2012-02-14
Prabhava ప్రభవ: రాగుల్లో ఇసుక
2012-02-10
For Kids: ఇరుక్కున్న ముక్కు
For Kids: వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము
2012-02-09
mamcimaata: vinayaka vandanam
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
———————
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…
బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.
1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు
విద్య గణపా! నీకు వేయిదండాలు
వీర గణపా !నీకు వేవేల దండాలు
సుగుణ గణపా ! నీకు చాలదండాలు .
2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు
శివునితనయా !నీకుశిరసు దండాలు
శ్రవణసోదర !నీకు సహస్రదండాలు
దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .
3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు
శతృ విజేయా ! శతకోటిదండాలు
ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు
అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .
4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు
బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు
గంగపుతృడ !నీకు గంపెడు దండాలు
గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .
దండాలు! దండాలు !దండాలు !దండాలు!.
చిన్నారుల ప్రపంచం: నెయ్యి-పొడి-వాణి-కట్టె కథ
ఒక ఊరిలో ఒక భార్య -భర్త ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఒకరినొకరు చాలా బాగా చూసుకునేవాళ్లు. ఇద్దరూ ముచ్చటగా ఒకరికొకరు ముద్దు పేర్లు పెట్టుకున్నారు. భర్తకు భార్య చేసే శనగవిత్తనాల పొడి అంటే చాలా ఇష్టం. అందుకని అతను భార్యను ముద్దుగా ‘పొడీ!’ అని పిలుచుకునేవాడు. భార్యకు భర్త కాచే నెయ్యంటే చాలా ఇష్టం. అందుకని ఆమె భర్తను ముద్దుగా ‘నెయ్యి’ అని పిలిచేది. ఇక , వాళ్ళకు రెండు ఎద్దులు ఉండేవి. వాటికి కూడా ముద్దు పేర్లు పెట్టుకున్నారు వీళ్లు. ఒక దాని పేరు వాణి. ఇంకో దాని పేరు కట్టె. అలా నెయ్యి, పొడి, వాణి, కట్టె- అందరూ కలిసి సుఖంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు.
అతిథి అభ్యాగతులు ఎవరయినా వాళ్ల ఇంటికి వస్తే, వాళ్ళకు అన్నం పెట్టకుండా పంపించేవాళ్లు కాదు పొడీ-నెయ్యిలు. ఒకరోజు మధ్యాహ్నం భోజన సమయానికి, నెయ్యి పొలం దున్నుతూ ఉంటే , ఒకవైపు నుండి ఒక స్వామి గస బోసుకుంటూ వచ్చాడక్కడికి.
“ఏంటి స్వామీ! అలసిపోయినట్టున్నారు? ప్రక్క ఊరినుండి నడుచుకొని వచ్చినట్టున్నారు, పాపం?” అని అడిగాడు నెయ్యి, ఆయన్ని.
అప్పుడు స్వామి “అవును నాయనా! ఆ ఊరినుండీ నడవటం వల్లనే అయిఉండొచ్చు, చాలా ఆయాసంగా ఉంది” అన్నాడు.
అప్పుడు నెయ్యి ఆయనకు త్రాగేందుకు నీళ్లు ఇచ్చి, “స్వామీ! నాకేమో ఇంకా కొంచెం పని ఉన్నది. చూడగా మీకు ఆకలి వేస్తున్నట్లుంది. దూరంగా ఆ కనబడేదే మాయిల్లు. మా ఇంటిలో పొడి ఉంటుంది. వెళ్ళి అన్నం పెట్టించుకొని కడుపునిండా తినండి- ఏమీ అనుకోకండి, వెళ్ళండి!” అని చెప్పాడు.
స్వామికి “‘పొడి’ అంటే ‘నెయ్యి’వాళ్ల భార్య” అని తెలీదు. “మామూలుగా ఊళ్లలో ప్రతి ఇంట్లోనూ చేసుకునే శనగ విత్తనాల పొడి – అదొక్కటే ఉందేమోలే, వీళ్ల ఇంట్లో”అనుకున్నాడు స్వామి.
“పొడి ఉంటే అంతే చాలు నాయనా, కాలే కడుపుకు మండే బూడిదైనా చాలు. నేను మీ ఇంటికి వెళ్ళి అన్నం తిని వెళ్తాను” అని చెప్పి నేరుగా నెయ్యి వాళ్ళ ఇంటికి పోయాడు స్యామి.
ఇంట్లో పొడి స్వామిని చూడగానే, “రండి, రండి, స్వామీ!” అని లోనికి ఆహ్వానించి, పీట వేసి కూర్చోబెట్టింది. ఆపైన ఆమె మర్యాదగా “స్వామీ! మీరు ఇప్పుడే తింటారా, లేక నెయ్యి వచ్చిన తరువాత తింటారా?” అని అడిగింది.
కానీ స్వామికి ‘నెయ్యి’ అంటే ‘ఆవిడ భర్త’ అని తెలీదు. “ఓ ,నెయ్యి వస్తుందట! పొడిలోకి నెయ్యి చాలా బాగుంటుంది!” అని అనుకొని, ఆయన “పర్వాలేదులేమ్మా! నెయ్యి వచ్చిన తరువాతే తింటాను” అన్నాడు.
అంతలోనే నెయ్యి ఇల్లు చేరుకున్నాడు. అతను భోజనానికి వచ్చేందుకు పనిని ఆపి, ఎద్దుల్ని విడిపించగానే ఆ ఎద్దుల్లో ఒకటి- “కట్టె” అనేది- పారిపోయింది. ‘దాని వెంటపడితే వాణి కూడా ఎక్కడికి పారిపోతుందో’ అని, అతను దానిని అలాగే వదిలి, వాణిని ఇంటికి పట్టుకొచ్చాడు.
ఇంటికి రాగానే అతను పొడిని కేక వేస్తూ- “ఏమేవ్, వాణ్ని గాటకు కట్టేయి. ఆలోగా నేను కట్టెను పట్టుకొస్తాను” అన్నాడు.
ఈ మాట విన్న స్వామి “అయ్యో! నేనేం తప్పు చేశాను దేవుడా, నన్ను గాటకు కట్టేయమంటున్నాడు? తను పోయి కట్టె తెస్తాడట.ఇక్కడే ఉంటే నన్ను చితకబాదుతారు బాబోయ్!” అనుకొని , పంచె ఎత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండ బయటికి పరుగుతీశాడు.
ఆలోగా నెయ్యి వెళ్ళి, పారిపోయిన ఎద్దును పట్టుకొచ్చాడు. లోపలికి వచ్చి చూసేసరికి, అక్కడుండాల్సిన స్వామి లేడు! “అయ్యో, స్వామీ! ఎక్కడికి పోయారు?” అని బయటకు వచ్చి చూస్తే దూరంగా స్వామి పరిగెడుతూ కనబడ్డాడు.
అప్పుడు నెయ్యి ఆయన వెనకే పరుగెడుతూ “అయ్యా, స్వామీ!” అని అరవసాగాడు. ఎవరో పిలుస్తున్నట్లుందే అని వెనక్కి తిరిగిచూసిన స్వామికి నెయ్యి కనబడ్డాడు. నెయ్యి చేతిలో చర్నాకోల మెరుస్తున్నది! అతను దాన్ని ఊపుతూ, “స్వామీ! ఆగండి! రండి! పొడి ఉన్నది, నాకు మా కట్టె దొరికిందిలెండి ” అని అరుస్తుంటే స్వామి ప్రాణాలు చేత బట్టుకొని పరుగుతీశాడు, వేగం పెంచి.
ఆయనను అందుకోలేని నెయ్యి “ఇదేమి, స్వామివారు ఎందుకు, నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగుతీశారు? స్వాముల లీలలు బహు చిత్రాలు” అనుకుంటూ వెనుతిరిగి ఇంటికి పోయాడు!
చిన్నారుల ప్రపంచం: రైతు-భూతం
అనగనగా.. ఒక మారు మూల పల్లెలో రంగన్న అనే ఒక తెలివైన రైతు ఉండేవాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుందో చూసుకొని పంట వేసి, మంచి రాబడిని ఆర్జిస్తూ – అలా జీవనం కొనసాగిస్తూండేవాడు.
ఒక రోజు ఇంకా పొద్దు పొడవకనే లేచి, నాగలి భుజాన వేసుకొని, ఎద్దుల్ని తోలుకొని పొలందుక్కి చేయడానికి బయలుదేరాడు రంగన్న . పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగిలినట్లైంది. ఎద్దులు ఆగిపోయాయి. అప్పుడు మడకకు ఏదో అడ్డం వచ్చిందని గ్రహించిన రంగన్న, నాగలినిని తప్పించి, అక్కడ త్రవ్వి చూశాడు. ఒక గాజు సీసా దొరికింది. దాన్ని అతను అటూ ఇటూ త్రిప్పి చూసి, మెల్లగా సీసా మూత తీశాడు.
ఆశ్చర్యం! మరుక్షణం సీసాలోంచి దట్టమైన పొగ మొదలైంది. చూస్తూండగానే ఆ పొగలో భూతం ఒకటి తయారైంది: “ఒరేయ్, మనిషీ! నువ్వు సాగు చేస్తున్న ఈ భూమి నిజానికి నాదే! ఈ భూమిలో ఎంతో కాలంగా నివాసముంటున్నాను నేను. కనుక ఈ భూమి నుండి వచ్చే ప్రతి పంటా నాదే! అదంతా నాకే సొంతం కావాలి!” అని అరిచింది ఆ భూతం.
నోటి దగ్గరి కూడు భూతం పాలవటం రంగన్నకేమీ సబబనిపించలేదు. “నేను కూడా చాలా రోజుల నుండీ ఈ భూమిని సాగు చేస్తున్నాను. కనుక ఈ భూమి నుంచి వచ్చే ఆదాయం అంతా నాదే అవుతుంది” అన్నాడు అతను ధైర్యం కూడగట్టుకొని.
“నేను చాలా రోజుల నుండీ ఈ భూమి లోపల ఉన్నాను. కనుక ఈ భూమి లోపల పండే పంట అంతా నాదే!” అన్నది భూతం పట్టు వీడకుండా.
చటుక్కున ఉపాయం తట్టిన రంగన్న “సరే, అయితే. అలాగే కానివ్వు. ఇప్పుడు నేను నేలను దుక్కి, పంట వేస్తాను. దానికి నీరు కట్టి, ఎరువు వేసే బాధ్యత నాది. కాపలా పని నీది. పంట తయారయ్యాక, ఆ పంటలో భూమి లోపలి భాగం మొత్తం నీది- భూమి పైభాగం మాత్రం నాది! సరేనా?” అన్నాడు.
భూతం ఒప్పుకున్నది. రంగన్న సంతోష పడి, పొలం సాగుచేసి, అందులో వరి నాటాడు. సమయానికి నీళ్ళు కట్టి, కలుపు తీసి, దాన్ని జాగ్రత్తగా సంరక్షించాడు. మడి చక్కగా పెరిగింది. వరి కంకులనిండా ధాన్యం తయారైంది. ధాన్యం పక్వానికి వచ్చాక, రంగన్న ఇక కోతలు మొదలుపెట్టాడు. తీరా కోతలు పూర్తయ్యే సమయానికి భూతం వచ్చి కూర్చున్నది: “ఏం, రంగన్నా! నా భాగం నాకు ఇచ్చేయి !” అన్నది.
“ఓ, అలాగే! అదిగో, పంటలో లోపలి భాగం మొత్తాన్నీ అలాగే నిలిపి ఉంచాను నీకోసం. నా మాట ప్రకారం పైభాగాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. నీ వాటాను నువ్వు ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్లచ్చు” అన్నాడు రంగన్న.
లోపల అంతా తవ్వి చూస్తే వేర్లు, మట్టి గడ్డలు తప్ప ఏమీ దొరకలేదు భూతానికి. దానికి చాలా కోపం వచ్చి, “రంగన్నా, నువ్వు నన్ను మోసం చేశావు!” అన్నది.
“నా మోసం ఏముందమ్మా, నువ్వేది అడిగావో అదే కదా నేను ఇచ్చింది?” అన్నాడు రంగన్న.
“సరే అయితే. ఈసారి పంటలో పైభాగం నాది, లోపలి భాగం నీది- సరేనా?” అన్నది భూతం.
“సరే” అని ఒప్పుకున్న రంగన్న, బాగా ఆలోచించి, ఈసారి వేరుశనగ సాగు చేయాలని నిశ్చయించుకున్నాడు. దుక్కి దున్ని, ఎరువు వేసి, విత్తనాలు విత్తి, పంటకు కాపలా కాసి, కంటికి రెప్పలా దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు. తీరా పంటచేతికొచ్చే సమయానికి భూతం రానే వచ్చింది: “ఏమి, రంగన్నా! పంట తయారైనట్లుందే!” అన్నది.
“అవును తల్లీ, ఇక చేతికొచ్చినట్లే. ఈసారి మన ఒప్పందం ప్రకారం పంటలో పైభాగం అంతా నీదే కదా, నీ భాగం నువ్వు తీసుకెళ్ళు” అన్నాడు రంగన్న, నేల లోపల ఉన్న వేరుశనగ కాయలు పీక్కుంటూ. ఎంత వెతుక్కున్నా పంట పై భాగంలో పనికి వచ్చేది ఏమీ దొరకలేదు భూతానికి.
ఏం చేయాలో దిక్కుతోచక, అది “ఒరే, రంగన్నా మళ్ళీ మోసం చేశావు గదరా!” అన్నది.
“నేనేమీ చెయ్యలేదు గద తల్లీ, నువ్వేది కోరితే నేను దాన్నే కద, ఇచ్చాను?” అన్నాడు రంగన్న.
“అయితే ఈసారి పంటలో పైభాగమూ, క్రిందిభాగమూ రెండూ నాకే కావాలి” అన్నది భూతం.
“అదెట్లా కుదురుతుంది తల్లీ, నేనూ బ్రతకాలి గద!” అన్నాడు రంగన్న.
“అయితే మధ్యభాగం నువ్వు తీసుకో, పర్లేదు!” అన్నది భూతం దయచూపిస్తున్నట్లు.
ఈసారి రంగన్న చెరకు పంట వేశాడు. పంట చేతికందే సమయానికి హాజరైన భూతానికి చెరకు మొదళ్ళూ, ఆకులూ తప్ప వేరే ఏమీ దొరకలేదు. రంగన్న తన వాటాక్రింద చెరకు గడలన్నీ బళ్ళలోకి ఎత్తాడు.
“ఇదిగో, ఈసారి పంటలో మధ్యభాగం నాది, చివర్లు నీవి- సరేనా?” అన్నది భూతం. “తల్లీ, మూడు సార్లుగా చూస్తున్నాను- ఒక్కోసారీ ఒక్కోలాగా మాట్లాడుతున్నావు. ఈసారి చివరిది- చెబుతున్నాను. ఇకపైన పంటమొత్తమూ నాదే. నీదంటూ ఏమీ ఉండదు. అలా అయితేనే, ఈ సారి నేను ఏ పంటైనా వేసేది. చెప్పు మరి. ఇంకా తనివి తీరలేదా?” అన్నాడు రంగన్న కొంచెం గట్టిగానే.
“సరేలే, ఈ ఒక్కసారికీ నాకు పంటలోమధ్యభాగం ఇచ్చెయ్. ఆపైన ఎప్పుడూ నీ జోలికి రాను. ఈ పొలాన్నే వదిలి పోతాను-సరేనా?” అన్నది భూతం.
ఈసారి రంగన్న జొన్న విత్తాడు. జొన్న కంకులు నిండుబారి, ముత్యాల్లాంటి జొన్నలు తయారవ్వగానే భూతం మళ్ళీ హాజరైంది. అయితే ఈసారి దానికి చొప్ప మాత్రం దక్కింది! రంగన్న జొన్నల్ని అన్నిటినీ బస్తాలకెత్తి బళ్ళలో ఇంటికి తోలాడు.”అబ్బా ఈ రంగన్న చాలా తెలివైనవాడు” అనుకొన్న భూతం, తన మాట నిలుపుకునేందుకు గాను ఆ పొలం విడిచిపెట్టి పోయింది. విముక్తుడైన రంగన్న, హాయిగా పంటలు మార్చి మార్చి తన ఇష్టం కొద్దీ పండించుకుంటూ నేలను భద్రంగా కాపాడుకున్నాడు.
Prabhava ప్రభవ: ఒక వడ్రంగి పిట్ట
2012-02-01
కొత్తపల్లి: పట్టుపడిన దొంగ
<img src="http://kottapalli.in/static/images/2012/02/Raju.jpg", alt="Raju", align="right",width="50", height="45"> <br> రచన: బి. రాజు, 8వతరగతి, z.p.h.స్కూల్, చెన్నేకొత్తపల్లి.
కొత్తపల్లి: సూపర్ డాల్
హైదరాబాదు బుక్ఫెయిర్లో కొత్తపల్లి అంగడి పెడితే, అందులో కూర్చొని కథలు రాసిన పిల్లల్లో ఒకడు, వంశీకృష్ణ. ప్రపంచం అంతరించటం, దాన్ని దుష్టశక్తులు స్వాగతించటం, మంచిశక్తులు వాటితో పోరాడటం..ఇదొక భయంకర ఘోర నేర ప్రపంచం..! చదవండి! ఈ యుద్ధప్రపంచం ఎలా ఉంటుందోఊహించుకోండి! వీలైతే ఇందులో చిక్కుకోకుండా బయట పడండి!! రచన: యం. వంశీకృష్ణ, 5వ తరగతి, ద వివేకానంద స్కూలు, షాపుర్ నగర్, రంగారెడ్డి జిల్లా.
2012-01-25
జాబిల్లి: నాకీ తమ్ముడొద్దు!!
2012-01-03
జాబిల్లి: బుద్ధుడు ఒసగిన 12 పేర్లు
2011-08-04
పిట్ట కథలు: గోపయ్య నల్లనా.. ఎందువలనా?
2011-05-07
పిట్ట కథలు: చిట్టెలుక - కొత్త కలుగు
2011-04-05
పుస్తకం » Focus-ChildrensLit: Christopher Paolini – Inheritance Cycle
2011-03-19
పుస్తకం » Focus-ChildrensLit: And then what happened, Paul Revere?
2011-02-18
2011-02-11
పుస్తకం » Focus-ChildrensLit: అగ్నిమాలా, మృత్యులోయా…
2011-02-05
తెలుగు మాటలు: చిలకల కొలికీ చినదానా
కథ ఇక్కడ వినగలరు.
అనగా అనగా ఇద్దరు రాణులు ఉండేవారట.
పెద్ద రాణికి ఒక అమ్మాయి పుట్టిందట. చిన్న రాణికి అది ఇష్టం లేదట. అందుకని ఆ పాపని పుట్టిన వెంటనే దాసీకి ఇచ్చేసిందట. పెద్ద రాణితో, “నీకు కప్ప పిల్ల పుట్టింది” అని చెప్పిందట. పెద్ద రాణి, “అయ్యో ! ఇది నా కర్మ!” అనుకుని ఏడుస్తూ ఊరుకుందిట.
తరవాత చిన్న రాణికి కూడా ఒక అమ్మాయి పుట్టిందట. ఇలా కొంతకాలం సాగిందట. పెద్దరాణి కూతురు దాసీ దాని ఇంటిలోనూ, చిన్నరాణి కూతురు రాజుగారింటిలోనూ పెరుగుతున్నారట. చిన్న రాణి పెద్దమ్మాయి చేత దాసీ పనులు చేయిస్తూ, చాలా కష్టాలు పెడుతూ ఉంటుందిట. చిన్నమ్మాయికి, అంటే చిన్న రాణీ గారి సొంత కూతురికి అది అస్సలు బాగుండదట. మరేమో, ఆ అమ్మాయికి తనకిది నచ్చలేదని వాళ్ళ అమ్మతో చెప్పాలంటే భయమట. అందుకని ఒక ఉపాయం ఆలోచించిందట.
ఒక రోజు ఆ చిన్నమ్మాయి బొమ్మలతో అమ్మ ఆట ఆడుకుంటోందిట. ఎంచక్కా అమ్మ లాగే తను కూడ వంట చేసి, ఆ బొమ్మకి, “తిను, తిను” అంటూ తినబెట్టిందట. కానీ ఆ బొమ్మేమో తినలేదు కదా. అప్పుడు ఆ అమ్మాయేమో, ” నా బొమ్మ బువ్వ తినటం లేదూ” అంటూ ఏడవటం మొదలెట్టిందట.
వాళ్ళమ్మ అది చూసి, “చిలకల కొలికీ చినదానా, బొమ్మలు బువ్వలు తిందురటే” అందిట నవ్వుతూ.
అప్పుడేమో ఆ అమ్మాయి, “మాయలదానా, మహిమల దానా, మనుషులు కప్పల కందురటే” అందిట చమత్కారంగా.
అప్పుడు చిన్న రాణి తను చేసిన తప్పు తెలుసుకుని, పెద్దరాణికి నిజం చెప్పి, పెద్దమ్మాయిని పిలుచుకుని వచ్చి, ప్రేమగా చూసుకోసాగిందట.”
(కథల అత్తయ్య (రచయిత్రి) గారికి కృతజ్ఞతలతో)
కథ కంచికీ, మనమింటికీ!
Filed under: కథలు
2011-01-06
పుస్తకం » Focus-ChildrensLit: చిన్నప్పటి రష్యన్ కథలు
2010-12-17
ఆహా! ఓహో!: కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
2010-11-01
mamcimaata: దురాశా పిశాచం
దురాశా పిశాచం
జగన్నాధపురం జమీ ధనవర్మ ఏలు బడి లోకిరాగానే ,ఆయన అనేకమార్పులు చేసాడు.దానికికారణం తాను అందరికంటే గొప్ప ధనవం తుడు కావాలని ఆశ. ‘ తన ఏకాం తమందిరం నిండా ధనరాసులు నిండిపోయి ఉన్నట్లూ ,ఆధనరాసులకాంతులమధ్య తాను ఉన్నట్లూ ‘ ప్రతిరోజూ కలలు కనేవాడు.ఆకలలు నిజంచేసుకోను ధనవర్మ పరిపాలనలో కొన్నిమర్పులుచేశాడు. తరతరాలుగా తన జమీలో జరుగుతున్న నిత్య అన్నదానపధకాలు, దేవాలయాలలోని ప్రత్యేకపూజలూ , తిరినాళ్ళూ , ఉత్సవాలూ రద్దుచేశాడు. దాంతో కొంతఖర్చు తగ్గినట్లు భావించాడు.ప్రజలపై పన్నులు రెట్టింపు చేశాడు. తండ్రి , దివాను , పెద్దలూ ఎంతచెప్పినా వినలేదు. పోగైన ఆధనం రాసులుగాపోసు కున్నాడు.ప్రజలు పెం చినపన్నులు కట్టలేక నా నా బాధలూ ప డసాగారు.రాత్రి పూటపురవీధుల్లో పది గంటలతర్వాత వీధి దీఅపాలన్నీ ఆర్పేయమని ఆఙ్ఞ్ వేశాడు.తన జమీ లోని ముసలిపని వారినంతా తీసేసి సగం మందినే యువకుల్ని నియమించి రెట్టింపుపనిచే యించసా గా డు. మందిరంలో హుందాగా అందంగా వెలిగే దీపాలు దుబారాగా భావించి తగ్గించేశాడు.వంటలూ పూలఖర్చుల్లోను కోతవిధించాడు.
ఈవిధంగాపొదుపు చేసినధనాన్ని కూడారాసులు పొసుకున్నా ఇంకా ఆ రాసుల్ని ఎలా పెంచుకోవాలా అనేతపనతో అశాంతి , అసహనం, కోపం ,నిద్రలేమి పెరిగిపోయాయి.తల్లి తండ్రులతో, భర్యా బిడ్డలతో మాట్లాడ టమే మానేశాడు. ప్రజలందరూ ముసలిజమీం దారైన జగన్నాధవర్మ కు తమ కష్టా లు మొరపెట్టు కున్నారు . జగన్నాధవర్మ ప్రజల బాధలు విని భరించలేక , భార్యతోకల్సి కొంతకాలం పుణ్య తీర్ధాలు సేవించను బయల్దేరివెళ్లాడు. పుణ్య క్షేత్ర దర్శ నాలు చేస్తూ జగన్నాధ వర్మ దంపతులు , దేవతలందర్నీ తమకుమరునికి పట్టిన ‘ దురాశాపిశాచాన్ని ‘ వదిలించి , అతనిలోమంచిమార్పు తెమ్మని ప్రార్ధించ సాగారు. ఒక అటవీప్రాంతంలోని పురాతనదేవాలయ మంటపంలో విశ్రాంతి తీసుకుం టున్న వారిని ఓ సాధువు పలుకరించాడు.వారుభక్తి తో ఆ యనకు నమస్క రించారు. వారి విచార ము ఖ కవళికలు గమనించిన ఆ సాధువు , వారి ద్వారా విషయం అంతా తెల్సుకుని , వారికి ఓ వుపాయం చెప్పాడు.జగన్నాధ వర్మ సం తోషం తో , భార్య తో కల్సి నగరానికి తిరిగి వచ్చాడు. తర్వాత మూడు రోజులకు ఒక సాధువు నగరానికి వచ్చాడు.ఆ యన అడిగిన వారి కోరికలన్నీ తీర్చుతున్నా డనే ప్రచారం సాగింది.నగర ప్రజలంతా ఆ యనను దర్సిం చను గుంపులుగా రాసాగారు.
దురాశా పరుడైన ధనవర్మ ఆ సాధువును దర్సించి , తన చిరకాలపు కలలు నిజంచేయమని ప్రార్ధించాడు. తన ఏ కాంత మందిరానికి ఆ యన్ను ఆ హ్వా నించాడు.సాధువు ధనవర్మ మందిరం ప్రవేసించి ,కళ్ళుమూసుకుని ఒక మంత్రం పఠించాడు.ఏ డు పెద్ద బానలు సృ ష్టించాడు. ఆ ఏ డు బానల్లోసగానికి వజ్రాలూ, ముత్యాలూ, బంగారు ఆ భరణాలూ,కాసులూ ఉ న్నాయి.” ధనవర్మా ! నీవద్ద వున్నధనాన్ని ఈ బానల్లో నింపు .నీస్వంత ధనంతో వీటిని నింపితే నీకలలు ఫలిస్తాయి.” అని చెప్పి ఆ సాధువు వెళ్ళి పోయాడు. ధనవర్మ తన ఏ కాంతమం దిరంలో తాను రాసులుపోసుకున్న ధనాన్ని ఆ బానలనిండా నింపసాగాడు.సగంవరకూ నిండివున్న ఆ ఏ డు బానల్లో ఆ రుమాత్రం పుర్తిగా నిండాయి.ఏ డవ బాన మాత్రం నిండలేదు.ఆ రోజు నుండీ ధనవర్మ ,ఇంకా పొదుపు పా టించి ,ఇంకా పన్నులు పెంచి ధనం కూ డబెట్టి, ఆ ఏడ వబాన నింపే ప్రయత్నం ముమ్మరం చేశాడు.
ఎం త పొసినా అదినిం డటంలేదు.రాజబాటల్లో హుండీలు పెట్టి ఆ దారినపోయే వారిపై ‘ దారిసుంకం ” కుడా విధించాడు.తల్లి తండ్రులు భార్య అతని దురాశను ఆ పను ఎం త ప్రయత్నించినా , వారిమాటలు పెడ చెవిని పెట్టాడు.రాత్రి పూట మారు వేషంలో ,జోలెపట్టిధనం సేకరించసాగాడు.
.ప్రజలు అతన్ని గుర్తించినా, అసహ్యంతో , నవ్వుకుంటూను, గుర్తించనట్లే ఎం తో కొంత డబ్బు వేయసాగారు.ఎం తధనం పోసినా ఆ ఏ డవ బాన నిండటంలేదు.అ న్నపానాదులుమాని ధనసేకరణలో పడి చిక్కి పోసాగాడు ధనవర్మ.దురాశా పిశాచం పట్టి పీడించేవాడు అల్లాగే అవుతాడు మరి
ఎ లాగైనా ఆ ఏ డవ బానను నింపాలనే పట్టుదలపెరగ సాగింది. పక్క నగరాలకు రాత్రిపూట మారు వేషం లో వెళ్ళి జోలెపట్టిధనంపోగుచేయసాగాడు నగరవాసులు అతన్ని ‘ ఇం తబలంగా వున్నా వే అ డుక్కొకపోతే ఏ దైనా కా య కష్టం చేసి నాల్గు డబ్బులు సం పాదించుకోరాదా? అడుక్కోను నీకు సిగ్గుగాలేదా?” , అని ఛీ కొట్టసాగారు. ఆ మాటలతో ధనవర్మ పంతం పెరిగింది.మారువేషంలోనే పక్కగ్రామాలకు వెళ్ళి కొలిమివద్ద కమ్మరిపని, కట్టెలు కొట్టేపని, రాళ్ళుమొసేపనీ, సేస్తూ కొంత ధనం పొగుచేశాడు.అ లాసంపాదించినధనాన్ని తెచ్చి, ఆ ఏ డవబానలో పొయగానే అ దినిం డిపొర్లింది.
ధనవర్మ ఆ శ్చర్యంతో ఇం తకాలం ఎంతపోసినా నిండని బాన ,తానుకూలిచేసి పోగుచేసిన కొద్దిపాటిధనంతోఎ లానిండిందాని అనుకుని ,ఆ సాధువు కనిపిస్తేఅడగాలని తలంచిన వెంటనే, ఆ సాధువు ధనవర్మ ఎ దుట ప్రత్యక్షమయ్యాడు.
“ధనవర్మా! నీ స్వంత ధనంతో ఆ ఏడు బానలూ నింపమన్నాను,నీవు నీ తాతలనాటి ధనాన్నీ ప్రజలపై అ న్యాయంగా పన్నులువేసి వసూలు చేసిన ధనాన్నీ ,సిగ్గు విడచి జోలెపట్టి సంపాదించిన ధనాన్నీ ఆ బానల్లో పోశావు. ఎం తకష్ట పడితే ధనం సంపాదించగలమో తెల్సు కోలేక పో యావు. ధనంకూడబెడితే అది పిశాచంలా పీడిస్తుంది. శాంతిలేకుండాచేస్తుంది.ఊ రకేవున్నధనం ఎవ్వరికీ వుపయోగపడని ధనంచూసుకుని సంతోషించే బదులు ఇసుక, రాళ్ళు ,మట్టీ ,ధనంగానే భావించి చూసుకుని సంతోషించవచ్చు.దానికోసం ప్రజలనూ కన్న తల్లి తండ్రులను భార్యాబిడ్దలనూ ఇన్ని కష్టా ల పాలు చేయవలసిన పనిలేదు.తాతముత్తా తలు ప్రజా సంక్షేమం కోసం ,దేవాలయాల్లో పూజలకోసం, అన్న దానాలకోసం ప్రత్యేకించి న ధనాన్ని ,వాటినంతా ఆ పి ఆ బానల్లో నింపావు.ప్రజలనుపీ డించి ధనం వసూలుచేశావు.కన్న బిడ్డలవలె చూసుకోవలసిన ప్రజలను ,ఎ న్నో కష్టాల పాలుచేశావు.ఆ నందం ధనం లో లేదు. అందరికీ ఆ నందం కలిగే పనులుచేస్తే ఆ ధనం వుపయోగం లోకివస్తే ఆ నందం లభిస్తుంది.ఆ ఏ డవబాన యే అత్యాశ !.మిగిలిన ఆ ఆ రూ అరిషడ్వర్గాలు. ఆ ఏడవదాన్ని నింపను ఎ వ్వరివల్లాకాదు. ఇప్పటికైనా తెలివొంది ప్రజా సంక్షేమం కోసం పాటుపడి తాతతండ్రులపేర్లు నిలుపు.ప్రజలనుసుఖపెట్టు.ఆ శాపాశం నాశనానికి దారితీస్తూదని తెల్సుకో….” ‘ అనిమాయమయ్యాడు సాధువు.
ఆ ఏడు బానలూ మాయమయ్యాయి.ప్రజాధనం అలాగేవుంది.తనతప్పు తెల్సుకున్న ధనవర్మ ఆ ధనాన్నంతా ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేసి ,ప్రజాహితకార్య క్రమాలన్నీ యధప్రకారం కొనసాగించి ,తనతప్పులన్నీ సరిదిద్దుకుని ,దురాశాపిశాచాని తరిమేసి,తల్లి తండ్రులనూ ప్రజలనూ
ఆ దరంతోచూసుకుంటూ, జనరంజకంగాపరిపాలించి,మంచిపలకుడిగాపేరుతెచ్చుకున్నాడు.ధనవర్మ గా కాక ధర్మ వర్మ గా పేరుపొందాడు.
నీతి:_ అత్యాశహానికరం.
2010-10-15
బాల కళ: చి. హర్షిత చిత్రకళ
2010-09-27
ఆహా! ఓహో!: పగలే వెన్నెలా - పరవశమాయెగా!
2010-09-03
బాల కళ: పుట్టిన రోజు పాత-యం.వి.తరుణ్ ప్రదీప్ ,నాలుగవ తరగతి
2010-07-05
పుస్తకం » Focus-ChildrensLit: పిల్లల కోసం పుస్తకాలు…
2010-06-27
బాల సాహిత్యం: ప్రణాళిక-క్రమశిక్షణ
బాల సాహిత్యం: ఈగలమోత
2010-05-16
మడత పేజీ: ఏమిటీ శబ్దం ?
2010-05-13
మడత పేజీ: తకిట తరికిట
2010-02-27
పుస్తకం » Focus-ChildrensLit: రెండు బాలల పుస్తకాల గురించి..
2010-02-26
పుస్తకం » Focus-ChildrensLit: పిల్లలు, పుస్తకాలు, నా అనుభవాలు
2010-02-24
పుస్తకం » Focus-ChildrensLit: తకిట తరికిట
2010-02-20
పుస్తకం » Focus-ChildrensLit: నాకు పరిచయమైన బాలల సాహిత్యం
2010-02-15
పుస్తకం » Focus-ChildrensLit: అద్భుత చిత్రగ్రీవం
2009-07-26
పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇంకొక ద్రిమ్మరి
పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇద్దరు వేటగాళ్లు
2007-11-13
Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)
2007-08-29
Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)
2006-07-04
తెలుగులో బాల సాహిత్యం: తెలుగులో బాల సాహిత్యం
నికు తొలి గురువయింది.
నీ పాలిటి దైవమయింది.
నీకు రోగమొస్తే నర్సు అయింది.
నీకు నిద్ర వస్తే లాలి పాట అయింది.
చాలా బావుందండి.
VERY GOOOOOOOOOOOOD STORY
I liked the story and how he used his cleverness
by Sravani Ireland
పై వాక్యం నా బ్లాగులోని అమ్మ కావాలి టపా లోనిది.
ఆ టపా ఇక్కడ చదవండి.
http://bonagiri.wordpress.com/2009/06/24/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/
very fair
good…keep post few more
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.





