ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2013-05-16

The Road to Emancipation: A post by Konatham Dileep on Facebook about Bhagat Singh's dream on independence

2013-05-16 10:40 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకూ తెలంగాణ పరిష్కారం చూపదు. ఇక్కడే మనం భగత్ సింగ్ మాటలను గుర్తుకుతెచ్చుకోవాలె: స్వాతంత్రం వస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందా అని ఒక మిత్రుడు అడిగితే, భగత్ సింగ్ ఇలా బదులిచ్చాడట. "మేము పదహారణాల కొరకు కొట్లాడుతున్నాం. స్వాతంత్రం మొదటి అణా మాత్రమే. అదొస్తే రేపటి నుండి మిగతా పదిహేను అణాల కొరకు కొట్లాడుతాం" అదీ నేస్తం విషయం. తెలంగాణ రాగానే కుల-మతాలూ, ధనిక-పేదలు, ఆడా-మగలు ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. కానీ ఈ ఉద్యమ పోరాటస్ఫూర్తి వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రడేశ్ కన్నా, ఇంకా అనేక రాష్ట్రాల కన్నా మెరుగైన రాష్ట్రంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం Rocket Science కానే కాదు. అది కేవలం Common Sense మాత్రమే అది నీకుందా లేదా అన్నదే ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న!

2013-05-12

The Road to Emancipation: తెలుగు జాతి సమైక్యత పేరు చెప్పుకోకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ పేరు చెప్పుకోవచ్చు కదా - విశాలాంధ్ర మహాసభకి సవాల్

2013-05-12 11:07 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా కోస్తా ఆంధ్రలో ఎక్కువ మంది ఇంగ్లిష్ కలిపిన తెలుగే మాట్లాడుతారు, తెలంగాణాలో ఎక్కువ మంది ఉర్దూ కలిపిన తెలుగే మాట్లాడుతారు. సురవరం ప్రతాప రెడ్డి కాలంలో తెలంగాణావాదమూ లేదు, సమైక్యవాదమూ లేదు. అయినా సురవరం గారు ఇలా అన్నారు "సర్కార్ ప్రాంతంలో తెంగ్లిష్ మాట్లాడితే నైజాం ప్రాంతంలో తుర్దూ మాట్లాడుతారు" అని. మాతృభాషాభిమానం లేని ఒక జాతికి చెందినవాళ్ళు నిజంగా భాషా సమైక్యత కోసం వీధి పోరాటాలు చేస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాలాంధ్ర మహాసభవాళ్ళు భాషా సమైక్యత పేరు చెప్పుకోకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ పేరు చెప్పుకుని వీధి పోరాటం చేస్తే వాళ్ళని మోసగాళ్ళని అనుకోవాల్సిన పని ఉండదు. భాషపై లేని ప్రేమ ఉందని చెప్పుకుంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రం అభ్యంతరకరమే. 

2013-05-11

The Road to Emancipation: తాము సమైక్యవాదులమని నిరూపించుకోవడానికి తెలుగు భాషని హత్య చేస్తోన్న ఈనాడు దిన పత్రిక

2013-05-11 10:19 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

అవును, ఈనాడు దిన పత్రిక తెలుగు భాషని హత్య చేస్తోంది. ఆ మధ్య విశాఖపట్నం గీతం విశ్వ విద్యాలయంలో ఇంటర్నెట్‌లో తెలుగు వాడకం గురించి సమావేశం జరిగినప్పుడు ఈనాడువాళ్ళు అంతర్జాలం అని వ్రాస్తే ఆ పదం ఏమిటో అర్థం కాక జనం ఆ సమావేశానికి రాలేదు. "అంతర్జాలం అంటే ఏమిటి? ఈనాడులో దాని గురించి వ్రాసారు" అని కొందరు నన్ను అడిగిన తరువాత నాకు అసలు విషయం అర్థమైంది "నిజ జీవితంలో ఇంటర్నెట్‌ని అంతర్జాలం అనేవాళ్ళు ఎవరూ లేరు" అని.

ఈనాడు ఒక కరడుగట్టిన సమైక్యవాద పత్రిక. సమైక్యవాద ఉద్యమం అనేది హైదరాబాద్ కోసమే జరుగుతోంది తప్ప అది తెలుగు ప్రజలని నిజంగా సమైక్యంగా ఉంచడానికి కాదు అనేది అందరికీ తెలిసినదే. కానీ ఈనాడువాళ్ళు సమైక్యవాద ఉద్యమం అనేది తెలుగు జాతి పరిరక్షణ కోసమే జరుగుతోందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు కోసం తమకి లేని భాషాభిమానం ఉన్నట్టు చూపిస్తున్నారు. అలా భాషాభిమానాన్ని ప్రదర్శించుకోవడానికే వాళ్ళు సాధారణ ప్రజలకి అర్థం కాని గుత్తేదారు, నిరీక్షణ జాబితా, శీతల బస్సు (AC Bus) లాంటి పాషాణ పాకపు పదాలని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చూస్తే జనం తెలుగంటే భయపడిపోతారు తప్ప తెలుగు భాష అభివృద్ధి చెందదు. ఫేస్‌బుక్‌లో హెచ్చార్కే అనే ఒకాయన తనకి తెలుగు మీద ఆసక్తి లేదనీ, ఇంగ్లిష్ నేర్పిస్తేనే తన పిల్లలకి ఉద్యోగాలొస్తాయనీ బహిరంగంగానే వ్రాసారు. ఉద్యోగావకాశాల కోసం సొంత భాషని మర్చిపోవడం బాధకరమే. ఈ పరిస్థితిలో ఈనాడువాళ్ళు మరింత మంది తెలుగంటే భయపడేలా చేస్తున్నారు.

నేను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమే. కానీ నేను ఈనాడుని విమర్శించడానికి కారణం అది కాదు. వాళ్ళ వల్ల తెలుగు భాష తొందరగా చస్తుంది కానీ బతకదు. ఇప్పటికే చచ్చిపోయే స్థితిలో ఉన్న తెలుగు భాష నిజ జీవితంలో ఎవరికీ అర్థం కాని గుత్తేదారు(ఉర్దూ), నిరీక్షణ జాబితా(సఘం సంస్కృతం, సఘం ఉర్దూ) లాంటి పదాలు ఉపయోగించడం వల్ల బతకదు అనేది నిజం. భాషాభిమానం ఎవరికీ లేని ఒక జాతి (తెలుగు జాతి) మేడి పండు లాంటి ఒక నగరం (హైదరాబాద్) పేరుతో కలిసి ఉన్నా, ఉండకపోయినా ఈ జాతివాళ్ళు మాట్లాడే భాష ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోతుంది. It is a determined and destined truth. కానీ ఈ భాష వైపు జనం రావడానికి భయపడిపోయేలా చేసే పదాలు ఉపయోగిస్తే ఈ భాష తొందరగానే అంతరించిపోతుంది.

2013-05-02

The Road to Emancipation: Muslims are not against Telangana and Asaduddin is just a poster boy

2013-05-02 07:48 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)
YSR was the first one to do propaganda that Muslims are against Telangana.Sonia has great confidence on Muslim votes. If state level leaders of Congress does propaganda that Muslims are against Telangana, then it will be easy for Sonia to take anti-Telangana decision. MIM was founded as pro-Nizam party. It's not a wonder if a pro-Nizam party stands against development of Telangana. So, a leader of such party became a poster boy for United Andhra supporters. We must remember that many muslims did struggle against Nizam's rule even though Nizam's razakars did commit brutal rapes on Hindu women. But now, some Hindus want Nizam's legacy against Telangana.

2013-04-29

The Road to Emancipation: చదువుకున్న బ్రాహ్మణుడు చేతబడి చెయ్యలేడు కానీ అక్షరం ముక్క రాని గిరిజనురాలు మంత్రాలు చదివి చేతబడి చేస్తుంది!

2013-04-29 03:27 PM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

పాతికేళ్ళ క్రితం జరిగిన ఘటన ఇది. ఓ రాత్రి మా తాతయ్య మోటర్ సైకిల్ మీద టౌన్ నుంచి పల్లెటూరికి తిరిగివస్తోంటే నలుగురు దొంగలు అతని మోటర్ బైక్‌ని దొంగిలించడానికి అతన్ని దారిలో అడ్డగించి కొట్టారు. ఆ తరువాత చంపబోయారు కూడా. కానీ ఒక దొంగ ఇలా అన్నాడు "వీడికి జంధ్యం ఉందంటే వీడు ఏ బాపనోడో, కరణపోడో అయ్యుంటాడు, బాపనోణ్ణి చంపిన పాపం మనకి చుట్టుకుంటది, వీణ్ణి వదిలెయ్యండిరా" అని. మిగితా దొంగలు మా తాతయ్యని వదిలేశారు. మా తాతయ్య గిరిజనుడని నిజం తెలిస్తే మాత్రం చంపెయ్యడం కరెక్టేనా? మనిషన్న తరువాత ఏ కులపోడైతే ఏమిటి? కావాలని మగవాళ్ళని వదిలేసి ఆడవాళ్ళని చంపేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించే నేను ఈ పుస్తకంలో వ్రాసాను: 
http://kinige.com/kbook.php?id=1404

2013-04-28

The Road to Emancipation: దానధర్మాల వల్ల పేదరికం ఎందుకు మాయమవ్వదు?

2013-04-28 07:06 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

దానధర్మాల వల్ల పేదరికం మాయమవ్వదు. కావాలంటే ఒక పల్లెటూరివానికి 40,000 రూపాయలు ఇచ్చి చూడండి. అతను వాషింగ్ మెషీనో లేదా గెలాక్సీ నోటో కొనకుండా ఆ నలభై వేలతో రోజూ మాంసమూ, చేపలూ తింటాడు. అతని standard of living వల్ల అతనికి వాషింగ్ మెషీన్ లేదా గెలాక్సీ నోట్ కొనాలనే ఆలోచన పుట్టదు. ఒరిస్సాలోని తుంబిగూడ అనే గిరిజన గ్రామంలో ఒకప్పుడు నాలుగు ధనవంతుల కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రామంలో ఒకటే ధనవంతుల కుటుంబం ఉంది. మిగిలిన మూడు కుటుంబాలవాళ్ళు మందూ, మాంసమూ, చేపల కోసం తమ తాతలు సంపాదించిన ఆస్తులని అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆస్తుల కోసం తమ అన్నదమ్ములతో రోజూ గొడవపడుతూ బతుకుతున్నారు.

"స్వేచ్ఛ అంటే ప్రతి మనిషి యొక్క అవసరాన్ని గుర్తించడం" అని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ అన్నాడు. "అవసరం అంటే ఏమిటి" అనే చైతన్యం standard of livingని బట్టి కలుగుతుంది. మార్కెట్‌లో 21,000 రూపాయలకే గెలాక్సీ ట్యాబ్ 310 మోడల్ దొరుకుతుంది. కానీ పల్లెటూరివాడు అది కొనకుండా రెండు లక్షల రూపాయలని తన కూతురు పెళ్ళికి కట్నంగా తగలెయ్యగలడు. అతని standard of livingలో అతనికి వాషింగ్ మెషీన్ లేదా ట్యాబ్ అవసరాలుగా కనిపించవు కానీ పెళ్ళి ఆడంబరమే అవసరం అనిపిస్తుంది. 500 రూపాయలు పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యమంటే చెయ్యకుండా కూతురు పెళ్ళికి కట్నం ఇవ్వడానికి భూములు అమ్ముకున్నవాళ్ళని చూశాను. పెట్టుబడిదారీ సమాజంలో కొంత మంది దొంగతనాలు చేసైనా తమకి అవసరం అనిపించినవి కొంటారు కానీ భూస్వామ్య సమాజంలో డబ్బులు ఫ్రీగా దానం చేసినా ఆ డబ్బుని అవసరాలకి కాకుండా ఆడంబరాలకి ఖర్చుపెడతారు. Anyway, charities cannot ammend the standards of lives that are highly dependant on social systems.

2013-04-25

The Road to Emancipation: "తెలంగాణా అభివృద్ధి చెందిందని ఒకసారి, వెనుకబడింది కానీ విభజన అవసరం లేదని ఇంకో సారి" వాదించేవాళ్ళది ఏ ఉద్యమం ?

2013-04-25 06:13 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

మేము తెలుగు తల్లి కోసమే సమైక్యవాదాన్ని నమ్ముతున్నామని ఒకడు, తెలుగు తల్లి గురించి ఏమీ మాట్లాడకుండా హైదరాబాద్ మాటేమిటి అని అడిగేవాడు ఒకడు, ఇలా సమైక్యవాదులలోనె సమైక్యవాదం విషయంలో ఏకాభ్రిప్రాయం లేదు. 'తెలంగాణా వెనుకబడలేదనీ, కెసి్ఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అలా అంటున్నాడనీ' ఒకడు, 'తెలంగానా వెనుకబడింది కానీ విభజన వల్ల అభివృద్ధి జరగదనీ ఇంకొకడూ ఇలా సమైక్యవాదులే తలాతోకా మరియు స్థిరత్వం లేని వాదనలు చేస్తూ తిరిగి తెలంగాణా ఉద్యమానికే ఋజువులు లేవని వాదిస్తున్నారు. రెండు నాలుకలతో నాలుగు రకాల అబద్దాలు చెప్పేవాళ్ళు ఇతరులు నడుపుతోన్న ఉద్యమానికి ఋజువులు లేవంటున్నారు.

2013-04-24

The Road to Emancipation: ఋజువులులేని సమైక్యాంధ్ర ఉద్యమం

2013-04-24 02:01 PM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

There are villages named Jangalapadu and Ranipeta near Parakhemundi, a town of Orissa. The name of Jangalapadu was changed as Jangilipada and the name of Ranipeta is now Ranipento. Another village named Komatlapeta, near Rayagada had changed it's name as Kumutipento. There are many such villages in Orissa that lost their Telugu names. Telugu language is getting euthanised (voluntary death) in Orissa. No one wants to save the language that is either being supressed or under euthanising condition in other states. But some people want the unity of two regions (Andhra and Telangana) in the name of lingual identity though they don't mind about the natural death of their mother toungue in neighbouring states. Can any one prove that United AP proponents like Nalamotu and Parakala do really love their mother toungue and they are not raising the United AP slogan to satisfy their favor on Hyderabad?

జాబిల్లి » రాజకీయం: ” రుజువులు లేని ఉద్యమం ” – తెలంగాణ

2013-04-24 03:43 AM కట్టా విజయ్
వేర్పాటు వాదులు , సమైక్యవాదులు అందరూ తప్పక చదివి తెలుసుకొవాల్సిన పుస్తకం ఇది …. పుస్తకం http://kinige.com/kbook.php?id=1695&name=Rujuvulu+Leni+Udyamam “చాలామంది నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకు వెళ్ళవద్దని ఫోను చేసారు. ఈమెయిల్స్ ఇచ్చారు. అలాంటివారు ఈ పుస్తకం చదవాలని నేను అంటున్నాను. వారు చెప్తున్నవి చాలా వరకు ఈ పుస్తకం చర్చించింది….. తెలంగాణా ప్రజల వ్యధను నేను … చదవడం కొనసాగించండి

2013-04-01

The Road to Emancipation: సూర్యచంద్రులుగా వెలుగు వెలుగుతోన్న ఇద్దరు అబివృద్ధి నిరోధక రచయితల కథ

2013-04-01 12:53 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)
నా స్వామి, నా నథ విశ్వనాథ అని అంటూ విశ్వనాథని పొగిడేవాళ్ళకి ఆయనకి స్త్రీ-పురుష సంబంధాలపై ఎలాంటి అభిప్రాయం ఉండేదో తెలుసా? విశ్వనాథ వ్రాసిన "చెలియకట్ట" కథలో ఒక ముసలివాడు ఇంటాడు, అతనికి ఒక పడుచు పెళ్ళాం ఉంటుంది. అమ్మాయిని ముసలివానికి ఇచ్చి పెళ్ళి చెయ్యడంవిశ్వనాథ దృష్టిలో తప్పు కాదు. ఆ ముసలివానికి నవ యువకుడైన తమ్ముడు ఉంటాడు. అతను తన వదిన గారికి స్త్రీ స్వేచ్ఛ గురించి చెపుతుండగా ఆ ముసలివాడు చూసి, వాళ్ళిద్దరినీ అనుమానించి బయటకి గెంటేస్తాడు. చివరికి ఆ వదిన-మరుదులు అవమానానికి లోనై ఆత్మ హత్య చేసుకుంటారు. స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించడం విశ్వనాథ దృష్టిలో ఆత్మహత్యతో సమానం. అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవలలో ఒక యువకుడు ఒక మహిళతో లేచిపోతాడు. కానీ ఆ మహొళ తన ప్రియుణ్ణి మోసం చేసి ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఆమెతో మొదట లేచిపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోయే ముందు నారాయణరావుకి ఉత్తరం వ్రాసి "లేచిపోయే స్త్రీలు ఇలాగే మోసాలు చేస్తరు" అని చెపుతాడు. స్త్రీ-పురుష సంబంధాలపై ఇలాంటి అభిప్రాయాలు ఉన్న రచయితలు సూర్యచంద్రులతో పోల్చదగినవాళ్ళా? విశ్వనాథ & బాపిరాజులకి సమకాలీకుడైన చలం గారి రచనలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. చలం గారు వ్రాసిన "చిత్రాంగి" నాటికలో సారంగధరుని తండ్రి చిత్రాంగిని అపహరించి పెళ్ళి చేసుకుంటాడు. ఇష్టం లేని పెళ్ళి వ్యభిచారంతో సమానం కనుక సారంగధరుని తంద్రి తన భర్త కాడనీ, సారంగధరుడు తన కొడుకు కాదనీ చెప్పి ఆమె సారంగధరుణ్ణే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది. హిందూ పురాణాలలో చిత్రాంగి ఒక పతిత అయితే చలం గారి కథలో చిత్రాంగి ఒక పతివ్రత. స్త్రీ స్వేచ్ఛ గురించి వ్రాసిన చలం గారి గురించి పట్టించుకునేవాళ్ళు కరువై విశ్వనాథ & బాపిరాజు లాంటి అభివృద్ధి నిరోధక రచయితలని పొగిడేవాళ్ళు ఎక్కువయ్యారు.

2013-03-17

The Road to Emancipation: The new drama played by "Visha" Andhra Mahasabha on Potti Sriramulu's legacy

2013-03-17 01:27 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)

Visalandhra Mahasabha started a new drama. They are saying that Potti Sriramulu did help in making the road for United Andhra movement by separating Andhra from Madras province. Potti Sriramulu did struggle against Tamil supremacy only for the justice of Teluguites living in the undivided Madras province and he had never imagined that Telugu speaking areas of Hyderabad state may merge with Andhra in future. So, we need not consider Potti Sriramulu as a founder of the road to United Andhra.

Potti Sriramulu was never a supporter of United Andhra. He never demanded to merge any of the parts of Hyderabad state in to Andhra. But United Andhra supporters are using the icon of Potti Sriramulu on their banners and marching on the roads. Neither Nalamotu Chakravarti nor Parakala Prabhakar can dare to tell those people that Potti Sriramulu was not a suporter of United Andhra because they know that street rowdies have nothing to do with awareness on history and those people do not even listen their words.

Even Nalamotu and Parakala might be unaware about the fact about Potti Sriramulu before they have read about it in Namasthe Telangana or some other pro-Telangana media. Fools have nothing to do with awareness on history either they are street rowdies or so called decent personalities like Nalamotu and Parakala.

2013-03-08

The Road to Emancipation: ఇప్పటికీ అమ్మగా & అక్కగా మాత్రమే పాత్ర వహిస్తోన్న మహిళ

2013-03-08 11:32 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళలో మహిళల సంఖ్య కేవలం 2% కానీ వ్యవసాయ కార్మికులలో 50% పైగా మహిళలే. వ్యవసాయంలో మహిళా కార్మికులకి తక్కువ కూలీలు ఇస్తారు కాబట్టి వ్యవసాయదారులకి మహిళా కార్మికులు అవసరమయ్యారు. కానీ పోలీస్ ఉద్యోగాలు ఎవరు చేసినా జీతాలు అనేవి ఆడ-మగ తేడా లేకుండా ఇవ్వాలి కాబట్టి ఆ డిపార్ట్‌మెంట్‌కి మహిళా ఉద్యోగులు అవసరం లేకుండా పోయారు. ఆడ-మగ మధ్య సంపాదనలోనే సమానత్వం లేదు.  స్త్రీలని ఇప్పటికీ అమ్మగా & అక్కగా మాత్రమే చూస్తున్నారు కానీ మనసున్న మనిషిగా చూడడం లేదు. ఇదంతా ఒక వైపు కోణం. ఇంకో వైపు పబ్బులకి వెళ్ళడం, డేటింగ్ చెయ్యడం వల్ల సమానత్వం వస్తుందనే భ్రమలో కొంత మంది ఉన్నారు. భ్రమల వల్ల స్త్రీల జీవితాలలో 1% కూడా మార్పు రాదు.

The Road to Emancipation: Welcome

2013-03-08 08:11 AM Praveen Nakkavanipalem (noreply@blogger.com)
This blog has been shifted from posterous to blogspot.

2013-03-02

Andhra Pradesh Politics(ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు): కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

2013-03-02 10:10 AM DVVSVarma (noreply@blogger.com)
కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌                                                                                                                     - డి.వి.వి,యస్‌. వర్మ                                                                                                                       dvvsvarmablogspot.com కేంద్ర బడ్జెట్‌ మీద ఈసారి దేశంలో కొంత ఆతృత కనిపించింది. 1991లో

2013-02-18

Andhra Pradesh Politics(ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు): ఆర్ధిక స్వేచ్ఛలో దిగజారిన భారత్‌ స్థానం

2013-02-18 12:12 PM DVVSVarma (noreply@blogger.com)
ఆర్ధిక స్వేచ్ఛలో  దిగజారిన భారత్‌ స్థానం                                                                                                               - డి.వి.వి.యస్‌. వర్మ                                                                                                             dvvsvarmablogspot.com           ప్రపంచ దేశాలలో ఆర్ధిక స్వేచ్ఛ 2012 వార్షిక నివేదిక 2013 జనవరిలో

2012-10-22

నేటి రాజకీయం: రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా శ్రీ మండలి బుద్దప్రసాద్

2012-10-22 08:33 PM admin

అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవులు ఎట్టకేలకు భర్తీ అవుతున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా రెండు నామినేటెడ్ పదవులను సర్కార్ భర్తీ చేసినట్లు సమాచారం. అధికార భాష సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్,  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా నేదురుమల్లి రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వీరి ఇరువురికి నామినేటెడ్ పదవులు వరించాయి. నియామకంపై త్వరలో అధికారికంగా జీవో విడుదల కానుంది.

నేటి రాజకీయం: తెలంగాణలో చంద్రబాబు మీకోసం వస్తున్నా…!

2012-10-22 07:57 PM admin

21TDP-(9)అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 21వ రోజు వస్తున్నా … మీకోసం పాదయాత్రను నిర్వహించిన టీడీపీ చీఫ్‌ నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు అడుగు పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయన తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈరోజు కర్నూలు నుంచి ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి వచ్చారు. అక్కడ ఆయనకు కార్యకర్తలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణపై స్పష్టత ఇవ్వకుంటే, తెలంగాణలో బాబును తిరుగనివ్వమని, ఆయన పాదయాత్రను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, టీజేఏసీ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌ నుంచి రాజోలికి వెళ్లేందుకు టీజేఏసీ నేతలు బయల్దేరారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో టీజేఏసీ నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. తాము బాబు పాదయాత్రను అడ్డుకోమని, కేవలం నిరసనలు మాత్రమే వ్యక్తం చేస్తామని వారు చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. దీంతో టీజేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.
తెలంగాణలో బాబు పాదయాత్ర సందర్భంగా బాబుకు భద్రత మరింత పెంచారు. తెలంగాణలో ఆయన పాదయాత్ర నిర్వహించే ప్రాంతాల్లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అడుగడుగునా పోలీసులు మోరించనున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణపై తాము స్పష్టతతోనే ఉన్నామని టీటీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా తమ అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ ఇచ్చారని, ఇటీవల తెలంగాణపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని ప్రధానికి బాబు లేఖ రాశారని వారు గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, తెలంగాణపై ప్రతిపక్షమైన టీడీపీని నిలదీయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకపడుతున్నారు. టీజేఏసీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, టీఆర్‌ఎస్‌ బ్రాంచి ఆఫీసుగా పని చేస్తుందని వారు ధ్వజమెత్తుతున్నారు. బాబు యాత్రను అడ్డుకోవాలని చూస్తే తాము సహించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఏతావాత ఈ రోజు మహబూబ్‌నగర్‌లోకి బాబు పాదయాత్ర ప్రవేశించిన దరిమిలా, రేపటి నుంచి వాడీవేడీగా బాబు యాత్ర సాగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు నాయుడు కఠోర శ్రమ ఫలిస్తుందా?

అరవెైమూడు సంవత్సరాల ముదిమిలో ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కఠోర శ్రమ ఫలిస్తుందా? ఆయన కల సాకారమవుతుం దా? ప్రాణాలను పణంగా పెట్టి బాబు యాత్ర చేస్తున్నా మిగిలిన నాయ కుల మాటేమిటి? జనస్పందన ఓట్లు రాలుస్తాయా? జనస్పందన ఉన్నా సరెైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? తన వ్యవహారశెైలి మార్చు కుంటున్న బాబు సత్వర నిర్ణయాలు తీసుకునే వ్యవహారంలో మాత్రం కొనసాగిస్తున్న నాన్చుడు వెైఖరి పార్టీకి నష్టం చేకూరుస్తుందా? దాని తో విసిగిపోతున్న నేతల అసంతృప్తిని జగన్‌ పార్టీ సొమ్ము చేసుకుంటోందా? ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు ఇంకా నాన్చుడు ధోరణి పార్టీకి నష్టం కలిగిస్తోందా? తెలుగుదేశం పార్టీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలివి. పార్టీకి పునరుజ్జీవం తీసుకువ చ్చి, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు 63 ఏళ్ల వయసులో కఠినమైన పాదయాత్రను కొనసాగిస్తున్న చంద్రబాబునాయుడుకు అనూహ్య స్పందన లభిస్తోంది.

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి, రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చినా తిరస్కరించి రాష్ట్ర సమస్యలపెై నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారి కోసం పోరాడుతున్న బాబు.. ఈ వయసులో తమ కోసం పాదయాత్ర చేస్తుండటం ప్రజల్లో సానుభూతి పెంచుతోంది. కాళ్ల నొప్పి, జలుబు, దగ్గు, కంటినొప్పితో బాధపడుతూనే తమను కలసి, సహపంక్తి భోజనాలు చేయటం సామాన్య, సగటు ప్రజలను బాబుకు చేరువ చేస్తోంది. నేతల కొరత బాగా ఉన్న కర్నూలు జిల్లాలో సైతం పాదయాత్ర విజయవంతం అయిందంటే.. ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. నిజానికి కర్నూలు జిల్లా పాదయాత్ర అంతగా విజయవంతం కాదన్న ఆందోళన మొదట్లో ఉంది. అయితే అంతా బాగున్న్పటికీ, ఈ స్పందనను ఓట్ల రూపంలో మలచుకునే యంత్రాంగం, నిర్ణయాలు ఉంటాయా? అన్న ప్రశ్న పార్టీ నేతల్లో మొదల యింది. పార్టీ అధినేతగా బాబు ఎక్కువరోజులు జనం మధ్యనే గడుపు తున్నప్పటికీ, నిర్ణయాలు మాత్రం హైదరాబాద్‌లో తనకు అందిన సమాచారం, సర్వేల ప్రాతిపదికనే తీసుకుంటున్నారు.

బాబు ప్రతిపక్ష నేతగా మారిన నాటి నుంచి ఇప్పటివరకూ 74 ఉప ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా గెలవ పోవడం బట్టి… తమ పార్టీ నాయకత్వం చేస్తున్న సర్వేలు గానీ, వ స్తున్న సమాచారంలోగానీ పస లేదన్న వాస్తవం రుజవయిందని పార్టీ నేతలు వ్యాఖ్యాని స్తున్నారు. పార్టీ సీనియర్లు కూడా బాబు వచ్చి వెళ్లేంత వరకూ హడావిడి చేస్తున్నారని, వెళ్లిన తర్వాత మళ్లీ పార్టీని పట్టించుకోవడం లేదంటున్నారు.బాబు ఎంత కష్టపడినా కీలకమైన ఎన్నికల సమయంలో,అంతకంటే ముందు ఇన్చార్జులు, జిల్లా అధ్యక్ష పదవుల్లో సరెైన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన మొదలయింది. మళ్లీ సర్వేలను నమ్ముకుంటేనష్టపోతామం టున్నారు. జనంలో తిరుగుతూ వారి హృదయ స్పందనను గమనిస్తున్న బాబు, ఎవరి ఒత్తిడి లేకుండా ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తున్నారు.సత్వర నిర్ణయాలు తీసుకోకపోవడం, ఒత్తిళ్లకు లొంగిపోవడం వంటి అంశా లే పార్టీని దెబ్బతీస్తున్నాయన్న భావన పార్టీ వర్గాల్లో ఇంకా కొనసాగుతోంది.

పాదయాత్రలో బాబు తన సహజ శెైలిని చాలావరకూ మార్చుకోవడంపెై పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే, సరెైన సమయంలో సత్వర నిర్ణయాలు తీసుకోకపోవడం, ఒకరికి భయడి మరొకరికి సంబంధించి తీసుకునే నిర్ణయాలను సాధ్యమయినంత నాన్చే వెైఖరికి తెరదించకపోవడంపెై మాత్రం అసహనం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో సమర్ధులెైన నేతలు చాలామంది ఉన్నారని, కానీ వారిని గుర్తించే సరెైన యంత్రాంగమే 30 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి కరవయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.జిల్లా ఇన్చార్జిలుగా నియమించిన చాలామంది సొంత లాభం చూసుకుంటున్నారే తప్ప, పార్టీ క్షేమం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కొందరు ఇన్చార్జులు డబ్బులు తీసుకుని, కార్లు తీసుకుని, ఇళ్ళలో సామాన్లు కొనిపించుకుని నియోజకవర్గ ఇన్చార్జిలు ఇప్పిస్తామని ప్రలోభపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఒక నగరానికి ఇన్చార్జిగా ఉన్న ఓ ప్రముఖుడు ఓ కీలకమైన నియోజకవర్గానికి ఇన్చార్జిని చేస్తానంటూ అతని వద్ద కారు తీసుకున్నారు.

సదరు నేత ఖర్చులను కూడా 15 లిక్కర్‌ షాపులున్న నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఆశిస్తోన్న ఆ నాయకుడే చూసుకుంటున్నారన్న ఆరోపణలు నాయకత్వం దృష్టికి వెళ్లినా ఆ ఇన్చార్జిని మార్చడం గానీ, చర్యలు తీసుకోవడంలో గానీ ఇప్పటివరకూ శ్రద్ధ చూపించని వెైనం శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు నాయకత్వ నిర్ణయాలపెై అసంతృప్తితో ఉన్న నేతలు ఆ దిశగా చూడటం సహజమంటున్నారు.‘గతంలో కాంగ్రెస్‌-టీడీపీ మాత్రమే ఉండేవి. అప్పట్లో ప్రత్యామ్నాయం లేదు. అవకా శాలు వచ్చే వరకూఎదురుచూసేవాళ్లు. ఇప్పుడు జగన్‌ పార్టీ ప్రత్యా మ్నాయంగా కనిపిస్తోంది. అయినా టీడీపీ మీద ప్రేమ, మొదటి నుంచీ ఉన్నామ న్న అనుబంధంతో చాలామంది కొనసాగుతున్నారు. ఇంకా వారికి న్యాయం చేయకపోయినా, నిర్ణయాలను గతంలో మాదిరిగా నాన్చినా పార్టీలో కొనసా గడం కష్టం. దీనిని గ్రహించాలి. ఓ పక్క జగన్‌ పార్టీ వాళ్లు ఆఫర్లు ఇస్తున్నారు. టికెట్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు. మా దగ్గర ఇన్చార్జి పదవులు ఇస్తారో లేదో కూడా తెలియదు.ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇన్నేళ్లు పడితే ఓపిక పట్టేంత సహనం ఇప్పటి నేతల్లో లేదు. జగన్‌ పార్టీ అందరికీ గాలం వేస్తున్న ఈ క్లిష్ట పరిస్థితిలో కూడా నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్ష పదవులు ప్రకటిం చడానికే ఇంత సమయం తీసుకోవడమే విస్మయం కలిగిస్తోంది.

ఒకవేళ ఇంత నాన్చి, నాయకుల్లో టెన్షన్‌ పెట్టి ఆ పదవులు ఇచ్చినా నాయకత్వంపెై వారికి కోపమే తప్ప అభిమానం ఉండదు. నాయకత్వం ఈవిధంగా అన్నీ చేతులారా చేసుకుంటోంద’ని పొలిట్‌ బ్యూరో నేత ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.హైదరాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, విశాఖవంటి కొన్ని జిల్లాల్లో అధ్యక్షులను నియమించే అధికారం పార్టీ అధినేతకే ఇచ్చి చాలా రోజువుతున్నా, ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంఐ అసంతృప్తివ్యక్తమ వ ుతోంది. 1984 నుంచి పార్టీని నడిపిస్తు, ఎవరేమిటో అన్నీ తెలిసినబాబు.. నియోజకవర్గ ఇన్చార్జి, అధ్యక్ష పదవులను భర్తీ చేయడానికి ఇంత సమయం తీసుకోవడమే ఆశ్చర్యంగా ఉందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బాబును మళ్లీచూడాలనుకుంటు న్నాం. అప్పట్లో చాలా వేగంగా పనిచేసేవారు. ఇప్పుడూ పార్టీ విషయంలో అలాంటి నిర్ణయాలు, చురుకుదనం లేకపోతే ఈ వయసులో చేసే పాదయాత్రలు ఫలించవ’ని బాబు కు అత్యంత సన్నిహితుడయిన ఓ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు.

Source: Surya

2012-02-02

ప్రజ్ఞ: "కాపులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?"

2012-02-02 07:16 AM tejaswi (noreply@blogger.com)
‘పీసీసీ నాయకత్వం కాపుకు’, ‘మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు’, ‘కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు’. అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా

2012-01-04

గుండె చప్పుడు...: నాకొక స్వప్నం ఉంది!

2012-01-04 05:55 AM Konatham Dileep
అక్టోబర్ 15, 2011 అగ్రరాజ్యపు అధికారపీఠం కాపిటల్ హిల్ ప్రాంగణం నుండి ఖంగున మోగుతున్న మాభూమి సంధ్యక్క గొంతు అటు యూనియన్ స్టేషన్ నుండి ఇటు కాన్స్టిట్యూషన్ అవెన్యూ వరకూ ప్రతిధ్వనిస్తున్నది. “జై తెలంగాణ” నినాదాలతో వాషింగ్టన్ డిసీ వీధులు మార్మోగిపోతుంటే … ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది. ఎక్కడ తెలంగాణ? ఎక్కడ వాషింగ్టన్? అక్కడ సకల జనులూ నభూతో అన్నట్టుగా సమ్మెకట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తున్న వేళ, మేము సైతం అంటూ అమెరికాలో ఉంటున్న [...]

2011-12-12

గుండె చప్పుడు...: మన చరిత్ర పుటలు విస్మరించిన 1954-56 తెలంగాణ రాష్ట్ర ఉద్యమం

2011-12-12 05:21 AM Konatham Dileep
చరిత్ర పుటలకు ఎక్కకుండా విస్మరింపబడ్డ 1954-1956 తెలంగాణ ఉద్యమ చరిత్రలోంచి మచ్చుకు కొన్ని క్లిప్పింగులు: (నవంబర్ 1955 గోలకొండ పత్రిక నుండి) — — — — — — — — —

2011-11-04

చదువరి: సీబీఐ ని విచారించిన జగన్ !

2011-11-04 01:55 PM చదువరి (noreply@blogger.com)
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ.  ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు. ’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చంద్రబాబేననీ,

2011-10-21

చదువరి: గెలిచినవాడు నీచ మానవుడు

2011-10-21 02:36 PM చదువరి (noreply@blogger.com)
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది. తమకు వోట్లు వెయ్యనంత మాత్రాన ప్రజలను

2011-09-26

జాబిల్లి » రాజకీయం: తెలంగాణ ఏందుకు కావాలి ? నాకు ఎవరైనా వివరించండి

2011-09-26 09:22 AM కట్టా విజయ్
నాకు జనాలు  తెలంగాణ ఎందుకు కావాలనుకు కావాలొ వివరిస్తారా ! సొది చెప్పకుండా  అంటే  … 1.మనం వెనక బడ్డాం  కాబట్టి 2.మాతెలంగాణ మాకు కావాలి 3. మీము మీతొ కలిసి ఊండం 4.మావనరులు మాకే ఇలాంటి సొల్లు కాకుండా , శాస్త్రీయంగా ఎవరైనా వివరిస్తారేమొనని చుస్తున్నా. తెలంగాణా వాళ్ళే చెప్పాలని ఏంలేదు … ఆంద్రాలొను … చదవడం కొనసాగించండి

2011-08-18

ప్రజ్ఞ: ఇంత దద్దమ్మ నాయకత్వమా మన దేశాన్ని పాలిస్తోంది?

2011-08-18 07:15 PM Tejaswi (noreply@blogger.com)
అన్నాహజారే ఎపిసోడ్ – కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ మరియు యూపీఏ నాయకత్వంలోని డొల్లతనాన్ని కళ్ళకుగట్టింది. ఇక్కడ, అన్నా వాదన కరెక్టా - కేంద్రప్రభుత్వ వాదన కరెక్టా అనేదాని గురించో (లేక) అవినీతి నిర్మూలనలో లోక్‌పాల్ బిల్ ఎంత సమర్ధమంతం అనేదాని గురించో చర్చించబోవడంలేదు. అన్నావిషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఎంత అవివేకంగా ఉందనేది చర్చనీయాంశం. రెండు తప్పుడు

2011-08-17

చదువరి: మన్మోహన్ అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే..

2011-08-17 06:38 PM చదువరి (noreply@blogger.com)
అడ్డెడ్డె... అన్నా హజారే విషయంలో మన అప్రధానమంత్రి చేసిన పనులు చూస్తూంటే రాజకీయ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం లాగా కనిపిస్తోంది. ’ఇహ నీతో పని అయిపోయింది, రాహుల్ గాంధీ కోసం సీటు ఖాళీ చెయ్యి’, అని నేరుగా చెప్పకుండా, ఇలా ఆత్మహత్య చేయిస్తున్నట్టున్నారు. లేకపోతే, ఇంత తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారా? అవినీతి పట్ల ప్రజల్లో ఉన్న క్రోధానికి అన్నా హజారే ప్రతీక. అలాంటి వ్యక్తిని ’నిలువెల్లా

2011-08-16

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అన్నా హజారే x అవినీతి నాయకులు

2011-08-16 10:57 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
అవినీతి పై అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజారే ను జైలులో పెట్టి భారత దేశంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత నీచమైన స్థాయికి దిగాజారిపోయారో ప్రజలందరికీ నిస్సిగ్గుగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా.   అక్రమ సంపాదన, అధికార దాహంతో ప్రజా ప్రతినిధులుగా వెలిగిపోతున్న ప్రస్తుత రాజకీయనాయకులు అవినీతి, అక్రమ సంపాదనలను అడ్డుకోడానికి సహకరించే ఏ బిల్లు నైనా ఆమోదింప చేస్తారని

2011-08-05

చదువరి: సమస్యలు బాబోయ్ సమస్యలు

2011-08-05 07:36 AM చదువరి (noreply@blogger.com)
ముసురుకున్న సమస్యల నుండి బైట పడటానికి నాయకులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్య నుండి కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఇలా సాగాయవి: మేడమ్మ: ఎట్టాగోట్టా మబ్బాయిని ప్రధానమంత్రిని చెయ్యి ప్రభూ! నాకున్న సమస్యల్లా ఇదొక్కటే. ఈ దేశానికున్న ఏకైక సమస్య కూడా ఇదే! దీన్ని తీర్చావంటే నేను, ఈ దేశ ప్రజలూ కూడా శేష జీవితాన్ని హాయిగా గడిపెయ్యొచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి:  మంత్రులు, అధికారులూ నా మాట

2011-08-02

మతాలు - రాజకీయాలు: ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా – డా. సుబ్రమణియన్ స్వామి విశ్లేషణ

2011-08-02 01:09 PM చదువరి

డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-

ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.

భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.

హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు  భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.

హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.

భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.

హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.

ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.

మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.

రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.

ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.

ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం:  370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.

ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.

ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.

ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం:
హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.

ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.

ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.

భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.


2011-06-14

చదువరి: మరింత దిగజారిన లౌకికవాదం

2011-06-14 04:37 AM చదువరి (noreply@blogger.com)
హిందూ వ్యతిరేక భావాలను పదేపదే నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది లౌకికవాదం.  బాబా రామ్ దేవ్ ఆరెస్సెస్ ఏజంటుఅన్నా హజారే ఆరెస్సెస్ ఏజంటు ఇద్దరు పౌరులు తమతమ దారుల్లో చేస్తున్న ప్రజా పోరాటాల గురించి కాంగ్రెసు పార్టీ స్పందన ఇది. దోపిడీకి గురైన ప్రజలధనాన్ని వెనక్కి రప్పించడం కోసం, సదరు దోపిడీ దొంగలను పట్టుకుని చట్టానికి కట్టేసే వ్యవస్థ కోసమూ కృషి చేస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెసు పార్టీకి కంటగింపుగా మారింది.

2011-06-08

పాలవెల్లి: కమ్యునిస్టులకు ఎవరంటే ద్వేషం

2011-06-08 12:20 AM Amaranarayana B (noreply@blogger.com)
బాబాలంటే ద్వేషం లేదు. దేవుడు అంటే విశ్వాసం లేకపోవచ్చు అంతేకాని దేవుడన్నా..దేవుణ్ని విశ్వసించే వారన్నా వారికి ద్వేషం ఏమాత్రమూ లేదు. వారు ద్వేషించేదల్లా దేవుడి పేరుతో దగాలు, దేవుడి పేరుతో సమాజాన్ని చైతన్యరహితం చేయడం, మొన్న ముఖ్యమంత్రిలా 'అంతా నుదుటి రాత' అంటూ నిష్క్రియాతత్వాన్ని ప్రోత్సహించడం, 'మా దేవుడు తప్ప..ఏ దేవుడు కాదు గొప్ప' అన్న వాగ్వాదాలతో సమాజాన్ని భ్రష్టు పట్టించడం, అదే దేవుడి

2011-05-29

చదువరి: మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం

2011-05-29 10:28 AM చదువరి (noreply@blogger.com)
మహానాడులో చంద్రబాబు ముగింపు ప్రసంగం చూసాను. మనిషిలో, మాటలో చాలా తేడా కనిపించింది. ప్రసంగంలో నేను గమనించిన కొన్ని విశేషాలు. మఖ్యమైన విశేషమేంటంటే - మామూలుగా చంద్రబాబు ప్రసంగం బోరు కొడుతుంది, వినబుద్ధి కాదు. సాధారణంగా నాయకుల ప్రసంగాల్లో ఫిల్లరు పదాలు ఉంటూంటై. కానీ చంద్రబాబు ప్రసంగంలో ఫిల్లర్లుగా ’పదాలు’ కాకుండా ఏకంగా ’వాక్యాలే’ ఉంటై. ముఖ్యమైన విషయాలు కూడా ఈ ఫిల్లరు వాక్యాల మధ్య నలిగిపోతూంటాయి (

2011-05-22

చదువరి: "అయితే హైకమాండు పిరికి సన్నాసేనన్నమాట!"

2011-05-22 06:17 PM చదువరి (noreply@blogger.com)
బ్రేకు తరవాత.. (బ్రేకు ముందర జరిగిన చర్చను చదవండి.) "చెప్పండి ఘొల్లు రవిగారూ, మీ హైకమాండుకు వెన్నెముక లేదట, పిరికిదట, సన్నాసట - నిజమేనా?" అని రంజనీకాంతు అడిగాడు. ఘొల్లురవి: ఈయన స్వరం కొంచెం వీకు. గొంతుపెంచి ప్రత్యర్థుల్తో వాగ్యుద్ధం చేస్తాడుగానీ, అవతలి గొంతుల హోరులో  కొంచెం వెనకబడుతూంటాడు. ముందు తెలుగు రాజ్యాన్ని తిట్టి ఆ తరవాత పాయింటు కొస్తూంటాడు. ఆయనిలా అన్నాడు: "చూడండీ.. రెండువేల

2011-05-21

చదువరి: హైకమాండుకు కమానుకట్టలు విరిగినై

2011-05-21 03:31 AM చదువరి (noreply@blogger.com)
మొన్నామధ్య నూరేళ్ళ పార్టీ హైకమాండు కడప మీంచి బిళ్ళబీటుగా కింద పడింది. అంతెత్తునుంచి కింద పడటంతో  వెన్నెముక విరిగింది, కాళ్ళు రెండూ కూడా విరిగిపోయాయి. నడవలేని స్థితిలో మంచాన బడింది. ముందే హైకమాండంటే ఎటకారమై పోయిన ఆ పార్టీ నాయకులు కొందరికి మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది. వంకరమ్మ అనే ఒక పార్టీ నాయకురాలు ’అసలు హైకమాండు ఉత్త పిరికిది. పేరుకే అది హైకమాండు, దానికి హై లేదు, కమాండూ లేదు. ఇప్పుడు

2011-05-19

చదువరి: సానుభూతి గెలిచింది

2011-05-19 06:36 AM చదువరి (noreply@blogger.com)
జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి: ఎక్కువ ప్రజాభిమానం కొనుక్కోవడం చేత: అందరూ వోట్లను కొనజూసినవారే. కానీ జగను పద్ధతి వేరు.. తనవాళ్లనే కాదు, తనకు ఖచ్చితంగా వోటెయ్యరు అని అనుకున్నవాళ్ళకు కూడా డబ్బులిచ్చాడంట, మనసు మారితే వేస్తారేమోనని. తండ్రి చాటున రాష్ట్రాన్ని దోపిడీ

2011-04-14

చదువరి: ఉండవల్లి అస్త్రం

2011-04-14 06:48 PM చదువరి (noreply@blogger.com)
ఉండవల్లి అరుణ్ కుమార్ జగనుపైకి ఒక పదునైన ఎన్నికల అస్త్రాన్ని విసిరాడు. పేరుబెట్టి పిలిచి, నిలదీసి ఉండవల్లికి అవకాశమిచ్చాడు జగను. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉండవల్లి బాగా వాడుకున్నాడు. అసలు జరిగిందేంటంటే.., సాక్షి టీవీ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఉండవల్లిని ఊసరవెల్లి అంటూ ఒక అరగంట పాటు నానావిధాలుగా తిట్టారంట. ఏదో ఒక విషయం గురించి చెప్పడం, ఏమయ్యా ఉండవల్లీ దీనికి సమాధానం ఏంటి అని అడగడం - ఇలా

2011-03-28

చదువరి: వయ్యెస్సార్ రౌడీ మూక

2011-03-28 04:42 AM చదువరి (noreply@blogger.com)
శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట.  అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట)  తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట. కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు" ...............

2011-03-15

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: తెగించిన తెలిబాన్లు

2011-03-15 11:12 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలుగు తేజాల విగ్రహాల కూల్చివేత తో తెలంగాణా తెలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్ లను మించిపోయారని రుజువు చేసారు. ఆ తాలిబాన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసినప్పటికంటే ఈ తెలిబాన్లు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం సాక్షి గా చేసిన ధ్వంస రచన సమస్త తెలుగు జాతిని నివ్వెర పరచింది, ఎంతో ఆవేదనకు గురి చేసింది. తెలంగాణా వుద్యమం తో కూల్చివేయబడ్డ కవులు, కళాకారులు, జాతి నిర్మాణ

2011-03-07

పాలవెల్లి: 'నేను తప్పు చేసాను'

2011-03-07 10:28 PM Amaranarayana B (noreply@blogger.com)
'నేను తప్పు చేసాను' నిండు సభలో పెద్దాయన నిసిగ్గు ప్రకటన బలే బలే.. శభాష్ శభాష్ బల్లలు చరిచి స్వపక్షం, స్వకూటమి అభినందన  ----------------------------------------------------- ఆహా ఇదిగదా అసలు భారతం  అవినీతి రాజ్యం..కాంగ్రెస్స్ కరప్సన్ భోజ్యం దేశానికి పట్టిన దరిద్రమేంటి ..? అత్యున్నత న్యాస్థానం అచేతన ప్రశ్న.

2011-02-17

చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

2011-02-17 01:43 PM చదువరి (noreply@blogger.com)
గవర్నరు గారూ, ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే

చదువరి: శాసనసభ వద్ద రౌడీలు

2011-02-17 06:32 AM చదువరి (noreply@blogger.com)
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ  మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది. ఇన్నాళ్ళూ రౌడీయిజం రోడ్లమీదే

2011-01-19

చదువరి: అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి

2011-01-19 07:52 PM చదువరి (noreply@blogger.com)
అసలు సంగతి కెళ్ళేముందు.. మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం. 1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే..  2490 ఫలితాలొచ్చాయి.)  2. చుక్కలనంటుతున్న ధరలను ఏనాటికి కిందకి లాక్కొస్తారు అని

2010-12-31

చదువరి: 2010 లో మన నాయకులు

2010-12-31 12:18 PM చదువరి (noreply@blogger.com)
2010 లో మన నాయకులు మన్మోహన్ సింగ్  ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి తాను నీతిమంతుడైతే  చాలదు, తన ప్రభుత్వం నీతిగా నడిచేలా చూడాలి. లేకపోతే ఆ ప్రధానమంత్రి విఫలమైనట్టే! లక్షల కోట్ల ఆదాయానికి గండి కొట్టిన  అవినీతి జరిగితే చూడకుండా, చూసీ పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి అవినీతిపరుడి కంటే ఎక్కువ.. అసమర్ధుడు!  బలహీనుడు కూడా మేడమ్మ ఆంధ్ర ప్రదేశులో చిచ్చుబెట్టి తాను చోద్యం చూస్తోంది, సోనియా గాంధీ.

2010-12-30

మతాలు - రాజకీయాలు: అతితెలివి క్రైస్తవ నన్

2010-12-30 05:48 PM చదువరి

పోలండులో  ఇస్కాన్ (ఇంటర్నషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కానషస్‍నెస్) అనుయాయుల సంఖ్య బాగా పెరగడం గమనించిన ఒక నన్  ఇస్కాన్ పై వార్సా కోర్టులో కేసు వేసింది. ’ఇస్కాన్ అనుయాయులు 16,000 మంది గోపికలను పెళ్ళాడిన కృష్ణుడు అనే ఒక అనైతిక పాత్రను కొలుస్తున్నారు’ అనేది ఆ కేసులోని విషయం.

కేసు విచారణకువచ్చినపుడు ఇస్కాన్ లాయరు జడ్జిని, ’ఈమె నన్ గా మారే సందర్భంలో తాను చేసిన ప్రమాణాన్ని ఓ సారి చదవమని ఈ నన్ ను అడగండి’ అని అడిగాడు.  జడ్జి ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని ఆమెను అడిగాడు. ఆమె చదవలేదు.

ఇస్కాన్ లాయరు ’పోనీ నన్ను చదవమంటారా’ అని జడ్జిని అడగ్గా, జడ్జి సరేన్నాడు. ఆ ప్రమాణంలో తాను (ఆ నన్) ఏసుక్రీస్తును పెళ్ళి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది.  అది చదివాక, ఇస్కాన్ లాయరు అడిగాడు: “యువరానర్! కష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడని అంటున్నారు. కానీ, కనీసం ఒక మిలియను మంది నన్ లు తాము క్రీస్తును పెళ్ళాడామని నిర్ధారిస్తున్నారు గదా, మరి.. క్రీస్తు, కృష్ణుడు – వీళ్ళిద్దరి లోనూ నీతి బాహ్యుడెవరు ?

జడ్జి కేసును కొట్టేసాడు.

———

ఇస్కాన్ వారి సైటు నుండి.

========================

అక్రమ పద్ధతుల్లో మతమార్పిడి ద్వారా తమ మతాన్ని వ్యాపింజేసుకునేవాళ్ళకు, తమ స్థానంలోనే ఇతర మతాలు వ్యాప్తిచెందడం కంటకంగానే ఉంటుంది. అందుచేతే, ఇలాటి అడ్డదార్లు తొక్కుతున్నారు.
రగ్గులు, డబ్బులు, ప్రలోభాలు, స్వలాభాలు, సంకుచితత్వమే మతమనుకునే ఈ మత వ్యాపారులకు, మతాల్లోని తాత్వికతను అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడుంటుంది!?

2010-12-04

నా ఆలోచనలు: మా యాకోబు రాజకీయ కష్టాలు

2010-12-04 11:50 PM రాధాకృష్ణ (noreply@blogger.com)
రాజకీయాలు అంటే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడానికి మంచి మార్గం అని అందరం అనుకుంటాం.  రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పవర్ చేతిలో ఉంటుంది, బ్యాంకు రుణాలు సులభంగా తెచ్చుకోగలరు. సామాన్యుడు బర్త్/డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా నానా తంటాలు పడతాడు. కానీ నాయకులకు మాత్రం చాలా వీజీ గా ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా ఫోన్ మీదనే అంత రెడీ అవుతుంది. దాన్నే మనం అదికార దుర్వినియోగం అంటాం. దుర్వినియోగం కూడా ఒక మోతాదు

నా ఆలోచనలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహానుబావులు: నా మొదటి బ్లాగ్

2010-12-04 02:04 AM రాధాకృష్ణ (noreply@blogger.com)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పెద్ద టాపిక్...రాజకీయాల పై నాకున్న సహజమైన ఆసక్తి రీత్యా నేను కాలేజీ రోజుల్లో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండే వాణ్ణి. చిన్నతనం నుంచి ఈనాడు పేపర్ ని డైలీ ఫాలో అవ్వడం, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను (వారి గురించి తర్వాత ప్రత్యేకంగా చెప్తాను) చాలా దగ్గరనుంచి చూడటం, ఉమ్మడి కుటుంబ నేపద్యంలో పెదనాన్న, నాన్న, పెద్దమ్మ గ్రామ స్థాయి పదవులు చేయడం

2010-11-25

చదువరి: ఉత్సవ విగ్రహాలు, లార్జర్ దాన్ లైఫ్ సైజు కటౌట్లూ!

2010-11-25 07:13 PM చదువరి (noreply@blogger.com)
ఆంధ్రప్రదేశుకు ముఖ్యమంత్రిని  మార్చారు.  తమలోంచి ఒకణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన జనానికి ప్రణబ్బు ముఖర్జీ చెప్పేదాకా తెలీదు, కుర్చీ ఎక్కబోయేది ఎవరో!  ఛానెళ్ళ పుణ్యమా అని, వాళ్లకంటే మనకే కొంత ముందు తెలిసింది.  ’ఏంటి ఎవరు  ముఖ్యమంత్రి కాబోతున్నారు ’అని అడిగితే కాంగీయుడు ప్రతీవాడూ చెప్పిన సమాధానం ఒకటే - అధిష్ఠానం మాటే మామాట ! అమ్మ మాట  బంగారు మూట అనమాట! ఇక్కడి నాయకుణ్ణి విమర్శించమంటే అడ్దమైన
వ్యాఖ్యలు
2012-11-11
2012-11-11 12:26 PM kachadarajakeeyam.blogspot.in (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
kotta postulu emi raayadam ledu. dayachesi raayandi <br /><br />http://kachadarajakeeyam.blogspot.in
2012-11-02
2012-11-02 07:35 PM Arjun p (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
avinithi entha baruvuntundo ardam ayindi..
2011-09-26
2011-09-26 01:45 PM Pratap - మతాలు - రాజకీయాలు పై వ్యాఖ్యలు

Its very good posting…. chaalaa bagundi.. aa lawyer ki naa kritagnatalu cheppalani undi!!!

2011-08-05
2011-08-05 08:05 AM ..nagarjuna.. - మతాలు - రాజకీయాలు పై వ్యాఖ్యలు

Thank you for suggesting the book Sriram gaaru. I think it will take considerable amount of time for me to go through and understand the book. meanwhile shall try to put a post on this subject.

2010-11-01
2010-11-01 01:37 PM satya - గుండె చప్పుడు... పై వ్యాఖ్యలు

nirmanam lo unnadi nampalli railway station kaadu.secunderabad rly station.state central library ni ippudu nashanam pattinchinru.

2010-10-17
2010-10-17 07:51 PM మల్లికార్జున శర్మ - గుండె చప్పుడు... పై వ్యాఖ్యలు

సారీ, 1956 దాకా అంటే హైదరాబాదుపై పోలీసు యాక్షన్‌ తర్వాత 8 ఏళ్ల పాటు జైలులో వుండాల్సి వచ్చింది. నేడు పెద్ద పెద్ద మర్డర్లు చేసి లైఫులు పడ్డ వాళ్లే అనేకులు 5-7 ఏళ్లలో విడుదలై పోతున్నారు!

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..