2012-02-04
'''నేస్తమ్...: నాన్న...!
2012-02-03
పద్యం - హృద్యం: చిన్మయ రూపిణీ !
రుచి...the temptation: ముల్లంగి చపాతీ
చాకిరేవు: ఓడితే సిగ్గుపడుతాను ఒట్టు
2012-02-02
మోపర్తి వారి కవితలు: వందేమాతరం అని వందనం చేయటం....
మోపర్తి వారి కవితలు: వసంతాల వాకిట కోయిల గానం కరువాయే....
మధురవాణి: ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో..
శ్రీ లలిత: శృతి మించితే...
రుచి...the temptation: బ్రెడ్ ఉప్మా
2012-02-01
2012-01-31
రవిగారు: చాలు చెలి
చాకిరేవు: పగటివేషం అయిన వేళ
2012-01-29
2012-01-27
2012-01-26
Life is a way: కృష్ణ శాస్త్రి - ఒక మధుర జ్ఞాపకం
శ్రీ లలిత: కథాజగత్----కథా విశ్లేషణ--3
పద్యం - హృద్యం: చిన్మయ రూపిణీ !
2012-01-24
రవిగారు: మళ్ళి మొదలయ్యింది
'''నేస్తమ్...: ఈ కధ ఇలా మొదలైంది...
మధురవాణి: మాయదారిపురం గోల్డ్ లోన్
2012-01-23
ツ ♥ హృదయ కవిత ♥ ツ: నీ చిత్రానికి నా భావం
2012-01-22
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: స్నేహం అనేది
మధురవాణి: నీ ప్రేమలో.. నిన్నా, నేడు!
2012-01-21
శ్రీ లలిత: కథాజగత్---కథా విశ్లేషణ--2
2012-01-18
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: మనసుకే తెలియని
సీతారామ్కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: నిన్ను ప్రేమించగలను
2012-01-16
వనితావని వేదిక: శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 36
2012-01-14
మీతో చెప్పాలనుకున్నా!!!: ” సంక్రాంతి శోభ ”
ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ….
ముందుమాట:- సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది పల్లెటూర్లు; పచ్చని పంటపొలాలు; చిరునవ్వులు చిందించే రైతన్నలు. పంటలు సమృద్ధిగా పండి, రైతన్నలు సుభిక్షంగా, ఆనందంగా వుండటం మనం చూసాం; కొన్నిసార్లు కరువుకాటకాలతో రైతన్నలు ఖిన్నులైవుండటాన్నీ చూసాం గతంలో. అయితే, నేటి పరిస్థితులలో, నదీజలాలు తగినంతలేక, నీటి బావులపై ఆధారపడిన రైతు, విద్యుత్ కోతలతో సతమతమవుతూ, ఆత్మహత్యలకు బలిఅవుతున్నాడు. అంటే, సంక్రాంతి కొంత కళను పోగొట్టుకుంటున్నది. ఇది మనందరికీ బాధాకరమే. అయితే, ఇటువంటి పరిస్థితులు రాకుండా, లేకుండా, రైతన్నల జీవితాలలో ఇకనుంచి మళ్ళీ ‘సంక్రాంతి’ వెలుగులు చిమ్మాలని ఆకాంక్షిస్తూ… … … మునుపు నేను చూసి, అనుభవించి, వర్ణించి, ప్రచురించిన ఆ సంక్రాంతి శోభను మరొకసారి మీముందుకు తీసుకువస్తున్నాను. ఇక ముందుకు చదవండి …
సంక్రాంతి పండుగ. ఒక్క రోజుకోసం మా ఊరు గుంటూరు వెళ్ళివచ్చాను. నా చిన్నప్పడు, అరవై-డెబ్భై ప్రాంతాల్లో, గుంటూరు పట్టణంలోకూడా, గ్రామాల్లో కనిపించేంత పండుగ వాతావరణం కనబడేది. అందరి ఇళ్ళముందు ముగ్గుల రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు; గొబ్బెమ్మల్లో గుచ్చిన ఎర్రమందారాలు, బంతిపూవులు. అదొక వింతైన శోభ. ఇంకా మంచు పడుతుండగానే, నులివెచ్చని సూర్యకిరణాలు వచ్చీరాకముందే, హరిదాసులు పాటలు పాడుకుంటూ, మధ్యమధ్యలో, “హరిలోరంగ హరి” అని పెద్దగా ఎలుగెత్తుతూ, ఇంటింట ఇచ్చిన బియ్యం, పప్పుల్ని తీసుకొని, దీవించి వెళ్తూవుండేవారు. ఆ సంగతులన్నీ నా మదిలో మరొకసారి మెదిలాయి. కానీ, సమయంలేక, మర్రోజు ప్రొద్దునే రైలెక్కి హైద్రాబాద్ రావాల్సివచ్చింది.
ప్రొద్దున్నే పల్నాడు రైలు ఎక్కి బయలుదేరాను. చాలా చలిగా వుంది. ఎవరూ రైలు కిటికీలు తెరవటంలేదు. వేడివేడి కాఫీ తాగుతున్నారు. నేను మాత్రం కెటికీ తెరిచి, కదులుతున్న రైలు నుంచి ప్రకృతి అందాలను చూస్తున్నాను. నెమ్మది, నెమ్మదిగా బాల సూర్యుని కాంతి కిరణాలు, తెల్లని మంచు తెరలను కరిగిస్తున్నాయి. భూమాత తెల్లని మంచు దుప్పటితో కప్పినట్లుంది. ఏడు గంటల సమయమయింది. రైలు పట్టాలవెంబడి గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పండగ సందడి కనిపిస్తున్నది. చిన్న,చిన్న గుడిసెలకు, మిద్దెలకు, చిన్న మేడల గుమ్మాలకు రంగురంగుల బంతిపూల తోరణాలు కట్టబడివున్నాయి. వరి, జొన్న కంకులను గుమ్మాలకు వ్రేలాడదీసారు. ప్రతి ఇళ్ళు ఒక కొత్త పెళ్ళికూతురు ముస్తాబై వున్నట్లుగా అనిపించింది నాకు. రంగురంగుల పరికిణీలు కట్టిన ఆడపిల్లలు హుషారుగా ఊళ్ళో తిరుగుతున్నారు.
ఇంకా వివరంగా చూడాలన్నా రైలు వేగంగా పరుగెడుతున్నది. ఒక గ్రామం దాటగానే, చాలా దూరంవరకు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. మరల చిన్న,చిన్న గ్రామాలు వస్తున్నాయి. చెట్లు పెరిగి వుంటంలో, కొన్ని గ్రామాలు కనిపించటంలేదు. కేవలం ఇళ్ళళ్ళనుంచి వంట పొగ మాత్రం కనిపిస్తున్నది. ఇక నా దృష్టి పొలాలమీద పెట్టాను. అప్పటికే, పొలాల్లో పనులు జరుగుతున్నాయి. చాలాచోట్ల వరి కోతలు అయిపోయినట్లున్నాయి. పొలం మధ్యలో కోసిన వరిపంటను ఎత్తుగా గుడిసెల్లాగా వేసివుంచారు ఎండటానికోసమని. ఇంకా వరికోతలు కోయని పొలాలు ఆకుపచ్చని తివాసీలాగా కనిపిస్తున్నాయి. భూదేవి, సంక్రాంతి లక్ష్మీ రూపంలో, ఆకుపచ్చని పట్టుచీరె కట్టుకొని వచ్చిందా అన్నట్లు భూమి కనిపిస్తున్నది. చేల గట్లెంబడి విరగబూసిన రంగురంగుల బంతిపూలు ఆ సంక్రాంతిలక్ష్మి కట్టుకున్న ఆకుపచ్చని చీరెకు అంచుల్లాగా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని అనుభూతి. ఒక్కసారి గుండెలనిండా గాలి పీల్చుకున్నాను దీర్ఘంగా. గుండెలు చల్లటి గాలితో బరువెక్కాయి. ఒక్కసారి చలికి వళ్ళు జలదరించింది. అయినా ఏదో సంతృప్తి ఆ భూదేవిని చూస్తుంటే. వరి పొలాలు ప్రక్కనే మిరపతోటలు. ఆకుపచ్చని ఆకులు, పండిన ఎర్ర మిరపకాయలు. వాటిని చూస్తుంటే, సంక్రాంతిలక్ష్మి తన జడలో ఎర్రని మందారాలను తురుముకున్నట్టు అనిపించింది. బహుశా, ఈ భూదేవి సింగారాన్ని చూసే, ఆడవాళ్ళు సింగారాన్ని నేర్చుకున్నారేమో అని అనిపించింది. ఈ రంగుల సింగారాన్నేజూసి, బహుశా, సాలెవాళ్ళుకూడా తాము నేసే బట్టలకు రంగులద్దటం నేర్చుకున్నారేమో?! నా మనసు రైలు పరుగిడుతున్నంత వేగంకంటే వేగంగా పరుగెడుతూ, వేగంగా వెనక్కివెళ్ళిపోతున్న నేలను, ఆ ప్రకృతి పరిసరాలను చూసేస్తున్నది. ఆశ్చర్యం!! పగటిపూట నక్షత్రాలు. అదికూడా నేలమీద!! మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యం, అనుమానంతో ఒక్కసారి ఆకాశంలోకి తొంగిచూసా రైలు కిటికీనుంచి. ఆకాశం వెల,వెలబోతున్నది. పైనుండే నక్షత్రాలన్నీ సంక్రాంతిలక్ష్మిని దగ్గరనుండి చూడటానికే అన్నట్లు భూమ్మీదకు వచ్చేసాయి. ప్రకృతి గొప్పతనం! నేలమీద నక్షత్రాలేమిటి అని మీరుకూడా ఆశ్చర్యపోతున్నారుకదూ! నిజమే. పత్తిచేలు. ఆకులు చాలావరకు రాలిపోయివున్నాయి. కాన్పుకు సిద్ధంగావున్న స్త్రీ ఎట్లా వడబడిపోయివుంటుందో, పత్తిమొక్కలుకూడా అట్లాగావున్నాయి. అయితేనేమి, పుట్టబోయే బిడ్డని తలుచుకుంటే ఆమె కళ్ళళ్ళో కాంతులు. పొట్ట విప్పుకొని, తెల్లగా పండిన పత్తికూడా అట్లాగే వెలుగులు జిమ్ముతూ, నేలకు దిగిన నక్షత్రాల్లా కనిపిస్తున్నది. పొలాల మధ్య, చిన్న,చిన్న పిల్ల కాలువల్లో, గల,గలమంటూ ప్రవహిస్తూన్న నీటి శబ్దం, సంక్రాంతిలక్ష్మి చేతికి వేసుకున్న గాజుల శబ్దంలా వినిపిస్తున్నది. పైరగాలి శబ్దం, ఆ సంక్రాంతిలక్ష్మి మానవాళికి, సమస్త జీవకోటికి శుభం పలుకుతూ పాడుతున్న పాటలాగావుంది. మరొకసారి నా ఒళ్ళు జలదరించింది. మరొక్కసారి ఆమెను నిశితంగా చూసాను. పండిన పసుపుతోట మొక్కల ఆకులు, పసుపచ్చని రంగులో మెరుస్తూ, సంక్రాంతిలక్ష్మి కాళ్ళకు రాసుకున్న పసుపు పారాణిలా కనువిందుచేస్తున్నాయి. మరి ఆమె కళ్ళు? ” నా కనులె మీ కనులగా చేసుకొని” చూడమని చెపుతున్నట్లుగా అనిపించటంలేదా ఈ శోభనంతటనీ చూస్తుంటే!! అక్కడక్కడా వున్న మోదుగ చెట్ల పువ్వుల ఎర్రని ముఖాలు ముడుచుకుపోయి వున్నాయి. ప్రక్కనేవున్న తాటిచెట్లు అడిగాయట ఎందుకట్లా వున్నారని? మేమందరం ఒక పెద్ద వడ్ఢాణంగా తయారయి, సంక్రాంతిలక్ష్మిని నడుముకు అలంకరించుకోమని అడిగాం. ఆమె సరేఆన్నది. కానీ ఏం లాభం? ఆమె నడుముకు మేం సరిపోవటంలేదు. ఏం చేయాలి? అందుకే అట్లా వున్నామని సమాధానం చెప్పాయిట ఆ పూలు. అప్పుడు తాటిచెట్లు వాటిని బుజ్జగించి, ఆ సంక్రాంతిలక్ష్మి భూదేవి. ఎప్పుడూ నిండుచూలాలే. కాబట్టి, మీరు ఆమె నడుమును చుట్టలేరు అని ఓదార్చాయిట!!
ఇంతటి సౌభాగ్యవతి, అష్టలక్ష్మీ అయిన ఆ భూదేవి, సంక్రాంతిలక్ష్మి రూపంలో ధగ,ధగా మెరిసిపోతూంటే, కన్నుకుట్టి, ఆమె సంపదను ఎవరైనా దోచుకువెళ్తారేమో అన్న అనుమానంతో కాబోలు, నల్లటి దుస్తులు ధరించి, ఆకుపచ్చని “విచ్చు” టోపీలను పెట్టుకొని, ఆజానుభావులను తలదన్నేటట్లుగా తాటిచెట్టంత ఎత్తున్న కాపలాదారులు ఆ పొలాల గట్లంబడి పహారాకాస్తున్నారు. మీ కర్ధమయేవుంటుంది. అవి తాటిచెట్లే మరి! అయినా, మన బుద్ధి సరైంది కాదుకాబట్టే, మనకు అన్నీ అనుమానాలే! తనే, తనలోని సంపదను మనందరికీ పంచిఇస్తుంటే, ఇంకా ఆమెను దోచుకునేవారెవరు?! ఆమే సంక్రాంతి లక్ష్మి. ఆమె శోభే సంక్రాంతి శోభ!
ఇంతకీ, “సంక్రాంతి” అంటే అర్ధం ఏమిటి? “సం+క్రాంతి”. “సం” అంటే మంచి, చక్కటి అని అర్ధం. “క్రాంతి” అంటే, “క్రమణము” అని అర్ధం. “క్రమణము” అంటే “అడుగిడుట లేదా నడుచుకొనుట” అని అర్ధం. కాబట్టి, సంక్రాంతి అంటే మంచి, చక్కటి జీవనపధంలో అడుగుపెట్టి, నడుచుకోవాలి అని అర్ధం. మరి మనందరి సంకల్పాలుకూడా అదే కావాలని కోరుకుంటూ, శెలవ్. స్వస్తి.
Filed under: "సామాజికం"
తెలుగు రక్షణ వేదిక: 'సంక్రాంతి' పండుగ - పూర్వోపరాలు
2012-01-13
సత్య పథ గామి: జాన్ గాల్ట్ః ద సత్యాన్వేషి
ツ ♥ హృదయ కవిత ♥ ツ: సహజత్వం
2012-01-12
కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": భక్తిలో కూడా కొత్తదనం కోసం.......
అన్నమయ్య సాహితీ వైభవము: ఏటి బిడ్డ కంటివమ్మ యెశోదమ్మా?
2012-01-11
మీతో చెప్పాలనుకున్నా!!!: “ ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది ”
‘ప్రజాస్వామ్యం’ అంటే ఏమిటి? వేదికపైనున్న పెద్దలొకరు సభలోవున్న యువతను అడిగారు. ఒకతను లేచి, పాఠాల్లో చదువుకున్నదాన్ని, ప్రజలకోసం, ప్రజలచేత …. అంటూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభుత్వం సమాంతరమైన రైలు పట్టాలులాగా ముందుకు సాగుతుంటాయి అంటూ ముగించాడు తన సమాధానాన్ని. మరొక యువకుడు లేచి నిర్వచినం చెప్పాడు. అతనికి అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఇతను భవిష్యత్లో గొప్ప రాజకీయ నాయకుడవుతాడు అని జోష్యం చెప్పారు. ఇంతకీ అతను చెప్పిందేమిటంటే:- ప్రజాస్వామ్యంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుంది; ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి‘నిధులు’ ప్రభుత్వాన్ని నడుపుతారు; ప్రజలనుంచి నిధులను పన్ను రూపంలో సేకరించి, తిరిగి వాటిని ప్రజోపకరమైన పనులకోసం ఖర్చు చేస్తారు; అంటే, ప్రజలనుంచి వచ్చిన సొమ్ము, తిరిగి, ప్రజలవద్దకే వెళతాయి; వెళ్ళాలికూడా. ( మనలోమాట! :- ప్రజలనుంచి వసూలుచేసిన పన్నులో సింహభాగం బీద,బిక్కి, నిరుపేదలకు చేరుతుంది; వారిపేరుతో పధకాలను సృష్టించి, నిధులను (దుర్)వినియోగం చేసి, సింహభాగంలో సింహభాగం ప్రజాప్రతినిధులు తమ జేబు నింపుకుంటారు; ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అని మనమేకదా చెప్పుకున్నాం! పేదవారి కోపం పెదవికి చేటన్నరు ప్రజాప్రతినిధులు; అందుకే పేదలు పెదవి విప్పలేరు. ఇక, నిధుల్లో మరొక సింహ భాగం బాగా ధనవంతుల వర్గానికి అందుతాయి; మరి వారేకదండీ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేది! వీరుకూడా పెదవి విప్పరు, పైగా పెదవిపై వేలు వేసుకొని వుంటారు. ఎవరైనా సభలో చూస్తే, చూసారా, అంత పెద్దవాడైనా (డబ్బునవాడైనా), ఎంతో వినయంతో నోటిమీద వేలు వేసుకుని మరీ కూర్చున్నాడు బుద్ధిమంతుడులాగా అని వారికే కితాబు ఇస్తారు. ఇక మిగిలింది మధ్యతరగతివారు. వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లాంటిది. ఇంతకంటే వివరంగా చెప్పనక్కరలేదనుకుంటా! ). … ఆ విధంగా అతను సమాధనమిస్తూ, ఇంకా ఏమన్నాడంటే, మరి ప్రజల సొమ్ము, ప్రజలవద్దకే చేరాలంటే, ప్రజాస్వామ్యాన్ని రైలుపట్టాలతో పోల్చకూడదు; పట్టాలు ఎంత దూరం అయినా కలవవు; ప్రజలు, ప్రజల సొమ్ముకూడా ఎప్పుడూ, లేదా భాగస్వామ్యం పొందవు. కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని ఒక గుండ్రంగా గీసిన గీతగా అభివర్ణించాలి. ఒక బిందువునుంచి గీత గీసినా, అది చివరకు ఆ బిందువులో కలిసిపోయి, తుది,మొదలు తెలియవు; అదేవిధంగా, ప్రజలు, పన్నులు, ప్రజాప్రతినిధులు ఈ గుండ్రంగా గీయపడిన గీతలాంటివారు; పన్నులరూపంలో సొమ్ము ప్రజలనుంచి విడివడి, ప్రజాప్రతినిధులకు చేరి, తిరిగి (తమ)ప్రజలవద్దకే చేరుకుంటాయి. ఇదే ప్రజాస్వామ్యంలో అసలైన, సిసలైన ప్రజాభాగస్వామ్యం’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
పై ఉ(దుర్)ద్బోధనని ఎంతోమంది ‘గీతోపదేశం’గా భావించి, నేటి తాజా రాజకీయాల్లో అమలుపరుస్తున్నారు. అందులోంచి పుట్టుకొచ్చిన పధకమే ‘బీ.ఓ.టి.’ (Build, Operate, and Transfer). అందరికీ తెలిసిందైనా, సూక్ష్మంలో చెప్పాలంటే, ఒక జాతీయ రహదారో; ఒక జాతీయ నీటి ఆనకట్టనో నిర్మాణం చేయాలనుకోండి; ప్రభుత్వం, ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది. మీ స్వంత డబ్బులతో రోడ్డుని నిర్మించండి; దానికయిన ఖర్చు ( ప్రజాప్రతినిధులకిచ్చే విరాళంతో సహా కలిపి! ), పెట్టుబడిపై వడ్డీ ఖర్చు, మీకు కొంత స్వంత వ్యాపార లాభం అన్నింటినీ కలిపి, ఆ మొత్తాన్ని ఒక పాతిక సంవత్సరాలలో, కొంచెం,కొంచెంగా, ప్రజలనుండి ‘టోల్టాక్స్’ రూపంలో వసూలు చేసుకోండి; పాతిక సంవత్సరాల తరువాత ఆ రోడ్డు, దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఇది టూకీగా బీ.ఓ.టి. అంటే.
అన్నట్లు, ఇక్కడ మీకొక తమాషా విషయం చెప్పాలి. మనిషి చనిపోయిన తరువాత, అతనిని ఇంటి దగ్గరనుంచి, శ్మశానానికి తీసుకువెళ్ళే దోవలో, ఐదుసార్లు పాడెను క్రిందకు దించి, మళ్ళీ ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్తుంటారు. అతడు చనిపోయాడని భ్రమపడ్డామేమో! అతను మళ్ళీ లేస్తాడేమో! అనే ఒక ఆశతో! బీ.ఓ.టి. పద్దతిలో నిర్మించిన రహదారిపై వాహనదారులనుకూడా ఐదారుచోట్ల ఇదేవిధంగా ఆపుతుంటారు. మొదటి గేటు దగ్గర పన్ను కట్టకుండా తప్పించుకున్నా, రెండో గేటు దగ్గర వసూలుచేస్తారు; అట్లా ఆఖరు గేటువరకు చెక్ పెడుతూనే (చేస్తూనే) వుంటారు. ఇందులో ఒక గొప్ప మర్మంవుంది. ఈ రహదారిపై, ముందుకు వెళ్ళటానికి, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి కొంత పన్ను భారం తగ్గుతుంది, కానీ, గుత్తేదారుడికి కొంత నష్టం. అదే ముందుకు వెళ్ళటానికి మాత్రమే టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి పన్ను భారం ఎక్కువ; గుత్తేదారునికి లాభం. ఐదు గేట్ల దగ్గరకూడా ఎందుకు చెక్ చేస్తారంటే వాహనదారుడు, తన ప్రయాణంలో ఒక జాతీయ రహదారినుంచి మరొక రహదారిపైగా ప్రయాణిస్తుంటాడు. ప్రతి రహదారిపైనా టోల్టాక్స్ కట్టాల్సిందే! ఈ టోల్టాక్స్ దెబ్బలకు ప్రయాణికుడు ఠపీమంటాడా? లేక బట్టగట్టి ముందుకు వెళ్ళే పరిస్థితిలో వున్నాడా? అని చెకు చేసుకోవటానికే!!
“ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది!! ”. ఇది ఒక సెల్ఫోన్ కంపెనీవారి వాణిజ్య ప్రకటన. ఇందులో చాలా దూరాలోచనవుంది. ఒక మంచి ఆలోచన రావాలేకానీ, జీవితమనే బండిని బ్రతుకు అనే బాటపై ఎడాపెడా మనం నడిపించేయవచ్చు సుమండీ! ఇదే ఆలోచన ఆధారంగా, ఈ మధ్యనే, నేటి దేశ,కాల,మాన,పరిస్థితులను బట్టి ఒక యువ రాజకీయ నాయకుడుకి ఒక సరికొత్త ఆలోచన మెదడులో మెరిసింది. అదేంటో చూద్దామా!!
అది ఆసియా ఖండం; అందులో భారతదేశం; అందులో దక్షిణ భారతదేశం; అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ( గమనిక: ఈ రాష్ట్రానికి పశ్చమాన, అంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు – ఆ సరిహద్దు, ప్రజాస్వామ్యంలో, ప్రజాభాగస్వామ్యంలో, కొంతమేర చెరిగిపోయింది! )
మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య దేశంలో ఆర్ధిక నేరాలు ఎక్కువై, పెద్ద,పెద్ద (రాజకీయ) నాయకులు చట్టానికి చిక్కిపోతున్నారు. ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేస్తున్నది అనటానికి నిదర్శనం సీ.బి.ఐ. అనేకమంది నాయకులని అరెస్ట్చేసి, కారాగారాల్లో నెలలతరబడి వుంచుతున్నది. నాయకులతోపాటు ఉన్నతాధికారులుకూడా జైల్లోకి వెళుతున్నారు. జైలుకు వెళ్ళుతున్న ప్రతి నాయకుడు, అధికారి పెద్ద హోదాతో, పలుకుబడి వున్నవారు; విలాసవంతమైన జీవితం గడిపేవారే! ఇందులో ఆశ్చర్య పోవలిసినదేమీలేదు. ఇక్కడే కధలో మలుపు, మెరుపు. ఈ పెద్ద,పెద్ద నాయకులు, అధికార్లందరూ, జైలు శిక్ష పడిన తరువాత, న్యాయమూర్తిముందు, తాము పెద్దవాళ్ళం (వయసులో కాదు) కాబట్టి, ప్రభుత్వాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా నడపటంలో ‘భాగస్వామ్యం’ వున్నవాళ్ళంకాబట్టి, జైల్లోకూడా తమను ‘ప్రత్యేక హోదా’గల వ్యక్తులుగా గుర్తించి, మొదటి తరగతి వసతులను కల్పించవలసినదిగా కోరుతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అని పెద్దలన్నారు. అసలే మన కారాగారాలు ఆంగ్లేయులు కాలంనాటివి. వసతులు తక్కువ. అందరికి ప్రత్యేక వసతులున్న గదులను కేటాయించాలంటే జైలు అధికారులకు కష్టంగానే వున్నది. ఒకరిని ఒకరకంగా, మరొకరిని ఇంకొక రకంగా ‘ట్రీట్మెంట్’ చేస్తే రేప్రొద్దున ఎటొచ్చి ఏమవుతుందో? “ నేటి జైల్లోవున్న నాయిక-ఖైదీనే, రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి ” కూడా కావొచ్చునేమోకదా!! అందుకని, వారి భయం వారిది. అట్లాఅని, అందరికీ కోరుకున్న వసతులు కల్పించలేరు మరి!
మొదట్లో ఒక యువకుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పిన విషయాలు గుర్తున్నాయికదా? ఆ యువకుడే వ్యాపారాలు చేస్తూ, రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాడు. అతనికి వచ్చిన ఒక గొప్ప ఆలోచనే ఈ క్రొత్త పథకం:– ‘ బీ.ఓ.టి. ’ పద్ధతిన రాష్ట్రంలోనూ, దేశం మొత్తంమీదానూ కారాగారాలు కట్టించి, అందులో ( మూడునుంచి ఐదు నక్షత్రాల, వద్దులేండి, ఇదీ మరీ వినటానికి, చూటానికి బాగుండదు ప్రజాస్వామ్యంలో!! ) ఒకటి నుంచి మూడు నక్షత్రాల హోదా, వసతులుగల గదులను నిర్మించటం; 14 సంవత్సరాల తరువాత (జీవితఖైదుకాలం) వీటిని బీ.ఓ.టి. పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించటం ”.
పెద్ద,పెద్ద రహదారులు, నీటి ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు, హోటళ్ళు, సూపర్ బజార్లులాంటివి కట్టటానికి ఎవరైనా ముందుకు వస్తారుగానీ, కారాగారాలను బీ.ఓ.టి. పద్ధతిన కట్టటానికి ఎవరు ముందుకు వస్తారు? ఇది పెద్ద సమస్యే! కానేకాదు. తమ వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు హద్దులు హద్దులేకావు, ఆకాశమే హద్దు అనేవాళ్ళు; శబ్ద తరంగాలకు హద్దేమిటి? సహజసిద్ధమైన వాటిని అందరికీ పంచితే తప్పేమిటి? అనే వాళ్ళకు; లక్ష్మి చంచలమైంది, నీదగ్గర వున్న ధనం, ఏదోవిధంగా నాదగ్గరకువస్తే తప్పేమిటి? అన్నిట్లో ప్రజాభాగస్వామ్యం కనబడటంలేదా? అనేవాళ్ళకు; ప్రజలకోసం ప్రభుత్వం వున్నప్పుడు, ప్రజల పనులను వారికి ఇష్టమైన పద్ధతిలో చేసిపెట్టటంలో తప్పేమిటి? భయందేనికి అనేవాళ్ళకు ఇది సమస్యేకాదు! ఏదో ప్రజలు అపోహపడి, ఆర్ధిక నేరాలు చేసారని అభియోగం వేసినంత మాత్రాన అది తప్పు అయిపోలేదుకదా? ఋజువు కావాలికదా? అప్పటివరకూ, జైల్లో ప్రత్యేక వసతులులేని సెల్లో, సెల్ (సెల్ ఫోన్) కూడా లేకుండా ఎట్లాగడపాలి? అందుకనే, ఈ పై వర్గం వారందరూ కలిసి, ఒక బృందంగా (కన్సార్టియం) ఏర్పడి, బీ.ఓ.టి. పద్ధతిలో కారాగారాలు కట్టించటానికి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారుట!! ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం! ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది!!
Filed under: చిన్ని ఆలోచనలు
2012-01-09
వనితావని వేదిక: శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 34
2012-01-07
రవిగారు: అలా ముగిసింది ?
2012-01-06
న్యూజింగ్స్: మురికి బొమ్మ - Dirty Picture
2012-01-04
తెలుగు రక్షణ వేదిక: ఈ సంవత్సరం - ఓ ప్రతిజ్ఞ చేద్దాం....
2012-01-01
నా మది రాతలు...: నూతన ఏ-దాడి?
Nijayitheega vunte satha ledhu annaru, ippudu raajakeeyalu chesthe chiranjeevini mosagadu antunnaru….. pilitics paranga ippudu chiranjeevi chesindhe correct …. migatha varitho polisthe ranku vyaparam thakkuve chestunnadu….. chiru ranku jeevi ayithe , migatha varu maha ranku jeevulatho samanam…..
…mana prajaaswamyaniki muppu .
శ్రీ కిరణ్ గారికి, నమస్కారములు.
మీకు ఈ సంక్రాంతి శోభ వ్యాసం నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వున్నది. రాబోయే రోజుల్లో వ్యవసాయం రైతులకు లాభసాటిగా వుంటూ, దేశమంతటా సంక్రాంతి శోభ మరింత శోభాయమయంగా వుండాలని అందరం ఆశిద్దాము.
మీ స్నేహశీలి,
మాధవరావు.
sankranti gurinchi chala baga chepparu…nijamyna sankranti ante yemito me vyasam dwara telusukovachu


