2012-02-04
Prabhava ప్రభవ: సూర్యుడు సున్నా
2012-02-03
Hyderabad Book Trust: జార్జి రెడ్డి (1947 -1972 ) జ్ఞాపకాలు ...
శిరా కదంబం: నో గో కలర్
2012-02-02
సరిగమల గలగలలు: జానకి రాముల కళ్యాణానికి..
కినిగె బ్లాగు: బ్లడ్ హౌండ్
సుప్రసిద్ధ రచయిత మధుబాబు రచించిన మరో థ్రిల్లర్ బ్లడ్ హౌండ్.
స్వాతంత్ర్యానంతరం, అత్యంత కిరాతకులుగా పేరుపొందిన మిజో జాతి ఆటవికులను నయనాభయానా లొంగదీసుకుని వారిని మిజో రిజర్వేషన్ పరిధిలో ఉంచింది ప్రభుత్వం. కానీ కొన్నేళ్ళకు ఆ తెగవారు మళ్ళీ ఆయుధాలు ధరించి జనాలను ఊచకోత కోయసాగారు. కారణాలు తెలుసుకుందామని వెళ్ళిన మిలిటరీ అధికారులపై సైతం దాడి జరిగింది. దేశద్రోహులెవరో వారిని ఎగదోస్తున్నారని ఆర్మీ అధికారులు గ్రహించారు. ఆటవికులకి మద్యం అలవాటు చేసి వారితో ఎవరో నాగరికులే దాడులు చేయిస్తున్నారని తెలుస్తుంది.
ఆ పరిసరాల్లో ఉన్న షాడో పరిస్థితి తీవ్రత గ్రహించి ఆర్మీ అధికారులను హెచ్చరిస్తాడు. అక్కడ్నించి బయల్దేరి వచ్చేస్తుండగా, మిజో జాతీయులు మరో మారణకాండ కొనసాగించడంతో, షాడో జోక్యం కలిగించుకోవాల్సి వస్తుంది. “వందమంది దుండగులను పట్టుకోవడానికి ఒక బెటాలియన్ సైన్యాన్ని పంపిస్తే అందరూ వెక్కిరించరా? మిజో జాతి కళ్ళలో మనం చులకనై పోమా?” అని ఆర్మీ అధికారులు సంశయిస్తుంటే, షాడో రంగంలోకి దిగక తప్పదు.
మిజో జాతి గెరిల్లాల వెనుక ఉన్న నాగరీకుడు ఎవరు? ఆటవికులను ఎగదోయడంలో రహస్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి.
ఆసాంతం ఆసక్తిగా సాగిపోయే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ను అనుసరించండి.
కొల్లూరి సోమ శంకర్
కినిగె బ్లాగు: కమాండర్ షాడో
ప్రఖ్యాత డిటెక్టివ్ నవలల రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో థ్రిల్లర్ నవల “కమాండర్ షాడో“.
మన దేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన నది బ్రహ్మపుత్రానది. ప్రతీ ఏడాదీ ఈ నదికి వచ్చే వరదల వల్ల వేలాది మంది మృత్యువాత పడుతూంటారు. ఎన్నో వేల ఎకరాల పంట నాశనం అవుతుంటూంది. దీనికి విరుగుడుగా బ్రహ్మపుత్రానదిపై ఆనకట్ట నిర్మించాలని తలపోస్తుంది ప్రభుత్వం. అయితే నదీ పరివాహక ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం కావడం వల్ల, ఆనకట్టకి సరైన స్థలాన్ని అన్వేషించడానికి ఆర్మీ అధికారులను పంపుతుంది. కల్నల్ రాంప్రసాద్ నాయకత్వంలో వెళ్ళిన బృందం మాయమవుతుంది. వారిని వెదుకుతూ వెళ్ళిన కమాండర్ త్రిపాఠీ నాయకత్వంలోని మరో బృందం ఆచూకీ తెలియకుండాపోయింది. బ్రహ్మపుత్రానది వారిని మింగేసిందా? లేక ఆ ప్రాంతాల్లో తలదాచుకునే బందిపోట్లు వారిని హతమార్చారో ఎవరికి తెలియలేదు.
చివరకి ప్రధానమంత్రి ఈ రెండు బృందాలను సంరక్షించే బాధ్యతని షాడోపై ఉంచారు. మిలిటరీ నుంచి కాప్టెన్ హిమానీ అనే ఇంజనీరు కూడా బయల్దేరాడు.
మిలిటరీ అధికారులు ఏమాయ్యారు? చనిపోయాడని అందరూ భావించిన బందిపోటు దొంగ బేలూ సింగ్ బతికే ఉన్నాడా? మిలిటరీ అధికారులు సైతం నెగ్గుకురాలేని చోట షాడో ఎలా విజయం సాధించాడు? షాడోకి ఎవరెవరు సాయం చేసారు? షాడో బందిపోట్ల ఆటలను ఎలా కట్టించాడు?
ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే. ఆసక్తిగా సాగిపోయే కథనం పాఠకులని కట్టిపడేస్తుంది.
ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈక్రింది లింక్ నొక్కండి
కొల్లూరి సోమ శంకర్
2012-02-01
నాగబ్రహ్మారెడ్డి: అందరికి ఆరోగ్యమస్తు
కినిగె బ్లాగు: ‘బ్లాగ్’ వనంలో విరబూసిన జాజి పరిమళాలు
మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు పుస్తకం పై ది. 29 జనవరి 2012నాటి ఆంధ్రభూమి దినపత్రిక -అక్షర పేజీలో ” ‘బ్లాగ్’ వనంలో విరబూసిన జాజి పరిమళాలు” అనే శీర్షికతో ఓ సమీక్ష ప్రచురితమైంది.
అందమైన గతానికీ, ప్రస్తుత అయోమయానికీ మధ్య ఒక వారధి కట్టిన కథలేవైనా పాఠకులని సులువుగా ఆకట్టుకుంటాయని సమీక్షకులు సాయి పద్మ మూర్తి అభిప్రాయపడ్డారు. మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు అలాంటివేనని అంటూ, ‘‘పెరస్పెక్టివ్’’ ప్రచురణల ద్వారా ప్రచురితమైన ఈ బ్లాగ్ కథలు మనల్ని హడావిడి పెట్టవని, నిశ్శబ్దంగా మన హృదయాల్ని కొల్లగొడతాయని అన్నారు సమీక్షకులు .
ఈ బ్లాగ్ కథలను చదువుతుంటే చెఖోవ్ కథలు గుర్తొస్తాయని, ఒక ఫ్లాష్ లాంటి కొసమెరుపు, చమక్కు ఉండటం వీటి ప్రత్యేకత అని అన్నారు సమీక్షకులు .
మనందరి ఉరుకుల పరుగుల జీవితాల్లో, పెద్ద పెద్ద కథలు చదవటం కష్టం అయిపోతోంది.. బరువైన పుస్తకాల వైపు ఆశగా చూస్తూ.. పుస్తకం సైజు చూసి చదవలేకపోతున్నాం అనే వాళ్ళకి.. గడిచిపోతున్న జీవితాన్ని, మోడువారిపోతున్న ఆశల తోటలకీ, తామే తోటమాలులు ఎలా కావాలో సూటిగా, సరళంగా చెప్తుందీ పుస్తకం అని సమీక్షకులు పేర్కొన్నారు.
పూర్తి సమీక్షని ఈ లింక్లో చదవగలరు.
జాజిమల్లి బ్లాగ్ కథలు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
జాజిమల్లి బ్లాగ్ కథలు On Kinige

కినిగె బ్లాగు: నిరుపేద జీవితాల నిలువెత్తు చిత్రాలు
వేంపల్లి షరీఫ్ రాసిన కథల సంపుటి “జుమ్మా” పై “నిరుపేద జీవితాల నిలువెత్తు చిత్రాలు” అనే శీర్షికతో 29/01/2012 నాటి ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీలో సౌభాగ్య సమీక్ష ప్రచురితమైంది.
ఈ పుస్తకంలోని 12 కథలు వ్యధార్థ జీవిత యథార్థ గాథలని, రచయిత ఎట్లాంటి ఉద్వేగాలకు, సెంటిమెంట్లకు లోనుకాకుండా కథల్లో తను భాగమయిన దయనీయ పేదతనాన్ని కళ్ళముందు నిలిపారని సమీక్షకులు పేర్కొన్నారు. కథలల్లడానికి ఈ రచయితకి చిన్న సంఘటన, చిన్న సమస్య అందితే చాలని, దానికి చిత్రిక పడతాడని సౌభాగ్య అన్నారు.
ఈ కథలలో చిన్ని వస్తువులు, అల్పమయిన అవసరాలు కూడా అమర్చుకోలేని, తీర్చుకోలేని జీవితాల్ని చూసి చదువరుల గుండె ఝల్లుమంటుందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు.
సహజమయిన భాషతో సహజమయిన ఆవిష్కరణతో పాఠకులని ఆశ్చర్యానికి లోనుచేసే కథలివి. ప్రపంచీకరణలో నాశనమవుతున్న గ్రామీణుల జీవితాలివి.
పూర్తి సమీక్షని చదవడానికి ఈ లింక్పై నొక్కండి
జుమ్మా కథల సంపుటి ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
2012-01-31
amayakapu bharta: పెళ్ళాం తీర్చిన కోరిక!!
Prabhava ప్రభవ: చివరి జీవి
శిరా కదంబం: భీష్మ ఏకాదశి.. ఇంకా.........
2012-01-30
Hyderabad Book Trust: విస్తృత చర్చకు విశేష ప్రతిపాదనలు - 'రూపంసారం: సాహిత్యంపై బాలగోపాల్ ' -2 ... కె.కె.రంగనాథాచార్యులు ...
లీలామోహనం: రథ సప్తమి శుభాకాంక్షలు
2012-01-29
ఉదయించే సూర్యుడు: జ్ఞాపకం కాదు జీవితం
Gurukrupa: వసంత పంచమి / శ్రీ పంచమి
2012-01-27
కినిగె బ్లాగు: శీలమా? అదియేమి?
అనామకుడు అనే కలంపేరుతో డా. ఎ. ఎస్. రామశాస్త్రి రాసిన కథా సంకలనం – “శీలమా? అదియేమి?“.
సిద్ధాంతాల మూసకట్టులోంచి కాకుండా విశాల జీవితానుభవం నుంచి వచ్చిన కథలివి. ఇందులోవి చాలా వరకు బహుమతి పొందిన కథలే. ఇందులో మొత్తం 21 కథలున్నాయి. కొన్ని కథల గురించి ప్రస్తావిస్తాను.
అనంతం: ఈ కథలోని ప్రధానపాత్ర రామ్మూర్తికి హఠాత్తుగా తను చచ్చిపోతాననే భయం పట్టుకుంటుంది. కొడుకు కోడలితోనూ, మనవడితోనూ, మిత్రబృందంతోనూ ఉల్లాసంగా ఉండలేక పోతాడు. ఎప్పుడూ అదే దిగులు….. మానసికంగా కృంగిపోతుంటాడు. భయాన్ని దూరం చేసుకోడానికి వీలైనంత సేపు సముద్రపుటొడ్డున కూర్చుంటుంటాడు. చివరికి, చావుకి భయపడేకన్నా, చచ్చిపోవడమే నయమని భావించి సముద్రంలోకి నడవబోతాడు. అప్పుడో పదహారేళ్ళ అమ్మాయి ఎదురై అతన్ని ఆపుతుంది….. జీవితం వైపు నడుపుతుంది. ఆసాంతం ఆసక్తిగా సాగిపోయిన ఈ కథలో సముద్రం గురించి, కెరటాల గురించి రాసిన వాక్యాలు చదువుతూంటే మనమూ సముద్రం ముందు బీచ్లో కూర్చున్నట్లుంది.
అసంపూర్ణం: ఇది ఇద్దరు బావామరదళ్ళ కథ. బావ (కథకుడు) బాగా చదువుకుని గొప్ప శాస్త్రవేత్త అవుతాడు. అతనికెంత సేపు విజ్ఞానం మీదే దృష్టి! ప్రకృతిని ఆస్వాదించేంత సమయమూ, ఆసక్తి, భావుకత లేవు. ఇందుకు భిన్నంగా, మరదలు శైలజ భావుకురాలు. ప్రకృతిని ఆస్వాదించలేని బావ స్వభావాన్ని అర్థం చేసుకున్న ఆమె అతనికి తనకి జోడీ సరిపోదని గ్రహించి అతనితో పెళ్ళికి నిరాకరిస్తుంది. ఇద్దరూ వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకుని తమ జీవితాలను గడుపుతూంటారు. కథకుడు తను ఎంచుకున్న రంగంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడు. అయినా అతనిలో ఏదో అసంతృప్తి. కొన్నేళ్ళ తర్వాత ఓ ఫంక్షన్లో బావామరదళ్ళు కలుస్తారు. మరదలితో తన బాధని వ్యక్తం చేస్తాడు. బదులుగా, మరదలు నవ్వుతుంది. ఆ నవ్వులో అతనికి ఎన్నో అర్థాలు గోచరిస్తాయి. మనుషులను అర్థం చేసుకోకబోతే, ఏం జరుగుతుందో ఈ కథ చెబుతుంది.
ఆరంభం: ఓ పౌరాణిక గాధ ఆధారంగా అల్లిన కథ ఇది. వసుదేవుడు కృష్ణుడిని రహస్యంగా రేపల్లెకి తీసుకురావడం గురించిన కథ. ఓ గడ్డపాయన బుట్టలో బాబుని పెట్టుకుని యమునానదిని దాటి రేపల్లె వస్తాడు. దార్లో ఎదురైన ఓ అవిటి బాలుడిని ఊరిపెద్ద ఇల్లెక్కడ అని అడుగుతాడు. కుంటి బాలుడు నందుడి ఇంటికి దారి చూపించడంతో పాటు, వర్షంలో బాబు తడవకుండా గొడుగు వేసి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లారి నిద్రలేచేసరికి అతని శారీరక వైకల్యం పోయి, కాలు బాగయిపోతుంది. దైవం లీలలని ఉద్దేశించి రాసిన కథ ఇది.
ఏ గాలెటు వీస్తుందో: ఓ ఆర్థికవేత్త కథ ఇది. దేశంలో వడ్డీరేట్లు తగ్గాలని, అప్పుడే మన దేశం ఆర్ధికంగా పురోగతి సాధిస్తుందని నమ్మే అతను, పెన్షన్ డబ్బులపై వచ్చే వడ్డీ సరిపోక ఇబ్బందులు పడుతున్న మావయ్య కుటుంబాన్ని చూడాడానికి వస్తాడు. తను చెప్పే సిద్ధాంతం వారి జీవితాన్ని క్రుంగదీస్తుందోని గ్రహిస్తాడు. మరి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడా, లేదా? చిన్నప్పుడు తనకి సాయం తన వృద్ధికి దోహదం చేసిన మావయ్యకి ఇప్పుడతను ఏమైనా చేయగలిగాడా? ఆర్ధికవేత్త దృక్పథానికి, సామాన్య మధ్యతరగతి మహిళ దృక్కోణానికి మధ్య ఉండే వైరుధ్యాన్ని ఈ కథ చక్కగా వ్యక్తీకరించింది.
ఓ అజ్ఞానం లోంచి: ఇది ఓ పాత్రికేయుడి కథ. ఒక రచయిత గురించిన కథ. రెండు సుప్రసిద్ధ నవలలు రాసి, ఆ తరువాత విరమించి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతున్న ఆ రచయితని ఇంటర్వ్యూ చేసి ఓ వ్యాసం రాయలనేది విలేఖరి ఉద్దేశం. ఆ రచయిత ఎవరు? ఆ విలేఖరి సంకల్పం నెరవేరిందా?
ఓ వందనోటు కథ: డబ్బు నల్లధనంగా ఎలా మారుతుందో సోదాహరణంగా తెలియజేసిన కథ ఇది. “నల్ల ధనం నిరోధించడం ప్రభుత్వం, బ్యాంకులు చేసేపని కాదు. నల్లధనం ఉండకుండా ఉండాలంటే కరెన్సీ నోట్లను కాదు తెలుపు చేయాల్సింది….. మన మనస్సులను..” అంటుందీ కథ.
క్రైం 2000: ఇంటర్నెట్ ఆధారంగా చేసే సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ, బ్యాంకు దొంగతనం సులువుగా ఎలా చేయచ్చో ఓ కుర్రాడు నిరూపిస్తాడు. అయితే మరో కుర్రాడు అంతే తెలివిగా ఈ నేరాన్ని నిరూపించి పోలీసులకు సాయం చేస్తాడు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రతీ ఒక్కరు ఎంత అప్రమత్తత ఉండాలో ఈ కథ చెబుతుంది.
గూళ్ళు: విపరీతంగా పెరిగిపోతున్న అపార్టుమెంట్ సంస్కృతిలో, ఓ ఫ్లాట్లో ఉంటున్న ఓ యువజంట కథ ఇది. వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వారి జీవితం ఎలా సాగుతోందీ, మార్పు కోసం ఏం చేయాలనుకున్నారు… ఇలా ఈ కథ ఆసక్తిగా సాగుతుంది. ఈ కథలోని చాలా సంఘటనలు మన అందరి జీవితాలలోనూ తారసపడేవే.
తెరవెనుక: ఇదో చక్కని కథ. మనిషికి తప్పు చేయాలనే ఆలోచన ఎందుకు కలుగుతుంది? తప్పు అనే భావన ఆలోచనలో ఉంటుందా? ఆచరణలో ఉంటుందా? వ్యక్తిగతంగా మనుషులకి ఉండే పిరికితనమే సమాజానికి లాభదాయకమా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ఆలోజింపజేస్తుందీ కథ.
మీ: స్వర్గస్తుడైన తండ్రికి ఉత్తరం రూపంలో నివాళి అర్పించిన కొడుకు కథ ఇది. మనసు ఆర్ద్రమైపోతుంది ఈ కథ చదివాక.
మెరీనా…మెరీనా: ” ఏదో వస్తుంది… ఇంకేదో పోతుంది. ఓ దశ నుంచి ఇంకో దశకి ఎదగడం…. ఇదే జీవితం” అని ఈ కథ చెబుతుంది. స్వేచ్ఛలోనే ఆనందం ఉందనుకునే వ్యక్తి, బాధ్యతలోనూ ఆనందం ఉందని తెలుసుకుంటాడీ కథలో.
విముక్తి: మరణానికి దగ్గరగా ఉండి, ఇంకా మృత్యుఘడియలు సమీపించని వయోవృద్ధులుండే కుటుంబాలు ఎదుర్కునే సమస్యల గురించిన కథ ఇది. మనుషుల అవసరాలు, మనస్తత్వాలు బంధాలను ఎలా నిర్దేశిస్తాయో ఈ కథ చెబుతుంది. నిడివి ఎక్కువైనా చివరిదాకా ఆసక్తిగా చదివిస్తుంది.
శీలమా? అదియేమి?: శీర్షికలోనే కథ ఏమిటో చెప్పేసే కథ ఇది. శీలమంటే ఏమిటో విశ్లేషించారు రచయిత ఈ కథలో. ప్రగతి అంటే బాహ్యాలంకరణ కాదని, ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ పురోగతి కావాలని రచయిత అంటారు. ఈ కథలో రచయిత విశ్వనాధ సత్యనారాయణగారి వాడుక భాష వంటి గ్రాంథిక భాషను ఉపయోగించే శైలిని వాడడానికి రచయిత ప్రయత్నించారు.
రచన శైలి ఆహ్లాదంగా ఉంటూ, ఆసాంతం హాయిగా చదివించే గుణం కలిగిన ఈ కథలు చదువరులలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. మంచి కథలని చదివిన తృప్తి పాఠకులకు కలుగుతుంది. ఈ పుస్తకం ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.
కొల్లూరి సోమ శంకర్
Gurukrupa: రధసప్తమి (2)
2012-01-26
కినిగె బ్లాగు: స్వీట్ హోం
స్వీట్ హోమ్ నవల మొదటి భాగం 1967లోనూ, రెండవ భాగం 1968లోనూ, మూడవ భాగం 1999లోనూ వెలువడ్డాయి. 2004లో ఈ మూడు భాగాలూ కలిపి ఒకే సంపుటంగా వెలువడింది.
ఈ నవల విమల, బుచ్చిబాబు అనే భార్యభర్తల కథ. బుచ్చిబాబుకి, ‘భర్త స్వభావం’ లేదు. భార్య మీద పెత్తనాలు చెయ్యడం, ఆధిక్యత కోసం తహతహలాడడం చెయ్యడు. విమలకి కూడా ‘భార్య స్వభావం’ లేదు. భర్త ముందు పిరికిగా, జంకుగా లొంగుబాటుగా ప్రవర్తించదు. ఇద్దరూ చనువుగా, స్నేహంగా ఉంటారు.
కొంతమంది మనుషులు తెలియకే తప్పులు చేస్తారు. తప్పు చేసినట్టు తెలుసుకుగాని దాన్ని సరిజేసుకోడానికి తహతహలాడుతారు. విమలా బుచ్చిబాబు అలాంటి వాళ్ళే. మరి వీరి కథ చదువుకోడం, వీళ్ళని తెలుసుకోడం పాఠకులకు ఆసక్తిగా ఉండదూ?
సంసారంలో కలకాలం కలసిమెలసి సాగేందుకు, నిండైన జీవితం గడిపేందుకు భార్యభర్తలు ఎలా నడుచుకోవాలో సూచించే కథ ఇది. కథ హాస్యంగా సాగుతూనే, భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలో, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతుంది.
ఒక ఇల్లు నిజంగానే స్వీట్ హోమ్ అవ్వాలంటే, స్త్రీ పురుషులిద్దరూ చాలా జ్ఞానవంతులై వుండాలి, మంచి చెడ్డల విచక్షణ గల వాళ్ళై వుండాలని అంటారు రచయిత్రి.
స్వీట్ హోం నవల ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెపై. వివరాలు ఇక్కడ
2012-01-25
కలల బాటసారి కవితాపథం: నాకు గణతంత్రదినోత్సవానికి వచ్చిన బహుమతి...
amayakapu bharta: షాపింగ్ 'కాంప్లెక్స్'
నా తలపులు: ఈ ప్రపంచంలో మన ఉనికీ ఎప్పుడూ ఒంటరిదే!
2012-01-24
జగ్నే కీ రాత్: అసంపూర్తి జీవితాలు ‘ఆధూరె’
కినిగె బ్లాగు: తెలుగు కథ హద్దులు చెరిపిన డయాస్పోరా
సాయి బ్రహ్మానందం గొర్తి కథాసంకలనం “సరిహద్దు“పై 19 అక్టోబరు 2011 నాటి నవ్య వారపత్రికలో సమీక్ష ప్రచురితమైంది. సమీక్షకులు సి. ఎస్. ఆర్.
సాయి బ్రహ్మానందం అమెరికాలో స్థిరపడిపోయి ప్రతిభావంతంగా రాస్తున్న బహుకొద్దిమంది రచయితల్లో ఒకరు.
సాయి బ్రహ్మానందం కథలలో కొన్నింటిని చదవగానే అవి ఎంత కలవరపెడతాయంటే, మిగిలిన కథల్ని వెంటనే చదవడానికి మనసొప్పుకోదని సమీక్షకుడు అభిప్రాయపడ్డారు. ఈ సంకలనంలోని దాదాపు కథలన్నీ స్త్రీల జీవితాలు, వారి సమస్యల చుట్టూ పరిభ్రమిస్తాయి.
జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు జీవం పోసి, పాత్రలను సృష్టించి వాటిని మన అంతర్లోకాలకు తోడ్కొనిపోయి రచయితగ తన మనోధర్మాన్ని ఎరుకపరచడంలో కృతకృతులయ్యారని సమీక్షకులు అన్నారు. ఈ కథలింత బావుడండానికి కారణం రచయిత శైలితో పాటు, చిన్న చిన్న వాక్యాలలో పెద్ద పెద్ద జీవిత సత్యాలను సున్నితంగా చెప్పడమేనని సమీక్షకులు భావించారు.
పూర్తి సమీక్షని ఈ లింక్లో చదవగలరు.
ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ నొక్కండి.
2012-01-23
జగ్నే కీ రాత్: జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతం -జిలుకర శ్రీనివాస్ ('అధూరే' పై ఆంధ్రజ్యోతి లో చర్చ)
Hyderabad Book Trust: తాత్త్విక ప్రయాణంలో సాహిత్య చర్చ - కె.కె.రంగనాథాచార్యులు ...
2012-01-22
కమనీయం: sooktulu
నాతో నేను నా గురించి...: అమ్మ లేని మరో ఏడాది.
2012-01-21
చిన్ని ఆశ: వందంటే మాట(పా) లా?
2012-01-20
అందమైన లోకం.: ఆహా ఎంత అందం....
2012-01-19
మానస - నా హ్రుదయం పలికే పదాలు: ఎలా చెప్పను...!!!
2012-01-17
ముక్తలేఖ: అన్ని రకాల కాల్క్ లేటర్లు... ఇక్కడ
2012-01-16
చిన్ని ఆశ: "చిత్రించా చెలీ" నా మనోఫలకం పై నిను శాశ్వతంగా...
2012-01-15
నాతో నేను నా గురించి...: సంక్రాంతి శుభాకాంక్షలు
2012-01-14
యుగళగీతం: కాదా!! అవునా!! ఏమంటారు?!
కినిగె బ్లాగు: బ్లాగు పుస్తకం బహుమతిగా ఇవ్వండి
బ్లాగు పుస్తకం బహుమతిగా ఇవ్వండి,
బ్లాగు ప్రపంచానికి ఆహ్వానించండి.
బ్లాగులు రాయాలని ఉండి మార్గదర్శకత్వం కోసం చూసేవారికి,
బ్లాగులు రాయాలని ఉండి అందులోని మంచి-చెడు ఆలోచిస్తూండేవారికి
సహాయకారిగా ఉండటానికి, బ్లాగు పుస్తకం మీ కోసం సిద్దంగా ఉంది.
ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి మీ ప్రియమైన వారికి బ్లాగులని పరిచయం చెయ్యండి.
భారతదేశంలో ఎక్కడికైనా ప్రింట్ పుస్తకాన్ని కూడా పంపించవచ్చు. వెల 26% తగ్గింపు తరువాత కేవలం 170/- రూపాయలు మాత్రమే. షిప్పింగ్ పూర్తిగా ఉచితం. ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడే దర్శించండి బ్లాగు పుస్తకం.
రచన –
మనసులో మాట బ్లాగరు – సుజత
సత్యాన్వేషణ బ్లాగరు – రహ్మాన్
టెక్నికల్ ఎడిటర్ – కిరణ్ కుమార్ చావా
మనస్సుచంచలమైన మనస్సును లయింప జేసుకోవటం, విషయవాంఛలవైపు ఆకర్షించే ఇంద్రియాలను నిగ్రహించుకోవటంశారీరక, మానసికారోగ్యాలు బాగుండాలంటే సుఖనిద్ర అవసరం. నిద్రలేమితో బాధపడే వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక సన్నివేశం ఉంది.
. ఎవడు సుఖంగా నిద్రిస్తాడు? – సమాధినిష్ఠుడు.
2. మేల్కొనినవాడెవ్వడు? – సదసద్వివేచన కలవాడు.
3. శత్రువులెవరు? – మన ఇంద్రియాలే.
4. మిత్రులెవరు? – జయింపబడిన ఆ ఇంద్రియాలే.
ఈ శ్లోకంలో నాలుగు ప్రశ్నలు, నాలుగు సమాధానాలు ఉన్నాయి. వాటిని గమనిద్దాం.
ఆలస్యంగా వచ్చి, పోస్టంతా చదివి, నోరు మూసుకుని ఊరుకోక ఈ బొక్కలు వెదికే కార్యక్రమం ఏమిటీ… అని మీరు తిట్టుకున్నా… అందమైన కథనంలో పలుకురాళ్ళు ఉండడం సరి కాదని… ఈ చిన్న సూచనలు. సహృదయులూ, రసజ్ఞులూ కాబట్టి భరిస్తారని….!
మూడో పేరా : తెలుగు పలుకుబడి అది కాదేమో… అలాంటి పలుకుబడికి సంస్కృతం, ఆంగ్లాల్లో వచ్చిన అందం తెలుగులో రాదని అనిపిస్తుంది నాకు.
దీర్ఘ నిట్టూర్పు … దుష్ట సమాసం కదా.
భావి తరాలు… మోపనున్నారో కాదు, “మోపనున్నాయో”
సాధారణ విల్లు … ఇదీ దుష్ట సమాసమే
విరచలేదని …. తప్పు తప్పు … “విరవలేదని” అని కదా ఉండాలి.
ఎవరో ఒక మీ మిత్రుడన్నట్టు మధ్యలో కథనం కొంచెం బలహీనమయినా.. మొత్తంగా చాలా అందంగా ఉంది. తనువతా విరుచుకు ముక్కలవడం … అద్భుతమైన ఊహ.









