
హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.
భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.
హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.
ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.
మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.
రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.
ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.
ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం: 370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.
ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.
ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.
ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం: హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.
ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.
ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.
భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.
2011-06-14
చదువరి: మరింత దిగజారిన లౌకికవాదం
2011-06-08
పాలవెల్లి: కమ్యునిస్టులకు ఎవరంటే ద్వేషం
2011-05-29
చదువరి: మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం
2011-05-22
చదువరి: "అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"
2011-05-21
చదువరి: హైకమాండుకు కమానుకట్టలు విరిగినై
2011-05-19
చదువరి: సానుభూతి గెలిచింది
2011-04-14
చదువరి: ఉండవల్లి అస్త్రం
2011-03-28
చదువరి: వయ్యెస్సార్ రౌడీ మూక
2011-03-15
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: తెగించిన తెలిబాన్లు
2011-03-07
పాలవెల్లి: 'నేను తప్పు చేసాను'
2011-02-17
చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!
చదువరి: శాసనసభ వద్ద రౌడీలు
2011-01-19
చదువరి: అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి
2010-12-31
చదువరి: 2010 లో మన నాయకులు
2010-12-30
మతాలు - రాజకీయాలు: అతితెలివి క్రైస్తవ నన్
పోలండులో ఇస్కాన్ (ఇంటర్నషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కానషస్నెస్) అనుయాయుల సంఖ్య బాగా పెరగడం గమనించిన ఒక నన్ ఇస్కాన్ పై వార్సా కోర్టులో కేసు వేసింది. ’ఇస్కాన్ అనుయాయులు 16,000 మంది గోపికలను పెళ్ళాడిన కృష్ణుడు అనే ఒక అనైతిక పాత్రను కొలుస్తున్నారు’ అనేది ఆ కేసులోని విషయం.
కేసు విచారణకువచ్చినపుడు ఇస్కాన్ లాయరు జడ్జిని, ’ఈమె నన్ గా మారే సందర్భంలో తాను చేసిన ప్రమాణాన్ని ఓ సారి చదవమని ఈ నన్ ను అడగండి’ అని అడిగాడు. జడ్జి ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని ఆమెను అడిగాడు. ఆమె చదవలేదు.
ఇస్కాన్ లాయరు ’పోనీ నన్ను చదవమంటారా’ అని జడ్జిని అడగ్గా, జడ్జి సరేన్నాడు. ఆ ప్రమాణంలో తాను (ఆ నన్) ఏసుక్రీస్తును పెళ్ళి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. అది చదివాక, ఇస్కాన్ లాయరు అడిగాడు: “యువరానర్! కష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడని అంటున్నారు. కానీ, కనీసం ఒక మిలియను మంది నన్ లు తాము క్రీస్తును పెళ్ళాడామని నిర్ధారిస్తున్నారు గదా, మరి.. క్రీస్తు, కృష్ణుడు – వీళ్ళిద్దరి లోనూ నీతి బాహ్యుడెవరు ?
జడ్జి కేసును కొట్టేసాడు.
———
ఇస్కాన్ వారి సైటు నుండి.
========================
2010-12-04
నా ఆలోచనలు: మా యాకోబు రాజకీయ కష్టాలు
నా ఆలోచనలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహానుబావులు: నా మొదటి బ్లాగ్
2010-11-25
చదువరి: ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!
2010-09-10
చదువరి: పోయినోళ్ళందరూ మంచోళ్ళే..
2010-07-21
చదువరి: నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!
2010-07-18
చదువరి: బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!
2010-07-06
చదువరి: మాకూ ఉపశమనం కావాలి!
2010-06-10
చదువరి: మందు x మందులు
2010-05-25
చదువరి: ఒక్కడే మహానుభావుడు..
2009-12-14
ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!
(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)
విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక వైపు మాత్రమే..
1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో.. జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో..
టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు.. ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్గా మారిపోతుంది..” — మీరు మరీ generalize చేస్తున్నట్టు అనిపించట్లేదా?!! ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్ కాలేజీ, వుమెన్సకాలేజీ, హైకోర్టు, రాజ్భవన్, అసెంబ్లీ, దిల్కుశ్ గెస్టహౌస్, పురానాపూల్, నయాపూల్, మక్కామసీదు, హుస్సేన్సాగర్,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు, హైటెక్ సిటీ, ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి.. అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”.. మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..
ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!
ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!! (ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)
నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!
2009-11-01
చదువరి: సాయంకాలమైంది!
2009-10-23
చదువరి: ఆ.. ట ఆగిందా!
2009-10-13
చదువరి: హైకమాండు, హై.కమాండు
2009-04-20
తెలుగు 'వాడి'ని: ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?
2009-04-17
తెలుగు 'వాడి'ని: 165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్
2009-04-10
తెలుగు 'వాడి'ని: PRP అంటే ......... !!!!!!!
2009-03-15
తెలుగు 'వాడి'ని: జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ
Its very good posting…. chaalaa bagundi.. aa lawyer ki naa kritagnatalu cheppalani undi!!!
Thank you for suggesting the book Sriram gaaru. I think it will take considerable amount of time for me to go through and understand the book. meanwhile shall try to put a post on this subject.
nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.
సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!


