2010-09-08
మనసు పలికే..: "నేను" నేనే..
హేమలత పుట్ల: పిండాల బావి
వెన్నెల సంతకం: 'అప్పర్ పెనిన్సులా' అందాలు-1
బ్లాగు బాబ్జీ: ఎవడీ బ్లాగుబాబ్జీ? -1
The Invincible Rebel Road: లాటిన్ దేశాలలో ఆకలిని ఎదుర్కొంటున్న ప్రజలు
లాటిన్ అమెరికా దేశాలలో 53 మిలియన్(5 కోట్ల 30 లక్షలు) మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటున్నారు. కొలొంబియా దేశంలో 12% కుటుంబాలు తమ పిల్లలకి ఆహారం అందించలేని స్థితిలో ఉండగా గ్రామీణ కొలొంబియాలో 17% మంది పిల్లలు పౌష్టిక ఆహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో చూడండి:
పిచిక గూడు: మరొక ఉదయం
2010-09-07
పిచిక గూడు: తొలి చినుకు
(చంద్రమౌళి) అంతర్మధనం: ఏమీ లేదు...
రౌడీ రాజ్యం: YSR వర్ధంతి వేడుకలా?
LAKSHMI: pablik nyusensulu
బ్లాగు బాబ్జీ: రోశితాతకో సలహా !
(చంద్రమౌళి) అంతర్మధనం: నా మీద నేను తయారు చేసుకున్న కార్టూన్లు
The Invincible Rebel Road: సహజ వనరులు - అభివృద్ధి
మన దేశంలో సహజ వనరులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో తెలుసా? వెనుకబడిన ప్రాంతాలలో. అక్కడ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అక్కడ స్థానికులు కాకుండా బహుళజాతి కంపెనీలవాళ్లే పరిశ్రమలు పెడతారు. జార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఖనిజ సంపద విస్తృతంగా ఉంది. ఆ ఖనిజాలని తవ్వేంత డబ్బున్నవాళ్లు అక్కడ తక్కువ. వేదాంత రిసోర్సెస్ లాంటి బహుళజాతి కంపెనీలు వచ్చినప్పుడు మాత్రం గనులని తక్కువ ధరకి లీజ్ కి ఇచ్చేస్తారు. గనులు తవ్వడానికి అవసరమైతే గ్రామాలని ఖాళీ చెయ్యిస్తారు.
2010-09-06
నెమలికన్ను: శనగలమాసం
Bhavanarayana Thota :: భావనారాయణ తోట: లైసెన్స్ నియమాలు : మన చానల్స్ ముచ్చట్లు
ఆగిన విస్సా
చానల్ లైసెన్సింగ్ నియమాలు ఎప్పటికప్పుడు కఠినతరమవుతూ వస్తున్నాయి. మొదట్లో కొన్ని అనవసరమైన నియమాలున్నా, ఆ తరువాత వాటిని సడలించారు. కొన్ని పట్టించుకోని విషయాలు ఆ తరువాత అవసరమని అర్థంచేసుకొని కఠినం చేశారు. చానల్ అనుమతి ఉన్నా ఏడాదికొకసారి డబ్ల్యూపీసీ లైసెన్స్ రెన్యూ చేయించుకోవటం తప్పని సరి. అందులో దొరికిపోయి ప్రసారాలు ఆపేయాల్సి వచ్చిందొక తెలుగు చానల్. దాని పేరు విస్సా.(తమిళనాడుకు చెందిన రాజ్ నెట్వర్క్ ప్రమోటర్లు తమ తల్లి విశాలాక్షి పేరుమీద దీన్ని ప్రారంభించారు). సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మొదలైన ఆ చానల్ ఎన్నికల సమయానికి డబ్ల్యూ పీసీ లైసెన్స్ రెన్యూ చేయించుకోవటం లో అలసత్వం ప్రదర్శించింది. నియమాల ఉల్లంఘన నిజమే కాని అది చెప్పుకోదగినంత నేరమేమీ కాదు. కానీ చానల్ ని ఆపేసే అంతటి కఠిన నిర్ణయం తీసుకోవటానికి వేరే కారణాలున్నాయని చెబుతారు. తమిళనాడులో నెంబర్ టూ గా వెలుగొందుతున్న రాజ్ నెట్వర్క్ వారి చానల్ కావడం దానికున్న ఒకేఒక్క అనర్హత. మొదట్లో వీడియో క్యాసెట్ల వ్యాపారంలో దిగి చాలా సినిమాల హక్కులు సొంతం చేసుకుని ఆ తరువాత చానల్ పెట్టడంతో అక్కడ ఎక్కువ సినిమాల ప్రసార హక్కులున్న చానల్ గా మిగిలింది. ఈ విషయంలో సన్ టీవీ కి గట్టి పోటీ ఇస్తుండటం వల్లనే కక్షగట్టి అప్పటి కమ్యూనికేషన్ల శాఖామంత్రి దయానిధి మారన్ ( సన్ టీవీ అధిపతి కళానిధి మారన్ సోదరుడు) వేటు వేశారని చెబుతారు. ఏమైనప్పటికీ రెన్యువల్ విషయంలో చానల్ తప్పిదాన్ని కాదనలేం. ఆ తరువాత దాదాపు ఏడాదిపాటు చానల్ కి సమస్యలు తప్పలేదు. కొంతకాలం విదేశాలనుంచి అప్లింక్ చేయాల్సి వచ్చింది. అంటే, అక్షరాలా అది ఒక విదేశీ చానల్ లాగా నడిచింది. ఏడాది నుంచి మళ్ళీ రాజ్ నెట్వర్క్ వారి సొంత ఎర్త్ స్టేషన్ నుంచి అపలింక్ అవుతోంది.
అద్దెకు డిడి చానల్
దూరదర్శన్ తన చానల్ నే డి ఎస్ ఎన్ జి గా మార్చి అద్దెకిచ్చిన సందర్భాలున్నాయి. 1998-99 నాటి సంగతి. డిడి మెట్రో చానల్ లో మధ్యాహ్నం వేళల్లో ప్రసారాలు ఉండేవి కావు. ఆ సమయంలో రోజూ 15 నిమిషాలపాటు వాడుకొని కొంత ఫీజు చెల్లించటానికి హైదరాబాద్ డిడి కేంద్రంతో జెమిని టీవీ ఒక అవగాహన కుదుర్చుకుంది. చెన్నై కేంద్రంగా జెమినీ వార్తలు వెలువడే రోజుల్లో హైదరాబాద్ నుంచి వీడియో క్లిప్స్ పంపుకోవటానికి సౌకర్యం ఉండేది కాదు. విమానంలో పంపటం ఒక్కటే మార్గం. అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట లోపు రెడీ అయితేనే పంపే వీలుండేది. అందుకే దూరదర్శన్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ళకూ ఇది ఆదాయ మార్గం కాబట్టి సరేనన్నారు. మొత్తం మీద ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో డిడి లోగో లేకుండా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి జెమినీ న్యూస్ క్లిప్స్ అప్లింకింగ్ అయ్యేవి. చెన్నై సన్ నెట్వర్క్ కార్యాలయంలో డిడి మెట్రో చానల్ పెట్టుకుని ఆ ప్రసారాలు రికార్డ్ చేసుకునే వాళ్ళం. సాయంత్రం 3 గంటలవరకు జరిగిన కార్యక్రమాలన్నీ ఇలా పంపుకునే వెసులుబాటు ఉండేది. హైదరాబాద్ లో ఈ బాధ్యతలు మోసిన జర్నలిస్టు రుద్రాభట్ల కిషన్ ఎప్పుడైనా కాసెట్ చేరటం ఆలస్యమైనా డిడి అధికారులను ఒప్పించి ఆరునూరైనా సరే అప్లింక్ చేసేవారు. కొద్ది రోజులు గడిచేసరికి కొత్త సమస్య వచ్చిపడింది. ఇలా మెట్రో చానల్ ద్వారా జెమినీ ఫీడ్ పంపుతున్న విషయం కేబుల్ చానల్స్ పసిగట్టాయి. కొంతమంది ఆపరేటర్లు ఆ ఫీడ్ రికార్డు చేసుకొని తమ కేబుల్ న్యూస్ లో వాడుకోవటం మొదలెట్టారు. దీనికి విరుగుడు లోగో తో క్లిప్స్ పంపటం ఒక్కటే. అప్పుడైతే ఎవరైనా వాడుకున్నా తెలిసిపోతుంది. కానీ లోగో వాడటానికి డిడి అధికారులు ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే పంపాల్సివచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు డి ఎస్ ఎన్ జి ( డిజిటల్ శాటిలైట్ న్యూస్ గాదరింగ్ ) ఏర్పాటైంది. అప్పట్లో అది కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా అంతకంటే మార్గం లేదు. ఒకే ఫ్రీక్వెన్సీ వాడుకుంటూ హైదరాబాద్, బెంగళూర్, మదురై, తిరువనంతపురం, కోయంబత్తూర్ నుంచి వీడియో క్లిప్స్ చెన్నై చేరేవి. అవసరాన్ని బట్టి, ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కొక్కరు వరుసగా ఫీడ్ పంపుకునేవారు. ఇప్పుడైతే ధరలు తగ్గాయి. పోటీ కూడా పెరిగింది. అందుకే సాక్షిటీవీ ఒక్కటే దాదాపు పాతిక డి ఎస్ ఎన్ జి లు వాడుతోంది.
ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు మామూలుగా డి ఎస్ ఎన్ జి లైసెన్స్ ఇవ్వరు. అందుకే ఎక్కువగా బ్రాడ్బాండ్ మీద ఆధారపడతాయి. కానీ సొంత ఎర్త్ స్టేషన్ ఉన్న నెట్వర్క్ తన చానల్ ప్రసారాలను ఎర్త్ స్టేషన్ దాకా పంపుకోవటానికి మాత్రం డి ఎస్ ఎన్ జి అనుమతిస్తారు. సన్ నెట్వర్క్ ఇదే విధంగా చెన్నై లోని ఎర్త్ స్టేషన్ కు తెలుగు చానల్స్ పంపుకునేందుకు డి ఎస్ ఎన్ జి లైసెన్స్ తీసుకుంది. బ్రాడ్బాండ్ వాడుకుంటున్నప్పటికీ, అత్యవసరపరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఎప్పుడైనా ప్రత్యక్ష ప్రసారాలు చేయాలంటే తప్పనిసరిగా బ్రాడ్బాండ్ మీద ఆధారపడటమో, తాత్కాలికంగా అనుమతి తీసుకొని డి ఎస్ ఎన్ జి వాడుకోవటమో చెయ్యాలి. బ్రాడ్బాండ్ వాడటమనేది మామూలుగా జరిగేదేకాని ఎక్కడైనా కేబుల్ కట్ అయితే ప్రత్యక్షప్రసారం అభాసుపాలవుతుంది. అందుకే, మరీ ముఖ్యమైన కార్యక్రమం అనుకున్నప్పుడు డి ఎస్ ఎన్ జి ని ఆశ్రయించటం మేలు. తెలుగు సినిమా వజ్రోత్సవాల వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు మా టీవీ ఇలాగే డి ఎస్ ఎన్ జి వాడుకుంది. అయితే, అనుమతులకు సంబంధించిన లాంఛనాలు పూర్తిచేయటంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సహించదు.
పేరుమార్చుకుని…
చానల్స్ పేర్లు మార్చుకోవటం కూడా ఈ మధ్య బాగా ఎక్కువైంది. జెమిని మ్యూజిక్ చానల్ మొదట ఆదిత్య మ్యూజిక్ గా మొదలైంది. ఆ తరువాత జెమిని మ్యూజిక్ అయింది. కామెడీ చానెల్ ను జీ సీ వీ పేరుతో మొదలెట్టి ఆ తరువాత నవ్వులు టీవీ గా మార్చింది. మాటీవీ ఒక ఆధ్యాత్మిక చానల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో మా భక్తి పేరుతో పర్మిషన్ తీసుకుని ఆ తరువాత భక్తి చానల్ రావటంతో మా పూజ గా మార్చుకుంది. ఇప్పట్లో ఆ చానల్ తెచ్చే ఆలోచన కూడా విరమించుకుందనుకోండి. జీ ఆల్ఫా పేరుతో ఎంటర్టైన్మెంట్ చానల్ మొదలెట్టిన జీ సంస్థ ఏడాది తరువాత జీ తెలుగు గా పేరు మార్చి పునఃప్రారంభించటమూ చూశాం. హెచ్ ఎమ్ టీ వీ యాజమాన్యం మొదట టీ చానల్ పేరుతో లైసెన్స్ తీసుకున్నప్పటికీ ఆ తరువాత మనసు మార్చుకుంది. టి అంటే ట్రూత్ అని ఎంత మొత్తుకున్నా జనం నమ్మక తెలంగాణ చానల్ అంటున్నారని చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. తొలి సర్వధర్మ చానల్ గా చెప్పుకుంటూ ‘ సంస్కృతి ‘ ప్రారంభించిన టీవీ9 ప్రమోటర్లు ఆ తరువాత దానిని న్యూస్ చానల్ గా మార్చి టీవీ1 అని పేరు పెట్టడం తెలిసిందే. మా టీవీ యాజమాన్యంలో మార్పులతోబాటే చానల్ లోగో కూడా మారింది. అలా లోగో మార్చటానికీ అనుమతి తప్పనిసరి. వైజయంతి టెలివెంచర్స్ వారి రిథమ్ సైతం మాయాబజార్ గా పేరుమార్చుకుని త్వరలో రావటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇలా చానల్స్ ఇష్టమొచ్చినట్టు పేర్లు మార్చుకోవటం చూసిన సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏడాదిలోపే పేర్లు మార్చుకోవటం మానుకోవాలని హితవు చెబుతూ ఇకమీదట పేరుమార్పుకోసం దరఖాస్తు చేసే సంస్థలు 25 వేల ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని రూలుపెట్టింది.
టీవీ 5 లైవ్ ఎందుకాగింది ?
చానల్ పేరు విషయంలో తలెత్తిన వివాదం ఒక చానల్ ప్రారంభమైన గంటసేపట్లోనే ఆపేసే పరిస్థితికి దారితీసింది. అది జరిగి మూడేళ్ళే అవుతోంది కాబట్టి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అది టీవీ 5 సంగతేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా. కానీ సరిగ్గా ప్రారంభ కార్యక్రమం జరిగేంతవరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగిన చానల్ ఆ మరుక్షణమే ఆగిపోవటం వెనుక అసలు నిజం చాలా మందికి తెలియదు. TV5 MONDE పేరుతో ఒక ఫ్రెంచ్ చానల్ భారత్ లో డౌన్లింకింగ్ పర్మిషన్ తీసుకుని ఉంది. అందువలన అలాంటి పేరున్న చానల్ కు లైసెన్స్ ఇవ్వకూడదనేది సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు అందిన ఫిర్యాదు సారాంశం. టీవీ5 అంటే గిట్టని వాళ్ళే ఆ ఫ్రెంచ్ చానల్ చేత ఫిర్యాదు చేయించి ఉంటారని కూడా అప్పట్లో ప్రచారం జరిగిందిగాని దానికి ఎలాంటి ఆధారాలూ లేవుగనుక ఆ విషయం వదిలేద్దాం. 2007 అక్టోబర్ 2 నాడు సాయంత్రం చానల్ ప్రారంభోత్సవం చానల్ కార్యాలయంలోనే జరిగింది. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ( అప్పటికింకా ప్రజారాజ్యం ప్రకటించలేదు) అతిథులుగా కేవలం గంటసేపట్లో కార్యక్రమం ముగిసింది. అప్పటిదాకా సాగిన ప్రత్యక్షప్రసారం ఆగిపోయింది. ముందే తెలిసిన యాజమాన్యం ఊపిరిపీల్చుకుందే తప్ప కంగారుపడలేదు. అసలు విషయం ఏమిటంటే, చానల్ ఆపేయాలని ఆదేశాలు వచ్చినట్టు చెన్నై లోని వి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ఆ రోజు ఉదయమే తెలియజేసింది. అయితే, అప్పటికే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రముఖులను ఆహ్వానించి ఉండటంతో కనీసం ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకు ఆ ఆదేశాలను పక్కనపెట్టాలని చానల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి వి ఎస్ ఎన్ ఎల్ అధికారిని బ్రతిమాలి ఒప్పించారు. అందుకే అప్పటిదాకా ఓపిక పట్టిన వి ఎస్ ఎన్ ఎల్ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే అప్లింకింగ్ కట్ చేసింది. ఆ తరువాత చానల్ ఐదు గా మార్చి కొన్నాళ్ళు నడిపి, ఎట్టకేలకు టీవీ5 పేరునే ఖరారు చేయించుకోవటం తెలిసిన విషయాలే.
అద్దెకు ఇవ్వబడును
సొంతగా చానల్ లైసెన్స్ లేనప్పుడు లీజుకు తీసుకుని నడపటం కూడా తెలుగు చానల్స్ అలవాటు చేసుకున్నాయి. వార్తలవరకే లీజుకివ్వటం విస్సా మొదలెట్టింది. జెమినీ న్యూస్ కొంతకాలం అలాగే లీజుకిచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఇవ్వటం అనేది రాజ్ న్యూస్ తోనే మొదలయిందని చెప్పాలి. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించే లక్ష్యంతో టీ ఆర్ ఎస్ కార్యాలయం నుంచి నడుస్తున్న రాజ్ న్యూస్ లైసెన్స్ చెన్నైలోని రాజ్ నెట్వర్క్ పేరుమీద ఉంది. నిజానికి ఈ చానల్ కోసం అంతకుముందు చాలా మంది ప్రయత్నించినా రకరకాల కారణాలవలన ముడిపడలేదు. దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా పనిచేసి రిటైరైన ఆకిరి రామకృష్ణారావు, సీబీసీ చానల్ చాలా కాలం ప్రయత్నించినా కుదరలేదు. చివరికి టీ ఆర్ ఎస్ అధినేత కె సి ఆర్ సాధించగలిగారు. అంతకు ముందు విస్సా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఢిల్లీ స్థాయిలో సాయం చేసి ఉండటంతో రాజ్ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని అంటారు. ఈ మధ్య లీజుకిచ్చిన మరో చానల్ హెచ్ వై టీవీ. హైదరాబాద్ ప్రేక్షకులే లక్ష్యంగా నడిచిన ఈ చానల్ కొన్ని అంతర్గత సమస్యల కారణంగా మూతబడటంతో చానల్4 సంస్థ అధిపతి శివరాం ప్రసాద్ దీన్ని ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. నిజానికి తమిళనాడుకు చెందిన పాలిమర్ సంస్థ (మన లోకల్ టీవీ తరహాలో బ్రాడ్బాండ్ చానల్ నడుపుతూ పంపిణీ రంగంలో ఎదుగుతోంది) ఈ చానల్ ను తీసుకోవటానికి ప్రయత్నించినా ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తరువాత రెండునెలల్లోపే చానల్4 తో హెచ్ వై టీవీ ఈ కొత్త లీజు ఒప్పందం కుదుర్చుకుంది.
చానల్ అమ్ముకోవటం. లైసెన్స్ అమ్ముకోవటం ఏమంత సులభం కాదు. కంపెనీ పేరుమీద ఒకే చానల్ ఉంటే, ఆ కంపెనీని అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా డైరెక్టర్లు మారతారు కాబట్టి ఆ విషయాన్ని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు తెలియజేసి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. లైసెన్స్ అమ్ముకోవటం కూడా చాలా కష్టం. అలా కొనాలనుకునే సంస్థ ముందుగా ఆ లైసెన్స్ ఉన్న సంస్థనే కొనాలి. అప్పుడు కూడా రకరకాల లాంఛనాలు పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో ఆమోదం దొరుకుతుంది. ఒకటి కంటే ఎక్కువ చానల్స్ నడిపే సంస్థ విడిగా ఒక చానల్ అమ్మడం కుదరదు. సంస్థ మొత్తాన్ని అమ్మితే తప్ప లైసెన్స్ బదలాయింపు కుదరదు. ఇన్ని సమస్యలుండబట్టే కొత్త లైసెన్సుకు మొగ్గు చూపుతారు. కానీ కొత్త లైసెన్స్ కావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనుకునేవారు లీజుకోసం ప్రయత్నిస్తారు. లీజును అడ్డుకునే నిబంధనలేవీ లేవు గనుక ఈ అనధికారిక ఒప్పందాలు సజావుగా సాగుతున్నాయి. అయితే, ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు అసలు యజమాని మాత్రమే బాధ్యుడవుతాడు గనుక ఇరుపక్షాలూ బాధ్యతగా, పరస్పరం విశ్వాసంతో వ్యవహరించటం తప్పనిసరి.
న్యూస్ చానల్ Vs నాన్ న్యూస్ చానల్
నాన్ న్యూస్ చానల్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు న్యూస్ చానల్ గా మారాలంటే మళ్ళీ కొన్ని నిబంధనలున్నాయి. ఉదాహరణకు రిథం చానల్ నాన్ న్యూస్ చానల్ గా అనుమతి పొందింది. అందులో న్యూస్ ప్రసారం చేయాలంటే నికర ఆస్తులవిలువ 3 కోట్లుగా చూపాలి. ( ట్రాయ్ సిఫార్సులు ఇంకా అమలులోకి రాలేదు కాబట్టి ). న్యూస్ చానల్ నియమాలన్నీ పాటించాలి. విదేశీ పెట్టుబడుల విషయం స్పష్టంగా చూపాలి. డైరెక్టర్ల వివరాలు తెలియజేయాలి. ఇలా చాలా తతంగాలుంటాయి.అయితే నాన్ న్యూస్ చానల్ గా లైసెన్స్ తీసుకొని న్యూస్ బులిటెన్స్ నడిపే ఎ టీవీ లాంటి వాళ్ళు న్యూస్ అనే పదం ఎక్కడా వాడకుండా జాగ్రత్త పడుతుంటారు. న్యూస్ ఇవ్వకూదని మన ఎఫ్ ఎమ్ రేడియోలు న్యూస్ అని చెప్పకుండానే క్రికెట్ స్కోర్, వాతావరణ వివరాలు, ట్రాఫిక్ పరిస్థితి, షేర్ మార్కెట్ సమాచారం ఇస్తున్నట్టే న్యూస్ ఇవ్వవచ్చుననే అభిప్రాయంతో బులిటెన్లు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ కారణంగా సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఏ చానల్ మీదా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. లైసెన్స్ వచ్చినా చానల్ మొదలుపెట్టకుందా, ఎప్పటికప్పుడు పొడిగింపుకోరుతూ మూడేళ్లకు పైగా సాగదీసి చివరికి లైసెన్స్ రద్దయి సత్య టీవీ మూతబడింది. అసలు లైసెన్సు కూడా రాకముందే సీబీసీ న్యూస్ చానల్ మూతబడింది.
సత్యప్రియ: నేను బ్లాగ్ రాయడం మొదలుపెట్టి అప్పుడే సంవత్సరం ఐపోయిందా?
2010-09-05
తెలుగు తేజం: హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం
హిమబిందువులు: నటించాలని వుంది
తెలుగు తేజం: యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే
2010-09-04
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం: సరస సల్లాపము - 4
Bhavanarayana Thota :: భావనారాయణ తోట: లైసెన్సులు : మార్గదర్శకాలు
భారతదేశం నుంచి అప్ లింక్ చేయటానికి సంబంధించిన నియమావళిని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు విడుదలచేస్తుంది. 2000 జూలై, 2003 మార్చి, 2003 మే, 2005 అక్టోబర్ లలో జారీచేసిన మార్గదర్శకాలన్నిటినీ కలిపి 2005 డిసెంబర్ 2 నుండి అమలయ్యేలా సమగ్రమైన నియమావళిని ప్రకటించింది. 2010 లో ట్రాయ్ చేసిన సిఫార్సులు అమలులోకి వచ్చేదాకా ఈ నియమాలే వర్తిస్తాయి.
లైసెన్సు దరఖాస్తులు ఆయా అవసరాలకు అనుగుణంగా ఆరు రకాలుగా ఉంటాయి.
1.అప్ లింకింగ్ కోసం టెలిపోర్ట్/ఎర్త్ స్టేషన్
2.నాన్-న్యూస్ చానల్
3.న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ చానల్
4. భారత భూభాగం నుండి పనిచేసే వార్తాసంస్థ(న్యూస్ ఏజెన్సీ)
5.ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి
6. తాత్కాలిక అప్ లింకింగ్ సౌకర్యం
ఏ లైసెన్సు కావాలన్నా దరఖాస్తుచేసుకునే సంస్థ ముందుగా భారతీయ కంపెనీల చట్టం,1956 ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కో విభాగం కింద దరఖాస్తు నియమాలు ఇలా ఉంటాయి.
1.టెలిపోర్ట్/ఎర్త్ స్టేషన్
చానల్ ప్రసారాలను ఉపగ్రహానికి పంపడానికి టెలిపోర్ట్/ఎర్త్ స్టేషన్ అవసరం. అయితే,ఒకటీ అరా చానల్స్ ఉన్నవాళ్లు టెలిపోర్ట్ కోసం ఖర్చుచేయటానికి ఇష్టపడరు. అలాంటి చానల్స్ కి సేవలందించటానికి కొన్ని సంస్థలు టెలిపోర్ట్ నిర్మిస్తాయి. అప్ లింక్ చేసే చానల్స్ సంఖ్యను బట్టి టెలిపోర్ట్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు. అయితే, కొన్ని చానల్ యాజమాన్యాలు సొంత టెలిపోర్ట్ నిర్మించుకోవచ్చు.ఆ సందర్భంలో కూడా లైసెన్స్ తీసుకోవలసి వస్తుంది.
టెలిపోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలో విదేశీవాటా 49 శాతం దాటకూడదు.కంపెనీ నికర ఆస్తుల విలువ ఇలా ఉండాలి:
——————————————————————————————————
చానల్స్ సంఖ్య ఉండాల్సిన నికర ఆస్తుల విలువ
——————————————————————————————————-
ఒక చానల్ సామర్థ్యం రు.1.00 కోటి
6 చానల్స్ రు.1.50 కోట్లు
10 చానల్స్ రు.2.50 కోట్లు
15 చానల్స్ రు.3.00 కోట్లు
——————————————————————————————————
పది సంవత్సరాలపాటు ఈ లైసెన్సు వర్తిస్తుంది. దరఖాస్తుదారుడు దరఖాస్తుతోబాటు 10 వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉండి, అర్హమైనదిగా తేలిన పక్షంలో ఒక్కో టెలిపోర్ట్ కు ఐదేసి లక్షలవంతున అనుమతి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అనుమతించిన చానల్స్ మాత్రమే ఆ టెలిపోర్ట్ నుంచి అప్ లింక్ చేయాలి. ఏదైనా కారణం వలన చానల్ లైసెన్స్ రద్దయినపక్షంలో ఆ చానల్ అప్ లింకింగ్ కూఢా నిలిపివేయాల్సిన బాధ్యత టెలిపోర్ట్ లైసెన్సుదారునిమీదనే ఉంటుంది.
2. నాన్ న్యూస్ చానల్ ( వార్తలు ప్రసారం చేయని చానల్ )
ఒక్క నిమిషం కూడా వార్తలు ప్రసారం చేయటానికి అవకాశం లేని చానల్స్ ఈ విభాగం కిందికి వస్తాయి. యాజమాన్యం, విదేశీ వాటా, నియంత్రణ లాంటి అంశాలతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా దరఖాస్తు చేసుకునే కంపెనీ నికర ఆస్తులవిలువ ఇలా ఉండాలి:
———————————————————————————-
చానల్స్ సంఖ్య ఉండాల్సిన నికర ఆస్తుల విలువ
———————————————————————————-
ఒక చానల్ కు రు.1.50 కోట్లు
ప్రతి అదనపు చానల్ కు రు.1.00 కోటి
————————————————————————————
పదేళ్లపాటు అమలులో ఉండే ఈ లైసెన్సు దరఖాస్తుతోబాటు 10 వేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిఉంటుండి. దరఖాస్తు అర్హమైనదని తేలితే, చానల్ కి ఐదు లక్షల వంతున అనుమతి రుసుము చెల్లించాలి. డౌన్ లింకింగ్ నియమాల ప్రకారం ఒక్కో చానల్ కు విడివిడిగా రిజిస్ట్రేషన్ అవసరమవుతుంది.
ఆ విధంగా లైసెన్సు పొందిన కంపెనీ ఏడాదిలోగా చానల్ ప్రసారాలు ప్రారంభించవలసి ఉంటుంది. అలా మొదలుపెట్టనిపక్షంలో అందుకు తగిన కారణాలను మంత్రిత్వశాఖకు చెప్పుకోవాలి.సంతృప్తికరమైన సమాధానం రాకపోతే లైసెన్సు రద్దు చేసే అధికారం మంత్రిత్వశాఖకు ఉంటుంది.
స్పోర్ట్స్ చానల్ గాని, స్పోర్ట్స్ ప్రసారహక్కులున్న కంపెనీ గాని ఆ క్రీడలకు సంబంధించిన ఫీడ్ ను తప్పనిసరిగా ప్రసారభారతికి (దూరదర్శన్ కి) ఇవ్వాలి. దానిమీద వచ్చే ఆదాయంలో డిడి 25 శాతం ఉంచుకుని 75 శాతం హక్కులున్న చానల్ లేదా సంస్థకు ఇస్తుంది.
3.న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ చానల్
మొత్తం కార్యక్రమాల్లో ఒక్క నిమిషం వార్తలున్నా అది న్యూస్ చానల్ కిందికే వస్తుంది. న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ చానల్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలో విదేశీపెట్టుబడులు 26 శాతం మించకూడదు.ఈ నియమాన్ని పాటిస్తునట్లు ప్రతి ఆర్థికసంవత్సరం చివర్లో ఆడిటర్ ధృవపత్రం పంపుతూ ఉండాలి. పెట్టుబడుల్లో మార్పులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు జరిగినా 15 రోజుల్లోగా సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలి. డైరెక్టర్ల బోర్డులో చేరే ప్రవాస భారతీయుల వివరాలను ముందుగానే తెలియజేయాలి. ఏడాదిలో 60 రోజులకు మించి ఉద్యోగులుగా గాని కన్సల్టెంట్లుగా గాని ప్రవాసభారతీయులను, లేదా విదేశీయులను తీసుకునే పక్షంలో వెంటనే ఆ సమాచారం తెలియజేయాలి. డైరెక్టర్ల బోర్డులో కనీసం 3/4వ వంతు, కీలకమైన హోదాలలో, ఎడిటోరియల్ విభాగంలో పూర్తిగాను భారతీయులు మాత్రమే ఉండాలి. కంపెనీ నికర ఆస్తుల విలువ ఇలా ఉండాలి :
————————————————————————————-
చానల్స్ సంఖ్య ఉండాల్సిన నికర ఆస్తుల విలువ
————————————————————————————-
ఒక చానల్ కు రు.3.00 కోట్లు
ప్రతి అదనపు చానల్ కు రు.2.00 కోట్లు
————————————————————————————–
పదేళ్లపాటు అమలులో ఉండే ఈ లైసెన్సు దరఖాస్తుతోబాటు 10 వేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు అర్హమైనదని తేలితే, చానల్ కి ఐదు లక్షల వంతున అనుమతి రుసుము చెల్లించాలి.
4. వార్తాసంస్థ(న్యూస్ ఏజెన్సీ)
దరఖాస్తు చేసుకునే కంపెనీ పి ఐ బి (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అక్రెడిటేషన్ పొంది ఉండాలి. నూటికి నూరుశాతం భారతీయ కంపెనీ అయి ఉండి, యాజమాన్య నియంత్రణ పూర్తిగా భారతీయుల చేతుల్లో ఉండాలి.అనుమతి కాలవ్యవధి డబ్ల్యు పి సి లైసెన్సుకు అనుగుణంగా ఉంటుంది. వార్తలసేకరణకు, ఇతర ఏజెన్సీలకు,చానల్స్ కు మాత్రమే వార్తలు ఇవ్వాలి తప్ప నేరుగా ప్రజలకు ప్రసారాలు అందించకూడదు.
పైన చెప్పిన నాలుగు రకాల లైసెన్సులు పొందినవారు అనుసరించాల్సిన సాధారణ సూత్రాలు కొన్ని ఉన్నాయి.
ఎ.భారత ఉపగ్రహాలను వాడుకునే కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుంది.
బి.కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ ( రెగ్యులేషన్ ) చట్టానికి అనుగుణంగా కార్యక్రమాల, ప్రకటనల నియమావళి పాటించాలి.
సి. ప్రసారం చేసిన మొత్తం కార్యక్రమాలను 90 రోజులపాటు రికార్డు చేసి ఉంచాలి. ప్రభుత్వం అడిగినప్పుడు చూపించగలగాలి.
డి. ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయడానికి వస్తే సహకరించాలి.
ఇ. లైసెన్సు ఉన్నంతకాలం అర్హతలు కొనసాగించాలి. లేనిపక్షంలో పెనాల్టీ విధించవచ్చు.
ఎఫ్. ప్రజాప్రయోజనాలు, లేదా, దేశ భద్రతాప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ఏ చానల్ ను అయినా నిర్దిష్ఠ కాలంపాటు నిలిపివేసే హక్కు ప్రభుత్వానికుంటుంది.
జి. సి ఇ ఓ లేదా, డైరెక్టర్లలో మార్పులు చేసే ముందు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవటం తప్పనిసరి.
5.ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి
న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ చానల్స్ ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి వాడుకునేందుకు అనుమతిస్తారు. పి ఐ బి అక్రెడిటేషన్ ఉన్న కంటెంట్ ప్రొవైడర్స్ కూడా ఎస్.ఎన్.జి/డి.ఎస్.ఎన్.జి వాడుకోవచ్చు. సొంత టెలిపోర్ట్ ఉన్న నాన్ న్యూస్ చానల్స్ తమ ప్రసారాల బదలాయింపుకోసం ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి వాడుకోవచ్చు. విదేశీ చానల్స్ సహా పై వర్గీకరణలోనికి రాని అన్ని చానల్స్ లైవ్ కవరేజ్ కోసం ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి వాడుకోవాలంటే తాత్కాలిక అనుమతి తీసుకోవలసిందే.
ఎస్ ఎన్ జి/డి ఎస్ ఎన్ జి డ్వారా సేకరించే ఫీడ్ కార్యక్రమాల, ప్రకటనల నియమావళికిలోబడి ఉంటుందని ఆయా చానల్స్ లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆయా చానల్స్ కిచ్చిన లైసెన్స్ వ్యవధిప్రకారమే ఈ లైసెన్స్ కూడా ఉంటుంది.
అయితే, రక్షణ సంబంధమైన సంస్థల ఆవరణలోకి ఎస్ ఎన్ జి / డి ఎస్ ఎన్ జి వాహనాలు ప్రవేశించడం నిషిధ్ధం. భద్రతాకారణాలదృష్ట్యా ప్రత్యేకించిన ప్రాంతాలలోకి ఈ పరికరాలు తీసుకువెళ్ళకూడదు. ఈ షరతులను ఉల్లంఘించిన పక్షంలో ఎస్ ఎన్ జి / డి ఎస్ ఎన్ జి లైసెన్సు రద్దు చేసే అధికారం సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఉంటుంది.
6. తాత్కాలిక అప్ లింకింగ్ సౌకర్యం
సొంత డి ఎస్ ఎన్ జి లైసెన్స్ లేని చానల్స్ ఏదైనా ఈవెంట్ ప్రత్యక్షప్రసారం చేయాలంటే డి ఎస్ ఎన్ జి కోసం తాత్కాలిక అనుమతి పొందవలసి ఉంటుంది.హోమ్ శాఖను సంప్రదించిన మీదట సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ లైసెన్స్ మంజూరు చేస్తుంది. విదేశీ న్యూస్ చానల్స్, న్యూస్ ఏజెన్సీలకయితే ఒకేసారి ఏడాదికి పాటు అమలులో ఉండేలా తాత్కాలిక లైసెన్స్ ఇస్తారు. పదివేల రూపాయల ప్రాసెసింగ్ ఫీజు, ఏడాదికి 50 వేల రూపాయల లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు.
జరిమానాలు :
అనుమతిలేని, అభ్యంతరకరమైన, ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించే, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే కార్యక్రమాలు ప్రసారం చేసినట్టు తేలిన పక్షంలో లైసెన్స్ రద్దుచేయటంతోబాటు ఐదేళ్లపాటు అనర్హమైనట్లు ప్రకటిస్తారు. మొదటి తప్పుకు 30 రోజుల పాటు ప్రసారాలమీద నిషేధం విధిస్తారు.రెండోసారి తప్పు చేస్తే 90 రోజులపాటు నిషేధిస్తారు.మూడోసారి కూడా అతిక్రమిస్తే, లైసెన్స్ మిగిలిపోయినకాలం మొత్తానికి ప్రసారాలు రద్దు చేస్తారు. జరిమానా చెల్లించకపోతే భవిష్యత్తులో ఐదేళ్లపాటు కొత్త లైసెన్స్ కు అనర్హమని ప్రకటిస్తారు.
2010-09-03
నెమలికన్ను: అమ్మకి జేజే!
సత్యప్రియ: అనావృష్టి ,అతివృష్టి
2010-09-02
నెమలికన్ను: ఏడాది తర్వాత...
2010-09-01
బృందావనంలో...: నల్లనయ్య మా ఇంటికీ వచ్చాడు
నెమలికన్ను: కన్నయ్య కనిపించడేం...?
వెన్నెల సంతకం: జయ జయ దేవ హరే
ఆలోచిస్తే...: చిరిగిన నోటు - సింగరాజు పాట్లు
హిమబిందువులు: ఈ రోజు నాదే
2010-08-30
సత్యప్రియ: మా సీమ టపాకాయ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
2010-08-29
'ప్రమాద'వనం - We came,We saw,We Kelikified!!!: ఈ తెలుగు నడకలో శరత్ హిడెన్ ఎజెండా - ఇదిగో!
రౌడీ రాజ్యం: మాలిక త్రైమాసిక తెలుగు పత్రిక
ఆలోచిస్తే...: "కామన్"వెల్త్ -- లింగరాజు క్లాస్ పీకుడు..
నెమలికన్ను: మేరీకమల
2010-08-28
పొద్దు గడి - స్లిప్పుల సర్వీస్: ఆగస్టు నెల గడి - 2010
2010-08-24
MAATA VARUSAKU బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని: ugly దర్శన్ బేకార్ న్యూస్
combodia vishnu temple?
Prambanan temple in Central Java, Indonesia
bagunnayi
mucchetlu bagunnayi.chala mandhi kotha journalist laku,aneka mandhi pata journalistu laku telayani vishayalu,samacharam unnayi.vijayavantamga konasaginchandi
తా మెచ్చిన
వారికి
తగు పాఠం,
తా నచ్చని వారికి
గుణ పాఠం
చిలిపి కృష్ణుని
తత్వ గుణం ….
బాగుంది బాగుంది
…. మీ …
పాఠాలందునా?
గుణపాఠాలందునా?”
అశ్వనీ శ్రీ జీ .
అభినందనలు ..
ఆశీస్సులతో …నూతక్కి




