2010-09-08
Padmarpita....: స్వీట్స్ ప్రపోసల్
అస్థికలు: ఓం వినాయక విగ్రహాయనమః
Stamps of Andhra: Special cover on Singareni Express Train
పుస్తకం: బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి వార్షిక పుస్తక ప్రదర్శన – ఆహ్వానం
సెప్టెంబర్ 8-12 మధ్య బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి ఆధ్వర్యంలో జరిగే పుస్తక ప్రదర్శన, మరియు సాహితీ సభలకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది.
15వ పుస్తక ప్రదర్శన గురించిన వివరాలు:
స్థలం: Kanaka Hall, Karnataka Pradesha Kurubara Sangha, Near Maha Bodhi Society, Gandhinagar, Bangalore – 09
సమయం: ఆ నాలుగు రోజులు ఉదయం 10 నుండి రాత్రి ఎనిమిది దాకా
సాహిత్య అకాడెమీ వారు 24 భాషల్లో వేసిన వివిధ పుస్తకాల పై ఇరవై నుంచి డెబ్భై ఐదు శాతం వరకూ తగ్గింపు ఉంటుంది.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
(వివరాలు తెలిపినందుకు నిడదవోలు మాలతి గారికి ధన్యవాదాలు.)
నరేష్ కార్టూన్స్: Check out my photos on Shtyle.fm
మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!: Flash... Flash... కుండపోత వర్షం కారణంగా తెగిపోయిన మొగిలిపేట్ చెరువు కట్ట - ప్రమాదం లో లోతట్టు గ్రామాలు .
లోలకం: 1. లెక్కకు అందని కాలమానం - అనుబంధం
2010-09-07
తురుపుముక్క: క్రాస్వర్డు పజిలు సాల్వుము - 27
పుస్తకం: గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు – ముగింపు సమావేశం
ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవ కమిటీ వారు జులై 31 నుండి వివిధ ప్రాంతాల్లో ’త్రిపురనేని గోపీచంద్ శతాబ్ధి మహాసభలు’ జరపబోయేముందు పుస్తకం.నెట్ లో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. (అప్పటి ప్రకటన ఇక్కడ.)
గోపీచంద్ ఉత్సవ కమిటీ వారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారూ కలిసి గోపీచంద్ శతజయంతి ఉత్సవాల ఆఖరు సమావేశాన్ని రేపు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు.
వివరాలతో కూడిన పీడీయెఫ్ ఇక్కడ
(వివరాలు అందించిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు).
సాహిత్య అభిమాని: రేడియో అభిమానులకు శుభవార్త
టపాకాయ: ఏ క్రీడలు చూసినా, ఏమున్నది.....
వరూధిని: స్టార్ బక్స్ & 'బక్స్'వంతుడు - బ్రాండ్ లోకం
2010-09-06
అస్థికలు: లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం మీకు చూపిస్తా రండి (part 2)
మాది మొగిలిపేట... మా ఊరే... మా ప్రపంచం...!: మొగిలిపేట దొంగల మోరి వద్ద పచ్చదనం తో నిండిన చిట్టడవి - టేకు వనం ( వీడియో )
గల గలా గోదారి: ది సిక్స్త్ సెన్స్ – చూసిందల్లా నమ్మకూడదని మీకెప్పుడైనా అనిపించిందా?
టపాకాయ: ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదు!
పుస్తకం: పరిశోధనా తృష్ణ – బంగోరె
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ - అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి చంద్రిక కథ, తెలుగులో జర్నలిజం, తొలకరిజల్లులు, బ్రౌన్ లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, మాలపల్లిపై నిషేధాలు, వేమన పద్యాల్లో ప్రక్షిప్తాలు, సి ఆర్ రెడ్డి రచనలు – ఎన్నింటినో ఆయన తవ్వి తీశారు. ఆ పత్రిక సంపాదకత్వం అస్థిరమైన తన నలభై ఐదేళ్ళ జీవితంలో బంగోరె చేసిన అసంఖ్యాకమైన ఉద్యోగాల్లో ఒకటి. ఎప్పుడూ కుదురుగా ఒకచోట ఉద్యోగం కూడా చేయని, విరామం లేని ఆయన జీవితంలో ఒక ఏకత్వం లేకుండా పోలేదు. అదే ఆయన పరిశోధనాతృష్ణ. తెలుగుదేశంలో పరిశోధన ప్రస్తుతం నిలిచిపోయింది. ఈ శతాబ్ది మొదటిభాగంలో ప్రతి విషయంలోనూ మౌలికమైన పరిశోధనను, మొదటితరం అగ్రగణ్యులను వదిలేస్తే సుమారు అన్నిరంగాల్లో ప్రస్తుత పరిశోధన ఈస్థితికి చేరువౌతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు అయ్యాయి. అకాడమీలు, భాషాసమితులు ఏర్పడ్డాయి. భారతీయ,సామాజిక,శాస్త్ర పరిశోధనా మండలి, భారతీయ చరిత్ర పరిశోధనామండలి, కోర్టు ఫౌండేషన్, రీసర్చ్ గ్రాంట్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనల ఆదరణ పెరిగి, పరిశోధన పేరుతో కోట్ల రూపాయలు నీళ్ళలా పరిగెడుతున్నాయి. ఈవ్యవహారాలు వ్యవహరించేందుకు పెద్ద పాలనా యంత్రాంగం రాక్షసిలా పెరిగి పరిశోధనలపై నిర్ణయాత్మక అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ యంత్రాంగంలో ఉన్న అధికారులతో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు చేయగలశక్తి ఉండటమే ఈరోజు పరిశోధకుడికి ఉండవలసిన ప్రాథమిక అర్హత. బంగోరెకు ఈ పరిశోధనావృత్తి చట్రంలో ఇమడగల సమర్థత లేకుండానే మరోవైపు ఆ ప్రాజెక్టులలో పని చేస్తూ ఒక పాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మార్చబడుతూ వచ్చిన విరామం ఎరుగని పరిశోధకుడు. పరిశోధన ఒక తీరని దాహంగా ఆయన పడిన శ్రమే విద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనపై ఆయనకు అసహనాన్ని కలుగజేసింది. చరిత్రకారులకు పనికివచ్చే ముడిసరుకును ఆయన ఒక్కడే తవ్వితీసి అందరికీ పంచి ఇచ్చాడు. ఆ మహానుభావుడే -బంగోరె!
2010-09-05
అస్థికలు: లండన్ నుంచి డిల్లి వరకు బై రోడ్ ప్రయాణం మీకు చూపిస్తా రండి
వరూధిని: కృష్ణా - 'బాగా' నే 'బారో'
తురుపుముక్క: దేవరాజు మహారాజుగారి కథ!
తురుపుముక్క: గురుభ్యోన్నమః
పుస్తకం: నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
రాసిన వారు: పీవీయస్
*************
మల్లాది వె౦కట కృష్ణమూర్తి – అక్షరాలతో హడలెత్తి౦చిన జూలాజికల్ ఫా౦టాసీ….. నత్తలొస్తున్నాయ్! జాగ్రత్త!
ఆఫ్రికా ఖ౦డ౦లోని కెన్యా దేశ౦లో దొరికే రాక్షస నత్తలు hermaphrodites. అ౦టే, తెలుగులో ముచ్చటగా ఒక్క మాటలో చెప్పాల౦టే అర్థనారీశ్వర జీవులు. స్త్రీ, పురుష జననా౦గా లు రె౦డూ ఒకే జీవిలో ఉ౦టాయన్నమాట. కాబట్టి ఈ అర్థనారీశ్వరులు స౦తానోత్పత్తి కోస౦ మరో జీవి దగ్గరకు వెళ్ళి, పిల్లిమొగ్గలు వేస్తూ ఎలా౦టి డ్యూయెట్లు పాడనవసర౦ లేదన్న మాటే కదా!
కెన్యాదేశ౦లో భారత రాయబారిగా పనిచేసిన ఉత్తమ్ సి౦గ్ కి అక్కడ అ౦దరూ బాగా ఇష్ట౦గా తినే రాక్షసనత్తమా౦స౦ తినట౦ అలవాటవుతు౦ది. పదవీ కాల౦ ముగిశాక, ఆ దేశ౦ ను౦చి మనదేశానికి వస్తూ, కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి ఒకే ఒక్క రాక్షసనత్తని తనతో తెచ్చుకు౦టాడు అతగాడు. ఆ నత్త భారతదేశానికి అతనితోపాటు చేరుకున్నాక అనుకున్నట్లే 3౦౦ గుడ్లు పెడుతుంది. అందులో తన ఆహారానికి అవసరమైనన్ని గుడ్లు మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తాడు ఉత్తమ్. ఎ౦దుక౦టే, రాక్షసనత్త గుడ్డు ఒక్క రోజులోనే పిల్ల కాగలదు. ఇలా పిల్ల ఐన ఒక్కొక్క నత్తా తిరిగి వార౦ రోజులలోనే దేనికది స్వత౦త్ర౦గా స౦తాన ఉత్పాదక శక్తిని పొ౦ది స్వ౦త ఫ్యాక్టరీని ప్ర్రార౦భి౦చేస్తాయి. కనుక ఉత్తమ్ రాక్షసనత్త జనాభా అధిక౦ కాకు౦డా తన జాగ్రత్త తను పడుతూ ఉ౦టాడు. కానీ, కథావశాత్తూ, ఒకసారి ఉత్తమ్ ఢిల్లీ నుంచి మదరాసుకి రైల్లో ప్రయాణం చేస్తుండగా ఖాజిపేట దగ్గర ప్రమాదం జరిగి సింగ్ తోపాటు అతని సూటుకేసులో ప్రయాణిస్తున్న రాక్షసనత్తలు బంధవిముక్తులై వివిధ మార్గాల ద్వారా నెమ్మదిగా హైదరాబాదుకి చేరుకుంటాయి. అసలు వినాశనం ఇక మొదలవుతుంది.
పుట్టిన ప్రతి నత్తా వారం రోజులలో సంతాన సాఫల్యతా శక్తి సంపాదించుకుని తడవకి 300 గుడ్లు పెడుతుంది. మళ్ళీ ఈ 300 గుడ్లు ఒక్క రోజులో నత్తలై వారం తిరిగేసరికల్లా (300X300) 90000 నత్తలకి ప్రాణమివ్వగలవు. అలావాటి జనాభా అనతి కాలంలోనే చైనా జనాభాని సైతం అధిగమించి పోతుంది. మన నాయకులకి మల్లేనే ఈ నత్తలకీ ఆకలి అధికం. అది తీరనిది. వజ్రాలని కొరకలేవు తప్ప, పచ్చగడ్డి నుంచి పసిడి నగలదాకా అవి వేటినైనా స్వాహా చేసేయగలవు. పసిపిల్లలని సైతం వదిలి పెట్టకుండా కొబ్బరి ముక్కల్లా కొరికి చప్పరించేస్తాయి. ఈ జరుగుతున్న మారణహోమానికి దేశం దేశమే కంపించిపోతుంది. పరాయి దేశాలలోనూ ప్రకంపనలు మొదలవుతాయి. ఆ దేశాలు మన దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసేసుకుంటాయి. లేకపోతే మనవాడు కోరితెచ్చుకున్ననత్తలు అక్కడ కూడా కొరివి పెడతాయిగా మరి! ఎయిర్ ఇండియా సంస్థ మూల పడుతుంది. ఈ నత్తలు విధ్వంసక సామ్రాట్టులవటంతో భీమా సంస్థలన్నీ దివాళా తీస్తాయి.
ఈ విలయతా౦డవానికి అ౦త౦ లేదా? పరిష్కరి౦చట౦ ఎలా? అని తలలు బద్దలు కొట్టుకోటానికి పెద్దలు అ౦దరూ ఓచోట చేరినపుడు, పరిశోధక పత్రికా రచయిత (investigative journalist) రఘుపతికి బల్బు వెలుగుతు౦ది. రాక్షసనత్తలకి జన్మస్థలమైన కెన్యా దేశ౦లో వీటివల్ల కి౦చిత్తైనా బెడద లేదు. ఒకేఒక్క నత్త వల్ల దాని విధ్వ౦సకర స౦తతి కేవల౦ నెల, నెలా పదిహేను రోజులలో ఒక బిలియన్ లేదా వంద కోట్ల స్థాయికి చేరుకుంటే, ఆ దేశం ప్రపంచ పటం నుండి ఎప్పుడో మాయమైపోయి ఉండేది. సృష్టిలో ఉన్న విచిత్రమైన విశిష్టత ఏమిటంటే ప్రతి అనర్థానికి ఒక సహజమైన విరుగుడు ఉంది. పాములు విపరీతంగా పెరగకుండా గద్దలు, ముంగీసలు ఉన్నాయి. అలాగే రాక్షసనత్తలకి విరుగుడు ఉండే ఉంటుంది. అది ఆ దేశానికి వెళితే కానీ తెలియదు. ఇలాంటి సహేతుకమైన ఆలోచనలతో కెన్యాదేశానికి బయలుదేరతారు రఘుపతి, జూవాలాజికల్ ప్రొఫెసర్ పాంచజన్య. పశ్చాత్తాప ధగ్ధ హృదయుడై, పాప ప్రక్షాళన కోసం వీరిని వె౦బడిస్తాడు ఉత్తమ్ సి౦గ్. అక్కడ అనేక శ్రమదమాదులు ఎదుర్కొన్నాక, వారికి రాక్షస నత్తలకి శత్రువైన గినాక్సిస్ నత్తలు లభిస్తాయి. వాటిని పదిల౦గా భారతదేశానికి తీసుకువచ్చి రాక్షసనత్తలని స౦హరి౦చి జరుగుతున్న ఘోరాన్ని అదుపులోకి తేగలుగుతారు.
తన ప్రదేశ౦లో లేని, దొరకని జ౦తువునో, జీవినో మనిషి తన సరదా కొసమో లేక అవసరార్థమో మరో ప్రదేశ౦ ను౦చి తెచ్చుకు౦టే కలిగే అనర్థాలని, జరగబోయే ప్రమాదాలని ఆసక్తికర౦గా తెలిపే zoological fantasy ఈ నవల. 1953లో అమెరికాలో రాక్షస నత్తలతోనూ, ఆస్త్రేలియాలో పిచ్చుకలతోనూ, కుందేళ్ళతోనూ నిజంగా ఇలాంటి పరిస్థితులే ఏర్పడటమూ; మానవ ప్రయత్నాలతో సమస్యలు పరిష్కారమై సాధారణ పరిస్థితులు నెలకొనటమూ జరిగిందని కూడా ఈ నవల చెపుతుంది.
ఈ నవల మొదట విజయ మాసపత్రికలో సీరియల్ గానూ, తర్వాత 1982/83 లలో పుస్తక రూపకంగానూ వచ్చింది. నేను 1983 జూలై 20న మొదటిసారి చదివాను. ఈ (Synopsis) సారాంశాన్ని కూడా అప్పుడే రాసుకున్నాను. చదివినవి నచ్చినప్పుడు వాటి గురి౦చి క్లుప్త౦గానో లేక విపుల౦గానో ఒక synopsis రాసి పడేసుకు౦టే ఆ తర్వాత ఆ ఒరిజినల్ గురి౦చి ఇక భయపడాల్సిన దేమీ ఉ౦డదని నా భావన. ఐతే, నచ్చిన అన్ని పుస్తకాలకీ లఘు టీకా టిప్పణీలు రాసుకోవట౦ కూడా సాధ్య౦ కాదు. ముఖ్య౦గా ఈ రాసుకునే అలవాటు ఎక్కువ పుస్తకాలని చదువనీయదు. ఇ౦కా పుచ్చెడు సమస్యలు ఉన్నాయి లాభాలతో పాటు. వాటన్నిటి గురి౦చి విశద౦గా వీలు౦టే మరోసారి….
(మరో మల్లాది నవల ’అందమైన జీవితం’ గత ఏడాది పుస్తకం.నెట్లో రమణి గారు రాసిన వ్యాసం ఇక్కడ చూడండి – పుస్తకం.నెట్]
2010-09-04
మారుతీయం: సహజీవనం
బెండు అప్పారావు (M.R.P): జంప్ జిలానీ ప్రమ్ టీచింగ్ ఇండస్ట్రీ :-)) (టీచర్స్ డే సందర్భంగా ....)
ఆలోచనా తరంగాలు: తొలగిన శుక్రుని కరుణ-2
2010-09-03
మా కశ్చిద్దుఃఖబాగ్భవేత్... Smiles Every Where: Raaga - Yeh Jo Des Hai Tera from Swades Music Videos, Hindi Video Songs.
శివరంజని: నా బ్లాగ్ బర్త్ డే..... కావాలి మీ అందరి స్వీట్ విషెస్
Dr. Acharya Phaneendra: విశాల భాస్వంత చరిత్ర
విశాల భాస్వంత చరిత్ర
రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
( హైదరాబాదులోని ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ యొక్క 110వ వ్యవస్థాపక దినం సందర్భంగా …
2010 సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించబడుతున్న వార్షికోత్సవాలలో …
మొదటి రోజు … ప్రారంభ సమావేశంతోబాటు, డా. నిడమర్తి నిర్మలాదేవి రచించి, సమర్పించిన ’భామినీ భువన విజయం’ సాహిత్య రూపక ప్రదర్శన జరిగింది. ఇందులో డా. నిడమర్తి నిర్మలాదేవితోబాటు డా. వేలూరి రేణుకాదేవి, డా. రాజలలిత, డా. కుసుమకుమారి, శ్రీమతి రమణ కుమారి, శ్రీమతి భారతీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు … ’తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించబడింది. దీనికి సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ’రిజిస్ట్రార్’ ఆచార్య టి. గౌరీశంకర్, ’ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి డా. అబ్బూరి ఛాయాదేవి, ప్రముఖ కవి, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం భాషాసేవ’ అన్న అంశంపై డా. జె. బాపురెడ్డి అధ్యక్షతన ’కవి సమ్మేళనం’ జరిగింది. ఇందులో డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. వి. యల్. యస్. భీమశంకరం, డా. పోతుకూచి సాంబశివరావు, డా. రాపాక ఏకాంబరాచార్య, శ్రీమతి శైలజామిత్ర తదితరులతోబాటు నేనూ పాల్గొన్నాను.
మూడవ రోజు … ముగింపు సమావేశంతోబాటు, St. Patricks High School, సికింద్రాబాదు విద్యార్థులచే ’బాలల భువన విజయం’ నిర్వహించబడుతుంది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ వార్షికోత్సవ సభలకు ’సమావేశ కర్త’ గా వ్యవహరించే భాగ్యం నాకు కలిగింది.
రెండవ రోజు నాటి ’కవి సమ్మేళనం’లో నేను చదివిన కవిత ఇది – )
రాజ ’రావిచెట్టు రంగరాయ’ని కల
సత్యమై నిలిచిన సదన మిద్ది -
’ఉరుదు’ వనిని తెలుగు పరిమళాల్ వెదజల్లు
మొట్ట మొదటి తెలుగు మొక్క ఇద్ది -
మున్ను ’పాల్వంచ’, ’మునగాల’ భూపతులును,
’కొమరరా’,’జాదిరా’జాది కోవిదులును,
’లక్ష్మి నరసమ్మ’ సహృదయ లక్ష్మి చలువ -
వెలసె ’భాషా నిలయ’ మిద్ది’, వెలుగు చూప !
’హైద్రాబాద్’ నడి బొడ్డున
నిద్రాణిత తెలుగు భాష నిగళాల్ తెగియున్,
భద్రత చేకూరుటకై -
ముద్రాంకితమాయె నిద్ది మూర్థన్యమునై !
వనితాభ్యుదయముకై పలు ప్రసంగాలిచ్చి,
’మాడపాటి’యె తెచ్చె మార్పు నిచట -
ఆంధ్రోద్యమాకాంక్ష కక్షతల్ జల్లిరి
’బూర్గుల’, ’సురవరము’ విదు లిచట -
’కదలి రండు ! ’నిజాము’ కథ తేల్చుదా’ మంచు
’కాళోజి’ ఇచ్చోట కంఠమెత్తె -
’నా తెలంగాణ రత్నాల వీణ’ యటంచు
’దాశరథి’ ఇట పద్యాలు పాడె -
ఎరుక గలుగ, గ్రంథాలయ మేరుపడగ -
జరుప సారస్వత సభల సంబరముగ -
పరిఢవిల్లె నాంధ్రోద్యమ గరిమ మిచట -
కరకు రక్కసి పాలకు నిరుకు బెట్ట !
ఇంతయి, ఇంతకింతయి, మరెంతయొ వర్ధిలి, ’హైద్రబాదు’ జ
న్మాంతర బంధమై నిలిచి, ఆంధ్ర జనావళి పాలి దివ్య క
ల్పాంతర వృక్షమౌచు, నజరామర కీర్తి గొనెన్ విశాల భా
స్వంత చరిత్రతో – తెలుగు జాతి సమస్తము గర్వమొందగాన్ !
జరిగెను రజతోత్సవములు -
వరలగ వైభవము స్వర్ణ, వజ్రోత్సవముల్ -
జరిపిరి అమృతోత్సవములు -
జరిగె శతాబ్ద్యుత్సవములు – జనతతు లలరన్ !
’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’, ’చిలకమర్తి’,
’సర్వెపల్లి’, ’మల్లంపల్లి’, ’జాష్వ’, ’అడివి’,
’విశ్వనాథ’, ’కాటూరి’ ప్రభృతులు వచ్చి -
పొంది సత్కారముల, నెంతొ పొంగి రిచట !
పూర్వ గ్రంథాలయోద్యమ పుణ్య చరిత
లో సువర్ణాక్షర లిఖిత శ్లోక మిద్ది -
అరయ, ’శ్రీకృష్ణదేవరా’యాంధ్ర విభుని
స్మృతికి నిలయమై నిలిచిన చిహ్నమిద్ది -
’కే. వీ. రమణ’యు, ’ఎమ్మెల్’
భావిని మరియింత వెలుగ, ’భాషా నిలయం’
బీ విధము తీర్చి దిద్దిరి -
ఈ విధి వర్ధిల్లు గాక ఎన్నొ శతాబ్దుల్ !
—- *** —-
పుస్తకం: మునిపల్లె రాజు – ‘ అస్తిత్వనదం ఆవలి తీరాన’
అతిథి: బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్
******************
మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు.రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ,దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా,అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు.ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో,ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు.ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు,పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత.చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి,ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.
రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు.చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం.ఇందులో మొత్తం పదిహేను కథలు,ఒక మినీ నవల ( ‘పూజారి ‘.ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి.గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది.కథ ఏదైనా,ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని,ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు,బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య,’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి,చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది.మనం కూడా కాసేపు సన్యాసులమై,కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం.నోరున్న మానవులే కాదు,నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి.అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు.మేధస్సుతో ప్రభావితమైనవి.హృదయంతో ప్రభావితమైనవి.ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’
హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.
అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు
నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-
2010-09-02
బెండు అప్పారావు (M.R.P): పై చదువులకు ఆర్థిక సహాయం చేయడం కన్నా.......
TELUGU PATHAM తెలుగు పథం: మంచి మాట
Stamps of Andhra: వై.యస్.రాజశేఖర్ రెడ్డి స్మారక తపాల బిళ్ళ
డా.పద్మశ్రీ భానుమతి రామకృష్ణ: దటీజ్ భానుమతి
సంకీర్తన: నాట్య రీతులు - మణిపురి
టపాకాయ: అమ్మదయా, మజాకానా? - దటీజ్ రేణుకా చౌదరి!
2010-09-01
లోలకం: 1. లెక్కకు అందని కాలమానం
ఆలోచనా తరంగాలు: తొలగిన శుక్రుని కరుణ
కృష్ణ గీతం...: ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతో
2010-08-31
పుస్తకం: మణిదీపాలు
వంద నీతులు చెబితే ఎవరూ వినరు. ఒక్క ఉదాహరణ చూపిస్తే అందఱికీ నమ్మ బుద్ధేస్తుంది. ఈ సత్యాన్ని మన పూర్వీకులు బాగానే ఆకళించుకున్నారు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా లేనంత కథాసాహిత్యం భారతదేశంలో పోగుపడింది. మన ౧౮ పురాణాలూ, ౧౮ ఉపపురాణాలూ, ఇతిహాసాలూ, కథాసరిత్సాగరం, పంచతంత్రం అన్నీ కథామయం. ఇతరుల్ని ఒప్పించడంలో దృష్టాంతానికున్న ప్రాధాన్యాన్ని గమనించినవారు కనుకనే కథనీ, కవిత్వాన్నీ వేఱుచేసి చూడడానికి మన పూర్వీకులు అంగీకరించలేదు. వారు కథల్ని ఆలంబనగా చేసుకొని వాటి చుట్టూ రసమయ కావ్యాల్ని అల్లారు. ముఖ్యంగా పిల్లలకు కథలే మెదడుకు మేత. కథాశ్రవణం బాల్యానికి అద్దిన ఆజీవన పరిమళం. అలాగే అవంటే చెవి కోసుకునే పెద్దలకూ కొదవలేదు. “నాకో కథ చెప్పవూ ?” అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాల మౌనఘోష.
పిల్లల్ని క్షణికంగా వినోదింపజేయడమే కాక వారి భావినైతిక జీవనాన్ని సైతం తీర్చిదిద్దాలంటే కల్పిత కథలు చెప్పి లాభం లేదు. ఒక వయసొచ్చాక కల్పిత కథల పట్ల గుఱి పోతుంది. అ దశలో ఆ నీతులకు ఉదాహరణభూతులై నిలబడిన పెద్దల గుఱించిన వాస్తవ ఘటనలు కావాలి. “మణిదీపాలు” అనే సంకలనగ్రంథం ద్వారా శ్రీ రెడ్డి రాఘవయ్యగారు సాధించిన ప్రయోజనం ఇదే. “బాలసాహిత్యం – పిల్లల కోసం పెద్దల కథలు” అనే ప్రచురణాపరంపరలో భాగంగా శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్సు (హైదరాబాదు) వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ’మణిదీపాల వెలుగులు’ అనే పేరుతో దీనికి ముందుమాట వ్రాసిన ఏడిద కామేశ్వరరావుగారు ఇలా అన్నారు : “…శ్రవణకుమారుడు, ప్రహ్లాదుల కథలు విని…మోహన్దాసు కరమ్చంద్ గాంధి మహాత్ముడైనాడు. పోతన భక్తిమార్గ జీవితగాథను తెరపై చూచి పరవశుడైన కొత్తలంక పశువుల కాపరి సుబ్బారావు ముమ్మిడివరం బాలయోగి అయినాడు. మహనీయుల జీవితాలు మణిదీపాలు. ఆ దీపాల కాంతులు ప్రసరించితే చీకటిగుహలు కూడా వెలుగువెన్నెలలతో శోభిస్తాయి…”
ఈ గ్రంథంలో రచయిత ౫౬ మంది మహనీయుల జీవితాల నుంచి తలా ఒక చిరస్మరణీయమైన సంఘటనని రెండు పుటలకు మించకుండా బాలపాఠకులకు పరిచయం చేశారు. పిల్లలు చిత్రప్రియులు కనుక ప్రతి కథకూ ఒక నలుపు-తెలుపు రేఖాచిత్రంతో నిండుదనాన్ని సంతరించారు. ఈ మహనీయులు వివిధ కాలాలకూ, వివిధ మతాలకూ, వివిధ రాష్ట్రాలకూ చెందినవారు :
౧. బుద్ధభగవానుడు ౨. ఆనందుడు ౩. వర్ధమాన మహావీరుడు ౪. వాల్మీకి ౫. ఆచార్య నాగార్జునుడు ౬. తిరువళ్ళువర్ ౭. శంకరాచార్యులు ౮. తులసీదాసు ౯. మాణిక్యవాచకర్ ౧౦. జయదేవుడు ౧౧. నరసింహ మెహతా ౧౨. గురునానక్ ౧౩. అమరదాస్జీ ౧౪. అర్జునదేవ్ ౧౫. అవ్వైయార్ ౧౬. శంకరదేవుడు ౧౭. రైదాసు ౧౮. అన్నమాచార్యులు ౧౯. జ్ఞానేశ్వర్ ౨౦. మధ్వాచార్యులు ౨౧. బసవేశ్వరుడు ౨౨. బిసోబా ఖేచర్ ౨౩. దాదూ దయాళ్ ౨౪. అక్కమహాదేవి ౨౫. కనకదాసు ౨౬. పుండలీకుడు ౨౭. సూరదాసు ౨౮. కబీరుదాసు ౨౯. భానుదాసు ౩౦. మీరాబాయి ౩౧. చైతన్యప్రభువు ౩౨. చొక్కమేళ ౩౩. రామానుజాచార్యులు ౩౪. నామదేవ్ ౩౫. ధనుర్దాసు ౩౬. పురందరదాసు ౩౭. ఏకనాథుడు ౩౮. పోతనామాత్యుడు ౩౯. సక్కుబాయి ౪౦. సమర్థరామదాసు ౪౧. త్యాగరాజస్వామి ౪౨. తుకారామ్ ౪౩. రాఘవేంద్రస్వామి ౪౪. భక్త రామదాసు ౪౫. మహీపతి ౪౬. ప్రాణనాథుడు ౪౭. సాయిబాబా ౪౮. పవహారిబాబా ౪౯. రమణమహర్షి ౫౦. రామలింగస్వామి ౫౧. రామకృష్ణ పరమహంస ౫౨. త్రైలింగస్వామి ౫౩. వివేకానందస్వామి ౫౪. రామతీర్థస్వామి ౫౫. దయానందసరస్వతి ౫౬. సాధు వాస్వాని.
ఇంతమంది మహనీయుల గుఱించి వ్రాయాలంటే రచయిత రెడ్డి రామయ్యగారు ఎన్ని గ్రంథాల్ని సంప్రదించి ఉంటారో, ఎంత శ్రమపడి ఉంటారో ఎవఱికి వారే ఊహించుకోవచ్చు. “ఒక్కొక్క మహనీయుడి జీవితం నుంచి పిల్లలు ఏమేం నేర్చుకోవచ్చు ? దాన్ని పిల్లలకు ఎలా అందివ్వవచ్చు ?” అని ఆలోచించి ఆ కోణంలో తన రచనని తీర్చిదిద్దుకోవడం మిక్కిలి ప్రశంసనీయం. కానీ పెద్దల నుంచి పిల్లలు నేర్చుకోవాలా ? లేక పిల్లల నుంచే పెద్దలు నేర్చుకోవాలా ? అనే సందేహం నన్ను చాలా కాలం నుంచి పీడిస్తోంది. ఉదాహరణకు ఈ పుస్తకంలో ’కులభేదాలను పట్టించుకోకూడదు’ అనే సందేశంతో తొమ్మిది కథలున్నాయి. వాటిల్లో “కడజాతివాడు, మాలమాదిగలు, నిమ్నకులస్థులు” మొదలైన పదాలు సందర్భవశానే అనుకోండి, తఱచుగా ప్రయోగించబడ్దాయి. పిల్లలకు కులభావన ఏ వయసులో పరిచయమవుతుందనేది ఒక వివాదాస్పద విషయం. బహుశా అది ఆయా కులాల్ని బట్టి ఉంటుంది. ఇటువంటి బాలసాహిత్యం ద్వారా పిల్లలకు “కులమనేది ఒకటుందనీ, అందులో అగ్రనిమ్న భేదాలున్నాయనీ, అగ్రులు నిమ్నుల పట్ల ఉగ్రులవుతూంటారనీ, అలా కాక కడజాతివారి పట్ల సద్భావం ప్రదర్శించడం గొప్ప ఔదార్య”మనీ – ఇలాంటి భావాల్ని నూఱిపోయడం – ఎంత ఆదర్శవాద ధోరణితో నైనా కానివ్వండి, అవసరమేనా ? కులం సెక్సులాంటిది. దాన్ని చిన్నపిల్లలకు పరిచయం చేయడం Child Abuse తో సమానం. ఇటువంటి విభజనాత్మకమైన సామాజిక వాస్తవాల గుఱించి వారు కాస్త పెద్దవారయినాక తెలుసుకుంటేనే బావుంటుంది. వారిలో లేనిదాన్నుంచి దూరంగా ఉండమని వారికి ప్రబోధించడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.
“పిల్లల కోసం పెద్దల కథలు” అన్నారు. బావుంది. పెద్దలంటే ఇక్కడ మహనీయులని ప్రాస్తావికార్థం అనుకోండి. కానీ పిల్లలకు పెద్దల ఆదర్శాల్ని – ఏ పెద్దలూ ఎప్పుడూ, ఎక్కడా ఆచరించడానికి ఇష్టపడని ఆదర్శాల్ని – బోధించడం హిపోక్రిసీ అవ్వదా ? అని కూడా నాకొక మూల మూలుగుతున్న సందేహం. సదరు ఆదర్శాలకి ఆ గతి పట్టడానికి అసలు కారణం – అవి సామాన్యుల లౌకిక జీవితంతో సంబంధం లేని పారలౌకిక, ఆధ్యాత్మిక ఆదర్శాలు కావడమేనని నా అనుమానం. ఎవఱికీ ఆచరణసాధ్యం కానివాటిని పిల్లలకు బోధించడంలో అర్థమేంటి ? ఉదాహరణకి ఈ పుస్తకంలో మమకారరాహిత్యం, ఎవరి పాపపుణ్యాలు వారివే, అహింస, క్షమాగుణం, గానంతో చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం, చనిపోయినప్పుడు ఏదీ వెంట రాదు, గేదె చేత వేదం చదివించడం, విష్ణునామమహిమ, శ్రీకృష్ణుడు తప్ప లోకులంతా స్త్రీలే, ఆత్మసాక్షాత్కారం మొదలైన ఇతివృత్తాలతోను, సందేశాలతోను చాలా కథలున్నాయి. ఇవన్నీ పెద్దలకు మాత్రమే అర్థమయ్యే విషయాలు.అదీగాక ఇవి పిల్లలలో భక్తినే తప్ప నైతికస్థాయిని, ధర్మాచరణనీ, సత్సంస్కారాన్నీ ఏ విధంగా పెంపొందిస్తాయో అర్థం కాలేదు.
మన దేశంలో పిల్లల సాహిత్యమంటూ ఏమీ లేదనడానికి ఇదొక ఉదాహరణ. పెద్దల సాహిత్యమే పిల్లల భాషలో పునస్కథనం (Re-telling) చేయబడుతూ పిల్లల సాహిత్యంగా చెలామణి అవుతున్నది. పెద్దల సమస్యలూ, సంఘర్షణలూ, వారి అంతర్మథనాలూ – ఇవే బాలసాహిత్య సృష్టికి సైతం స్ఫూర్తి అయికూర్చున్నాయి. మన ఆధ్యాత్మిక అభినివేశాల్ని (మొండి పట్టుదలల్ని) పిల్లల మీద ఆ వయసులో అడుగడుగునా రుద్దడం వల్ల అంతగా ప్రయోజనం లేదు. మన భాషలో పిల్లల బాధల్నీ, భయాల్నీ, వారి జీవితాన్నీ, నమ్మకాల్నీ, భావోద్వేగాల్నీ అవసరాల్నీ చిత్రించి ప్రతిబింబించే సాహిత్యం అరుదుగా కంటబడుతుంది. పిల్లల్ని కూర్చోబెట్టి ఇఱవై నాలుగ్గంటలూ నీతులు చెప్పేవారే తప్ప వారిని ఆడించి, నవ్వించి ఆసక్తి కలిగించి వినోదింపజేసేవారెవఱూ లేరు. ఈ పరిస్థితి మారాలి. మారాలంటే మనం పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. మనలోని పిల్లతనాన్ని, అమాయకత్వ పరిమళాన్ని, ఆటల ఆసక్తినీ, హాస్యధోరణిని పెద్దతనంలో కూడా నిలబెట్టుకోవాలి. విషయాల్ని పిల్లల కళ్ళతో చూడాలి.
రచయిత ఈ గ్రంథాన్ని వెంకటేశ్వరస్వామికి అంకితమిచ్చారు.
(మణిదీపాలు : రచన – రెడ్డి రాఘవయ్య ; పుటలు - ౧౨౪ ; వెల – తెలియదు ; ప్రచురణ - శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ హైదరాబాదు ; పంపిణీదారులు - శ్రీ గోపాల్ పబ్లికేషన్స్, 3-3-860, ఆర్యసమాజ్ మందిర్ ఎదురు సందులో, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు 500027)
2010-08-30
పుస్తకం: పుస్తక సమీక్ష – సౌశీల్య ద్రౌపది
రాసిన వారు: ఎమ్బీయస్ ప్రసాద్
(ఈ వ్యాసం మొదట జులై 2010 ’ఈభూమి’ పత్రికలో ప్రచురితమైనది.)
******************
మనకు పురాణాలలో లభించేదంతా అక్షరసత్యాలు కానక్కరలేదు. పురాణం అంటే జనశ్రుతంగా వస్తున్న కథ. మనిషి బతికుండగానే ఎన్నెన్ని అతిశయోక్తులు పుడుతున్నాయో, కళ్ళెదురుగుండా జరిగే సంఘటనకే టీవీ ఛానెల్సు వేర్వేరు తరహాలుగా ఎలా వ్యాఖ్యానాలు చెపుతున్నాయో చూస్తున్నాం. వేల ఏళ్ళ క్రితం గ్రంథస్తం అయిన గాథల్లో కూడా ఇలాటివి చోటు చేసుకోవచ్చని సులభంగా వూహించవచ్చు. అలా గ్రంథస్తం అయినవి ఇన్ని తరాలూ దాటుకుని ఉన్నదున్నట్టుగా దిగుమతి అయ్యాయని అనుకోవడానికి వీలు లేదు. మహాభారతం తన మూలరూపానికి ఆరురెట్లు పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ పులుసులో ఎవరికి కావలసిన దినుసులు వాళ్ళు పడేశారని.
ఇలా తయారైన పులుసును కూడా రకరకాలైన దృష్టికోణాలతో చూశారు మనవాళ్ళు. వ్యాసుడు చెప్పలేదు కానీ, ఇలా జరిగిఉంటుంది అనుకుని వూహించి కొంత కల్పన చేశారు మరికొందరు. ప్రతినాయకుణ్ణి నాయకుణ్ణి చేసి భాసుడు నాటకాలు రాసినట్టే, ఎన్టీయార్ దుష్టపాత్రల చుట్టూ సినిమాలు తిప్పి రాయించుకున్నారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కీచకుడు – ఇలా ఏ పాత్ర వేసినా, వాళ్ళలో మంచి గుణాల్ని వెదికిపట్టుకుని, లేకపోతే కల్పించి మనకు వండి వార్చారు. ఆయన హిండింబాసురుడి వేషం వేసుంటే భీముని వలచిన చెల్లెలికోసం ఆత్మత్యాగం చేసిన అన్నగా మలిచి వుండేవారు. అందరూ ఔనన్నది మళ్ళీ చెబితే మోజుండదని కొత్త తరహాగా, విపరీత పోకడలతో చెబితే గుర్తింపు వుంటుందనుకుని ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కళాకారులు.
యార్లగడ్డ ఇలాటి ప్రయత్నమే చేశారు తన ’ద్రౌపది’లో. నిజానికి తిక్కన ద్రౌపది కథను అలాగే రాసినా బోల్డంత డ్రామా ఉంది. ఈనాటి సమాజానికి రెలవెన్సు (ప్రాసంగికత) వుంది. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఒక ఆచారానికి (ద్రౌపది విషయంలో అన్నదమ్ములందరినీ చేసుకోవలసి రావడం అయితే, తెలుగమ్మాయికి మేనరికం కావచ్చు, పంజాబీ పడతికి భర్త పోయాక మరిదిని చేసుకోవడం కావచ్చు) తలవొగ్గడం, అందం కారణంగా మరిది (దుర్యోధనుడు) చేత, ఆడపడుచు మొగుడి (సైంధవుడి) చేత, రాజ్యాధికారి (కీచకుడు) చేత ఇబ్బందులకు గురి కావడం – యీనాటి స్త్రీ కూడా ఎదుర్కునే సమస్యలే! ఫ్యామిలీ సర్కిల్లో (కురుసభ), వర్క్ ప్లేస్లో (కీచకుడు రాజు ఎదురుగా కింద పడేసి తన్నాడు) అవమానించినా అడ్డుకునేవాళ్ళు లేకపోయారు. సాక్షాత్తూ భర్త పణం ఒడ్డాడు. (యుద్ధంలో ఓడిపోయాక శత్రువుతో శాంతి కోసం పెళ్ళి పేరుతో కూతుర్ని వాడికి నాలుగో భార్యగా అప్పగించిన రాజులు చాలామంది వున్నారు). భర్తలను వెక్కిరించడానికి కౌరవులు చేసినది – యీమె గుడ్డలూడదీయడం! వారిపై పగ సాధించడానికి అశ్వత్థామ చేసినది – యీమె కొడుకులందరినీ నిద్రలో చంపడం! కీచకుడి హత్యకు ప్రతీకారం అంటూ ఉపకీచకులు చేసినది – వాడితో బాటు యీమెను తగలేయబూనడం! అంటే ఎక్కడ ఉరుము వురిమినా భరించే మంగలం మాత్రం – మహిళే! అప్పుడైనా సరే, యిప్పుడైనా సరే!
ఇంత కాంటెంపరరీ డ్రామా వున్నా యార్లగడ్డ వారికి సరిపోలేదనిపించింది. అందుకే తన ద్రౌపదిని ఆయన ’రస’వత్తరంగా తీర్చిదిద్దారు. పూర్వజన్మలో అమిత కాంక్షతో ఐదుగురు భర్తలను కోరుకుందన్న ఒక పాయింటు పట్టుకుని మొత్తం సెక్సు చుట్టూ కథ నడిపారు. దానికి యాంటీ-డోట్ గా రాసిన కస్తూరి మురళీకృష్ణ ’సౌశీల్య ద్రౌపది’ అని పేరు పెట్టడంలోనే ద్రౌపదిలో ఏ లక్షణాన్ని తను హైలైట్ చేయబోతున్నారో చెప్పేశారు. మురళీకృష్ణ పాండిత్యం, సృజనాత్మకత కలబోసిన రచయిత. బహు విషయపరిజ్ఞానం, అధ్యయనం ఆయన సొత్తు. వీటికి సంస్కృతిపై మమకారం, ఆ సంస్కృతిని అపమార్గాన్ని పట్టిస్తున్న వారిపై రోషం తోడయింది. అందువలన యార్లగడ్డ ఊహలకు పూర్తిగా వ్యతిరేకదిశలో ఆలోచించి పరిగెత్తించే కథనశైలితో యీ నవల రాశారు. మహాప్రస్థానంలో నేలకూలడంతో మొదలుపెట్టి తన జీవితం ఎలా అపార్థం పాలయిందో ద్రౌపది సింహావలోకనం చేసుకుంటూన్నట్టు ఫ్లాష్బ్యాక్లో, సినిమా దృశ్యమాలికలా కథ నడిపారు. క్రితం జన్మలో అపరిమిత వాంఛకై వెంపర్లాడడం చేత ఈ జన్మలో మొహం మొత్తి ఉంటుందన్న తర్కంతో ఐదుగురు భర్తలతోనూ బ్రహ్మచర్యం నెరపిందని రాశారు. (సత్సంతానకాంక్షతో కూడడం కూడా బ్రహ్మచర్యమేనని వివరణ).
ఏ ద్రౌపది పాత్రను అడ్డం పెట్టుకుని యార్లగడ్డ – ధృతరాష్ట్రుణ్ణి (వస్త్రాపహరణ సమయంలో కళ్ళుండి వుంటే నేనూ నా కోడలి సౌందర్యాన్ని చూసేవాణ్ణి కదా అని వాపోయాడట), కృష్ణుణ్ణి (పుస్తకం మొత్తం మీద ద్రౌపదిని సఖీ అని తప్ప సోదరీ అని పిలిచిన పాపాన పోయాడు కాదు), ధర్మరాజును (ద్రౌపది మీద కన్నేసి, స్వయంవరం కాగానే ఇంటికి వచ్చేసి తల్లితో ’భిక్ష పథకం’ పన్నాడట) భ్రష్టుపట్టించి ఆ పురాణ పురుషులందరికీ మసిపూసేస్తే, మురళీకృష్ణ ఆ మసి కడిగేయడమే కాదు, కస్తూరి పరిమళాలు అద్దాడు. పైగా, భారతీయ స్త్రీని ఉన్నతంగా నిలబెట్టడానికి మధ్యమధ్యలో స్వీయవ్యాఖ్యలు జోడించాడు. పాఠకులు వాటిని విస్మరించకుండా ’బోల్డు’ చేయించాడు కూడా. ఇది 100 పేజీల చిన్నపుస్తకం. కానీ, ప్రతిపుటలోనూ భారతీయ ధర్మాన్ని నిలబెట్టడానికి రచయిత చేసిన కృషి కనబడుతుంది. ముఖచిత్రంగా ఉత్తరప్రదేశ్లోని దశావతారాలయంలోని ద్రౌపదీ సమేత పంచపాండవ శిల్పాలు వేశారు. దారినపోయేవారి చేతివాటం వలన ముక్కు, వక్షోజాలు ఛిన్నమైనా తరతరాలుగా చెదరని శిలాసదృశమైన భారతీయత ధర్మానికి ప్రతీకగా నిలిచివున్న ద్రౌపది యీమెయే అనిపిస్తుంది.
పాతకాలం కవులకు దేవీదేవతలు స్వప్నంలో వచ్చి తమపై కావ్యాలు రాయమని కోరేవారట. ఈ సౌశీల్య ద్రౌపదికి లభిస్తున్న జనాదరణ చూసి పైన చెప్పిన పురాణపురుషులు మురళీకృష్ణ కలలోకి వచ్చి ’సౌశీల్య కృష్ణుడు’, ’సౌశీల్య ధర్మరాజు’ వగైరా పుస్తకాలు రాయమని ఒత్తిడి చేస్తారేమో పాపం!
-ఎమ్బీయస్ ప్రసాద్
పుస్తకం వివరాలు:
సౌశీల్య ద్రౌపది
రచయిత – కస్తూరి మురళీకృష్ణ
100 పేజీలు, 50 రూపాయలు
కస్తూరి ప్రచురణలు
సోల్ డిస్ట్రిబ్యూటర్స్ – నవోదయా బుక్ హౌస్, హైదరాబాదు.
(ఈ పుస్తకంపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ.)
అప్పుడు అధికారంలొ వున్న పార్టికి (Congress) ఎన్నికలు గెలవడానికి కావలసిన ఫండ్స్ కి కొదవ వుండదు.


