ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-09-08

Padmarpita....: స్వీట్స్ ప్రపోసల్

2010-09-08 11:14 PM 'Padmarpita' (noreply@blogger.com)
ఓ...అమ్మాయి!!!నీవే నా పీచుమిఠాయిఓరకంట చూడమాకే ఓ పిల్లానాకు గుర్తుకొస్తుంది రసగుల్లానీ అధరాలపై దరహాసంనాకది సేమ్యా పాయసంనీవు నడుస్తుంటే భలే మజాతలపిస్తుందది తాపేశ్వరం కాజానీ జడలోని గులాబీనాకు అక్కర్లెద్దు జిలేబీనీ బుగ్గలపై పడే సొట్లునా మదిలో మెదిలే బొబ్బట్లునీ చీరమాటున దాగిన బొడ్డుగుర్తుచేస్తుందది తొక్కుడులడ్డునీ నల్లని కురుల సిరులురాసులై కనిపిస్తున్న పూతరేకులుఅమ్మో! నీ అందాన్ని కొల్వసరిపోదు

అస్థికలు: ఓం వినాయక విగ్రహాయనమః

2010-09-08 08:49 AM beereddy nagesh reddy (chantireddy12@gmail.com)
'ఈ విగ్రహాలన్నీ ఎంతకిస్తావ్‌?' ఓ పెద్దావిడ అడిగింది. 'లేదండీ నేనివ్వను' చెప్పాడతను. 'మహా అంటే లక్షల విలువ చేస్తాయి. నేను కోటి రూపాయలిస్తాను' ఆశ పెట్టింది ఆమె. 'ఎన్ని కోట్లు?' అడిగాడాయన ఆసక్తిగా. 'పదికోట్లిస్తాను' గర్వంగా చెప్పిందామె. 'లేదండి. నేనివ్వను' ఆయన స్థిరంగా అన్నాడు. 'ఇరవై కోట్లిస్తాను' కాస్త పెంచింది. 'అయినా ఇవ్వను' ఆయన ఏమాత్రం దిగలేదు. 'ఇక బేరాలొద్దుగానీ, యాభై కోట్లిస్తాను.

Stamps of Andhra: Special cover on Singareni Express Train

2010-09-08 07:05 AM kodali srinivas (noreply@blogger.com)
సింగరేణి కాలరీలు -  సింగరేణి ఎక్సప్రస్ రైల్A Special cover was released on 02 Sep 1976  to mark the Inaugural run of Singareni Express Train . The Cover was cancelled at Belampalli PO . This train covers all Coal Mining Towns of Andhra Pradesh. The Cover also shows the Singareni Collieries .

పుస్తకం: బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి వార్షిక పుస్తక ప్రదర్శన – ఆహ్వానం

2010-09-08 02:30 AM పుస్తకం.నెట్

సెప్టెంబర్ 8-12 మధ్య బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి ఆధ్వర్యంలో జరిగే పుస్తక ప్రదర్శన, మరియు సాహితీ సభలకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది.

15వ పుస్తక ప్రదర్శన గురించిన వివరాలు:

స్థలం: Kanaka Hall, Karnataka Pradesha Kurubara Sangha, Near Maha Bodhi Society, Gandhinagar, Bangalore – 09
సమయం: ఆ నాలుగు రోజులు ఉదయం 10 నుండి రాత్రి ఎనిమిది దాకా
సాహిత్య అకాడెమీ వారు 24 భాషల్లో వేసిన వివిధ పుస్తకాల పై ఇరవై నుంచి డెబ్భై ఐదు శాతం వరకూ తగ్గింపు ఉంటుంది.

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

(వివరాలు తెలిపినందుకు నిడదవోలు మాలతి గారికి ధన్యవాదాలు.)

నరేష్ కార్టూన్స్: Check out my photos on Shtyle.fm

2010-09-08 02:29 AM Naresh Patnaik (naresh.designers@gmail.com)
Hi naresh.designers.1963@blogger.com!   Check out my photos on Shtyle.fm I've created a profile on Shtyle.fm to upload my photos, share files and make new friends and I want to add you as a friend. View my Profile and Photos » Regards, Naresh

మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!: Flash... Flash... కుండపోత వర్షం కారణంగా తెగిపోయిన మొగిలిపేట్ చెరువు కట్ట - ప్రమాదం లో లోతట్టు గ్రామాలు .

2010-09-08 02:19 AM we3ours3 (noreply@blogger.com)
కుండపోతగా గత రెండు రోజుల వర్షం కారణంగా మా మొగిలిపేట గ్రామం చెరువు ఈ రోజు ఉదయం 5 గంటలకు తెగిపోయింది . అటు శ్రీ రాం సాగర్ గేట్లు అన్నీ ఎత్తివేయడం తో గోదావరి వరద లోతట్టు లో పోటెత్తి ఓబులాపూర్ ,దామ్రాజ్పల్లి , వాల్గొండ గ్రామాలు ప్రమాదం లో పడ్డాయి. అధికార్లకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్పందించాల్సి వుంది.                                తాజా సమాచారం కోసం ఈ పోస్ట్

లోలకం: 1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం

2010-09-08 01:41 AM రావు వేమూరి (rvemuri@gmail.com)
విశ్వస్వరూపం: 1. లెక్కకు అందని కాలమానం - అనుబంధంహిందూ పురాణాలలో (ముఖ్యంగా, విష్ణుపురాణంలో) కాలమానం ఈ దిగువ చూపిన విధంగా వర్ణించబడింది. ఈ వర్ణన నేను సంప్రదించిన అన్ని గ్రంధాలలోనూ ఒకేలా లేదు. కాని, స్థూలంగా కథ ఈ దిగువ చూపిన విధంగా ఉంటుంది. ఈ దిగువ చూపిన కాలమానం నిజమా కాదా అన్న వివేచన ఇక్కడ అప్రస్తుతం; కాలగమనానికి ఇంత విస్తృతమైన నమూనా మన పూర్వులు నిర్మించేరంటే అది వారి ఊహాశక్తికి ఒక అపురూపమైన

2010-09-07

తురుపుముక్క: క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 27

2010-09-07 01:00 PM కోడీహళ్ళి మురళీ మోహన్ (noreply@blogger.com)
ఆధారాలు:  అడ్డం:  1. ఏ,బి,సి,డి వర్గీకరణను కోరుతున్న ఉద్యమం. 3. కాకులు దూరనిది విరజాజి కాడలోనున్నదా? 5. కాలి బూడిద కావడం జామదగ్నికి ఇష్టమైనదేనా? 7. తిరోగమించిన కళాభినేత్రి!!! 9. తీర్థయాత్రలకు కాశీప్రయాగలతో పాటు ఇదీ ఎందుకో అని జమున అనుమానం. 10. మన్మథుని బాణము! 11. సంకరం కాదు ముంగురులు! 14. రచన తెలుగు వెండితెరకు పరిచయం అయిన సినిమా! 15. వరంగల్‌లో ఉన్న అతి పురాతన దేవాలయము ఈ దేవతదే! 16.

పుస్తకం: గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – ముగింపు సమావేశం

2010-09-07 10:36 AM పుస్తకం.నెట్

ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవ కమిటీ వారు జులై 31 నుండి వివిధ ప్రాంతాల్లో ’త్రిపురనేని గోపీచంద్ శతాబ్ధి మహాసభలు’ జరపబోయేముందు పుస్తకం.నెట్ లో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. (అప్పటి ప్రకటన ఇక్కడ.)

గోపీచంద్ ఉత్సవ కమిటీ వారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారూ కలిసి గోపీచంద్ శతజయంతి ఉత్సవాల ఆఖరు సమావేశాన్ని రేపు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు.

వివరాలతో కూడిన పీడీయెఫ్ ఇక్కడ

(వివరాలు అందించిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు).

సాహిత్య అభిమాని: రేడియో అభిమానులకు శుభవార్త

2010-09-07 09:31 AM శివ (vu3ktb@gmail.com)
అవును శుభవార్తే!ఎన్నెన్ని రేడియో నాటికలు, రూపకాలు, పరిచయాలు, లలిత సంగీతం!వినండి ఆనందించండి!మీ దగ్గర ఉన్న రేడియో కార్యక్రమ రికార్డింగులను అందరితో పంచుకొండిరేడియో మనకు దైనందిన కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు కాదు లెండి. ఒకప్పుడు అంటే, ఒక ముఫ్ఫై ఏళ్ళపైమాట. పొద్దున్నే భక్తీ రంజనితో నిద్ర లేచిన రోజులు మళ్ళి వస్తే బాగుండును అనిపించక మానదు. రేడియోలో వార్తలు వినని రోజున ఏదోగా అనిపించేది. రేడియోలో

టపాకాయ: ఏ క్రీడలు చూసినా, ఏమున్నది.....

2010-09-07 06:50 AM AMMA ODI (leninyadla@gmail.com)
[క్రికెట్ ఆటలో ఫిక్సింగులూ, బెట్టింగులూ, అద్లెటిక్స్ లో డోపింగులు వార్తల నేపధ్యంలో] సుబ్బలష్షిమి: జనాలు టీవీల కతుక్కు పోయి, కళ్ళార్ప కుండా, ఉత్కంఠకి ఊపిరి పీల్చకుండా చూసే క్రీడా పోటీల్లో.... చూడబోతే చాలా అవకతవకలే ఉన్నట్లున్నాయి కదూ, బావా! సుబ్బారావు: అప్పుడెప్పుడో శ్రీశ్రీ, "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం" అన్నాడు మరదలా! మనం దాన్ని తిప్పి

వరూధిని: స్టార్ బక్స్ & 'బక్స్'వంతుడు - బ్రాండ్ లోకం

2010-09-07 04:24 AM Zilebi (noreply@blogger.com)
స్టార్ బక్స్ వాడు బ్రాండ్ పేరుతో కాఫీ ని - డాలర్ ల లో అమ్ముతాడు. బ్రాండింగ్ లోకం లో అన్నిటికి డిమాండ్ ఉంది. బ్రాండ్ బాగా చేస్తే - మన భాజా బజంత్రీలు బ్రహ్మాండం గా వెలుగు తాయి. మన ఐపిఎల్ లాగ అన్న మాట.'కాసే దాన్ కడవులప్పా అన్నాడు ఒక తమిళ కవి. డబ్బుకు లోకం దాసోహం అని వాపోయాడు తెలుగు కవి.మొత్తం మీద మన భగవంతుడు కూడా - 'బక్స్' వంతుడు అయిపోయే! బ్రాండింగ్ లోకం లో మా తిరుపతి కొండ దేవర ని కూడా పోటీ కి

2010-09-06

అస్థికలు: లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం మీకు చూపిస్తా రండి (part 2)

2010-09-06 05:19 PM beereddy nagesh reddy (chantireddy12@gmail.com)
ఒక జంట  లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం చేశారు. వారికి సంభందించిన ఫొటోలే ఇవి. వారి జర్నీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. just click here to see part 1 of the photo album here to see part 2 of the photo album here

మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!: మొగిలిపేట దొంగల మోరి వద్ద పచ్చదనం తో నిండిన చిట్టడవి - టేకు వనం ( వీడియో )

2010-09-06 08:04 AM we3ours3 (noreply@blogger.com)
మన గ్రామం నుండి కొండాపురం పోయే తోవల గల దొంగల మోరి ణి ఆనుకుని వున్న చిట్టడవి లో పచ్చదనం పరుచుకుంటోంది. టేకు వనం చిగురేయడం వల్ల కొత్త అందాల తో అడవి ఆకర్షిస్తోంది.

గల గలా గోదారి: ది సిక్స్త్ సెన్స్ – చూసిందల్లా నమ్మకూడదని మీకెప్పుడైనా అనిపించిందా?

2010-09-06 07:11 AM 3g (gggodari@gmail.com)
ఇపుడీ అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకని మీరు అనుకోకపోతే విడుదలైన పదకొండేళ్ళ తరువాత చూడగలిగిన ఈ సినిమా నాకు కలిగించిన అనుభూతి ఇక్కడ మీతో పంచుకోవాలనిపించింది. పదకొండేళ్ళు ముందు చూసుంటే నేను పెద్దగా పొడిచేది ఏమీ ఉండేదికాదనుకోండి, ఎందుకంటే నేను అప్పట్లో హాలీవుడ్ అంటే రోజ్ఉడ్ లాగ అదీ ఒకరకం చెక్క అనుకొనేవాణ్ణి. సరే ఈ విషయం వదిలేద్దాం. బహుశా ఇది చదువుతున్న మీలో చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే

టపాకాయ: ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదు!

2010-09-06 05:24 AM AMMA ODI (leninyadla@gmail.com)
[ప్రాణాలైనా తీసుకొండి. తెలంగాణా ఇవ్వండి - కేకే వ్యాఖ్య నేపధ్యంలో] సుబ్బలష్షిమి: బావా! ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కె..... "ప్రాణాలైనా తీసుకొండి, తెలంగాణా ఇవ్వండి" అంటున్నాడు తెలుసా? సుబ్బారావు: అంత త్యాగమెందుకులే మరదలా! ఎటూ అమాయక విద్యార్ధులు ప్రాణాలిస్తూనే ఉన్నారు కదా? "తెలంగాణా సాధన కోసం ఏ త్యాగమైనా చేస్తాం" అనే కేకేలు, కేసీఆర్ లు వంటి నాయకులంతా.... ప్రాణాలొద్దు గానీ, ఇప్పటి వరకూ నానా

పుస్తకం: పరిశోధనా తృష్ణ – బంగోరె

2010-09-06 02:30 AM పుస్తకం.నెట్

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]

’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ - అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి చంద్రిక కథ, తెలుగులో జర్నలిజం, తొలకరిజల్లులు, బ్రౌన్ లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, మాలపల్లిపై నిషేధాలు, వేమన పద్యాల్లో ప్రక్షిప్తాలు, సి ఆర్ రెడ్డి రచనలు – ఎన్నింటినో ఆయన తవ్వి తీశారు. ఆ పత్రిక సంపాదకత్వం అస్థిరమైన తన నలభై ఐదేళ్ళ జీవితంలో బంగోరె చేసిన అసంఖ్యాకమైన ఉద్యోగాల్లో ఒకటి. ఎప్పుడూ కుదురుగా ఒకచోట ఉద్యోగం కూడా చేయని, విరామం లేని ఆయన జీవితంలో ఒక ఏకత్వం లేకుండా పోలేదు. అదే ఆయన పరిశోధనాతృష్ణ. తెలుగుదేశంలో పరిశోధన ప్రస్తుతం నిలిచిపోయింది. ఈ శతాబ్ది మొదటిభాగంలో ప్రతి విషయంలోనూ మౌలికమైన పరిశోధనను, మొదటితరం అగ్రగణ్యులను వదిలేస్తే సుమారు అన్నిరంగాల్లో ప్రస్తుత పరిశోధన ఈస్థితికి చేరువౌతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు అయ్యాయి. అకాడమీలు, భాషాసమితులు ఏర్పడ్డాయి. భారతీయ,సామాజిక,శాస్త్ర పరిశోధనా మండలి, భారతీయ చరిత్ర పరిశోధనామండలి, కోర్టు ఫౌండేషన్, రీసర్చ్ గ్రాంట్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనల ఆదరణ పెరిగి, పరిశోధన పేరుతో కోట్ల రూపాయలు నీళ్ళలా పరిగెడుతున్నాయి. ఈవ్యవహారాలు వ్యవహరించేందుకు పెద్ద పాలనా యంత్రాంగం రాక్షసిలా పెరిగి పరిశోధనలపై నిర్ణయాత్మక అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ యంత్రాంగంలో ఉన్న అధికారులతో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు చేయగలశక్తి ఉండటమే ఈరోజు పరిశోధకుడికి ఉండవలసిన ప్రాథమిక అర్హత. బంగోరెకు ఈ పరిశోధనావృత్తి చట్రంలో ఇమడగల సమర్థత లేకుండానే మరోవైపు ఆ ప్రాజెక్టులలో పని చేస్తూ ఒక పాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మార్చబడుతూ వచ్చిన విరామం ఎరుగని పరిశోధకుడు. పరిశోధన ఒక తీరని దాహంగా ఆయన పడిన శ్రమే విద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనపై ఆయనకు అసహనాన్ని కలుగజేసింది. చరిత్రకారులకు పనికివచ్చే ముడిసరుకును ఆయన ఒక్కడే తవ్వితీసి అందరికీ పంచి ఇచ్చాడు. ఆ మహానుభావుడే -బంగోరె!

2010-09-05

అస్థికలు: లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం మీకు చూపిస్తా రండి

2010-09-05 06:58 PM beereddy nagesh reddy (chantireddy12@gmail.com)
ఒక జంట  లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం చేశారు. వారికి సంభందించిన ఫొటోలే ఇవి. వారి జర్నీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. just click here to see part one of the photo album here సెకండ్ పార్ట్ రేపు....

వరూధిని: కృష్ణా - 'బాగా' నే 'బారో'

2010-09-05 06:30 PM Zilebi (noreply@blogger.com)
అప్పు చేసి పప్పు కూడు చిత్రం చూసాక - కృష్ణా నీవే బేగనే బారో అన్న కన్నడ పద జాలానికి నవ్వొచ్చింది. కృష్ణా బాగా నే బారో అన్నట్టుందే ఇది అని!అయినా ప్రస్తుత జమానాలో - క్రెడిట్ లేనిదే దునియా లేదన్నుట్టుంది! ప్రతి ఒక్కటి క్రెడిట్ లో కొనాల్సొచ్చే రోజులు అయి పోయేయీ!కాబట్టి - ఎట్లాగు క్రెడిట్ తప్పదు - సో బేగనే బాగా బారో చేసి - పప్పు కూడు తినవలె ! ఇది విస్సన్న చెప్పిన వేదం ఈ కాలానికి !( ఈ బ్లాగు మాత్రం ఏమి

తురుపుముక్క: దేవరాజు మహారాజుగారి కథ!

2010-09-05 01:39 PM కోడీహళ్ళి మురళీ మోహన్ (noreply@blogger.com)
డాక్టర్ దేవరాజు మహారాజు గారి కథ సోదా కథాజగత్‌ లో ప్రకటించాము. ఈ కథపై పాలపిట్ట మాసపత్రిక ఆగస్టు నెల సంచికలో వచ్చిన సగ్గురాజయ్యగారి అభిప్రాయం ఇక్కడ చదవండి.  ఆనందింపజేసిన 'సోదా ' పోలీసు అంటే రాజ ప్రతినిధి. రాజుగారి చేత ఏర్పడిన చట్టాలను రక్షించేవాడు. అన్యాయం జరిగినప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకునేవాడు. కాని ఈ కాలంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పే కథ సోదా . నా లండన్‌కోటు కథల పుస్తకంలో 'దొంగ

తురుపుముక్క: గురుభ్యోన్నమః

2010-09-05 05:51 AM కోడీహళ్ళి మురళీ మోహన్ (noreply@blogger.com)
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!!! మా ప్రచురణ బుడ్డా వెంగళరెడ్డి పై ఈరోజు వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో పుస్తక సమీక్ష వచ్చింది. అది ఇక్కడ చదవండి.

పుస్తకం: నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!

2010-09-05 01:30 AM అతిథి

రాసిన వారు: పీవీయస్
*************

మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!

ఆఫ్రికా ఖ౦డ౦లోని కెన్యా దేశ౦లో దొరికే రాక్షస నత్తలు hermaphrodites. అ౦టే, తెలుగులో ముచ్చటగా ఒక్క మాటలో చెప్పాల౦టే అర్థనారీశ్వర జీవులు. స్త్రీ, పురుష జననా౦గా లు రె౦డూ ఒకే జీవిలో ఉ౦టాయన్నమాట. కాబట్టి ఈ అర్థనారీశ్వరులు స౦తానోత్పత్తి కోస౦ మరో జీవి దగ్గరకు వెళ్ళి, పిల్లిమొగ్గలు వేస్తూ ఎలా౦టి డ్యూయెట్లు పాడనవసర౦ లేదన్న మాటే కదా!

కెన్యాదేశ౦లో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సి౦గ్ కి అక్కడ అ౦దరూ బాగా ఇష్ట౦గా తినే రాక్షసనత్తమా౦స౦ తినట౦ అలవాటవుతు౦ది. పదవీ కాల౦ ముగిశాక, ఆ దేశ౦ ను౦చి మనదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకు౦టాడు అతగాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 3౦౦ గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు ఉత్తమ్. ఎ౦దుక౦టే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పిల్ల ఐన ఒక్కొక్క నత్తా తిరిగి వార౦ రోజులలోనే దేనికది స్వత౦త్ర౦గా స౦తాన ఉత్పాదక శక్తిని పొ౦ది స్వ౦త ఫ్యాక్టరీని ప్ర్రార౦భి౦చేస్తాయి. కనుక ఉత్తమ్ రాక్షసనత్త జనాభా అధిక౦ కాకు౦డా తన జాగ్రత్త తను పడుతూ ఉ౦టాడు. కానీ, కథావశాత్తూ, ఒకసారి ఉత్తమ్ ఢిల్లీ నుంచి మదరాసుకి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఖాజిపేట దగ్గర ప్రమాదం జరిగి సింగ్ తోపాటు అతని సూటుకేసులో ప్రయాణిస్తున్న రాక్షసనత్తలు బంధవిముక్తులై వివిధ మార్గాల ద్వారా నెమ్మదిగా హైదరాబాదుకి చేరుకుంటాయి. అసలు వినాశనం ఇక మొదలవుతుంది.

పుట్టిన ప్రతి నత్తా వారం రోజులలో సంతాన సాఫల్యతా శక్తి సంపాదించుకుని తడవకి 300 గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఈ 300 గుడ్లు ఒక్క రోజులో నత్తలై వారం తిరిగేసరికల్లా (300X300) 90000 నత్తలకి ప్రాణమివ్వగలవు. అలావాటి జనాభా అనతి కాలంలోనే చైనా జనాభాని సైతం అధిగమించి పోతుంది. మన నాయకులకి మల్లేనే ఈ నత్తలకీ ఆకలి అధికం. అది తీరనిది. వజ్రాలని కొరకలేవు తప్ప, పచ్చగడ్డి నుంచి పసిడి నగలదాకా అవి వేటినైనా స్వాహా చేసేయగలవు. పసిపిల్లలని సైతం వదిలి పెట్టకుండా కొబ్బరి ముక్కల్లా కొరికి చప్పరించేస్తాయి. ఈ జరుగుతున్న మారణహోమానికి దేశం దేశమే కంపించిపోతుంది. పరాయి దేశాలలోనూ ప్రకంపనలు మొదలవుతాయి. ఆ దేశాలు మన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటాయి. లేకపోతే మనవాడు కోరితెచ్చుకున్ననత్తలు అక్కడ కూడా కొరివి పెడతాయిగా మరి! ఎయిర్ ఇండియా సంస్థ మూల పడుతుంది. ఈ నత్తలు విధ్వంసక సామ్రాట్టులవటంతో భీమా సంస్థలన్నీ దివాళా తీస్తాయి.

ఈ విలయతా౦డవానికి అ౦త౦ లేదా? పరిష్కరి౦చట౦ ఎలా? అని తలలు బద్దలు కొట్టుకోటానికి పెద్దలు అ౦దరూ ఓచోట చేరినపుడు, పరిశోధక పత్రికా రచయిత (investigative journalist) రఘుపతికి బల్బు వెలుగుతు౦ది. రాక్షసనత్తలకి జన్మస్థలమైన కెన్యా దేశ౦లో వీటివల్ల కి౦చిత్తైనా బెడద లేదు. ఒకేఒక్క నత్త వల్ల దాని విధ్వ౦సకర స౦తతి కేవల౦ నెల, నెలా పదిహేను రోజులలో ఒక బిలియన్ లేదా వంద కోట్ల స్థాయికి చేరుకుంటే, ఆ దేశం ప్రపంచ పటం నుండి ఎప్పుడో మాయమైపోయి ఉండేది. సృష్టిలో ఉన్న విచిత్రమైన విశిష్టత ఏమిటంటే ప్రతి అనర్థానికి ఒక సహజమైన విరుగుడు ఉంది. పాములు విపరీతంగా పెరగకుండా గద్దలు, ముంగీసలు ఉన్నాయి. అలాగే రాక్షసనత్తలకి విరుగుడు ఉండే ఉంటుంది. అది ఆ దేశానికి వెళితే కానీ తెలియదు. ఇలాంటి సహేతుకమైన ఆలోచనలతో కెన్యాదేశానికి బయలుదేరతారు రఘుపతి, జూవాలాజికల్ ప్రొఫెసర్ పాంచజన్య. పశ్చాత్తాప ధగ్ధ హృదయుడై, పాప ప్రక్షాళన కోసం వీరిని వె౦బడిస్తాడు ఉత్తమ్ సి౦గ్. అక్కడ అనేక శ్రమదమాదులు ఎదుర్కొన్నాక, వారికి రాక్షస నత్తలకి శత్రువైన గినాక్సిస్ నత్తలు లభిస్తాయి. వాటిని పదిల౦గా భారతదేశానికి తీసుకువచ్చి రాక్షసనత్తలని స౦హరి౦చి జరుగుతున్న ఘోరాన్ని అదుపులోకి తేగలుగుతారు.

తన ప్రదేశ౦లో లేని, దొరకని జ౦తువునో, జీవినో మనిషి తన సరదా కొసమో లేక అవసరార్థమో మరో ప్రదేశ౦ ను౦చి తెచ్చుకు౦టే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికర౦గా తెలిపే zoological fantasy ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్త్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది.

ఈ నవల మొదట విజయ మాసపత్రికలో సీరియల్ గానూ, తర్వాత 1982/83 లలో పుస్తక రూపకంగానూ వచ్చింది. నేను 1983 జూలై 20న మొదటిసారి చదివాను. ఈ (Synopsis) సారాంశాన్ని కూడా అప్పుడే రాసుకున్నాను. చదివినవి నచ్చినప్పుడు వాటి గురి౦చి క్లుప్త౦గానో లేక విపుల౦గానో ఒక synopsis రాసి పడేసుకు౦టే ఆ తర్వాత ఆ ఒరిజినల్ గురి౦చి ఇక భయపడాల్సిన దేమీ ఉ౦డదని నా భావన. ఐతే, నచ్చిన అన్ని పుస్తకాలకీ లఘు టీకా టిప్పణీలు రాసుకోవట౦ కూడా సాధ్య౦ కాదు. ముఖ్య౦గా ఈ రాసుకునే అలవాటు ఎక్కువ పుస్తకాలని చదువనీయదు. ఇ౦కా పుచ్చెడు సమస్యలు ఉన్నాయి లాభాలతో పాటు. వాటన్నిటి గురి౦చి విశద౦గా వీలు౦టే మరోసారి….

(మరో మల్లాది నవల ’అందమైన జీవితం’ గత ఏడాది పుస్తకం.నెట్లో రమణి గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడండి – పుస్తకం.నెట్]

2010-09-04

మారుతీయం: సహజీవనం

2010-09-04 08:45 PM గొల్లపూడి మారుతి రావు (noreply@blogger.com)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళనిఅల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 వ తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయవిశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచిబయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి

బెండు అప్పారావు (M.R.P): జంప్ జిలానీ ప్రమ్ టీచింగ్ ఇండస్ట్రీ :-)) (టీచర్స్ డే సందర్భంగా ....)

2010-09-04 05:35 PM బెండు అప్పారావు (noreply@blogger.com)
ప్రతి ఒక్కరికీ తమ పిల్లలకు చక్కగా చదువు చెప్పే ఉపాధ్యాయులు కావాలి. కానీ, అధ్యాపక వృత్తి చేపడితే మాత్రం, ఇంత చదువు చదివి ఇట్టాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నావంటారు. నీ కన్నా ఫలానా కంపెనీలో పాకీ పని చేసేవాడు ఎక్కువ సంపాదిస్తున్నాడంటూ, అధ్యాపక వృత్తి చేపట్టిన వాడు ఒక చవట అన్నట్టుగా మాట్లాడతారు. ఆఖరికి మా పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, ఎవరన్నా ఏమి ఉద్యోగం చేస్తున్నావని అడిగితే, చెప్పుకోవడానికి

ఆలోచనా తరంగాలు: తొలగిన శుక్రుని కరుణ-2

2010-09-04 04:37 PM సత్య నారాయణ శర్మ (ssarma04@gmail.com)
నిన్న శుక్రవారం నాడు ఈ ప్రమాదాలు జరిగాయి.పాకిస్తాన్ లోని క్వెట్టా నగరం లో షియాల ర్యాలీ గొడవల్లో మానవ బాంబు పేలుడు, తరువాత ఉగ్రవాదుల కాల్పుల వల్ల రక్తపాతం జరిగి కనీసం ఏభై మంది తుక్కు తుక్కుగా చనిపోయారు.రష్యాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అడవులు అంటుకుని కార్చిచ్చు వ్యాపించి కనీసం 500 ఇళ్ళు తగల బడ్డాయి. కనీసం 1000 మంది రోడ్ల పాలయ్యారు.బ్రిటన్ లో హరే కృష్ణ ఆలయంలో గ్యాస్ సిలిండర్లు పేలి తీవ్ర అగ్ని

2010-09-03

మా కశ్చిద్దుఃఖబాగ్భవేత్... Smiles Every Where: Raaga - Yeh Jo Des Hai Tera from Swades Music Videos, Hindi Video Songs.

2010-09-03 05:27 PM gpawansir (gpawansir@gmail.com)
Raaga - Yeh Jo Des Hai Tera from Swades Music Videos, Hindi Video Songs.

శివరంజని: నా బ్లాగ్ బర్త్ డే..... కావాలి మీ అందరి స్వీట్ విషెస్

2010-09-03 07:08 AM శివరంజని (noreply@blogger.com)
ఎప్పుడో సంవత్సరం క్రితం మా నాన్న తీసుకువచ్చిన బిర్యాని పార్సిల్ లో వచ్చిన పేపార్ లో చూసాను స్నేహమా బ్లాగర్ రాధిక గారి గురించి.. అప్పటికి బ్లాగ్ అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు.దీనిని బట్టి మీకు తెలిసిన నీతి ఏమిటి ????? బిర్యాని బాగ తినడం వలన కొత్త కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట!అందుకే మీరు బిర్యాని బాగా తినండి మరో ముగ్గురి చేత తినిపించండి మీ బిల్ల్ తోఅలా ఆ స్నేహమా బ్లాగ్ లో కవితలు అన్ని

Dr. Acharya Phaneendra: విశాల భాస్వంత చరిత్ర

2010-09-03 01:55 AM Dr.Acharya Phaneendra

విశాల భాస్వంత చరిత్ర

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

( హైదరాబాదులోని ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ యొక్క 110వ వ్యవస్థాపక దినం సందర్భంగా …
2010 సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించబడుతున్న వార్షికోత్సవాలలో …
మొదటి రోజు … ప్రారంభ సమావేశంతోబాటు, డా. నిడమర్తి నిర్మలాదేవి రచించి, సమర్పించిన ’భామినీ భువన విజయం’ సాహిత్య రూపక ప్రదర్శన జరిగింది. ఇందులో డా. నిడమర్తి నిర్మలాదేవితోబాటు డా. వేలూరి రేణుకాదేవి, డా. రాజలలిత, డా. కుసుమకుమారి, శ్రీమతి రమణ కుమారి, శ్రీమతి భారతీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు … ’తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించబడింది. దీనికి సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ’రిజిస్ట్రార్’ ఆచార్య టి. గౌరీశంకర్, ’ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి డా. అబ్బూరి ఛాయాదేవి, ప్రముఖ కవి, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం భాషాసేవ’ అన్న అంశంపై డా. జె. బాపురెడ్డి అధ్యక్షతన ’కవి సమ్మేళనం’ జరిగింది. ఇందులో డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. వి. యల్. యస్. భీమశంకరం, డా. పోతుకూచి సాంబశివరావు, డా. రాపాక ఏకాంబరాచార్య, శ్రీమతి శైలజామిత్ర తదితరులతోబాటు నేనూ పాల్గొన్నాను.
మూడవ రోజు … ముగింపు సమావేశంతోబాటు, St. Patricks High School, సికింద్రాబాదు విద్యార్థులచే ’బాలల భువన విజయం’ నిర్వహించబడుతుంది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ వార్షికోత్సవ సభలకు ’సమావేశ కర్త’ గా వ్యవహరించే భాగ్యం నాకు కలిగింది.
రెండవ రోజు నాటి ’కవి సమ్మేళనం’లో నేను చదివిన కవిత ఇది – )

రాజ ’రావిచెట్టు రంగరాయ’ని కల
సత్యమై నిలిచిన సదన మిద్ది -
’ఉరుదు’ వనిని తెలుగు పరిమళాల్ వెదజల్లు
మొట్ట మొదటి తెలుగు మొక్క ఇద్ది -

మున్ను ’పాల్వంచ’, ’మునగాల’ భూపతులును,
’కొమరరా’,’జాదిరా’జాది కోవిదులును,
’లక్ష్మి నరసమ్మ’ సహృదయ లక్ష్మి చలువ -
వెలసె ’భాషా నిలయ’ మిద్ది’, వెలుగు చూప !

’హైద్రాబాద్’ నడి బొడ్డున
నిద్రాణిత తెలుగు భాష నిగళాల్ తెగియున్,
భద్రత చేకూరుటకై -
ముద్రాంకితమాయె నిద్ది మూర్థన్యమునై !

వనితాభ్యుదయముకై పలు ప్రసంగాలిచ్చి,
’మాడపాటి’యె తెచ్చె మార్పు నిచట -
ఆంధ్రోద్యమాకాంక్ష కక్షతల్ జల్లిరి
’బూర్గుల’, ’సురవరము’ విదు లిచట -
’కదలి రండు ! ’నిజాము’ కథ తేల్చుదా’ మంచు
’కాళోజి’ ఇచ్చోట కంఠమెత్తె -
’నా తెలంగాణ రత్నాల వీణ’ యటంచు
’దాశరథి’ ఇట పద్యాలు పాడె -

ఎరుక గలుగ, గ్రంథాలయ మేరుపడగ -
జరుప సారస్వత సభల సంబరముగ -
పరిఢవిల్లె నాంధ్రోద్యమ గరిమ మిచట -
కరకు రక్కసి పాలకు నిరుకు బెట్ట !

ఇంతయి, ఇంతకింతయి, మరెంతయొ వర్ధిలి, ’హైద్రబాదు’ జ
న్మాంతర బంధమై నిలిచి, ఆంధ్ర జనావళి పాలి దివ్య క
ల్పాంతర వృక్షమౌచు, నజరామర కీర్తి గొనెన్ విశాల భా
స్వంత చరిత్రతో – తెలుగు జాతి సమస్తము గర్వమొందగాన్ !

జరిగెను రజతోత్సవములు -
వరలగ వైభవము స్వర్ణ, వజ్రోత్సవముల్ -
జరిపిరి అమృతోత్సవములు -
జరిగె శతాబ్ద్యుత్సవములు – జనతతు లలరన్ !

’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’, ’చిలకమర్తి’,
’సర్వెపల్లి’, ’మల్లంపల్లి’, ’జాష్వ’, ’అడివి’,
’విశ్వనాథ’, ’కాటూరి’ ప్రభృతులు వచ్చి -
పొంది సత్కారముల, నెంతొ పొంగి రిచట !

పూర్వ గ్రంథాలయోద్యమ పుణ్య చరిత
లో సువర్ణాక్షర లిఖిత శ్లోక మిద్ది -
అరయ, ’శ్రీకృష్ణదేవరా’యాంధ్ర విభుని
స్మృతికి నిలయమై నిలిచిన చిహ్నమిద్ది -

’కే. వీ. రమణ’యు, ’ఎమ్మెల్’
భావిని మరియింత వెలుగ, ’భాషా నిలయం’
బీ విధము తీర్చి దిద్దిరి -
ఈ విధి వర్ధిల్లు గాక ఎన్నొ శతాబ్దుల్ !

—- *** —-


పుస్తకం: మునిపల్లె రాజు – ‘ అస్తిత్వనదం ఆవలి తీరాన’

2010-09-03 01:30 AM అతిథి

అతిథి: బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్
******************
మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు.రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ,దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా,అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు.ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో,ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు.ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు,పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత.చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి,ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.

రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు.చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం.ఇందులో మొత్తం పదిహేను కథలు,ఒక మినీ నవల ( ‘పూజారి ‘.ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి.గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది.కథ ఏదైనా,ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని,ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు,బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య,’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి,చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది.మనం కూడా కాసేపు సన్యాసులమై,కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం.నోరున్న మానవులే కాదు,నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి.అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు.మేధస్సుతో ప్రభావితమైనవి.హృదయంతో ప్రభావితమైనవి.ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’

హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు

నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-

2010-09-02

బెండు అప్పారావు (M.R.P): పై చదువులకు ఆర్థిక సహాయం చేయడం కన్నా.......

2010-09-02 09:55 PM బెండు అప్పారావు (noreply@blogger.com)
ఇందాక ఛానల్స్ మారుస్తుండగా ఒక ఛానల్‌లో, ఒక అమ్మాయి పదవతరగతి వరకు చదువుకుంది, పై చదువులకు ఆర్థిక సహాయం చెయ్యండి అంటూ ఒక ప్రోగ్రాంలో ప్రేక్షకులను అడుగుతున్నారు. పేదరికం వల్ల పై చదువులు చదువుకోవడానికి డబ్బుల్లేవని ఆమె అంటోంది. ఎవరైనా సహాయం చేస్తే, బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి అండగా ఉంటానంటోంది. ఆ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులు కూడా కొద్ది మంది ఫోన్ చేసి తమకు తోచిన సలహాలు ఏవో

TELUGU PATHAM తెలుగు పథం: మంచి మాట

2010-09-02 04:06 PM TELUGUPATHAM (praveencreat@ymail.com)
1.  ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా. 2. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. 3.  మరణించిన సింహం కన్నా, బతికున్న కుక్క మేలు. 4. స్వయం సమృద్ది సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే  అవసరం. 5. జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే. 6.

Stamps of Andhra: వై.యస్.రాజశేఖర్ రెడ్డి స్మారక తపాల బిళ్ళ

2010-09-02 01:17 PM kodali srinivas (noreply@blogger.com)
A Commemorative stamp onDr.Y.S .RAJASEKHARA REDDY  Date of Issue: 02-09-2010మన 16 వ  రాష్ట్ర ముఖ్యమంత్రి ,అత్యంత ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీ  వై.యస్.రాజశేఖర్ రెడ్డి(1949 -2009 ) గారి స్మారక ఐదు రూపాయల తపాల బిళ్ళను వారి ప్రధమ వర్దంతి సందర్బంగా 02 -09 -2010 న మన తపాల శాఖ వారు విడుదల చేసారు. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల

డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ: దటీజ్ భానుమతి

2010-09-02 07:00 AM విహారి(KBL) (noreply@blogger.com)
చదవటానికి ఇమేజ్ మీద నొక్కండి

సంకీర్తన: నాట్య రీతులు - మణిపురి

2010-09-02 06:50 AM విహారి(KBL) (noreply@blogger.com)
చదవటానికి ఇమేజ్ మీద క్లిక్ చేయండి

టపాకాయ: అమ్మదయా, మజాకానా? - దటీజ్ రేణుకా చౌదరి!

2010-09-02 05:52 AM AMMA ODI (leninyadla@gmail.com)
[రేణుకా చౌదరికి పునరావాసం - వార్త నేపధ్యంలో] సుబ్బలష్షిమి: బావా! ఎన్నికల్లో ఓడిపోయినా... రేణుకా చౌదరికి ఢోకా లేదు చూశావా! ఆమెను బ్యూరో ఆఫ్ పార్లమెంట్ స్టడీస్ అండ్ ట్రెయినింగ్[బీపీఎస్ టీ] గౌరవ సలహాదారుగా ప్రభుత్వం నియమించిందట. బీపీఎస్ టీ పార్లమెంట్ పనితీరుపై సదస్సులు నిర్వహిస్తుందట, ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందట. గత వారమే రేణుకా చౌదరి బాధ్యతలు స్వీకరించిందట.

2010-09-01

లోలకం: 1. లెక్కకు అందని కాలమానం

2010-09-01 05:51 PM రావు వేమూరి (rvemuri@gmail.com)
విశ్వస్వరూపం (గత సంచిక తరువాయి)1. లెక్కకు అందని కాలమానంవేమూరి వేంకటేశ్వరరావువిశ్వం, సృష్టి ఎంతో పురాతనమైనవని పాశ్చాత్యులు మొన్నమొన్నటి వరకు ఒప్పుకోనే లేదు. బైబిలు ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని 5,000 ఏళ్ల క్రితం సృష్టించేడు. వారి దృష్టిలో దేవుడు మానవ స్వరూపుడు, మగ వాడు. విశ్వమూ, సృష్టీ ఆదిమధ్యాంతరహితం అని మనం అంటాం. ఆదిమధ్యాంతరహితుడయిన సృష్టికర్తని మానవ కాలమానం తోటీ, దైర్ఘ్య మానం తోటీ కొలవలేము.

ఆలోచనా తరంగాలు: తొలగిన శుక్రుని కరుణ

2010-09-01 04:12 PM సత్య నారాయణ శర్మ (ssarma04@gmail.com)
శుక్రుడు ఈ రోజు కన్యారాశిని వదలి తులా రాశిలో ప్రవేశించాడు.దీనివల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుజుడు అగ్నితత్వ గ్రహం. శని వాయు తత్వ గ్రహం. వీరి కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. కనుక కుజ శనుల కలయిక అగ్ని ప్రమాదాలకు పేలుళ్ళకు దారితీస్తుంది.శుక్రుడు జలగ్రహం. కనుక శుక్రుని జలప్రభావం వల్ల ఆ ప్రమాదాలు జరుగవు. లేదా ఒకవేళ జరిగినా తక్కువ స్థాయిలో జరుగుతాయి. నిప్పును నీరు ఆర్పినట్లు శుక్రుని

కృష్ణ గీతం...: ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతో

2010-09-01 02:22 AM భావన (noreply@blogger.com)
ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతో  కృష్ణాష్టమి కు దేవదేవుడి కి ------ చివరి అంచున.... ప్రయాణపు మొదటి అడుగున నిలిచిన యాత్రికురాలి గా మారే క్షణం లో ఆలోచనలను నైవేద్యం గా . జీవితం లో లెక్కలేని ఆటు పోట్లను ఎదుర్కొని ప్రయాణపు ఆఖరి మజిలిలో నిలిచిన నాకు, ఈ తుది లేఖను రాయటానికి హృదయం పగిలి ముక్కలయిన రక్తాశ్రువులే తోడవుతున్నాయి సఖా.... ఏ మనిషికైనా జీవిత ఆఖరి చరణం లో అసహాయత, అహంకారం రెండిటిని

2010-08-31

పుస్తకం: మణిదీపాలు

2010-08-31 11:06 AM తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యంగా పిల్లలకు కథలే మెదడుకు మేత. కథాశ్రవణం బాల్యానికి అద్దిన ఆజీవన పరిమళం. అలాగే అవంటే చెవి కోసుకునే పెద్దలకూ కొదవలేదు. “నాకో కథ చెప్పవూ ?” అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల మౌనఘోష.

పిల్లల్ని క్షణికంగా వినోదింపజేయడమే కాక వారి భావినైతిక జీవనాన్ని సైతం తీర్చిదిద్దాలంటే కల్పిత కథలు చెప్పి లాభం లేదు. ఒక వయసొచ్చాక కల్పిత కథల పట్ల గుఱి పోతుంది. అ దశలో ఆ నీతులకు ఉదాహరణభూతులై నిలబడిన పెద్దల గుఱించిన వాస్తవ ఘటనలు కావాలి. “మణిదీపాలు” అనే సంకలనగ్రంథం ద్వారా శ్రీ రెడ్డి రాఘవయ్యగారు సాధించిన ప్రయోజనం ఇదే. “బాలసాహిత్యం – పిల్లల కోసం పెద్దల కథలు” అనే ప్రచురణాపరంపరలో భాగంగా శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్సు (హైదరాబాదు) వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.  ’మణిదీపాల వెలుగులు’ అనే పేరుతో దీనికి ముందుమాట వ్రాసిన ఏడిద కామేశ్వరరావుగారు ఇలా అన్నారు : “…శ్రవణకుమారుడు, ప్రహ్లాదుల కథలు విని…మోహన్‌దాసు కరమ్‌చంద్ గాంధి మహాత్ముడైనాడు. పోతన భక్తిమార్గ జీవితగాథను తెరపై చూచి పరవశుడైన కొత్తలంక పశువుల కాపరి సుబ్బారావు ముమ్మిడివరం బాలయోగి అయినాడు. మహనీయుల జీవితాలు మణిదీపాలు. ఆ దీపాల కాంతులు ప్రసరించితే చీకటిగుహలు కూడా వెలుగువెన్నెలలతో శోభిస్తాయి…”

ఈ గ్రంథంలో రచయిత ౫౬ మంది మహనీయుల జీవితాల నుంచి తలా ఒక చిరస్మరణీయమైన సంఘటనని రెండు పుటలకు మించకుండా బాలపాఠకులకు పరిచయం చేశారు. పిల్లలు చిత్రప్రియులు కనుక ప్రతి కథకూ ఒక నలుపు-తెలుపు రేఖాచిత్రంతో నిండుదనాన్ని సంతరించారు. ఈ మహనీయులు వివిధ కాలాలకూ, వివిధ మతాలకూ, వివిధ రాష్ట్రాలకూ చెందినవారు :

౧. బుద్ధభగవానుడు ౨. ఆనందుడు ౩. వర్ధమాన మహావీరుడు ౪. వాల్మీకి ౫. ఆచార్య నాగార్జునుడు ౬. తిరువళ్ళువర్ ౭. శంకరాచార్యులు ౮. తులసీదాసు ౯. మాణిక్యవాచకర్ ౧౦. జయదేవుడు ౧౧. నరసింహ మెహతా ౧౨. గురునానక్ ౧౩. అమరదాస్‌జీ ౧౪. అర్జునదేవ్ ౧౫. అవ్వైయార్ ౧౬. శంకరదేవుడు ౧౭. రైదాసు ౧౮. అన్నమాచార్యులు ౧౯. జ్ఞానేశ్వర్ ౨౦. మధ్వాచార్యులు ౨౧. బసవేశ్వరుడు ౨౨. బిసోబా ఖేచర్ ౨౩. దాదూ దయాళ్ ౨౪. అక్కమహాదేవి ౨౫. కనకదాసు ౨౬. పుండలీకుడు ౨౭. సూరదాసు ౨౮. కబీరుదాసు ౨౯. భానుదాసు ౩౦. మీరాబాయి ౩౧. చైతన్యప్రభువు ౩౨. చొక్కమేళ ౩౩. రామానుజాచార్యులు ౩౪. నామదేవ్ ౩౫. ధనుర్దాసు ౩౬. పురందరదాసు ౩౭. ఏకనాథుడు ౩౮. పోతనామాత్యుడు ౩౯. సక్కుబాయి ౪౦. సమర్థరామదాసు ౪౧. త్యాగరాజస్వామి ౪౨. తుకారామ్ ౪౩. రాఘవేంద్రస్వామి ౪౪. భక్త రామదాసు ౪౫. మహీపతి ౪౬. ప్రాణనాథుడు ౪౭. సాయిబాబా ౪౮. పవహారిబాబా ౪౯. రమణమహర్షి ౫౦. రామలింగస్వామి ౫౧. రామకృష్ణ పరమహంస ౫౨. త్రైలింగస్వామి ౫౩. వివేకానందస్వామి ౫౪. రామతీర్థస్వామి ౫౫. దయానందసరస్వతి ౫౬. సాధు వాస్వాని.

ఇంతమంది మహనీయుల గుఱించి వ్రాయాలంటే రచయిత రెడ్డి రామయ్యగారు ఎన్ని గ్రంథాల్ని సంప్రదించి ఉంటారో, ఎంత శ్రమపడి ఉంటారో ఎవఱికి వారే ఊహించుకోవచ్చు. “ఒక్కొక్క మహనీయుడి జీవితం నుంచి పిల్లలు ఏమేం నేర్చుకోవచ్చు ? దాన్ని పిల్లలకు ఎలా అందివ్వవచ్చు ?” అని ఆలోచించి ఆ కోణంలో తన రచనని తీర్చిదిద్దుకోవడం మిక్కిలి ప్రశంసనీయం. కానీ పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవాలా ? లేక పిల్లల నుంచే పెద్దలు నేర్చుకోవాలా ? అనే సందేహం నన్ను చాలా కాలం నుంచి పీడిస్తోంది. ఉదాహరణకు ఈ పుస్తకంలో ’కులభేదాలను పట్టించుకోకూడదు’ అనే సందేశంతో తొమ్మిది కథలున్నాయి. వాటిల్లో “కడజాతివాడు, మాలమాదిగలు, నిమ్నకులస్థులు” మొదలైన పదాలు సందర్భవశానే అనుకోండి, తఱచుగా ప్రయోగించబడ్దాయి. పిల్లలకు కులభావన ఏ వయసులో పరిచయమవుతుందనేది ఒక వివాదాస్పద విషయం. బహుశా అది ఆయా కులాల్ని బట్టి ఉంటుంది. ఇటువంటి బాలసాహిత్యం ద్వారా పిల్లలకు “కులమనేది ఒకటుందనీ, అందులో అగ్రనిమ్న భేదాలున్నాయనీ, అగ్రులు నిమ్నుల పట్ల ఉగ్రులవుతూంటారనీ, అలా కాక కడజాతివారి పట్ల సద్భావం ప్రదర్శించడం గొప్ప ఔదార్య”మనీ – ఇలాంటి భావాల్ని నూఱిపోయడం – ఎంత ఆదర్శవాద ధోరణితో నైనా కానివ్వండి, అవసరమేనా ? కులం సెక్సులాంటిది. దాన్ని చిన్నపిల్లలకు పరిచయం చేయడం Child Abuse తో సమానం. ఇటువంటి విభజనాత్మకమైన సామాజిక వాస్తవాల గుఱించి వారు కాస్త పెద్దవారయినాక తెలుసుకుంటేనే బావుంటుంది. వారిలో లేనిదాన్నుంచి దూరంగా ఉండమని వారికి ప్రబోధించడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.

“పిల్లల కోసం పెద్దల కథలు” అన్నారు. బావుంది. పెద్దలంటే ఇక్కడ మహనీయులని ప్రాస్తావికార్థం అనుకోండి. కానీ పిల్లలకు పెద్దల ఆదర్శాల్ని – ఏ పెద్దలూ ఎప్పుడూ, ఎక్కడా ఆచరించడానికి ఇష్టపడని ఆదర్శాల్ని – బోధించడం హిపోక్రిసీ అవ్వదా ? అని కూడా నాకొక మూల మూలుగుతున్న సందేహం. సదరు ఆదర్శాలకి ఆ గతి పట్టడానికి అసలు కారణం – అవి సామాన్యుల లౌకిక జీవితంతో సంబంధం లేని పారలౌకిక, ఆధ్యాత్మిక ఆదర్శాలు కావడమేనని నా అనుమానం. ఎవఱికీ ఆచరణసాధ్యం కానివాటిని పిల్లలకు బోధించడంలో అర్థమేంటి ? ఉదాహరణకి ఈ పుస్తకంలో మమకారరాహిత్యం, ఎవరి పాపపుణ్యాలు వారివే, అహింస, క్షమాగుణం, గానంతో చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం, చనిపోయినప్పుడు ఏదీ వెంట రాదు, గేదె చేత వేదం చదివించడం, విష్ణునామమహిమ, శ్రీకృష్ణుడు తప్ప లోకులంతా స్త్రీలే, ఆత్మసాక్షాత్కారం మొదలైన ఇతివృత్తాలతోను, సందేశాలతోను చాలా కథలున్నాయి. ఇవన్నీ పెద్దలకు మాత్రమే అర్థమయ్యే విషయాలు.అదీగాక ఇవి పిల్లలలో భక్తినే తప్ప నైతికస్థాయిని, ధర్మాచరణనీ, సత్సంస్కారాన్నీ ఏ విధంగా పెంపొందిస్తాయో అర్థం కాలేదు.

మన దేశంలో పిల్లల సాహిత్యమంటూ ఏమీ లేదనడానికి ఇదొక ఉదాహరణ. పెద్దల సాహిత్యమే పిల్లల భాషలో పునస్కథనం (Re-telling) చేయబడుతూ పిల్లల సాహిత్యంగా చెలామణి అవుతున్నది. పెద్దల సమస్యలూ, సంఘర్షణలూ, వారి అంతర్మథనాలూ – ఇవే బాలసాహిత్య సృష్టికి సైతం స్ఫూర్తి అయికూర్చున్నాయి. మన ఆధ్యాత్మిక అభినివేశాల్ని (మొండి పట్టుదలల్ని) పిల్లల మీద ఆ వయసులో అడుగడుగునా రుద్దడం వల్ల అంతగా ప్రయోజనం లేదు. మన భాషలో పిల్లల బాధల్నీ, భయాల్నీ, వారి జీవితాన్నీ, నమ్మకాల్నీ, భావోద్వేగాల్నీ అవసరాల్నీ చిత్రించి ప్రతిబింబించే సాహిత్యం అరుదుగా కంటబడుతుంది. పిల్లల్ని కూర్చోబెట్టి ఇఱవై నాలుగ్గంటలూ నీతులు చెప్పేవారే తప్ప వారిని ఆడించి, నవ్వించి ఆసక్తి కలిగించి వినోదింపజేసేవారెవఱూ లేరు. ఈ పరిస్థితి మారాలి. మారాలంటే మనం పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. మనలోని పిల్లతనాన్ని, అమాయకత్వ పరిమళాన్ని, ఆటల ఆసక్తినీ, హాస్యధోరణిని పెద్దతనంలో కూడా నిలబెట్టుకోవాలి. విషయాల్ని పిల్లల కళ్ళతో చూడాలి.

రచయిత ఈ గ్రంథాన్ని వెంకటేశ్వరస్వామికి అంకితమిచ్చారు.

(మణిదీపాలు : రచన – రెడ్డి రాఘవయ్య ; పుటలు - ౧౨౪ ; వెల – తెలియదు ; ప్రచురణ - శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ హైదరాబాదు ; పంపిణీదారులు - శ్రీ గోపాల్ పబ్లికేషన్స్, 3-3-860, ఆర్యసమాజ్ మందిర్ ఎదురు సందులో, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు 500027)

2010-08-30

పుస్తకం: పుస్తక సమీక్ష – సౌశీల్య ద్రౌపది

2010-08-30 01:30 AM అతిథి

రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్
(ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.)

******************
మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ. మనిషి బతికుండగానే ఎన్నెన్ని అతిశయోక్తులు పుడుతున్నాయో, కళ్ళెదురుగుండా జరిగే సంఘటనకే టీవీ ఛానెల్సు వేర్వేరు తరహాలుగా ఎలా వ్యాఖ్యానాలు చెపుతున్నాయో చూస్తున్నాం. వేల ఏళ్ళ క్రితం గ్రంథస్తం అయిన గాథల్లో కూడా ఇలాటివి చోటు చేసుకోవచ్చని సులభంగా వూహించవచ్చు. అలా గ్రంథస్తం అయినవి ఇన్ని తరాలూ దాటుకుని ఉన్నదున్నట్టుగా దిగుమతి అయ్యాయని అనుకోవడానికి వీలు లేదు. మహాభారతం తన మూలరూపానికి ఆరురెట్లు పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ పులుసులో ఎవరికి కావలసిన దినుసులు వాళ్ళు పడేశారని.

ఇలా తయారైన పులుసును కూడా రకరకాలైన దృష్టికోణాలతో చూశారు మనవాళ్ళు. వ్యాసుడు చెప్పలేదు కానీ, ఇలా జరిగిఉంటుంది అనుకుని వూహించి కొంత కల్పన చేశారు మరికొందరు. ప్రతినాయకుణ్ణి నాయకుణ్ణి చేసి భాసుడు నాటకాలు రాసినట్టే, ఎన్టీయార్ దుష్టపాత్రల చుట్టూ సినిమాలు తిప్పి రాయించుకున్నారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కీచకుడు – ఇలా ఏ పాత్ర వేసినా, వాళ్ళలో మంచి గుణాల్ని వెదికిపట్టుకుని, లేకపోతే కల్పించి మనకు వండి వార్చారు. ఆయన హిండింబాసురుడి వేషం వేసుంటే భీముని వలచిన చెల్లెలికోసం ఆత్మత్యాగం చేసిన అన్నగా మలిచి వుండేవారు. అందరూ ఔనన్నది మళ్ళీ చెబితే మోజుండదని కొత్త తరహాగా, విపరీత పోకడలతో చెబితే గుర్తింపు వుంటుందనుకుని ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కళాకారులు.

యార్లగడ్డ ఇలాటి ప్రయత్నమే చేశారు తన ’ద్రౌపది’లో. నిజానికి తిక్కన ద్రౌపది కథను అలాగే రాసినా బోల్డంత డ్రామా ఉంది. ఈనాటి సమాజానికి రెలవెన్సు (ప్రాసంగికత) వుంది. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఒక ఆచారానికి (ద్రౌపది విషయంలో అన్నదమ్ములందరినీ చేసుకోవలసి రావడం అయితే, తెలుగమ్మాయికి మేనరికం కావచ్చు, పంజాబీ పడతికి భర్త పోయాక మరిదిని చేసుకోవడం కావచ్చు) తలవొగ్గడం, అందం కారణంగా మరిది (దుర్యోధనుడు) చేత, ఆడపడుచు మొగుడి (సైంధవుడి) చేత, రాజ్యాధికారి (కీచకుడు) చేత ఇబ్బందులకు గురి కావడం – యీనాటి స్త్రీ కూడా ఎదుర్కునే సమస్యలే! ఫ్యామిలీ సర్కిల్‍లో (కురుసభ), వర్క్ ప్లేస్‍లో (కీచకుడు రాజు ఎదురుగా కింద పడేసి తన్నాడు) అవమానించినా అడ్డుకునేవాళ్ళు లేకపోయారు. సాక్షాత్తూ భర్త పణం ఒడ్డాడు. (యుద్ధంలో ఓడిపోయాక శత్రువుతో శాంతి కోసం పెళ్ళి పేరుతో కూతుర్ని వాడికి నాలుగో భార్యగా అప్పగించిన రాజులు చాలామంది వున్నారు). భర్తలను వెక్కిరించడానికి కౌరవులు చేసినది – యీమె గుడ్డలూడదీయడం! వారిపై పగ సాధించడానికి అశ్వత్థామ చేసినది – యీమె కొడుకులందరినీ నిద్రలో చంపడం! కీచకుడి హత్యకు ప్రతీకారం అంటూ ఉపకీచకులు చేసినది – వాడితో బాటు యీమెను తగలేయబూనడం! అంటే ఎక్కడ ఉరుము వురిమినా భరించే మంగలం మాత్రం – మహిళే! అప్పుడైనా సరే, యిప్పుడైనా సరే!

ఇంత కాంటెంపరరీ డ్రామా వున్నా యార్లగడ్డ వారికి సరిపోలేదనిపించింది. అందుకే తన ద్రౌపదిని ఆయన ’రస’వత్తరంగా తీర్చిదిద్దారు. పూర్వజన్మలో అమిత కాంక్షతో ఐదుగురు భర్తలను కోరుకుందన్న ఒక పాయింటు పట్టుకుని మొత్తం సెక్సు చుట్టూ కథ నడిపారు. దానికి యాంటీ-డోట్ గా రాసిన కస్తూరి మురళీకృష్ణ ’సౌశీల్య ద్రౌపది’ అని పేరు పెట్టడంలోనే ద్రౌపదిలో ఏ లక్షణాన్ని తను హైలైట్ చేయబోతున్నారో చెప్పేశారు. మురళీకృష్ణ పాండిత్యం, సృజనాత్మకత కలబోసిన రచయిత. బహు విషయపరిజ్ఞానం, అధ్యయనం ఆయన సొత్తు. వీటికి సంస్కృతిపై మమకారం, ఆ సంస్కృతిని అపమార్గాన్ని పట్టిస్తున్న వారిపై రోషం తోడయింది. అందువలన యార్లగడ్డ ఊహలకు పూర్తిగా వ్యతిరేకదిశలో ఆలోచించి పరిగెత్తించే కథనశైలితో యీ నవల రాశారు. మహాప్రస్థానంలో నేలకూలడంతో మొదలుపెట్టి తన జీవితం ఎలా అపార్థం పాలయిందో ద్రౌపది సింహావలోకనం చేసుకుంటూన్నట్టు ఫ్లాష్‍బ్యాక్‍లో, సినిమా దృశ్యమాలికలా కథ నడిపారు. క్రితం జన్మలో అపరిమిత వాంఛకై వెంపర్లాడడం చేత ఈ జన్మలో మొహం మొత్తి ఉంటుందన్న తర్కంతో ఐదుగురు భర్తలతోనూ బ్రహ్మచర్యం నెరపిందని రాశారు. (సత్సంతానకాంక్షతో కూడడం కూడా బ్రహ్మచర్యమేనని వివరణ).

ఏ ద్రౌపది పాత్రను అడ్డం పెట్టుకుని యార్లగడ్డ – ధృతరాష్ట్రుణ్ణి (వస్త్రాపహరణ సమయంలో కళ్ళుండి వుంటే నేనూ నా కోడలి సౌందర్యాన్ని చూసేవాణ్ణి కదా అని వాపోయాడట), కృష్ణుణ్ణి (పుస్తకం మొత్తం మీద ద్రౌపదిని సఖీ అని తప్ప సోదరీ అని పిలిచిన పాపాన పోయాడు కాదు), ధర్మరాజును (ద్రౌపది మీద కన్నేసి, స్వయంవరం కాగానే ఇంటికి వచ్చేసి తల్లితో ’భిక్ష పథకం’ పన్నాడట) భ్రష్టుపట్టించి ఆ పురాణ పురుషులందరికీ మసిపూసేస్తే, మురళీకృష్ణ ఆ మసి కడిగేయడమే కాదు, కస్తూరి పరిమళాలు అద్దాడు. పైగా, భారతీయ స్త్రీని ఉన్నతంగా నిలబెట్టడానికి మధ్యమధ్యలో స్వీయవ్యాఖ్యలు జోడించాడు. పాఠకులు వాటిని విస్మరించకుండా ’బోల్డు’ చేయించాడు కూడా. ఇది 100 పేజీల చిన్నపుస్తకం. కానీ, ప్రతిపుటలోనూ భారతీయ ధర్మాన్ని నిలబెట్టడానికి రచయిత చేసిన కృషి కనబడుతుంది. ముఖచిత్రంగా ఉత్తరప్రదేశ్‍లోని దశావతారాలయంలోని ద్రౌపదీ సమేత పంచపాండవ శిల్పాలు వేశారు. దారినపోయేవారి చేతివాటం వలన ముక్కు, వక్షోజాలు ఛిన్నమైనా తరతరాలుగా చెదరని శిలాసదృశమైన భారతీయత ధర్మానికి ప్రతీకగా నిలిచివున్న ద్రౌపది యీమెయే అనిపిస్తుంది.

పాతకాలం కవులకు దేవీదేవతలు స్వప్నంలో వచ్చి తమపై కావ్యాలు రాయమని కోరేవారట. ఈ సౌశీల్య ద్రౌపదికి లభిస్తున్న జనాదరణ చూసి పైన చెప్పిన పురాణపురుషులు మురళీకృష్ణ కలలోకి వచ్చి ’సౌశీల్య కృష్ణుడు’, ’సౌశీల్య ధర్మరాజు’ వగైరా పుస్తకాలు రాయమని ఒత్తిడి చేస్తారేమో పాపం!

-ఎమ్బీయస్ ప్రసాద్

పుస్తకం వివరాలు:


సౌశీల్య ద్రౌపది
రచయిత – కస్తూరి మురళీకృష్ణ
100 పేజీలు, 50 రూపాయలు
కస్తూరి ప్రచురణలు
సోల్ డిస్ట్రిబ్యూటర్స్ – నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు.

(ఈ పుస్తకంపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.)

వ్యాఖ్యలు
2010-09-08
2010-09-08 02:22 PM తార (noreply@blogger.com) - ఆలోచనా తరంగాలు
Bravo..<br />SNKR మీరు సడెన్‌గా ఇలా జ్యోతిష్యుడు ఐపోయారేమా అనుకున్నాను,..ఇప్పుడు చూశాను..<br />బాబ్బాబు నాకూ జాతకం చెప్పండి..నవ్వి నవ్వి పోతానేమో.
2010-09-08 01:49 PM సత్య నారాయణ శర్మ (noreply@blogger.com) - ఆలోచనా తరంగాలు
Snkr garu,<br /><br />A small advice to you. Don&#39;t play jokes with planets by your satirical comments. You will face very bad consequences in life.Then you will repent. I am advising from experience. To listen or not to listen is your choice.
2010-09-08 01:13 PM నేస్తం (noreply@blogger.com) - జాజిపూలు
శ్రినివాస్ gaaru పొరపాటు కాదు,అలవాటు కాదు ..అంత పెద్ద పెద్ద పోస్ట్లను రాస్తానా ...అప్పటికి కళ్ళు నెప్పి,బేక్ పెయిన్ వచ్చేసి ఇక తప్పులు సరిదిద్దను...తరువాత బద్దకం ... <br />ఆ ఫోటో కాపీ చేసానా? గుర్తు లేదండి..అంత మంచి ఫొటో నాకు అందుబాటులో పెట్టినందుకు బోలెడు థేంక్యూలు..
2010-09-08 12:34 PM snkr (noreply@blogger.com) - ఆలోచనా తరంగాలు
/Mars is moved to Tula Rasi (Along with Venus) /<br />Fire joined water means Valcono erruption in Seas resulting in Tsunamis.<br />/Sun enters into Kanya Rasi stay one month with Saturn /<br />Fatherly Fire planet with Saturn(misery, air). Bad days for good fathers and fire accidents caused by winds.<br /><br />- My guess. I just started reading astrology, not an expert.
2010-09-08 12:13 PM gajula (noreply@blogger.com) - టపాకాయ
WELL SAID
2010-09-08 11:44 AM srinivas (noreply@blogger.com) - మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!
hats off nagaraju sir mana village ni naku kottha angle lo chuyincharu
2010-09-08 10:35 AM సావిరహే (noreply@blogger.com) - జాజిపూలు
ha ha ha .....!<br />chchandi babu ....navvaleka....mee post ki <br /><br />:)))
2010-09-08 10:12 AM పరిమళం (noreply@blogger.com) - కృష్ణ గీతం...
ఇదో అద్భుతం .........మాటల్లేవంతే....దాదాపు టపా చదివిన పావుగంటకు కామెంట్ రాస్తున్నా ...భావన గారు , మీబ్లాగ్ కృష్ణ గీతం ఐతే ...మీరు కృష్ణ మానస !!
2010-09-08 09:34 AM బద్రి (noreply@blogger.com) - బెండు అప్పారావు (M.R.P)
Btw, thanks for the post. మీరు మరోకోణం చూపించారు.
2010-09-08 09:30 AM బద్రి (noreply@blogger.com) - బెండు అప్పారావు (M.R.P)
నేను పై చదువులకు ఆర్ధిక సహాయాన్ని అందించడాన్ని సమర్ధిస్తాను. <br /><br />అలా సహాయం పందిన వాళ్ళు స్థిరపడిన తరువాత సహజంగా,<br />1. ఒకస్థాయికి రావడం వల్ల వాళ్ళ కుటుంబం/వారసుల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి <br />2. వాళ్ళు ఆ రకంగా అడిగారంటే వాళ్ళ బంధువుల, స్నేహితుల పరిస్థితులు కూడా అలానే వుంటాయి. వీరు బాగుపడిన తరువాత వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎంతో కొంత కృషి చేస్తారు లేదంటే ఎట్ లీస్ట్ వాళ్ళ చూట్టూ
2010-09-08 06:56 AM శివరంజని (noreply@blogger.com) - శివరంజని
భాస్కర రామిరెడ్డి గారు మీ విషెస్ కి నా హృదయపూర్వక ధన్య వాధములు
2010-09-08 05:07 AM Priya (noreply@blogger.com) - వరూధిని
Ante ippudu meeru chiranjeevi ni mayam cheseyyali antara... Nenu hurttttuuuu
2010-09-08 05:02 AM Priya (noreply@blogger.com) - వరూధిని
Baagundhi Jilebigaru....ee mata rasthunte naaku jilebi gurthu vachi mouthwateringuuu. Enti meeru undedhi singapore aa..?? Blog list antha singapore scenaries mayam. Inni photos petti Sentosa ni miss chesare papam. Vivocity dhaka vacharu..ala bayatanunde vellipoyaru?? Mee Flyer photo matram baaga vachindhi.
2010-09-08 04:16 AM శ్రీనివాస్ పప్పు (noreply@blogger.com) - జాజిపూలు
బాగున్నాయి నేస్తం గారూ మీ ప్రేమ కబుర్లు,అదే సారీ కాలేజీలో మీ ప్రేమ కబుర్లు,అయ్యయ్యో మళ్ళీ నాలిక మడతబడింది అదే మీ కాలేజీ ప్రేమ కబుర్లు మళ్ళీ అప్పుతచ్చయ్యింది అదేలెండి మీ కాలేజీలో ప్రేమ కబుర్లు.హమ్మయ్య ఇప్పటికి కరష్టుగా చెప్పినట్టున్నా కదా.<br /><br />అవునూ అన్నిటికీ మేకులు దిగ్గొట్టి(కుటుంభం)రాస్తున్నారు అలవాటా పొరపాటా.అలవాటయితే మార్చుకోండి ,పొరపాటయితే దిద్దుకోండి.తప్పులెన్నుతున్నానని అనుకోవద్దు
2010-09-08 12:34 AM శివ (noreply@blogger.com) - సాహిత్య అభిమాని
వంశీగారూ. ఇలా అందరూ సేకరించి దశాబ్దాలపాటు తమ దగ్గర భధ్రపరచిన రికార్డింగులు రాబొయ్యే తరాల వారికి అందించటాని ఒక చక్కటి వేదికను ఏర్పరిచారు. ధన్యవాదాలు.
2010-09-08 12:30 AM శివ (noreply@blogger.com) - సాహిత్య అభిమాని
హరేఫలగారూ ధన్యవాదాలు. ఆ వెబ్సైటులో ఒక్క గణపతి చింతామణి తప్ప మిగిలినవి నేను ఇచ్చినవే. చింతామణి నాటిక రేడియో నాటిక కాదు. <br /><br />చింతామణి నాటిక మినహాయించి, మిగిలినవన్ని మాగంటి.ఆర్గ్ లో ఉన్నాయి.
2010-09-08 12:28 AM కోడీహళ్ళి మురళీ మోహన్ (noreply@blogger.com) - తురుపుముక్క
జ్యోతిగారూ, సూర్యలక్ష్మిగారూ అభినందనలు. సూర్యలక్ష్మిగారూ అడ్డము 1, నిలువు 4,6 తప్ప మిగితావి అన్నీ కరెక్టేనండి. నిలువు 5.కొద్దిగా సరిచేయాలి.
2010-09-07
2010-09-07 07:40 PM MALLI (noreply@blogger.com) - మారుతీయం
గొల్లపూడి గారికి నమస్సుమాంజలి.<br /> నేను ప్రతి సోమవారం ఉదయాన్నే చేసే పనులలో మీరు బ్లాగ్ లో వ్రాసిన వ్యాసం చదవటం ముఖ్యమైనది. మీరు వ్రాసిన &quot;సహజీవనం&quot; వ్యాసం చదివాక, న్యాయం కోసం ఎన్నో ఏళ్ళు పోరాడి, నిరీక్షించి చివరకు గెలిచిన వీరాస్వామి లాంటి వారినుంచి ఎంతో నేర్చుకోవాలని అనిపిస్తుంది. మీకు సేవ చేస్తాను అని బాస చేయటం ఒక భీషణ ప్రతిజ్ఞలాంటిది. అలా బాస చేసిన రాజకీయ
2010-09-07 07:12 PM భమిడిపాటి సూర్యలక్ష్మి (noreply@blogger.com) - తురుపుముక్క
అడ్డము:<br /> 1)మానవహక్కురా,3)కారడవి,5)పరశురామప్రీతి,7)శ్రీణివా,9)రామేశ్వరము,10)నవమల్లిక,11)ఖంకరం,14)నేనుప్రేమిస్తున్నాను,15)భద్రకాళి,16)ట్టుచెనసెరిది.<br />నిలువు:<br /> 1)మార్గదర్శి,2)రాగరాగిణి,4)వితంతు...,5)పరమేశ్వరునినే,6)......7)శ్రీముఖం,8)వానరం,9)రాణిరత్నప్రభ,12)కడిమిచెట్టు,13)మహానది.
2010-09-07 06:16 PM చెప్పు దెబ్బలు-పూలదండలు (noreply@blogger.com) - టపాకాయ
Exactly.
2010-09-07 03:23 PM జ్యోతి (noreply@blogger.com) - తురుపుముక్క
ఈ పజిల్ చూడగానే నాకు తెలిసిన సమాధానాలు ఇవి. మిగతావి తర్వాత..<br /><br />అడ్డం<br />3 - కారడవి<br />7 - శ్రీ ణి వా<br />10 - నవమల్లిక<br /><br />నిలువు<br />8 - వానరం<br />12 - కడిమిచెట్టు
2010-09-07 04:34 AM 3g (noreply@blogger.com) - గల గలా గోదారి
@హరే: అవునండి అంత చిన్న వయసులో అలాంటి action చెయ్యటం నిజంగా గ్రేట్. కాని శ్యామలనే వన్ మూవీ వండర్ గా మిగిలిపోవడం కొంచెం బాదపడే విషయం.<br /><br />@కవిత: thank u
2010-09-07 02:00 AM భాస్కర రామి రెడ్డి (noreply@blogger.com) - శివరంజని
శివరంజని గారికి బ్లాగు పుట్టినరోజు స్వీట్ విషెశ్. కూసింత లేటుగా ;)
2010-09-06
2010-09-06 07:19 PM gajula (noreply@blogger.com) - టపాకాయ
maa bhaagaa cheppavu subbalaxmi.
2010-09-06 01:18 PM కొత్త పాళీ (noreply@blogger.com) - వరూధిని
brilliant
2010-09-06 11:09 AM కవిత (noreply@blogger.com) - గల గలా గోదారి
మీ విశ్లేషణ బావుంది...
2010-09-06 10:22 AM శివరంజని (noreply@blogger.com) - శివరంజని
@అపర్ణ: మంచు గారి కళ్ళలోంచి ఇన్ని నదులు పుట్టాయా ? కొంపదీసి ఆయనేమి శ్రీ మహా విష్ణువు కాదు కదా... అంటే గంగ విష్ణువు వేలి నుండి పుట్టిందంటారు కదా అందుకే అడిగా
2010-09-06 03:37 AM చక్రవర్తి (noreply@blogger.com) - అస్థికలు
ఏదైనా సాధించడానికి ముందుగా ధైర్యం ఉండాలి అలాగే సాహసం చెయ్యడానికి సావాసం కావాలి. ఇలా ఒకరికొకరు తోడుగా ఇంత పెద్ద యాత్ర చేసిన వీరిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను. <br />బ్రావో.. తుషార్ మరియు పూజ .. చాలా పెద్ద సాహసం చేసారు, మీ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నాను.
2010-09-05
2010-09-05 03:31 PM వేణూ శ్రీకాంత్ (noreply@blogger.com) - కృష్ణ గీతం...
భావన గారు, మీరు ఈ టపా ప్రచురించిన రోజే ఏకబిగిని చదివేసి కేవలం ’బాగుంది’ అనే ఒక చిన్న మాటతో నా భావాన్ని వ్యక్త పరచడం ఇష్టంలేక, ఇంకెలా తెలపాలో తెలియక అయోమయంలో తదాత్మ్యతలో తరించి పోతూ వ్యాఖ్య రాయడానికి మళ్ళీ వద్దాం అని వెళ్ళి పోయి... ఆ వంకతో మళ్ళీ వచ్చి మరోసారి చదివి... గత నాలుగు రోజులుగా ఇదే జరుగుతుంది, ఇక లాభం లేదని ఇంతకన్నా చెప్పటం నాకు రాదని ఈ రోజు ఈ మాట చెప్తున్నాను &quot;మీకు మీరే సాటి&quot;
2010-09-05 03:21 PM కొత్త పాళీ (noreply@blogger.com) - లోలకం
చాలా బావుంది మాస్టారూ
2010-09-05 07:31 AM sravanah (noreply@blogger.com) - మారుతీయం
ఇంకా కొద్దిపాటి పచ్చదనం వున్నది అన్న విషయం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
2010-09-05 06:55 AM భావన (noreply@blogger.com) - కృష్ణ గీతం...
@సావిరహే గారు: ధన్యవాదాలండీ.<br /><br />@రాధిక: నెనర్లు.:-)<br /><br />@కృష్ణ: భావములో, బాహ్యము లో ప్రతి క్షణం లో గోవిందుని తలచుకోవటమే గా అత్యుత్తమ పూజ క్తి మరి. నచ్చినందుకు ధన్యవాదాలు.<br /><br />@భా.రా.రె: నా ఆశ కూడా అదే. ధన్యవాదాలు.<br /><br />@మురళి: నెనర్లు.. :-)
2010-09-05 01:27 AM Krishnapriya (noreply@blogger.com) - మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!
Nice.. మా ఇంట్లో కూడా తియ్యటి సీతాఫలాలు కాసాయి. మొక్క కనీసం 4 అడుగులైనా కాకుండానే ! ఆశ్చర్యం వేసింది. హైబ్రిద్ కూడా కాకపోవచ్చు. తిన్నాక ఊసేసిన గింజల తో
2010-09-04
2010-09-04 11:05 AM Sirisha (noreply@blogger.com) - అస్థికలు
very impressive blog...manchi info pettaru
2010-09-04 09:54 AM Sirisha (noreply@blogger.com) - అస్థికలు
wow nice info.. i like this type of places...thanks for sharing
2010-09-03
2010-09-03 09:51 AM పరిమళం (noreply@blogger.com) - Padmarpita....
ఊహలకే రెక్కలోస్తుంటే ...కాదేదీ అసాధ్యం :)
2010-09-03 07:17 AM oremuna (noreply@blogger.com) - లోలకం
Nice Post. There was a similar story in Bhagavatam to show Lord Brahma, how Krishna is supreme God :-)
2010-09-03 05:41 AM రావు వేమూరి (noreply@blogger.com) - లోలకం
రాకేశ్వర:<br /><br />సృష్తి జరిగి 13.7 బిలియను సంవత్సరాలు అయిందని ఆధునిక అంచనాలు. ఇది కేవలం అంచనా మాత్రమే. అయిదేళ్ల క్రితం వరకు ఈ అంచనా 17 బిలియను సంవత్సరాలు దగ్గర ఉండేది. ఈ మధ్య ఈ అంచనా 10 బిలియనుల సంవత్సరాలని ఎవరైనా అన్నారేమో. ఆ విషయం నాకు తెలియదు.<br /><br />పోతే కాలగమన వేగం (how fast time is moving) మీద కూడ చాల తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బలమైన గురుత్వాకర్షక క్షేత్రాల్లో కాల గమనం జోరు
2010-09-02
2010-09-02 04:50 PM 'Padmarpita' (noreply@blogger.com) - Padmarpita....
భాస్కర రామిరెడ్డిగారు కసితో కూడా కవిత్వంతో కమెంటిడి కవ్వించగలరన్నమాట:):)
2010-09-02 04:49 PM 'Padmarpita' (noreply@blogger.com) - Padmarpita....
రమేష్ గారు,సృజనగారు,శివరంజనిగారు, మురళిగారు,సత్యగారికి ధన్యవాదాలండి!
2010-09-02 01:54 PM raki (noreply@blogger.com) - Stamps of Andhra
ఇలాగైనా అందరు గుర్తు పెట్టుకుంటారు
2010-09-02 10:03 AM Lakshmi Raghava (noreply@blogger.com) - డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ
మా శ్రివారు భానుమతిగారిని ఎంతొ అభిమానిస్త్తారు. ఆయన జీవితంలో ఒక సారి ఆవిద తనతొ మాట్లడిన సంఘటన ఆధారంగా నేను రాసిన ఒక చిన్న కథలాటిది వుంది అది నా బ్లాగులో రాసుకొవాలనుకున్నను ..ఈరొజు ఈ బ్లాగు చూసాక మీకు పంపుదామనిపించింది. పంపమంటారా
2010-09-02 08:12 AM ramaneeyam (noreply@blogger.com) - డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ
Bhanumati wasgood inher earlierroles butoveracting later.But she was a great singer,esp.Ilike her javalis.Though she was atop star,she didnothesitate but acqitted herself very well as a vampin some pictures. Ramaneeyam.
2010-09-01
2010-09-01 06:09 AM Zilebi (noreply@blogger.com) - మారుతీయం
మీ వందవ టపా బూతు క్రీడ మీద - 99 వ టపా &quot;బూటు&quot; క్రీడల మీద - మొత్తం మీద వంద వారాల పాటు ప్రజా రంజకంగా కొనసాగిస్తున్న మీకు ఇదే మా శుభాకాంక్షలు! <br /><br />చాలా కాలం క్రితం వసుంధర గారి కథ ఒకటి చదివాను. స్థూలం గా - ఓ నగరం లో సానివాడలని నగరం మధ్య లొ నించి నగరం వెలుపలకి మారిస్తే ఆ నగరం ఆనవాలు మారి పోయి - ఆ నూతన సానివాడ నగర సెంటెర్ కావడం ఆ కథలోని ప్రధాన అంశం! అట్లాంటి బాధల నించి డిల్లీ వారిని
2010-08-31
2010-08-31 05:39 AM AvanthiRao (noreply@blogger.com) - మోహనామురళి
U knw one thing nenu ippatiki Aug 15 roju white dress vesukuntanu, edo oka road centre lo flag hoisting jarugutadi kada akkadiki veltanu choclates kosam(nijamgaaa), dh adugutaru enti chinna pillalagaa ani kani naku ala cheyyadam nachutundi :)
2010-08-31 05:31 AM Poodoori Raji Reddy (noreply@blogger.com) - fukuoka farm
@ కొత్తపాళీ:<br />మీ ప్రశ్నకు జవాబు ఏం రాయాలో తెలియక ఇంత ఆలస్యం.<br />రెండు రకాలుగా రాశాను, డబ్బులకోసం, త్రుప్తి కోసం అని ఆయన చెబుతున్నారు. <br />రెండో రకంలోకి వచ్చేవి పాఠకులకు ఉపయోగపడతాయన్న భావన ఆయనకు ఉంది. ఎంతోమంది నావల్ల ప్రభావితం అయ్యారు- అన్న డాంబికపు ఫీలింగ్ అయితే నాకు కనబడలేదు. కానీ తను రాస్తున్నదే కరెక్టు, జీవితానికి ఇలాంటి రచనలే కదా డైరెక్షన్ ఇవ్వగలిగేవి అనే ధోరణి మాత్రం ఉంది. అది
2010-08-31 03:10 AM ఆకాశరామన్న (noreply@blogger.com) - ఆకాశరామన్న
ఆ. సౌమ్య <br /><br />థాంక్ యూ... And sorry for very late reply. కొంచెం పని ఒత్తిడి కారణంగా బ్లాగును రెగ్యులర్‌గా చూడడం లేదు.
2010-08-30
2010-08-30 05:26 PM powerstar - Esbrahmachari's Blog కి వ్యాఖ్యలు

అప్పుడు అధికారంలొ వున్న పార్టికి (Congress) ఎన్నికలు గెలవడానికి కావలసిన ఫండ్స్ కి కొదవ వుండదు.

2010-08-28
2010-08-28 05:47 PM చెప్పు దెబ్బలు-పూలదండలు (noreply@blogger.com) - రాణీ రత్నప్రభ రిమార్కులు
పిచ్చి నాయాళ్ళు.
2010-08-28 04:03 PM Anonymous (noreply@blogger.com) - నరేష్ కార్టూన్స్
మనం నాయకులను ఎన్నుకోలేదు. పాలేర్లను ఎన్నుకొన్నాం.
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish