2010-09-08
శ్రీ లలిత: ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్?
"Osaamaa....": దండుమారాజులు
చాకిరేవు: నిన్నటి తరం చేసింది క్రోనీ క్యాపిటలిజం
మీతో చెప్పాలనుకున్నా!!!: ” రాధమాధవ్ గద్య కవితలు ”
” ఋతు పయనం ”
“శిశిరం”లో చెట్ల లేచిగుళ్ళు మొగ్గలవుతున్నాయి,
పెళ్ళికూతురైన ఆ కన్నియ సిగ్గులు,మొగ్గలవుతున్నాయి;
నవదంపతులైన మా జంట మనసులలో
కోరికలు సిగ్గులుదాటి మొగ్గలవుతున్నాయి,
అందులో ఓ కోరిక ఓ బిడ్డని కనాలని;
“వసంతం” రానే వచ్చింది,
వస్తూ,వస్తూనే మా ఒడిలోకి ఓ బిడ్డని తెచ్చింది,
మా జీవితాల్లోకి ఓ కొత్త వసంత శోభను తెచ్చింది;
తాను రావాల్సిందేనని భీష్మించింది “గ్రీష్మం”,
తాపం ఓపలేకున్నాం,
ఆపలేకున్నాం మా బిడ్డడి ప్రతాపం;
ఓపలేని మా తాపాలను ఆపాలని వచ్చేసింది ” వర్షం “,
పరుగున పారింది, పొంగింది, అలసింది,
కలసింది సముద్రంలో,
మా దంపతుల వయసూ పారింది, పొంగింది;
చిక్కటి, చక్కటి, చల్లని వెన్నెలను కురిసే,
“శరదృతు”వచ్చేసింది,
జీవితం వయసు పొంగులను చూసేసింది,
చల్లబడింది, సేదదీరుతున్నది, ఆనందిస్తున్నది;
“హేమంతం” వచ్చేసింది,
పులి కొరకక పోయినా,
నే కొరకక వుంటానా అంటూ ఉరికింది చలిపులి,
నీటిని గడ్డ కట్టించింది,
మా వయసుకూడా గడ్డ కట్టిందనిపించింది,
చిగురించి, వికసించిన మా దంపతుల జీవిత పుష్పం,
ముకుళించి, రాలటానికి సిద్దమైంది,
బాధ ఎందుకూ? అంతా ఆనందమే కదా!
రాలిన చోటే కదా కొత్త చివుళ్ళు పుట్టేది!!
మళ్ళీ “శిశిరం” వస్తున్నది,
మా “శిశిరం” కూడా మొగ్గ తొడుగుతున్నాడు.
Filed under: సాహిత్యం (Literature-Poetry)
చాకిరేవు: పాదయాత్రతో ప్యాలస్ …….
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: ఒక అమ్మాయి
2010-09-07
అమ్మ ఒడి: ఈ రోజు ప్రశంసలు – రేపు విమర్శలు ! [భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా కుట్ర – 23]
పిచ్చాపాటి: చక్రపాణి సినిమా లో ఒక చక్కని హాస్య సన్నివేశం
2010-09-06
పున్నమి: ఆంధ్ర అవతార్
అది 2050 వ సంవత్సరం..తెలుగు వారికి చీకటి రోజులు.. అప్పటికి కూడా పోలేదు. వేర్పాటు రాబందులు ప్రజలను కాల్చుకు తింటున్న రోజులు..తెలంగాణా కోసం kcr ముని మనమడు జూ జూ కెసిఆర్ గారు(జూనియర్ జూనియర్ కెసిఆర్ అని చదువుకోవాలి ) జ్జ్జై తెలంగాణా..జై జ్జ్జై తెలంగాణా. అంటూ పాత చింతకాయ పచ్చడి తింటూ నిరాహార దీక్ష చేస్తున్నాడు.
మా ముత్తాత తెరాస వ్యవస్థాపకులు…సీ సీ కెసిఆర్ గారికి(సీనియర్ సీనియర్ కెసిఆర్) జిందాబాద్.. అని తెగ ఆయాసం నటిస్తున్నాడు. పని లేని ..ఎ వార్త దొరకని..ఒకే వార్తని పడి పడి ప్రసారం చేసే ..TV 1 ..TV2 TV3.. .TV4 … TV 100 అనే వంద చానెళ్ళు అతనిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
” మా హ్..మా హ్…” అని మూలుగుతూ నీరస పడిపోయాడు జూ జూ కెసిఆర్ గారు
చెప్పండి జూ జూ కెసిఆర్ గారు “మా.. మా ..తరువాత? “అంటూ ఒక లేడీ జర్నలిస్ట్ ఆత్రంగా అడుగుతోంది.
“కవిత ఇప్పుడే కెసిఆర్ గారు మా మా అన్నారు ” ప్రణీత ఫ్రొం duplicate హాస్పిటల్
అంటూ వెంటనే న్యూస్ పాస్ చేసింది ఒక ఔత్సాహిక రిపోర్టర్.
“మా ప్రాంతాన్ని రాయలసీమ ఆంధ్ర వారు దోచుకుంటున్నారు “
“కెసిఆర్ గారు ఏవిధంగా దోచుకుంటున్నారు అని మీరు భావిస్తున్నారు?”
“అదీ..అదీ.. అ .. ఆ ..ఇ ..ఈ ” అని నీళ్ళు నమిలి
“మేము అతి కష్టం మీద తిరుపతి వెళ్తే మేము సమర్పించిన తలనీలాలు అమ్ముకొని వాళ్ళ తిరుపతి ని అభివృద్ధి పరచుకుంటున్నారు ..పైగా ముందు మాకు గుండు గీయకుండా వాళ్లకు గీస్తున్నారు ఇది అన్యాయమ కాదా ని నేను ప్రశ్నిస్తున్నాను?”
“వావ్ ఎంతో కరెక్ట్ గా చెప్పారు కెసిఆర్ గారు.! దీనిపై మీరు ఎం చేయ బోతున్నారు?”
“మేము ఇప్పుడు గోవింద తెలంగాణా గోవింద అనే ఒక వింత పద్దతిలో నిరసన తెలుపుతాము . దీని ప్రకారం మేమే ఇక్కడ ఒక కొండ కట్టుకుంటాం. మా తాత సీ సీ కెసిఆర్ గారి రాయి పెడుతాం.. మా గుండులేవో మేము గీక్కుంటాము”
“ఇంకో పది రోజుల్లో తెలంగాణ రాబోతుంది. ప్రజలారా ఎవ్వరు పన్నులు కట్టొద్దు..బస్సులు తగుల బెట్టండి. పరీక్షలు రాయకండి. రోడ్డు పై వంట చేసుకోండి. ముగ్గులు వేయండి నేను cm ఐన తరువాత మీ పై ఎటువంటి కేసులు లేకుండా చూసుకుంటా .ఈసారి కూడా appsc ని సరిగ్గా జరగనివ్వకండి . మన తెలంగాణా వాటా ఏదైతే ఉందొ ..ఆ 100 శాతం ఇచ్చే దాక పోరాడుదాం. బాగా చదువుకున్న వాడి కంటే ఇక్కడి ఎవడో ఒక చవటకి ఉద్యోగం తెచ్చుకుందాం ఇంకా గోదావరి లో కృష్ణ లో నీరు ఆంధ్ర వారు తాగేస్తున్నారు మన ప్రాంతం లో నీరు సాటి తెలుగు వారు చుక్క కూడా తాగానివ్వకుండా సముద్రం లో కి వదలాలి దీనిపై నేను మా ముత్తాత ను ఆదర్శం గా తీసుకొని గొప్ప రచయితైనా మా నాన్న గారు శ్రీ జూ కెసిఆర్ గారు రచించిన “ఓ ముష్టి వాడ నీది ఒక జన్మేనా ? ” అన్న మా తాత జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకొని తెరాస 100 వ సెలైన్ దీక్ష చేస్తున్నాను. అందులో సెలైన్ దీక్ష చేయడం ఎలా? ముతక వయసులో మంచి పేరు కొట్టి చావడం ఎలా ? వగైరా వగైరా ప్రశ్నలకు సమాధానం సంపాదించాను. ఇక మనల్ని ఎవ్వరు ఆపలేరు రక్తపాతం సృష్టిద్దాం .. ఈ december తరువాత ప్రళయమే ..వివరాలకు www.telangaana.com చూడండి.. మీ సలహాలు సూచనలు www. telangaana.blogg.com లో కామెంట్ల రూపం లో రాయండి ”
“జై తెలంగాణా ..జైజై @౩@౨౪%%^ &*%౬!22@#$%^&*()_ + ……. జై తెలంగాణా”
౮౮౮౮౮౮౮౮౮౮౮౮ ౮౮౮౮౮౮౮౮౮౮౮౮ ౮౮ ౮౮
దయ చేసి గమనించండి
నిజంగా తెలంగాణా వెనక బడి ఉంటె అందరం కలసి బాగుపరచుకుందాం
ఐదు వెళ్ళు కలిస్తేనే పిడికిలి మనమందారం కలిసి ఉంటేనే తెలుగు వారం విడిపోతే అది చారిత్రక తప్పిదం.
విడి పొతే శూన్యం అని అందరికి తెలుసు కాని ఆశ జీవి ఐన మనిషికి అది వస్తుంది ఇది వస్తుంది అని ఆశ పెట్టి తన పబ్బం గడుపు కుంటున్నాడు కెసిఆర్.
తెలుగు వారు అంటే రాయలసీమ వాడు తెలంగాణా వాడు ఆంధ్ర వాడు అని నిర్వచించారు కెసిఆర్ గారు నా వరకు అందరు ఒక్కటే
నాకు తెలంగాణా వస్తే వచ్చే నష్టం లేదు .కలసి ఉంటె వచ్చే లాభం అంతకన్నా లేదు కాని సాటి తెలుగు వారు పరాయి వారై పోతారన్న భాధ తప్ప. తెలుగు భాష ఇప్పుడే ప్రమాదం లో ఉంది..కలసి ఉంటె కాపాడు కోవచ్చన్నది నా బాధ.
కావాలంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణా అని పేరు పెట్టుకుందాం …మనల్ని మనం కాపాడుకుందాం..అవకాశ రాజకీయ నాయకుల ను చెప్పుతో కొడదాం
Filed under: చెంప పెట్టు...అన్ని సెటైర్లు ఒకేలా ఉండవు
మీతో చెప్పాలనుకున్నా!!!: ” శ్రావణమాసం – పూజ ”
శ్రావణమాసం వచ్చేసింది. శుక్రవారం వరలక్ష్మీ పూజకు మా ఇంట్లో ముందు రోజునే ఏర్పాట్లు మెదలయాయి. మా ఆవిడ శుక్రవారంనాటికి ఆఫీసులో సెలవు తీసుకుంది. ఇంట్లో వుండేది నా భార్య, నేనే (ఒక్కతే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది) కాబట్టి, అలంకరణ ఏర్పాట్లల్లో మా ఆవిడ నా సహకారం కోరుతుంది. సరే, నాకు తోచింది నేను చేస్తుంటాను.
క్రితం సంవత్సరం, వైరల్ జ్వరాలు వచ్చి, మేమిద్దరం జ్వరం పడ్డాం. తగ్గిన తరువాత, ఇద్దరికీ మోకాలు నెప్పి వచ్చింది. ఇప్పటికి సరిగ్గా సంవత్సరం అయింది. నాకు కొంచెంగానే నెప్పివుంటున్నా, మా ఆవిడకి మాత్రం ఎక్కువగానేవుంది. అందుకనే, ఎక్కువుగా నిలబడి, క్రింద కూర్చొని పనిచేయటం తగ్గించింది. సరే, అసలు విషయానికి వస్తే, గురువారం రాత్రి భోజనాలు అయిన తరువాత, అమ్మవారి అలంకరణ ఏర్పాట్లు మొదలుపెట్టాం. రాత్రి 9.30 కి మొదలుపెట్టితే, 11.30 కి పూర్తిఅయింది పని. మా ఇంట్లో వున్న ఒక మట్టి జింక బొమ్మ (తల భాగం) ను అమ్మవారి విగ్రహంగా మార్పులు చేసాను. దానికి, క్రొత్త చీరెకట్టింది మా ఆవిడ. మూడు అడుగులు ఎత్తుండి, సన్నగా వుండటంతో, చీరె కట్టిన తరువాత, అచ్చు ఒక చిన్నపిల్లకి చీరె కట్టినట్లు వచ్చింది. తల భాగంలో అమ్మవారి ముఖం వున్న వెండి ఆభరణాన్ని పెట్టాం. మర్రోజు, చూసిన వాళ్ళంతా చాలా,చాలా బాగుంది ఈ ఆలోచన, ఈ చీరె కట్టటం అని మెచ్చుకున్నారు. అయితే, ఇది నా ఆలోచనే అని మాత్రం మా ఆవిడ ఎవరికీనూ చెప్పలేదు. ఏంచేస్తాం!!
రాత్రి 9.30 కి అమ్మవారి బొమ్మను పెట్టేచోట మా ఆవిడ, తడితో శుభ్రంచేసి, ముగ్గువేసి, దానిపై పీటవేసి, మళ్ళీ ముగ్గువేసి, ఒక బట్టను పరిచి, దానిపై బొమ్మను పెట్టి, దానికి చీరె కట్టింది. అక్కడికి కొంత పని అయింది. అప్పటికి రాత్రి 10.30 అయింది. ఇక, మండపం మీదకు కావలసిన సరంజామా, సామగ్రి అమర్చాలి. ఈలోపు స్టూలుమీదనే కూర్చున్నా, లేచి, కూర్చొని; మళ్ళీ లేచి ఇట్లా చాలాసార్లు చేస్తుంటంతో మోకాలి నెప్పి ఎక్కువయింది. కుదురుగా కూర్చోలేక పోతున్నది. అప్పటికీ, తను అడిగిన వాటిని కొన్నింటిని నేనే లేచివెళ్ళి తెచ్చి ఇస్తున్నాను ఓపికగా. ఇంక తోరాలు తయారుచేయటం మొదలెట్టింది. దారపుండలో అక్కడక్కడ చిక్కుముళ్ళు పడటంతో తొమ్మిది పోగులు వేయటానికి దారం గబగబా,సాఫీగా రావటంలేదు. దాంతో, కొంత చికాకు మొదలయింది. మరోప్రక్క మోకాలు నెప్పి పెరుగుతున్నది. దాంతో విసిగి, చేతిలోవున్న దారపుండను కోపంగా క్రిందకు విసిరేసింది. అది మాత్రం తక్కువ తినలేదన్నట్టుగా, వెళ్ళి మండపం పీట పక్కనే నూనె పోసి పెట్టివున్న దీపారాధన కుందులకు గట్టిగా తగిలింది. అంతే, అందులోని నూనె అంతా క్రిందపోయింది. ఇక మా ఆవిడ కోపం ఎక్కువై, చిన్న పెట్టున ఏడ్చింది. అరే, ఎందుకు హైరాన పడతావ్, రేపు సెలవేగదా, ఇప్పుడు నింపాదిగా కొంత పని చేసుకొని, మిగిలింది రేపు చేసుకోవచ్చుగదా అని నేను కొంత బుజ్జగించాను. ఇక తను లేచి,క్రిందపడిన నూనెను తుడిచి, శుభ్రంచేసి, మళ్ళీ పని మొదలు పెట్టింది. సరే, నేనుకూడా ఓపికగా తనకు సహకరించాను. ” ఆ మోకాలు నెప్పితో ఇంత హైరానపడి ఈ భారీ ఏర్పాట్లు, ఈ పూజ చేయకపోతే ఏంబోయింది? ఒక కలశం పెట్టి, రెండు పూవులు పెట్టి,నమస్కారం చేసుకొని, కొద్దిమందిని మాత్రమే పేరంటానికి పిలిచి, పూజ పూర్తి చేసుకోవచ్చుగదా? ” అని అందామన్న మాట నా నోటివరకూ వచ్చింది. కానీ, ” పూజ చేసుకొనేది నేను కదా? మీ కిష్టమైతే సహాయం చేయండి, లేకపోతే లేదు ” అని ఖచ్చితంగా అంటుంది. ఎందుకొచ్చిన వాదనలు అని నేను ఏమీ అనకుండా కొంత సహాయం చేసాను. గురువారం రాత్రి ఏర్పాట్లు, శుక్రవారం పూజ, పేరంటాళ్ళ పిలుపులు, వారికి తాంబూలాలు ఇవ్వటం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయేసరికి శుక్రవారం రాత్రి 10.30 అయింది. ఏదో ఇంత అన్నం తిని, అలసిపోయి, మోకాలి నెప్పికి తోడుగా నేనూ వుంటాను అంటూ వచ్చిన నడుంనెప్పితో సహా మా ఆవిడ మంచం మీద నడుంవాల్చింది.
ఇక్కడ నేను కొన్ని విషయాలను గమనించాను. చెప్తాను వినండి. పూజ ఏర్పాట్లకు, అలంకరణకు ఏమేమి వస్తువులు వాడటం జరిగిందో ముందు చెబుతాను:– మండపం పెట్టే చోట తుడవటానికి నీళ్ళు; ఒక బట్ట; ముగ్గుపిండి; ఒక పీట; పీటపైన వేయటానికి ఒక బట్ట; అమ్మవారిగా వాడటానికి ఒక బొమ్మ; అమ్మవారికి కట్టటానికి ఒక కొత్త చీరె, జాకెట్టు; అమ్మవారిది వెండి ముఖం; అమ్మవారికి జడగంటలు; కొన్ని ఇతర నగలు; పూలు; పండ్లు; తమలపాకులు; వక్కలు; పసుపు; కుంకుమ; అక్షితలు; తోరాలు; నూనె; దీపారాధనకు వత్తులు; దీపారాధన కుందులు; కొబ్బరికాయలు; కర్పూరం; హారతి పళ్ళెం; అగరొత్తులు; గంట; అగ్గిపెట్టె; కొబ్బరినీళ్ళూ పోయటానికి గిన్నె; కూర్చోవటానికి చాపలు; పంచామృతాలు; వ్రతకథా పుస్తకం; పేరంటాళ్ళకు ఇవ్వటానికి శెనగలు; సంచులు; ఒక్కపొడి పొట్లాలు; పసుపు,కుంకుమ పొట్లాలు; గంధం; కాళ్ళకు రాయటానికి పసుపుపారాణి; కలశం; గుమ్మానికి కట్టటానికి బంతిపువ్వులు; మామిడి తోరణాలు; పురికొస; దారపుండ; వ్రత పుస్తకం చదవటానికి కళ్ళజోడు; అమ్మవారికి నైవేద్యం పెట్టి, మనం తినటానికోసం : అన్నం, కూరలు, పప్పు, పులిహోర, పొంగలి, గారెలు, అల్లం పచ్చడి, బెల్లం పానకం, వడపప్పు ( ఇవి మొత్తం తొమ్మిది రకాలు ) — వెరసి 42 + 9 = 51 రకాల సరంజామాను ఆమె పూజకు ఏర్పాటు చేసుకోవాలి.
ఇక రెండవ విషయం. శుక్రవారం ఉదయమేలేచి, తలంటు స్నానంచేసి, మహానైవేద్యానికి వంటచేసి, వరలక్ష్మీ వ్రతకథను చదువుతూ, పూజ చేసుకొని, అన్నంతిని, కొంచెంకూడా విశ్రాంతి తీసుకోకుండా, హాల్లో జంపఖానాలు పరచి, సంచుల్లో శెనగలు, పండ్లు, పసుపు, కుంకుమ, తమలపాకులు పెట్టి, వాటన్నిటినీ వరసగా ఒక బల్లపై సర్ది, తాను మూడు గంటలకల్లా ముస్తాబై, కుంకుం భరిణె తీసుకొని, వుంటున్న కాలనీలో బాగా పరిచయమున్న ఒక పాతికమంది ఇళ్ళకు వెళ్ళి, పిలుపులు పిలిచి, వస్తూవస్తూ, దోవలోనే, కొందరింటికి వెళ్ళి తాంబూలాలు తీసుకొని, తిరిగి ఇంటికి వచ్చి, మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని, ఇంటికి వచ్చిన పేరంటాళ్ళనందరినీ సాదరంగా ఆహ్వానించి, వాళ్ళకు తాంబూలాలు ఇచ్చిపంపి, చివరకు వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసుకుంది మా ఆవిడ. ( గమనిక:- ఇందులో మగవాళ్ళ చేయగలిగిన పనులు ఏమీలేవు సుమండీ!! ). మర్రోజు, అంటే శనివారం ఆఫీసుకు వెళ్ళాలి, కానీ, బడలిక.
పైన చెప్పినంత శ్రమకోర్చి ఈ పూజను చేయాలా? అనేది నా ప్రశ్న. మన పెద్దలు ఇటువంటి వ్రతాలు పెట్టింది, వ్రతం పేరుతో, నలుగురిని పరిచయం చేసుకొని, ఇరుగుపొరుగు వారితో కలిసిమెలసి వుంటూ జీవనం చేయాలని. ఈ విషయంలో నానుంచి ఎటువంటి ఆక్షేపణలూ లేవు. అయితే, పైన చెప్పినట్ట్లుగా, 51 రకాల వస్తు సామగ్రిని కొని, ఏర్చి, పేర్చి, అలంకరణచేసి, చివరకు పూజచేసే సమయానికి వచ్చేటప్పటికల్లా, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క వస్తువు చేతి ప్రక్కనే లేకపోవటం, మళ్ళీ దానికోసం తను లేచి వెళ్ళి తీసుకోవటమో, లేదా ఇంట్లో కూతుళ్ళు వుంటే వాళ్ళను తీసుకురమ్మనటమో, లేదా, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, వెళ్ళిపోయివుంటే, నాలాంటి (మంచి) భర్తను అడిగి (సెలవు పెట్టించి) సహాయం తీసుకోవటమో చేస్తూ, చేస్తూ,చేస్తూ మధ్యలో ఆగిన పూజను మరల కొనసాగిస్తూ, పూజను పూర్తిచేస్తే, మన మనస్సు యొక్క ధ్యాస దేనిమీద లగ్నమయింటుందో మీరే ఆలోచించండి. ఈ వరలక్ష్మీవ్రత పూజే కాదు, సత్యనారాయణవ్రతం, ముఖ్యంగా, పెళ్ళి అయింతరువాత, ఇంట్లో కొత్త దంపతులు సత్యనారానణవ్రతం చేసుకొనేటప్పుడు, ఇతర హోమాలు చేసేటపుడు మనం గమనిస్తే, వ్రతం చేసేవాళ్ళ ధ్యాస ఎక్కువగా కావలసిన వస్తువులపైనా, ఇంటికివచ్చి, పలకరిస్తున్న అతిధులపైనే వుంటుంది. పూజ మాత్రం మొక్కుబడిగా సాగుతుంటుంది. కాదంటారా? పుణ్యం, మోక్షం, శాంతి కలుగుతాయంటారా? ఇట్లా జరగకుండా వుండాలంటే, వేరే మార్గాల్లేవా? రెండు పద్ధతులున్నాయి:–
మొదటి పద్ధతి:- ఏ పూజైతే చేస్తున్నామో, ఆ పూజకు సంబంధించిన దేముడి పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టి, రెండేరెండు పూలు, కొన్ని మామిడి ఆకులు పెట్టి, ఆ పూజకు సంబంధించిన పూజావిధానాన్ని పూజచేసేవాళ్ళే స్వయంగా ఆచరించాలి. దీనివలన, ఇతరులతో మాట్లాడటానికి కుదరదు, ధ్యాస పూజ మీదనే వుంటుంది. వేరేవాళ్ళు అలంకరణ చేయటానికి వుంటేసరి, లేకపోతే, రెండు పూలను పెట్టినా చాలు. అలంకరణ కంటే, భక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి.
రెండవ పద్ధతి:- మొదటి పద్ధతిలో విగ్రహారాధన, దానికి అలంకరణ వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతూవుంటుంది. ఈ పూజల వుద్దేశ్యం ఏమిటి? మనస్సుకు శాంతి, ప్రశాంతత కలగాలనీ పుణ్యం కలగాలనీ, మోక్షం సిద్ధించాలనీ. ఇదేగదా మన లక్ష్యం. మన హిందూ ధర్మాల్లో, విగ్రహారాధన కేవలం మొదటి దశ మాత్రమే. ఎంత వయసువచ్చినా విగ్రహారాధన స్థాయిని మనం దాటమా? దాటద్దా? ఉన్నత స్థాయికి వెళ్ళొద్దా? మరి ఏంచేయాలి? దీనికి ధ్యాన మార్గం ఒక్కటే సరిఅయినది. ఏ మంత్ర, తంత్రాలు లేకుండా, ఎవరి సహాయంలేకుండా, ఏ వస్తు సామగ్రితో పనిలేకుండా చేసే పద్ధతే ధ్యానం. కేవలం నిశ్శబ్దంగావున్న గదిలో కూర్చొని, కళ్ళు మూసుకొని, మన శ్వాసను గమనిస్తూ వుండటమే ధ్యానం. విగ్రహారాధనలో, ఒక్కొక్క పువ్వును లేదా అక్షతలను విగ్రహంపై చల్లుతూ, ” పాదం పూజయామి… హస్తం పూజయామి….” అని అంటూ పూజ చేస్తాం. తరువాత, వడలిపోయిన పూలను తీసిపారేస్తాం. అయితే, ధ్యాన పద్ధతిలో, మీరు లోపలికి తీసుకున్న శ్వాసను ఒక పువ్వుగానే అనుకోని, మీ మనసులోనే వున్న “అంతరాత్మను/పరమాత్మను” ఆ శ్వాస అనే పువ్వుతో పూజించండి. వడలిపోయిన పువ్వును తీసివేసినట్లే, నిశ్వాస రూపంలో శ్వాసను బయటకు పంపండి. మీ శరీరం ముందుగా ప్రాణవాయువు ద్వారా శుభ్రపరచపడుతుంది. రక్తం, ప్రాణవాయువుతో శుభ్రపడి, శరీరంలోని అన్ని అవయవాలకు అందుతుంది. మీ ప్రతి ఉఛ్శ్వాస, నిశ్వాసలద్వారా, రక్తం శుభ్రపడి, పాదం నుంచి తలవరకు అందుతున్నప్పుడు, దానినే, ” పాదం పూజయామి … హస్తం పూజయామి… శీర్షం పూజయామి….” అన్నట్లుగానే భావించుకోండి. కొంత సుదీర్ఘ సాధన తరువాత, మీ శరీరంలోని ఏడు చక్రాలు ఈ శ్వాస ప్రక్రియ అనబడే పువ్వుల ద్వారా తేజోమంతమై, రానురాను అతి తక్కువ పూలతో, అంటే, అతి తక్కువ శ్వాసలతోనే వికసింపబడుతుంది. శరీరంలోని ఏడు చక్రాలు పూలరూపం లోనే వర్ణించబడ్డాయి. ఆఖరిది అయిన, సహాస్రార చక్రం ( పద్మంతో పోల్చబడింది ). ఇది తలలోని మెదడు భాగంలో వుంటుంది. దీనికి వెయ్యి రేకులుంటాయి అని పెద్దలు చెబుతారు. అంటే, అసంఖ్యాకమని చెప్పటం దీని అర్ధం. ఎప్పుడైతే, సహాస్రారమనే పుష్పం, మన శ్వాస ప్రక్రియద్వారా సంపూర్ణంగా వికసింపబడుతుందో, అప్పుడు, మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. శాంతి, సహనం లభిస్తుంది. శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. ఇంతకంటే మించిన మోక్షం ఏ పూజ ద్వారా మనకు లభిస్తుంది? ఏ విధంగానూ ఈ పద్ధతిలో మనం హైరాన పడనక్కరలేదు. అవునుకదా!! మరి వరలక్ష్మీవ్రత పూజ చేసేటప్పుడు, ధ్యానం చేస్తూ కూర్చుంటామా? అని ఎవరైనా అడగవచ్చు. మన ఇంటికివచ్చిన వారందరికీ కొంత వివరణ ఇచ్చి, పది నిముషాలపాటు, అందరం కలిసి అమ్మవారిని ధ్యానం చేద్దామని చెప్పండి. ముందు, ఎదురుగా పటం కనిపించినా, కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల, విగ్రహం మాయమయి, నిగ్రహం కలుగుతుంది. ప్రశాంతత కలుగుతుంది. ఒక క్రొత్త అనుభూతి కలుగుతుంది. వారు వెళ్ళేటప్పుడు, తాంబూలం ఇచ్చి, వెళ్ళిన ప్రతిచోటా ఇదే విధంగా చేయమని చెప్పండి. మరింత లాభం కలుగుతుంది.
గమనిక:– ధ్యానం చేసే పద్ధతులపై మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే, ఈ నా బ్లాగ్ లో ప్రచురితమైన ” ధ్యానం ” అనే వ్యాసాన్ని చదవగలరని ప్రార్ధన. స్వస్తి.
Filed under: ఆధ్యాత్మికం(Spiritual)
మధుమూర్తి: సుప్రభాతం చూద్దాం రండి....
2010-09-05
Life is a way: bharathiram
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: మరపురాని నీ పరిచయం
మనసులో...: మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం
2010-09-04
అమ్మ ఒడి: క్రికెట్లో కూడా సంకేత భాష ! [నిజంగా ఈ పాపం ఎవరిది? – 02]
2010-09-03
కృష్ణా!.......గోవిందా!: శ్రీగిరి శ్రీపతి
2010-09-02
రుచి...the temptation: శనగలతో పాఠోళీ
2010-09-01
పిచ్చాపాటి: మచిలీపట్నం మాయాబజార్ - 2
2010-08-31
శ్రీ లలిత: నీ పదధూళిని కానా ప్రభూ..
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: మనస్సు మైదానం
2010-08-28
"ఓ తెలుగు రాడికల్": రాహుల్ ప్రజాసేవా........
"Osaamaa....": కల్మాడీ.....
2010-08-27
రవ్వల జడి: మదర్ తెరెసా
2010-08-26
"ఓ తెలుగు రాడికల్": ఈనాడు
2010-08-25
2010-08-23
"Osaamaa....": భాగ్యమా--బంగారమా
మధుమూర్తి: అమ్మా బాగున్నాను!!!!
2010-08-22
పున్నమి: కార్పోరేట్ కాలేజా..మజాకా..
అప్పుడే నేను మోదటి సారి జీవితంలో..నిక్కరు వదిలి ప్యాంటు తొడిగాను.. అదీ మా నాన్న కి సరిపోక పోతె..దాన్ని సరి చేసి నాకు ఇచ్చాడు. ఓకటా రెండా.. ఓ పది.. మా నాన్న చిన్నప్పటివి కలిపి. మది లో ఎన్నో ఆలోచనలు eamcet లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలి..ఇంజనీరు అయిపోవాలి..నాలాగె నూనుగు మీసాలతో ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు ఒక మార్కుల మెషీను. ఎవరం ఎవ్వరితో మాట్ల్లాడుకోనె వారం కాదు .తీరిక అంతకన్నా లేదు . నన్ను ఒక పెద్ద కల గూర గంప లో పడేసారు. . 40 మంది సరిపోయె తరగతిలో కేవలం 60 మంది ని కూర్చోపెట్టె వారు..దయార్దహృదయులు..అయ్యోర్లు. class లో ఒక ఫ్యాను ఉండేది. చాలా వేగంగా తిరిగేది…ఒకటొ తరగతి వాడు కూడా నిమిషానికి ఎన్ని సార్లు తిరుగుతుందో లెక్కపెట్టేయొచ్చు. తెల్లవారున 8.00 గం.లకు జైలులోకి వెళ్ళీ పోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 1.10 కి విడుదల..మళ్ళీ టెంచనుగా 2.00 గం.లకు వచ్చేయాలి. ఒకరు పోతె మరొకరు..వాళ్ళూ పోతె ఇంకొకరు.ఇలా దంచు..దంచు ..దంచు.. అని మా దుంప తెంచేవాళ్ళు. మళ్ళీ 5.30 కి మాకు బండెడు హోం వర్కు. రేపు పరీక్ష..లాంటి షరతులతో కూడిన తాత్కాలిక స్వాతంత్ర్యం ప్రకటించేవాళ్ళు. ఇది మా కార్పొరేట్ కాలెజి లెక్క.
ఇక మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఢాం. ఢిం…ఢూం ..తుస్సు మని కెమిస్ట్రీ లో అగాను. మొదటి సారి జీవితంలో ఒటమి ని రుచి చూసాను. ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకో ఇప్పుడు తలచుకుంటే అనవసరంగా చిన్న విషయానికి ఎక్కువ బాధ పడ్డానని అని పిస్తుంది. అలా నాకు నా మొదటి సం. కెమిస్ట్రీ చివరి వరకు తోడుగా వచ్చింది.
నాపై నాకే జాలి వేసేది. అయినా తెలిసీ..తెలియని ఆ వయసులో..కాలేజీకి వెళ్ళాలంటె ఎక్కడ లేని ఉత్సహం నాకు..దీనికి ఒక కారణం ఉంది. మా క్లాసులో రమ్య. అమాయకంగా..రెండు బొట్లతో..చాలా cute గా ..నా ఊహల్లో అమ్మయి అంటె రమ్య నే..రోజు తన వైపు ఆశ గా చూడటం..నా వైపు తను చూస్తె గుండె ఝల్లుమనేది. మాట్లాడదామంటె తెగ భయం. మొన్నామధ్యన ఒక సారి తను కనపడింది.. ఎలా ఉన్నావన్న నా ప్రశ్నకు .. నువ్వెవరన్న ప్రశ్న నాకు ఎదురైంది.
ఓహో.. జీవితం పై విరక్తి అంటె ఇదన్నమాట.
ఒకసారి ఎం జరిగిందంటె మా కాలేజి లో exam paper ఇస్తారని తెలియటంతో, కాలేజి నుండి జంప్ జిలాని.ఇంట్లో కాలేజి కని చెప్పి మా ఊరి మెసానికల్ గ్రౌండు లో కూర్చొన్నా. ఇలా ఈరోజు కాదు రేపు ఇస్తారు రేపు కాదు ఎల్లుండి ఇస్తారని.. ఇలా మూడు రోజులు ఎగరగొట్టాను..కాలేజి వాళ్ళకు అనుమానం రావటంతో ఇంటికి ఫోన్ చేసారు.. నేనెమో కాలేజి కి వెళ్ళానని అబద్దం చెప్పేసాను. మా నాన్న కాలెజి కి రావడం నా అటెండెన్స్ మొత్తం చూసాడు. ఎగరగొట్టటంతో సరిపుచ్చుకోక..మా ఇంటి దగ్గర ఒక STD ఉంది. అక్కడ పని చేసే అతని తో మా ఇంటి కి ఫోను చేయించి.. మీ అబ్బాయి కాలేజీకి వచ్చాడు.. మేమె పొరపాటుగా మీకు ఫోను చేసాము. అని చెప్పించాను. ఇవన్నీ నాన్నకు తెలిసిపోయింది. మా నాన్న నేను ఎప్పుడు fail అయినా..దగ్గర కూర్చోపెట్టుకొని.. నీ సమస్య ఎంటి ? పెన్ను లేదా? ఎదైనా బుక్స్ లేవా..? అది లేదా..? ఇది లేదా..? అని అడిగేవాడు. ఆరోజు కూడా దగ్గర కూర్చోపెట్టుకొని.. “నీ problem ఏంటి..?” అని అడి గాడు. నేను ఏ problem లేదు మొర్రో అంటె తరువాతి ప్రశ్న రెడీగా ఉంటుంది..అయితే కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అని..ఎం చెప్తాం..ఒళ్ళు కొవ్వెక్కి అని చెప్పలేం కదా..మళ్ళీ మా నాన్నే కాస్త గెట్టిగా ” రేయ్ ! నీ problem ఎంటి ? ” అని అడుగు తుంటె సమాధానం లేదని ఒకటే గోల.. అలా నా జీవితంలో నేను చేసిన మొదటి డుప్కితో దొరికి పోయాను.ర్యాంకు సంగతి దేవుడెరుగు, ఇన్నికష్టాల మధ్య నా ఇంటర్ అయ్యిందనిపించా.ఆ తరువాత డిగ్రీ చేరడం, మంచి ర్యాంకు తో MCA జాయిన్ కావడం. జరిగి పోయాయి.
కౌమార దశ..చాలా విచిత్రంగా ఉంటుంది. అన్నీ తెలిసినట్టు. ..కొంత తెలీనట్టు..కొంత తెలిసినట్టు ఎమీ తెలియనట్టు తెలిసీ.. తెలియని ..అమాయకత్వంతో..ఉంటారు. నూనుగు మీసాలను చూసి మురిసి పోతారు. అంతె కాదు..ఇంకా మీసాలు రాని వారిని చూసి త్రిప్పుతారు. అప్పుడె వయసుకి వచ్చిన లేత అమ్మాయిలు, వారిని దొంగ చూపులు చూసే అబ్బాయిలు. వారి వెషధారణ గురించి, శరీరాకృతి గురించి రకరకాల ఆలోచనలు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళను ఆ దశలో చాలా జాగ్రత్తగా గమనించాలి..మన దేశంలో ఆ వయసులో మార్పుల గురించి..తల్లి దండ్రులతో చర్చించే అవకాశం తక్కువనే అంటాను కాదంటారా..? ఆ వయసులొ మన పెద్దవాళ్ళూ మానసికంగా మనం ఎదగాల్సినంత మనల్ని ఎదగనిస్తున్నారా..? ఎమో..
*శ్రీ*
Filed under: అవీ...ఇవీ
2010-08-21
రవిగారు: ముష్టి ప్రహాసనం
2010-08-20
కృష్ణా!.......గోవిందా!: తితిదే పాలక మండలి
రవ్వల జడి: సంతోషానికి
2010-08-18
'''నేస్తమ్...: ప్రేమించానా...?
2010-08-17
రుచి...the temptation: అరటి దూట( Banana stem ) చేసే మేలు - కొన్ని వంటలు
2010-08-16
గీతాచార్య SSC: పందెం నీదా నాదా... సై, వెంట్రుక "పై"
ప్రసాదం: నా కథలు 4
2010-08-15
నవ్వు: నవ్వు
గీతాచార్య SSC: ఫేన్మనుడి పుస్తకమిది
Tech సంగతులు: మీ blog content చౌర్యం నివారించడానికి
“ఇద్దరు కామెడీ గాళ్ళ పుణ్యాన” Sooooo True.
శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
“ఇంకా ముఖ్య కారణం ఉంది కొన్ని గంటలు మన ఐహిక బాదలు మర్చి పోగలగటం. మనస్సుని రెఫ్రెష్ చేసి కొత్త విధంగా మన జీవి తాన్ని చూసుకో గలగటం. మనవాళ్ళు ఎంత చక్కగా జీవనం లో వీటిని ఇమిర్చారో చూడండి.” — చాలా సరిగ్గా చెప్పారు. వ్యాసం నచ్చినందుకు, ధన్యవాదములు.
భవదీయుడు,
మాధవరావు.
హ్మ్మ్!!
నగేష్ బాబు గారు
చాలా బాగా రాసారండీ
మీరు హెచ్చరించక పోతే మీ వ్యాసం మిస్ అయ్యేవాణ్ణి. మాకు లేబర్ డే ౩ డే వీకెండ్. ఊళ్ళో లేను. దానికి థాంక్స్.
మన వ్రతాలు అవీ పెట్టింది మీరన్నట్లు చుట్టూ పక్కల వారిని పరిచయం చేసు కోటానికి,మన బంధువులతో గడపటానికీను. ఇంకా ముఖ్య కారణం ఉంది కొన్ని గంటలు మన ఐహిక బాదలు మర్చి పోగలగటం. మనస్సుని రెఫ్రెష్ చేసి కొత్త విధంగా మన జీవి తాన్ని చూసుకో గలగటం. మనవాళ్ళు ఎంత చక్కగా జీవనం లో వీటిని ఇమిర్చారో చూడండి.
మీ ధ్యాన పద్ధతి ఆచరించటానికి ప్రయత్నిస్తాను. శ్వాస ప్రక్రియ చాలా ముఖ్యమయినది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.


