2009-07-03
జానుతెనుగు సొగసులు: తెలుగు ఆడియో పుస్తకాలు - ఏది ఉత్తమ కళ? - శ్రీ దేవులపల్లి రామానుజరావు
జానుతెనుగు సొగసులు: ఆ విరుపులు, ఆ ఝలక్కులు, ఆ చమక్కులు
కొత్త పాళీ: కథాంశం
2009-07-02
దీప్తి ధార: కుక్క కుంటితే
రాతలు - కోతలు: తప్పక చూడవలసిన సినిమా, నింగీ-నేలా, నాదే!
రేపు విడుదలవుతున్న నింగీ, నేలా, నాదే- అనే సినిమాను అందరూ, పిల్లలూ, పెద్దలూ, మొత్తం కుటుంబ సభ్యులూ అందరూ కలసి తప్పనిసరిగా చూడవలసిన సినిమా.
ఇది, చైనా సినిమా ఇన్విసిబుల్ వింగ్స్ కు తెలుగు తర్జుమా.
ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోతుంది. అయినా, అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని, తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అవసరంలేదని, ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది. అంగవైకల్యం శరీరానికేననీ, మనోశక్తితో అన్ని వైకల్యాలను అధిగమించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చనీ నిరూపిస్తుంది.
ఈసినిమా చూస్తూంటే ప్రతి చిన్న కష్టానికీ కృంగిపోతూ, న్యూనతాభావానికి గురవుతూ, ఆత్మహత్యలవైపు పరుగిడేవారందరికీ బుద్ధివచ్చి స్ఫూర్తి జాగృతమవుతుంది.
తాము వెనుకబడి వున్నాము కాబట్టి తమకు చేయూతలేనిదే నిలబడలేమని దీనాలాపాలు, ఆక్రందనలు చేసేవారందరికీ, ఆత్మశక్తి, ఇచ్చాశక్తి అనే పదాల అర్ధాలు బోధపడతాయి. మనస్సాక్షి జాగృతమయి సిగ్గిలుతుంది.
మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, అతని ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని నిక్కచ్చిగా చూపుతుందీ సినిమా.
ప్రతి ఒక్కరూ, ఒకతికి రెండుసార్లు చూసి స్ఫూర్తిని పొందవలసిన అద్భుతమయిన సినిమా ఇది.
ఈ సినిమాను చలన చిత్రోత్సవంలో చూశాను. ఇప్పుడిది అనువాదమయి, పాటలు చేర్చుకుని వస్తోంది. చూడండి. ఇతరులకు చూపించండి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు మనకందుతాయి. లేకపోతే, ఎవరూచూడరని. అవే ప్రేమలూ, అవే గెంతులు, పూబంతుల ప్రతీకల కుళ్ళు సినిమాలే మనకు గతి అవుతాయి.

కొత్త పాళీ: తెలుగు పత్రికల్లో కథ నవలల పోటీలు పెద్ద పెద్ద బహుమతులతో
కడలితరగ: ఇరాన్ – జయాపజయాల దోబూచులాట
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్ష స్థానానికి జూన్ 12 న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏడు కోట్ల జనాభాలో నాలుగుకోట్ల అరవైలక్షల మంది వోటర్లుండగా ఎనబై శాతం మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎతెలాఫ్ ఆబాద్ గరాన్ ఎ ఈరాన్ ఎ ఇస్లామీ (ఇస్లామిక్ ఇరాన్ నిర్మాతల ఐక్య వేదిక – ఆబాద్ గరాన్ అని పిలుస్తారు) తరఫున మహ్మూద్ అహ్మదినెజాద్, ఎతెమాద్ ఎ మెల్లి (జాతీయ విశ్వాస పార్టీ) తరఫున మెహ్దీ కర్రౌబీ, స్వతంత్ర అభ్యర్థులుగా మీర్ హొస్సేన్ మౌసవీ, మొహ్సెన్ రెజాయీ పోటీ చేశారు. వీరిలో అహ్మదినెజాద్ గత ఎన్నికలలో, 2005లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనను, రెజాయీని మితవాదులుగా, మౌసవీని, కర్రౌబీని సంస్కరణవాదులుగా పిలవడం పాశ్చాత్య పత్రికలకు అలవాటు. కాని ఇరాన్ వార్తలు చదివేటప్పుడు పాశ్చాత్య పత్రికల కథనాలను ఒకింత అనుమానంతో చూడవలసి ఉంటుంది. ఇరాన్ లో 1979 నుంచీ కొనసాగుతున్న పాలనాపద్ధతిలో అధ్యక్షపదవికి పోటీ చేయాలంటేనే మతపెద్దల రక్షణ సమితి అనుమతి ఉండాలి. ఇవాళ సంస్కరణవాదులుగా అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు, పాశ్చాత్య పత్రికలు పిలుస్తున్న వారు కూడ ఇరాన్ ఇస్లామిక్ మత రాజ్యంగా ఉండాలని కోరుకునేవారే.
వోట్ల లెక్కింపు జరిగినతర్వాత అహ్మదినెజాద్ కు 62 శాతం వోట్లు, మౌసవీకి 33 శాతం వోట్లు వచ్చాయని దేశ పాలనా వ్యవహారాలు చూసే అత్యున్నత పాలకమండలి రక్షణ సమితి ప్రకటించింది. ఆరుగురు మతపెద్దలు, ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన ఈ పాలకమండలికి అధినాయకుడు అయతొల్లా అల్ ఖామెనీ. కాని ఆ ఎన్నికలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కావలసిన దానికన్న ఎక్కువ సంఖ్యలో బాలట్ పత్రాలను ముద్రించడం, వోటుముద్రలను తయారు చేయడం జరిగిందనీ, చాల ప్రాంతాలలో ఉన్న వోటర్ల సంఖ్యకన్న ఎక్కువ వోట్లు పడ్డాయనీ, కనుక ఆ ఎన్నికలు చెల్లవనీ మీర్ హొస్సేన్ మౌసవి ఆరోపిస్తున్నారు. తొలుత మౌసవి ఫిర్యాదును అంగీకరించి విచారించిన రక్షణ సమితి ఎన్నికలు సక్రమంగానే జరిగాయని నిర్ధారించింది. మరోపక్క ఫలితాలు వెలువడినప్పటినుంచీ ఇరాన్ రాజధాని టెహరాన్ లోను, ప్రధాన పట్టణాలన్నిటిలోనూ నిరసనలు, ప్రజా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నిరసనకారులు వేలాదిగా, లక్షలాదిగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు. కాల్పులు, అరెస్టులు, పత్రికలమీద సెన్సార్ షిప్, హింసాకాండ చెలరేగుతున్నాయి.
ఇంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసినది ఏమీ లేదు. మూడో ప్రపంచ దేశాలలో చాల చోట్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల సరళి, ఎన్నికలలో అక్రమాలు, హింసాకాండ, దక్షిణార్ధగోళపు దేశాల వెనుకబడినతనం గురించి ఉత్తరార్థగోళపు ప్రచార సాధనాల వైఖరులు ఈ విధంగానే ఉంటున్నాయి గనుక ఈ ఆరోపణలకు, నిర్ధారణలకు ఆశ్చర్యపోవలసిందేమీలేదు. కాని ఇరాన్ మీద పాశ్చాత్య ప్రపంచంలో అసాధారణమైన ఆసక్తి కనబడుతోంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడి దగ్గరి నుంచి, అమెరికన్, యూరపియన్ పత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా వ్యాఖ్యానించే సాధారణ పౌరులవరకూ ఎందరెందరో ఇటు కొసనుంచి అటు కొసవరకూ ప్రకటించగల అభిప్రాయాలన్నీ ప్రకటిస్తున్నారు. ఒక శిబిరంలోనే పరస్పర వ్యతిరేకమయిన భిన్నాభిప్రాయాలు కూడ వెలువడుతున్నాయి.
దాదాపు పాశ్చాత్య ప్రపంచ నాయకులందరూ ఎన్నికలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను సమర్థిస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలు, ఐక్యరాజ్యసమితి, యూరపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు ఇరాన్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని భావిస్తున్నాయి. అవి ఇప్పటిదాకా అహ్మదినెజాద్ ను ఎన్నికయిన అధ్యక్షుడిగానే అంగీకరించలేదు. ఇరాన్ లో జరుగుతున్న ప్రజా నిరసన ప్రదర్శనలను సమర్థిస్తున్నాయి. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా ఇరాన్ మీద యుద్ధానికి సన్నద్ధమవుతూ, సాకులు వెతుకుతూ, అహ్మదినెజాద్ మీద వ్యక్తిగతంగా కూడ దాడులు చేస్తున్న అమెరికా పాలకులకు ఈ ఎన్నికల ఫలితాలు, ఆరోపణలు కొత్త అవకాశమిచ్చాయి.
మరొకవంక, అరబ్ లీగ్ లోని అన్ని దేశాలు, రష్యా, చైనా, బ్రెజిల్, భారత ప్రభుత్వాలు ఈ ఎన్నికల ఫలితాలను ఆహ్వానించాయి. అహ్మదినెజాద్ ను అధ్యక్షుడిగా గుర్తించాయి. ఇరాన్ లో జరుగుతున్న ప్రజాందోళన అంతా నిజమయిన ప్రజాందోళన కాదనీ, కేవలం సంపన్న, మధ్యతరగతి, విద్యావంతుల ఆందోళన అనీ, అమెరికనీకరణ చెందిన వర్గాలు మాత్రమే అహ్మదినెజాద్ ను వ్యతిరేకిస్తున్నాయనీ, సద్దాం హుసేన్ తర్వాత అమెరికాను ఎదిరించి నిలుస్తున్న నాయకుడిగా అహ్మదినెజాద్ ను చూడాలనీ వాదించేవారు కూడ చాలమందే ఉన్నారు.
నిజానికి అమెరికాకూ, ఇరాన్ కూ మధ్య ఘర్షణ కొత్తది కాదు. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ చమురు, సహజవాయు నిలువలు ఉన్న దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న దేశంగా, పశ్చిమాసియాలో ప్రభావశీల దేశంగా ఉన్న ఇరాన్ తమ అధీనంలో ఉండాలని అమెరికా పాలకులు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ పాత రాజు షా మహమ్మద్ రెజా పహ్లవీ అమెరికా అనుకూల ప్రభుత్వాన్నే నడిపాడు. రాజకీయార్థిక విధానాలలో మాత్రమే కాక, సాంస్కృతిక జీవనంలో కూడ అమెరికా తరహా జీవన విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. “ఇస్లామిక్ మూఢత్వాన్ని” రద్దుచేసి ఆధునికతను ప్రవేశపెట్టిన రాజుగా అమెరికా ఆయనకు పూర్తి మద్దతు తెలిపింది. కాని 1979లో అక్కడ జరిగిన ఇస్లామిక్ విప్లవం రాజును కూలదోసి మతపాలన ప్రారంభించింది. మొదట అయతొల్లా ఖొమేనీ, ప్రస్తుతం ఖామెనీ అక్కడ అత్యున్నత, అంతిమాధికార పాలకులుగా కొనసాగుతూ, తమ కనుసన్నలలోనే పార్లమెంటరీ పాలనను నడుపుతున్నారు.
ఖొమేనీ తరహా ఇస్లామిక్ పాలనలో ఇరాన్ కు అమెరికాతో ఘర్షణ తీవ్రతరమయింది. తన మూర్ఖత్వం వల్లనో, మత ఛాందసం వల్లనో ఖొమేనీ క్రైస్తవ అమెరికన్ పాలకులను, యూదు ఇజ్రాయిలీ పాలకులను ఎదిరించడం ప్రారంభించాడు. పశ్చిమాసియాలో అరబ్ రాజ్యాల పక్కలో బల్లెంగా అమెరికా సృష్టించిన ఇజ్రాయిల్ ను అడుగడుగునా వ్యతిరేకిస్తూ అరబ్ రాజ్యాలకు నాయకత్వం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ మధ్యలో ఇరాక్ తో యుద్ధం చేసినా ఒక ఇస్లామిక్ మత రాజ్యంగా ఇరాన్ అరబ్ దేశాలన్నిటి గౌరవాన్ని పొందింది. ఇటీవల అణ్వాయుధాలను సంతరించుకునే ప్రయత్నంలో అమెరికాతో, ఇజ్రాయిల్ తో వైరం ఎంతగా పెరిగిందో, అరబ్ రాజ్యాలతో స్నేహం అంతగా పెరిగింది. బుష్ పాలనాకాలంలో దాదాపు ప్రతిరోజూ అమెరికా ప్రభుత్వం ఇరాన్ మీద విమర్శలూ ఆరోపణలూ గుప్పిస్తూ వచ్చింది. ఒబామా పాలన ప్రారంభమయినాక ఆ ఉరవడి తగ్గినప్పటికీ, అసలు దృక్పథం ఏమీ మారలేదు. పైగా ఒబామా ప్రభుత్వంలో కూడ ఇజ్రాయిలీ యూదు అనుకూల వర్గాలదే పైచేయి కావడంతో, ఇరాన్ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పాత భాషే మొదలయింది.
ఇరాన్ లో ఎన్నికలలో చాల అక్రమాలు జరిగే ఉండవచ్చు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న ప్రజల ఆలాంక్షలు న్యాయమయివే కావచ్చు. కాని ఇరాన్ కల్లోలంలో అమెరికా, ఇజ్రాయిల్, బ్రిటన్ ల పాత్ర సముచితమైనదేనా అనే ప్రశ్న ముఖ్యంగా ఆలోచించవలసినది. ఇరాన్ ఎన్నికలపైన అమెరికా వ్యాఖ్యలు ఇరాక్ లో జన విధ్వంసక ఆయుధాల ఆరోపణలను గుర్తుకు తెస్తున్నాయి. అహ్మదినెజాద్ పై విమర్శలు సద్దాం హుసేన్ పై జరిగిన దాడులను జ్ఞాపకం చేస్తున్నాయి. మౌసవీ పట్ల, నిరసనకారుల పట్ల ప్రస్తుతం అమెరికా చూపుతున్న ప్రేమ ఏడెనిమిది సంవత్సరాల కింద సద్దాం హుసేన్ వ్యతిరేకులపైన చూపిన ప్రేమను తలపిస్తోంది. అవన్నీ నిజమే అయినా ఒక సర్వ సత్తాక ఇరాన్ పైన ఈ విధంగా దాడి చేయడానికి అమెరికాకు హక్కు లేదు. ఇవాళ్టి మాటలదాడి రేపు ఆయుధాల దాడి కాబోదనే హామీలేదు. ఇరాక్ లో ఆ సాకులతో ప్రవేశించి ఇప్పటికి అమెరికా సైన్యాలు చంపిన ఇరాక్ పౌరుల సంఖ్య పన్నెండు లక్షలకు చేరింది.
గత ముప్పై సంవత్సరాల మతపాలనలో ఇరాన్ రాజకీయార్థిక, సామాజిక జీవితం ధ్వంసమైపోయిన మాట నిజమే. సాంస్కృతిక జీవనం అతలాకుతలమయిందనే మాట నిజమే. అందువల్ల అసంతృప్తి చెందిన లక్షలాది ప్రజలు ఇవాళ దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనకారులు ప్రస్తుతం మౌసవిని తమ నాయకుడుగా చూపుతుండవచ్చుగాని, అది మౌసవి మీద ప్రేమ ఏమీ కాదు, అమెరికా మీద ప్రేమ అంతకన్నా కాదు. అహ్మదినెజాద్ మీద ఎట్లాగూ వ్యతిరేకత ఉంది. అటువంటి న్యాయమైన ప్రజా నిరసనను తన ప్రయోజనాలకొరకు వాడుకోజూడడమే అమెరికా దుర్మార్గనీతి.
ఎన్నికలలో న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా ఇరాన్ ప్రజలు తేల్చుకుంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉన్నప్పటికీ, పెనం మీద మాడడమో పొయ్యిలో పడిపోవడమో తప్ప మరొక దారి లేనప్పటికీ ఇరాన్ ప్రజల ఆందోళన న్యాయమైనది.

శాస్త్ర విజ్ఞానము: 65 ని 90 గా మార్చడానికి 10
2009-07-01
బ్లాగాడిస్తా!: చారు చాఱు !!
రాతలు - కోతలు: కోతికొమ్మచ్చివే, మరికొన్ని ఫోటోలు!
కోతికొమ్మచ్చి సభ విశేషాలవే మరికొన్ని ఫోటోలిదిగో.
ఇవన్నీ బాపు, రమణల సన్మానానికి సంబంధించిన ఫోటోలు. ఈఫోటోల్లో, రావికొండలరావు గారి నిందాస్తుతి అక్షింతల ఫోటో కూడా వుంది.
సభలో, రమణ గారు ఉపన్యసించటానికి మైకు వద్దకు వచ్చి చేతులు జోడించగానే ఒక 10 నిముషాలు హాలు చప్పత్లతో దద్దరిల్లింది. అంతసేపూ వారు అలానే నిలబడి, ఇది చాలు నాకు, అన్నట్టు ఏమీ మాత్లాడకుండా వెళ్లిపోయారు. మరో 10 నిముషాలు హాలు దద్దరిల్లింది.
ఇది సభ విశేషాలను తెలిపే పోస్టు కావటంతో పుస్తకం వెల వివరాలు ఇవ్వలేదు. ఆ వివరాలను పుస్తక సమీక్షతో ఇస్తాను. అదీ అతి త్వరలోనే…..











కడలితరగ: పతంజలి గారితో మూడు దశాబ్దాలు
(అరుణతార పత్రికలో ప్రచురితం)
పతంజలిగారిని మొదటిసారి చూసి దాదాపు ముప్పై ఏళ్లు కావస్తోంది.
సృజన అక్టోబర్ 1980 సంచిక అచ్చువేయించడానికి బెజవాడ వెళ్లి కృష్ణక్క వాళ్లింట్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆయనను చూశాను. అప్పుడు వేణుగోపాల రావు గారు సిద్ధార్థ కాలేజికి ప్రిన్సిపాల్ గా ఉన్నారు. బెంజి సర్కిల్ కు ఇటువైపు కృష్ణక్క వాళ్లిల్లు. అటువైపు ఈనాడు ఆఫీసు. పతంజలి గారు అప్పటికి ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఒక మధ్యాహ్నం వాసు (కె. వాసుదేవరావు) గారితో కలిసి పతంజలి గారు కృష్ణక్కవాళ్లింటికి వచ్చారు. అప్పటికే చతురలో పతంజలి గారి నవల ఖాకీవనం అచ్చయి ఉంది. అంతకు ఒకటి రెండు సంవత్సరాల ముందే ఉత్తరప్రదేశ్ లో పోలీసుల సమ్మె, ఆ నేపథ్యంలో వచ్చిన ఖాకీవనం నవల, అది కలిగించిన సంచలనం వల్ల ఖాకీవనం రచయితను కలవడం, దగ్గరిగా చూసి మాట్లాడడం అద్భుతాలుగా తోచాయి. ఒక రకమైన యాసతో, సన్నని, వ్యంగ్యం ధ్వనించే గొంతుతో, తక్కువ మాటలే అయినా చతురోక్తులతో ఆయన మాట్లాడుతుంటే వినడం ఒక అనుభవం.
అప్పటి నుంచి ఆ తర్వాతి ముప్పై సంవత్సరాలు వేరువేరు సందర్భాలలో వ్యక్తిగా, అభిమానరచయితగా, వైద్యుడిగా, పత్రికారచయితగా ఆయనను దూరం నుంచీ దగ్గరి నుంచీ చూసే అవకాశం కలిగింది. చిట్టచివరికి మార్చ్ 9 సాయంకాలం విశాఖపట్నం సింహాద్రి ఆస్పత్రిలో రూం నంబర్ 510 లో అర్థచేతనలో, బాధతో మూలుగుతున్న ఆయనను చూసినప్పుడు ‘ఎటువంటి మనిషి ఎట్లా అయిపోయాడు’ అని దుఃఖం కలిగింది. అమ్మా అని ఆయన మూలుగుతుంటే, ఆయన కూతురు ఉపశమనంగా ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు. చీపురుపుల్లలా అయిపోయిన కుడి చేతికి అప్పటికే సెలైన్ ఎక్కుతోంది. అప్పుడే రక్తం ఎక్కించడానికి వచ్చిన నర్సులు నరం దొరకడం లేదని కంగారు పడుతున్నారు. ‘ఎట్లా ఉన్నారు సార్’ అని ఆయన ఎడమచేతిని చేతిలోకి తీసుకుని పలకరిస్తే కళ్లెగరేసి చిరునవ్వు నవ్వారు గాని, నిజంగా గుర్తించారో లేదో తెలియదు. కలిసిన ప్రతిసందర్భంలోనూ ఏదో ఒక వ్యంగ్యాన్నో, పరిహాసాన్నో, లోతయిన ఆలోచననో పలికించిన ఆ పెదాల మధ్య ఒక భాధాతప్త, వేదనామయ ధ్వని తప్ప, పెదాల వెనుక ఆగిపోయిన పలకరింపు తప్ప అంతకు ముందరి అనేక కలయికల ఆహ్లాదం లేదు. ఆయనతో ఈ ఆఖరి కలయిక కూడ మళ్లీ కృష్ణక్కతో కలిసే జరిగింది.
ఆయన ఉండిన ఆస్పత్రి రావిశాస్త్రి గారి ఇంటికి వందగజాల దూరంలో. ఇటు రావిశాస్త్రి జ్ఞాపకాల వీథి, అటు పడిలేస్తున్న కడలి. మధ్యలో ఆస్పత్రిలో ఆయన చివరి రోజులు గడిపారు. ఒక రకమైన భవిష్యవాణి పలికించినట్టుగా ‘చివరి రోజులు విశాఖలో గడుపుతాను’ అని ఆయన రెండువారాల కింద హైదరాబాదు వదిలేసి వెళ్లారని తెలిసినప్పుడు, హైదరాబాదులో కలవలేకపోయినా విశాఖలో తప్పనిసరిగా కలవాలనుకున్నది, ఇట్లా ఆయన అకాల మరణానికి ముప్పై గంటల ముందు జరిగింది.
యాభై ఏడు సంవత్సరాల వయసు ఏం వయసని ఈలోకాన్ని వదిలి వెళిపోవడానికి? వదిలివెళ్లిన రచనలు రాశిలోనూ వాసిలోనూ చెప్పుకోదగినన్ని ఉన్నా, ఆయన రాయాలనుకున్నవీ, రాయవలసినవీ ఎన్నెన్ని రాయకుండా మిగిలిపోయాయి?!
గడిచిన ముప్పై ఏళ్లలో ఆయనతో జ్ఞాపకాలనూ, అనుభవాలనూ గుర్తు తెచ్చుకుంటుంటే మనసు పొరల్లోనుంచి ఆయన పట్ల గౌరవం, ఆయనతో ఉండిన ప్రత్యేక అనుబంధం ఉవ్వెత్తున ఎగసివస్తున్నాయి.
ఆయన బెజవాడ ఈనాడు ఉద్యోగం రోజుల్లో మరి ఒకటి రెండు సార్లు కలిశానో లేదో గుర్తు లేదు గాని, మరి మూడు నాలుగు సంవత్సరాలకే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తెలుగు దినపత్రికల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, ఉదయం దినపత్రిక తన సబ్ ఎడిటర్లకూ రిపోర్టర్లకూ శిక్షణ ఇవ్వదలచి, పత్రిక ప్రారంభానికి దాదాపు ఏడాది ముందే ట్రెయినింగ్ కాలేజి ప్రారంభించింది. అలా ట్రెయినింగ్ కోసం ఎంపికయిన ఇరవై మందికి శిక్షణ ఇచ్చే ప్రధాన బాధ్యత పతంజలి గారిది. ఆయనను చీఫ్ సబ్ ఎడిటర్ అన్నారో, న్యూస్ ఎడిటర్ అన్నారో గుర్తు లేదు గాని ఎ కె ఆర్ బి కోటేశ్వరరావు ప్రిన్సిపాల్. తర్వాత వాసుగారు, తర్వాత పతంజలిగారు. తర్వాత ప్రకాశ్. ఎ కె ఆర్ బి, వాసుగారు అప్పటికే పెద్దవారు గనుక ఇరవైల్లో ఉన్న మా సబ్ ఎడిటర్ ట్రెయినీలందరికీ, ఇరవైల చివరా, ముప్పైల మొదటా ఉన్న పతంజలిగారూ, ప్రకాశ్ గురువులు మాత్రమే కాక స్నేహితులూ మార్గదర్శకులూ అయ్యారు. అశోక్ నగర్ చౌరస్తాలో ఒకమూల ఆజాద్ కేఫ్ అనే ఇరానీ హోటల్, సరిగ్గా ఎదురుమూల మోహన్ కోడా ఇంటి పై అంతస్తులో మా ట్రెయినింగ్ కాలేజి. టెలిప్రింటర్ మీద వచ్చిన పిటిఐ వార్తలను మేం అనువాదం చేస్తుంటే పతంజలిగారు దిద్దుతుండేవారు. మా భాషనూ, అనువాదాన్నీ సరిచేస్తూ అనుభవాలూ కథలూ గాథలూ చెపుతుండేవారు. ఆ ఉద్యోగం ఎక్కువరోజులు చేయలేకపోయినందువల్ల నేను పొందిన నష్టాలన్నిటిలోకీ పెద్దది పతంజలిగారితో కలిసి ఎక్కువకాలం పనిచేసే అవకాశం పోగొట్టుకోవడం.
కాని ఆ తర్వాత కూడ రచయితగా, పత్రికా రచయితగా ఆయనతో సంబంధం కొనసాగుతూనే ఉండేది. నేను బెజవాడ ఆంధ్రపత్రికలో పనిచేస్తుండగా ఆయన హైదరాబాదు ఉదయంలో ఉన్నారు. కృష్ణుడు (ఎ కృష్ణారావు) ఆయనకు సన్నిహితుడుగా ఉండేవాడు గనుక ఆయన సంగతులు నాకూ, నా సంగతులు ఆయనకూ కృష్ణుడిద్వారా తెలుస్తుండేవి. ఆ రోజుల్లోనే (బహుశా 1987లో కావచ్చు) సాహిత్య విమర్శ మీద నేనొక వ్యాసం రాశాను. అది అప్పుడు హైదరాబాదు నుంచి వస్తుండిన ఉదయం సాహిత్యపేజీలో అచ్చయింది. ఆ వ్యాసం చదివి పతంజలిగారు విరుచుకుపడ్డారనీ, విసుక్కున్నారనీ, దానిలో సాహిత్య వాసనలు లేవన్నారనీ సన్నిహిత మిత్రులొకరు నాకొక ఉత్తరం రాయడమో, టెలిప్రింటర్ మెసేజి పంపడమో చేశారు. నా వ్యాసం ఆయనకు నచ్చనందుకు నాకు బాధ కలిగింది. ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు తన వ్యాఖ్యల సందర్భాన్ని ఆయనే వివరించేదాకా ఆ నొప్పి అట్లాగే ఉండింది. తాను ఆ వ్యాసం మీద దురుసు వ్యాఖ్యలేమీ చేయలేదనీ, సాహిత్య విమర్శ గురించి అయినా, సాహిత్యం గురించి అయినా నా వ్యాసంలో ఉండిన కటువు వైఖరి మంచిది కాదని మాత్రమే అన్నాననీ ఆయన వివరించారు.
ఆయన ఆ వివరణ ఇచ్చిన సందర్భం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడ నిన్న జరిగినంత తాజాగా కనబడుతోంది. అప్పుడు ఆయన సమయంలో ఎడిటర్ గా ఉన్నారు. నేను చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరి, అప్పటికింకా పత్రిక మొదలు కాలేదు గనుక ట్రెయినీ సబ్ ఎడిటర్ల అనువాదాలు దిద్దే పనిలో ఉన్నాను. ఒక ట్రెయినీ పెళ్లి విందుకు ఆజామాబాదు సమయం ఆఫీసు నుంచి అడిక్ మెట్ నడిచివెళ్తూ ఉన్నాం. అప్పటికి నాలుగైదు సంవత్సరాలుగా నా మనసులో మెరమెరలాడుతున్న నా బాధ ఆయనకు చెప్పాను. ‘నా సాహిత్య విమర్శ వ్యాసం మీద మీకు విమర్శ ఉందని తెలిసింది. ఏం తప్పు రాశానో చెపుతారా’ అని. సాహిత్యకారులు సృజనకర్తలుగా, భావుకులుగా ఎంత సున్నితంగా ఉంటారో, అందువల్ల సాహిత్య అధ్యయనాన్ని, విమర్శను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలో, విషయం దృఢంగా చెపుతూనే దాన్ని మృదువుగా ఎలా చెప్పాలో ఆయన చాల ఓపికగా చెప్పారు. రాసిన విషయంతో తనకు పేచీ ఏమీలేదని, కాని పద్ధతి మొరటుగా ఉందేమోనని అనిపించిందని అన్నారు.
బహుశా నా రచనాపద్ధతి మీద ఆయనకు ఏర్పడిన ఆ అభిప్రాయం చివరివరకూ మారినట్టులేదు. ఒక సంవత్సరం కింద ఒక విందులో కలిసినప్పుడు కూడ దగ్గరికి పిలిచి మరీ చాల సేపు నాగురించీ, నా రచన గురించీ మాట్లాడారు. ‘ఈ వారం వారం కాలమ్ లు, అక్కడో ఉపన్యాసం, ఇక్కడో ఉపన్యాసం మానెయ్యండి’ అని విసుక్కున్నారు. ‘మీ శక్తి వృథా చేసుకోకండి. మీరు ఫుల్ లెంథ్ పుస్తకాలు రాయాలి. మీరే రాయవలసినవి ఉన్నాయి. మీరు రాయగలరు’ అన్నారు. ‘కాని కాస్త కోపం తగ్గించుకోండి. నేను కూడ కోపంతోనే రచన చేస్తాను. కోపం రాకుండా ఉండలేం, రాయలేం. కాని కోపంగా చెప్పేటప్పుడు మన దగ్గర పాయింటు ఉన్నా కూడ బయటివాళ్లు అది గుర్తించరు. వాళ్లకు కోపమే కనబడుతుంది గాని పాయింటు కనబడదు’ అని చాలసేపు చెప్పారు. అప్పటికే ఆయన సాక్షిలో చేరారు. ‘ఇంకా పని మొదలు కాలేదు. ఎప్పుడయినా రండి, ఖాళీగానే ఉంటున్నాను. చాల మాట్లాడుకోవాలి మనం’ అన్నారు.
ఆరోజు సంభాషణంతా ఒక శిష్యుడికి గురువు చేసిన బోధ లాగ ఉండింది. కాని చిత్రం, ఆయన ఎప్పుడూ ఎవరికీ గురువునని అనుకోలేదు. ప్రతి ఒక్కరితోనూ స్నేహితుడిగా మెలిగారు. ఆత్మీయుడిగా ఉన్నారు. చాల సందర్భాలలో బిడియంతో, మొహమాటంతో కూడ ఉండేవారు. అంత అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి, అంతగా వ్యవస్థపట్ల ఆగ్రహం, ధిక్కారం ఉన్న ఆయన తోటి మనుషులతో ఇట్లా సంకోచంగా, బిడియంగా ఎందుకు ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుండేది.
సరే, మళ్లీ వెనక్కి వెళ్తే, బెజవాడలో ఉండినరోజుల్లో, 1985-89 తెలుగుదేశం పాలనాకాలంలో, ఆట-మాట-పాట బంద్ రోజుల్లో, ఉదయంలో వారం వారం ఆయన రాస్తుండిన పతంజలి భాష్యం ఎడారిలో ఒయాసిస్సులా ఉండేది. ప్రభుత్వ విధానాలమీద, అక్రమాల మీద ఒక సృజనకర్త కాలమిస్టుగా మారి ఎటువంటి పదునైన వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉందో చూపిన కాలమ్ అది. అప్పుడే సృజన పునఃప్రారంభించడానికి ఒక విఫలప్రయత్నం చేసి, మరొక సాహిత్యపత్రిక ఏదయినా ప్రారంభించాలనుకుని డానీ, ఖాదర్ వంటి మిత్రుల సహాయంతో సమీక్ష పత్రిక ప్రారంభించాం. ఆ పత్రిక తొలి సంచికలో పతంజలిగారి రచన ఉండాలని మా కోరిక. ఆయన పోయేకాలం అని ఒక వ్యంగ్య కథ పంపించారు. అప్పుడప్పుడే రామోజీరావు ప్రియ పచ్చళ్ల వ్యాపారం ప్రారంభమయింది. పతంజలిగారి కథ నరమాంసం పచ్చళ్ల వ్యాపారం గురించిన కథ. వ్యంగ్యాన్ని ఆశ్రయించి లోతయిన రాజకీయార్థిక, సామాజిక విశ్లేషణా వ్యాఖ్య చేసిన కథ అది. సమీక్ష రెండు సంచికలతో ఆగిపోయినా ప్రచురించిన విలువైన రచనలలో ఆ కథ ఒకటి.
ఆ రోజుల్లోనే ఉదయం సాహిత్య పేజీలో ఆయన అనుసృజన చేసిన మార్క్ ట్వేన్ కథలు తుంటర్వ్యూ, నా వ్యవసాయపత్రిక హాస్యస్ఫోరకమైన కథలుగా ఎందరినో ఆకర్షించాయి. అవి కేవలం వ్యంగ్య వైభవాన్ని నింపుకున్న కథలు మాత్రమే కాదు. ఆభిజాత్యాలమీద, భేషజాల మీద ఘాటయిన విమర్శలు అవి. అజ్ఞానంతో కూడిన అహంకారాన్ని కత్తితో చీల్చినట్టుగా వెటకరించిన కథలు అవి. పత్రికా రచనమీద, పాత్రికేయ వృత్తి బోలుతనం మీద ఛెళ్లున చరిచిన కొరడాలు అవి. ఆ రెండు అనువాదకథలను కొన్ని వందల మందికి చదివి వినిపించి ఉంటాను.
పది నెలలపాటు సమయంలో సహోద్యోగులుగా ఉన్నా, సమయం రాకుండానే ఆగిపోవడంతో, నేను కొంతకాలం నిరుద్యోగం చేసి చివరికి ఉద్యోగార్థం బెంగళూరు వెళ్లాను. బహుశా పతంజలి పట్ల, ఆయన రచనల పట్ల ఇనుమడించిన గౌరవంతో బెంగళూరు వెళ్లానేమో, బెంగళూరు తొలి జ్ఞాపకాల్లో ఒకటి చూపున్నపాటను ఇంగ్లిషులోకి అనువాదం చెయ్యడం. అది ఎక్కడా అచ్చు కాలేదు గాని, ఆ కథ మీద నా గౌరవాన్ని చూపుకోవడానికే అనువాదం చేసినట్టున్నాను.
అప్పుడే మోహన్ చిరునవ్వు సంచికలు తెచ్చి దాంట్లో గోపాత్రుడు, వీరబొబ్బిలి, పిలక తిరుగుడుపువ్వు, ఒక దెయ్యం ఆత్మకథ ప్రచురించాడు. ఆ మూడు గొలుసు నవలికలు చదివి ఎంత కదిలిపోయానంటే వెంటనే వాటిమీద విశ్లేషణా వ్యాసం ఒకటి రాసి ఆంధ్రప్రభకు పంపాను. ఆ వ్యాసం ఆయనకు నచ్చిందని విని పొంగిపోయాను.
అప్పుడు బెంగళూరు నుంచి వస్తూపోతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కలిసేవాళ్లం. అప్పుడే నాకు డయాబెటిస్ ఉందని బయటపడినప్పుడు, ఆయన తన వైద్యంతో అది నయమవుతుందన్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. ఒకటి రెండు సార్లు మందులు ఇచ్చారు. ప్రతిరోజూ ఒక అంజూర్ ముక్క తినమని కలిసినప్పుడల్లా చెపుతుండేవారు. వాళ్ల పాపకు కూడ డయబెటిస్ వచ్చినప్పుడు శంకరమఠం ఎదురుసందులో ఇంట్లో తన ఆవేదన నాతో పంచుకున్నారు. ఆ తర్వాత నేను హైదరాబాదు వచ్చి, అప్పటికి మా గోపీ మరణించి పది సంవత్సరాలయిన సందర్భంగా గోపీ స్మృతి అని ఒక ప్రచురణను ప్రారంభించాలనుకున్నప్పుడు వెంటనే తట్టినది పతంజలి కథల సంపుటమే. ఇలా మీ కథల సంపుటం వేయాలనుకుంటున్నాం అనగానే ఆయన వెంటనే అంగీకరించారు. గోపీ స్మృతి మొదటి ప్రచురణగా చూపున్నపాట పుస్తకం అలా వెలువడింది. చూపున్నపాటకు మోహన్ వన్ అండ్ ఓన్లీ పతంజలి అని ఒక అప్పటికీ ఇప్పటికీ అద్భుతమైన విశ్లేషణాత్మకమైన, అనుభూతి ప్రధానమైన ముందుమాట రాశాడు.
ఇటు కూర్మనాథ్ ద్వారానో, అటు నందిగం కృష్ణారావు ద్వారానో చాల తరచుగా, చాల ఎక్కువగా సమాచారం అటూ ఇటూ అందుతున్నప్పటికీ గత ఐదారేళ్లుగా ఆయనను కలవడం చాల తగ్గిపోయింది. నువ్వేకాదు వివాదం సందర్భంగా ఫోన్ లో చాల సార్లే మాట్లాడాను గాని, ఆయనతో ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగేది కాదు. నువ్వేకాదు మీద పరువు నష్టం దావా వచ్చి, రచయిత మీద ఒక న్యాయమూర్తి అన్యాయమైన వ్యాఖ్యలు చేసి, ‘రచయితలయితే ఎక్కువా? నా ముందు వచ్చి బోనులో నిలబడవలసిందే, క్షమాపణలు చెప్పవలసిందే’ అన్నప్పుడు ఆయనకు రక్షణగా సాహిత్యలోకం నిలవాలనీ, ఇది భావప్రకటనాస్వేచ్ఛమీద దాడేననీ, కాల్పనిక సాహిత్య సృజనకు అవరోధమనీ ప్రకటిస్తూ హైదరాబాదులో విరసం తరఫున ఒక సభ ఏర్పాటు చేశాం. సాహిత్య లోకం నుంచి విస్తృతమైన సంఘీభావం ప్రకటితమైన సభ అది. పతంజలిగారు ఆ సభకు వచ్చారు గాని, వేదిక మీదికి రాలేదు. కనీసం ఒకటి రెండు మాటలు మాట్లాడమన్నా నిరాకరించారు.
ఒకవైపు అటువంటి వినయం, బిడియం, మరొకవైపు ప్రతిదాన్నీ నిర్మమకారంగా, నిర్దాక్షిణ్యంగా చూసి విమర్శించగలగడం, వెటకరించగలగడం, ప్రతి కన్నీటి చుక్కనూ ఒక చిరునవ్వుగా మార్చగలగడం ఆయన విశాల, నిశిత రచనాశక్తికి చిహ్నాలు. రాజుల లోగిళ్ళ శునకాలకు కూడ ఉండే ఆభిజాత్యాల దగ్గర ప్రారంభించి నల్లకుంట గుడ్డి బిచ్చగాడి పిల్లనగ్రోవిలో కూడ పలికే ఉద్యమగీతాల శక్తి దాకా మనం గుర్తించవలసిన అనేక విషయాలమీద అత్యద్భుతమైన రచనలు చేసిన పతంజలిని తెలుగు సమాజం గుర్తించవలసినంత గుర్తించిందా, గౌరవించవలసినంత గౌరవించిందా అనుమానమే.
Related Post:
పతంజలి గారూ, ఈ తగువు ఇంకెవరికి చెప్పేది?

తెలు-గోడు: గడియారం

శాస్త్ర విజ్ఞానము: 65 ని 90 గా మార్చడం ఎలా?
మనిషి: ఆకాశదీపం
కలగూరగంప: మహానుభావుడు శ్రీ గౌరు
2009-06-30
తెలుగు తూలిక: ఊసుపోక – సంతంటె సంతోసమయ్య మాకు

బ్లాగాడిస్తా!: సంస్కృత చిత్రకవితలు!
కలగూరగంప: అమెరికా : ఇచ్చట నమ్మకమైన, నాణ్యమైన, తాజా స్వైన్ ఫ్లూ ఎగుమతి చేయబడును-2
గుండె చప్పుడు...: శంభుని శిరము నుండి సీసాలోకి…

'సత్య'శోధన: పోతీ డాట్ కం లో నా చిన్న పుస్తకం
2009-06-29
ఏటి ఒడ్డున: నీలో నేను
గుండె చప్పుడు...: ఇప్పుడు రామారావు వంతు. మరి రేపు?

2009-06-28
నా మదిలో ...: క్వీను గారి కంట్రీలో అనుభవాలు ...
జానుతెనుగు సొగసులు: నానా.....నానా..... రుట్ట తెయ్
2009-06-27
నాలో 'నేను': ఒక వేసవి సాయంత్రం...
2009-06-26
జానుతెనుగు సొగసులు: "టాకీ టెక్నిక్ - చలన చిత్ర నిర్మాణ కళ" - వెల కట్టలేని పుస్తకం
కాలాస్త్రి: మైఖేల్ జాక్సన్ - కాలాస్త్రి నివాళి
2009-06-25
దీప్తి ధార: మీకు తెలియని మీ సెల్ ఫోన్ రహస్యాలు
అనుభవసారం: క్రికెట్ చరిత్రలో ఓ మహత్తర క్షణం
శ్రీ కృష్ణదేవరాయలు: అక్షర లక్షలు!
2009-06-24
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి: అలాల్ - ముద్దార్
2009-06-23
తెలు-గోడు: గులాబి గోల

జానుతెనుగు సొగసులు: మాయాబజార్ కథాసంగ్రహం - April 1957 చందమామ నుంచి
2009-06-22
తెలుగు తూలిక: “నేను” కథ

అనుభవసారం: పిరికితనపు ఒయాసిస్సు సాక్షిగా
శ్రీ కృష్ణదేవరాయలు: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ - శ్రద్ధాంజలి
2009-06-21
జానుతెనుగు సొగసులు: సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే గారి ఇంటర్వ్యూ
అందం: మన సంస్కృతి
2009-06-20
అందం: రేపు నేను ఒక టపా వేయబోతున్నాను
జీవితంలో కొత్త కోణం...: గవురుమెంటు డాట్రారు
పడమటి గోదావరి రాగం.: నాన్నమ్మ...
2009-06-18
నేను చెప్పేది ఏమిటంటే...: ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 2
కలగూరగంప: అమెరికా : ఇచ్చట నమ్మకమైన, నాణ్యమైన, తాజా స్వైన్ ఫ్లూ ఎగుమతి చేయబడును-1
జానుతెనుగు సొగసులు: వాయిదాకే విసుగొచ్చి హెచ్చరించడంతో - ఆడియో పుస్తకాలకి శ్రీకారం!
2009-06-17
నేను చెప్పేది ఏమిటంటే...: ఎక్స్ పిచ్చి వై పిచ్చి.. క్రికెట్ పిచ్చి.. Part 1
మనసులో మాట: క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!
2009-06-16
శ్రీ కృష్ణదేవరాయలు: స్నేహితుని విజయాన్ని ఆస్వాదిస్తూ...మళ్ళీ మీ ముందుకు!
2009-06-15
జానుతెనుగు సొగసులు: ఉలవ చారులో బొమికేసినట్టే !
2009-06-14
e-తెలుగు: e-తెలుగు కార్యవర్గ సమావేశం, జూన్ 14, 2009
2009 జూన్ 14 నాడు జరిగిన e-తెలుగు కార్యవర్గంలోని సమావేశ విశేషాలు:
జీవితంలో కొత్త కోణం...: బుద్ధి చెప్పే బాంద్రా బ్యానర్
@సుజాతా, పదహారొస్తే ఎలాగో ఏమిటో –
అప్పుడు మనకి పాఠాలే పాఠాలు. – జబ్బ పుచ్చుకు పక్కకి లాగి, mom, we need to talk అంటూ
@మధురవాణీ, – అదే టైపు – అనుకున్నా
) . హహ
మాలతి గారూ,
‘కథామాలతీయం’ pdf గా చేసి, ఎప్పటికీ మా దగ్గర భద్రపరచుకునే వీలుని కల్పించినందుకు ధన్యవాదాలు.
పతంజలి కథలు ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.. ఈ మధ్యనే ‘పతంజలి భాష్యం’ వచ్చింది.. కథల కోసం ఎదురు చూడొచ్చా?
మిత్రులు
మహేష్ కుమార్
అరుణ
రవికుమార్
బిందు
చిన్ని గార్లకు,
ధన్యవాదాలు. దాదాపు ఏడాదిగా పని ఒత్తిడివల్ల, కారణాంతరాల వల్ల నా బ్లాగ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే నాకు అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. అంతకు ముందు ఆంధ్రజ్యోతి, సూర్య దినపత్రికలలో వారం వారం కాలమ్స్ రాసినప్పుడు ఆ పత్రికలకు పంపేటప్పుడే మిత్రుడు జయప్రకాశ్ కు కూడ పంపేవాణ్ని. తానే అప్ డేట్ చేసేవాడు. ఇప్పుడు ఆ కాలమ్స్ లేకపోవడంతో రాసినవి కూడ తనకు పంపడం లేదు. ఇటీవల నా రచనలు అప్ డేట్ చేస్తానని దిలీప్ అంటే తనకు గత రెండు మూడు నెలల రచనలన్నీ పంపాను. అలా చాల రోజులతర్వాత నా బ్లాగ్ మీద మళ్లీ కదలిక మొదలయింది. ఆ కదలికకు మీ స్పందనలు చూస్తే చాల ఆర్ద్రంగా అనిపించింది. అలా రవరవలాడిన గుండెతో మీ అందరికీ గుండెలోతులనుంచి కృతజ్ఞ్తతలతో ఈ నాలుగు మాటలు.
- ఎన్ వేణుగోపాల్
@a2zdreams: నమ్మచ్చు. నిజంగానే అంతకంటే ఎక్కువ చేసే స్నేహితులూ ఉంటారు.అందికే మంచి స్నేహాలు అనేవి కూడా ఉంటాయి. ఏ విషయాన్ని లేదా ఏ మనిషిని నమ్మలేకపోవటం కన్నా, నమ్మి మోసపోవటమే మంచిది. అది “నమ్మకం” అనేది ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మోసపైనవాడికీ, మోసం చేసే వాడికీ కూడా.
“నమ్మకం నమ్మకం నమ్మకం……నమ్మకమే లేకుంటే బతుకేది”…ఏదో జెమినీ సీరియల్లా టైటిల్ సాంగ్. చాలా రోజులైపోయింది ఆ సీరియల్ ఐపోయి. ఆ ఒక్కలైను మాత్రం ఎప్పుడూ చెవుల్లో మోగుతూనే ఉంటుంది నాకు.
i saw this movie, please don’t miss it, if you miss it you’ll regret.
As you said those morally bankrupt, lazy people who cry that they were deprived of oppurtunities,
and blackmail and blame the society for their vows should hang themselves to the nearest statue.
@a2z:
స్నేహితులకు అంతకన్నా పెద్ద సాయాలు చేసేవాళ్లుంటారు. సీతారామ్కి అయాచితంగా వచ్చినదాన్ని స్నేహితుడికివ్వటానికి కారణాలు వివరించటం అనవసరం అనిపించింది.
మీ బ్లాగులో పొందుపర్చిన ఫోటోల్ని డౌన్ లోడ్ చేసుకుందామంటే వీలుకాకుండా ఉంది. అదీగాక మీరు ఈ టపాలో వాటిని పెట్టిన క్రమం అస్తవ్యస్తంగా ఉంది. మీరు స్లైడ్ షో పద్ధతి ద్వారా వీటిని మళ్ళీ టపా చెయ్యరాదూ ? దీన్నెలా చెయ్యాలనేదాని గురించి తాడేపల్లిగారి బ్లాగులో వివరంగా ఒక టపా ఉంది. అయితే ఆ సూచనలు మీ wordpress బ్లాగుకి వర్తిస్తాయో లేదో తెలియదు. లేకపోతే ఒకసారి తీరిక చేసుకుని సదరు స్లైడ్ షో సైట్ కే వెళ్ళి చదవండి.
తాడేపల్లిగారి టపా URL :
http://www.tadepally.com/2009/01/blog-post_14.html
I’m doing a Kryptos Anagram contest if anyone is interested.
http://kryptosfan.wordpress.com/challenges/anagram-action/
Thanks!
ఎเ ŕ°Şŕąŕ°°ŕ°śŕąŕ°¨ŕ°˛ŕą‹ŕ°¨ŕą‡ ŕ°‰ŕ°‚ŕ°Śŕ°ż సఎఞధఞనం. ŕ°’ŕ°• ఎనిడి ŕ°Śŕąŕ°¸ŕąŕ°Ľŕ°żŕ°¤ŕ°żŕ°¨ŕ°ż ŕ°…ŕ°°ŕąŕ°Ľŕ°‚ చ็సŕąŕ°•๋ల็ని, ఎఞనాతŕąŕ°ľŕ°‚ ల็ని ŕ°…ŕ°‚ŕ°Śŕ°°ŕą‚ ఆఎๆన๠ఎ๋సం చ็యఞలన็ చโసŕąŕ°¤ŕ°žŕ°°ŕą. తపŕąŕ°Şŕ°¨ŕ°ż సరిగఞ ఆఎๆన๠ఎఞరŕąŕ°šŕ°Ąŕ°žŕ°¨ŕ°żŕ°•ŕ°ż పโరŕąŕ°¤ŕ°ż ఎఞనాతŕąŕ°ľŕ°‚ కలిగిన ŕ°ľŕąŕ°Żŕ°•ŕąŕ°¤ŕ°ż ఎเర็ ŕ°Žŕ°‚ŕ°Śŕąŕ°•๠కఞకโథఌŕą?


